కచ్, గుజరాత్ /
ముంబై, మహారాష్ట్ర :
20వ శతాబ్దం ప్రారంభంలో, బొంబాయి నగరానికి హజ్ యాత్ర కోసం స్త్రీపురుషులు వచ్చే వారు. 1909 ప్రాంతంలో – బొంబాయి భారతీయ హజ్ యాత్రికులకు ఒక ప్రధాన బయలుదేరే కేంద్రంగా మారింది. బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ నడిపే ఆవిరి నౌకలు హజ్ యాత్రికులను బొంబాయి నుండి జెడ్డాకు క్రమం తప్పకుండా తీసుకువెళ్లేవి. యాత్రికులు తరచుగా ప్రయాణం మొదలయ్యే వరకు నగరంలో రోజులు లేదా వారాల తరబడి వేచి ఉండవలసి వచ్చేది, బొంబాయి ఒక పవిత్ర యాత్రకు ముందు ఆత్రుతతో ఎదురుచూసే ప్రదేశంగా మారింది.
హజ్ యాత్రికులను ضیوف الرحمٰن — అంటే అల్లాహ్ అతిథులు అని పిలిచేవారు. వారికి సేవ చేయడం ఒక గౌరవంగా, ఆధ్యాత్మిక మరియు సామాజిక అర్థం ఉన్న ఒక గొప్ప కార్యం అని భావించేవారు. ఇస్లాం నైతిక చట్రంలో, ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ఐచ్ఛిక సద్గుణంగా కాకుండా, ఒక బాధ్యతగా పరిగణించబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా అన్నారని చెప్పబడింది, "ఇతరులకు అత్యంత మేలు చేసేవారే ఉత్తమ ప్రజలు."
కచ్ ప్రాంతానికి చెందిన గుజరాతీ
మెమన్ వ్యాపారి మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ
ప్రకారం హజ్ యాత్రికులకు సేవచేయడం ఒక నైతిక పిలుపు. హజ్
యాత్రికులు ضیوف الرحمٰن
(దైవదూతలు) కు సేవచేయడం కోసం ఒక ముసాఫిర్ ఖనా నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ వ్యక్తిగత జీవితం గురించి చాలా
తక్కువగా తెలుసు.
మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ఐదు లక్షల రూపాయల భారీ మొత్తo క్రాఫోర్డ్ మార్కెట్ సమీపంలో, రైలు మార్గాలకు దగ్గరగా, బొంబాయి పోర్టుకు అందుబాటులో బొంబాయి లో ఒక ముసాఫిర్ఖానా నిర్మించడానికి పూనుకొన్నారు. మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు – అదే మహమ్మద్ సబూ సిద్ధిఖీ ముసాఫిర్ఖానా. అది వైభవం కోసం నిర్మించబడలేదు. ఒక ప్రయోజనం కోసం నిర్మించబడింది. ముసాఫిర్ఖానాలో గదులు, ప్రాథమిక సౌకర్యాలు, మరియు ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉండేవి.
మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ముసాఫిర్ఖానా, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి యాత్రికులకు సేవ చేస్తూనే ఉంది. ముసాఫిర్ఖానా వ్యవస్థాపకుడు మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ కన్నుమూసిన తర్వాత కూడా, అది ఒక సంరక్షణ కేంద్రంగా నిలిచింది.
మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ఆశ్రయంతో పాటు, విద్యలో కూడా పెట్టుబడి పెట్టారు –ఎం.హెచ్. సబూ సిద్ధిఖీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు, ఇక్కడ యువత నైపుణ్యాలను సంపాదించి తమ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.
మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ఆరోగ్య సంరక్షణ వైపు కూడా దృష్టి సారించారు. వైద్య సంరక్షణ అందుబాటు తక్కువగా ఉన్న పేద మహిళల కోసం సబూ సిద్ధిఖీ బొంబాయి అంతటా ఆరు ప్రసూతి గృహాలను నిర్మించారు. కాలక్రమేణా, ఈ ప్రసూతి గృహాలు నగర ప్రజారోగ్య వ్యవస్థలో భాగమయ్యాయి, వాటిని బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని నిర్వహించింది మరియు అటువంటి సంస్థలలో ఒకటైన మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ ప్రసూతి గృహం, ప్రభాదేవిలోని మున్సిపల్ రికార్డులలో ఇప్పటికీ నమోదై ఉంది. ఇమామ్వాడలోని మరొకటి, తరువాత ఎం.హెచ్. సబూ సిద్ధిఖీ ప్రసూతి & జనరల్ ఆసుపత్రిగా అభివృద్ధి చెంది, ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది.
మహమ్మద్ హాజీ సబూ సిద్ధిఖీ సంవత్సరాలు
గడిచేకొద్దీ, ప్రయాణ స్వరూపం మారింది. ఓడల స్థానంలో
విమానాలు వచ్చాయి., ఒకప్పుడు యాత్రికులకు ఆశ్రయం ఇచ్చిన ముసాఫిర్ఖానా
ఇప్పుడు, విద్యాన్వేషణలో నగరానికి వచ్చిన
యువకులకు ఆతిథ్యం ఇవ్వడం ప్రారంభించింది
No comments:
Post a Comment