24 November 2016

భారతదేశం లో వ్యవసాయం భవిష్యత్తు ఏమిటి (What is the Future of Agriculture in India?)

భారత దేశం లో వ్యవసాయ అభివృద్ధికి గాను ప్రధానంగా రైతుల ఆదాయ భద్రత పై దృష్టిని కేంద్రీకరించాలి. 2015-16 ఆర్థిక సర్వే పరిశీలన ప్రకారం "భారత వ్యవసాయo ఒక విధంగా దాని స్వంత గత విజయం హరిత విప్లవం యొక్క బాధితురాలు అయినది”. ప్రస్తుతం వ్యవసాయ రంగ నాశనము హరిత విప్లవం ద్వారా చేయబడింది. అధిక దిగుబడి విత్తనాలు, రసాయనిక ఎరువులతో హరిత విప్లవం వలన నిస్సందేహంగా, గణనీయంగా భూ ఉత్పాదకత పెరిగింది. కానీ ఇటివల సంవత్సరాలలో ఉత్పాదకత వృద్ధి తగ్గి రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయిoది. దీనికి తోడూ పర్యావరణ ప్రతికూల ప్రభావాలు, గ్రీన్ హౌస్  వాయువుల ఉద్గారo మరియు ఉపరితల మరియు భూగర్భ జల కాలుష్యము, క్షీణత కూడా ప్రభావం చూపుతున్నాయి. పలితంగా వ్యవసాయ రంగం తీవ్రంగా నష్ట పోయినది మరియు   రైతులు, సన్నకారు రైతులు ప్రభావితం అయినారు. వారి ప్రయోజనాలను కాపాడటానికి తక్షణ జోక్యo అవసరం అవుతుంది.

ప్రభుత్వం ఈ  సమస్యను పరిష్కరించడానికి మరియు 2022 నాటికి రైతుల ఆదాయ రెట్టింపు చేసే మార్గాలను సిఫార్సు చేయడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేసింది.ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో వ్యవసాయ రంగ పెరుగుదల లక్ష్యంగా రైతుల ఆదాయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అయితే ఈ లక్ష్యం సాధనకు  అనేక సమస్యలు ఉన్నాయి.

రెయిన్ బో విప్లవం
ఈ సమస్యను అధిగమించడానికి మొదటి ప్రధాన అడ్డంకి ఉత్పాదకత తగ్గిపోవడం. 2013 నాటి డేటా ప్రకారం భారతదేశం లో హెక్టారుకు ధాన్యపు యొక్క సగటు దిగుబడి చాలా దేశాల (అనేక అల్పాదాయ దేశాలతో సహా) కంటే చాలా తక్కువ, ముఖ్యంగా చైనా తో పోల్చితే తేడా భారీగా ఉంది. ఉదాహరణకు హెక్టారుకు మనదేశ  సగటు దిగుబడి  చైనా కంటే 39% తక్కువ ఉంది  మరియు వరి లో దిగుబడి 46% తక్కువ గా ఉంది. బంగ్లాదేశ్, వియత్నాం మరియు ఇండోనేషియా వరి దిగుబడి విషయంలో భారతదేశం కంటే మెరుగైన దిగుబడిని కలిగి ఉన్నాయి. ఇంకా మన దేశం లో భారీ ప్రాంతీయ వైవిధ్యం ఉంది; హర్యానా, పంజాబ్ నుంచి గోధుమ, వరి దిగుబడి ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా ఉంది.

క్షీణిస్తున్న ఉత్పాదకత అడ్డంకి దాటే క్రమంలో గోధుమ వరి చక్రం నుండి తృణధాన్యాలు మరియు పప్పులు కు  మార్పు చేయడం ద్వారా ఇంద్రధనస్సు విప్లవం సాదించవచ్చు. గోధుమ,వరి  మరియు ఇతర పంటల కు కనీస మద్దతు ధర (MSP) ఇన్పుట్ సబ్సిడీ  (నీరు, ఎరువులు లేదా శక్తి) లబిoచున్నoదువలన  వాయవ్య భారతదేశం యొక్క సాగునీటి ప్రాంతంలో ఈ పంటలను పెంచడంవలన రైతులకు భారీ ప్రోత్సాహకం గా ఉంటుంది.

ఈ పంటలు ఇన్పుట్ సబ్సిడీ పొందటమే కాకుండా పర్యావరణ దుష్ప్రభావాలకు అనగా తగ్గుతున్న నీటి పట్టిక మరియు ఆకుపచ్చ హౌస్ వాయువుల ఉద్గారాల  క్షీణత ను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు  ప్రతిస్పందన గా కనీస మద్దతు ధర లో పెరుగుదల ఉంది.  అయితే  ఇది సరిపోదు.  ప్రజా మౌలిక వ్యవస్థ లో  లో భారీ పెట్టుబడుల అవసరం ఉంది.  ఉదాహరణకు, హర్యానా, పంజాబ్ లో బియ్యం మిల్లింగ్ పరిశ్రమ తో పాటు వరి పండించే రైతులకు వరి యొక్క వివిధ రకాల కోసం సరైన మార్కెట్ సౌకర్యం  ఉంది. అటువంటి మార్కెట్ ఇతర తృణధాన్యాలు మరియు పప్పులు కోసం సృష్టించే  వరకు, రైతులు తృణధాన్యాలు మరియు పప్పులు పంట మార్పిడి చేయడానికి అవకాశం లేదు
ప్రతి బిందువు కు ఎక్కువ ఉత్పత్తి(Per drop more crop)
రెండవ ప్రధాన అడ్డంకి వ్యవసాయానికి రెండు ప్రధాన వనరులు అయిన సాగు భూమి మరియు నీటి  కొరత ఉంది. పెరుగుతున్న జనాభా కారణంగా తలసరి  పంట పొలాల విచ్ఛిన్నత తగ్గిపోవు చున్నది.  ఇతర ప్రముఖ వ్యావసాయిక దేశాలతో పోలిస్తే భారతదేశం లో  కూడా తలసరి నీటి శాతం చాలా తక్కువగా  ఉంది. భారత దేశం ప్రధానం గా నీటి ఆధారిత వ్యసాయ పంటలను  ఎగుమతు చేస్తుంది. ఎగుమతి ఒకసారి చేస్తే తిరిగి కోలుకోలేము. ప్రశాంత్ గోస్వామి  మరియు శివ నారాయణ్ నిషాద్ నివేదిక ప్రకారం 2010 లో భారతదేశం 25 cu km నీటి ఆధారిత వ్యవసాయ ఎగుమతులు చేసింది అది ప్రతి సంవత్సరం లబించే నీటిలో సుమారు 1%గా ఉంది.

నీటి కొరత దృష్టా  సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థను సమర్థవంతమైనదిగా మరియు న్యాయపరమైనదిగా ఉపయోగించాలి.  13 రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్) మరియు 64 జిల్లాల్లో సూక్ష్మ నీటిపారుదల పై సస్టైనబుల్ అగ్రికల్చర్ నేషనల్ మిషన్ నిర్వహించిన ఒక అధ్యయనం లో నీరు మరియు ఎరువులు వాడకం లో తగ్గుదల ఉన్నప్పటికీ పంటల దిగుబడి గోధుమ 45%, పప్పు ధాన్యాలలో  20% మరియు సోయాబీన్ 40% వరకు పెంచవచ్చు అని రుజువైనది. అయితే ప్రారంభ ఖర్చులు ఎక్కువైనందువలన ఈ సాంకేతిక రైతులు పాటించటలేదు.   పెద్ద రైతులు సులభంగా ఈ సాంకేతికత పొందవచ్చు అందుకు గాను ప్రభుత్వం చిన్న రైతులకు రాయితీలు ఇవ్వాలి.

వైద్యనాథన్ ప్రకారం  విద్యుత్, డీజిల్ చమురు ధరలు వాస్తవ ధర కంటే తక్కువ ధరకు ఇవ్వాలి తద్వారా భూగర్భజలాల దోపిడీని అరికట్టవచ్చు. వైద్యనాథన్ నీటి ఛార్జింగ్ వాస్తవ ఖర్చుల వద్ద సిఫార్సు చేసారు  అయితే, ఇది కూడా వ్యవసాయ ఉత్పాదకత మరియు  రైతుల ఆదాయం వలన ప్రస్తుత సందర్భంలో సాధ్యం కాకపోవచ్చు.

మార్కెట్ల ప్రారంభం (Opening up of the markets)
2000 నేషనల్ అగ్రికల్చరల్ పాలసీ ప్రకారం ప్రేవేట్ భాగస్వామ్యం పెంచడం కోసం ఒప్పంద  వ్యవసాయo, భూమి తనఖా ఒప్పందాలు (contract farming and land leasing arrangements ) మరియు  పంట ఉత్పత్తి కోసం వేగవంతమైన టెక్నాలజీ బదిలీ, పెట్టుబడుల రాక మరియు పంట ఉత్పత్తి కోసం  నమ్మకమైన మార్కెట్ అనుమతించేందుకు ఏర్పాట్లుచేయాలి. అయితే, వ్యవసాయం లో ప్రైవేటు రంగం ద్వారా ఏవిధమైన  ప్రముఖ పాత్ర ఉండరాదు.

వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా ప్రయివేట్ రంగాన్ని ఆటoకపరుస్తున్న ప్రధాన కారకాలు ఒకటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మేనేజ్మెంట్ కమిటీ (APMC) యాక్ట్. ఇది  సుదీర్ఘకాలంగా టోకు మార్కెట్ల సంస్కరణలను  పెండింగ్లో ఉంచినది.AMPC ప్రభుత్వ నియంత్రణలో ఉండే మార్కెటింగ్ యార్డ్ లలో మాత్రమే రైతులు వారి ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతి ఇస్తున్నది.APMC యొక్క లక్ష్యం మార్కెట్ల నియంత్రణ మరియు మార్కెట్ యార్డ్ ల సంఖ్యను పెంచడoగా ఉండగా, అది ప్రైవేటు పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా గా నిలిచినది.

అయితే 2003 లో కేంద్ర ప్రభుత్వం మోడల్ APMC ఏర్పాటు చేయదలచినది  కానీ వ్యవసాయంపై నితి అయోగ్ (NITI Aayog) ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్  తూర్పు భారతదేశం లోని  అనేక రాష్ట్రాల్లో ఇది  అమలు చేయబడుట లేదు అని తెలిపినది. అందువలన వ్యవసాయం లో ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెంచడానికి ఈ అడ్డంకులను తొలగించ వలసి ఉంది. ఇంకా ప్రభుత్వం రైతులకు జాతీయ వ్యవసాయ మార్కెట్ ద్వారా రైతులు  భారతదేశం లో ఎక్కడైనా వారి ఉత్పత్తులకు విక్రయించడానికి ఒక ఎలక్ట్రానిక్ మాధ్యమం ప్రారంభించింది. రైతులు ఇంకా ఈ వేదిక నుండి ప్రయోజనాలు పొందవచ్చో లేదో తెలియాల్సి ఉంది.

భవిష్యత్తు అంతా ఆర్ అండ్ డి R&D is the future
వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం యొక్క ప్రధాన అడ్డంకులలో  ఒకటి కొత్త టెక్నాలజీలు మరియు ప్రధాన ఆవిష్కరణలు లేకపోవడం. జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థ హరిత విప్లవం లో ప్రధాన పాత్ర వహించగా, ఇటీవలి సంవత్సరాలలో స్వదేశీ పరిశోధనలో ఏ మాత్రం ప్రధాన పురోగతి లేదు. అందుకు ప్రధాన కారణాలలో ఒకటి ఆర్థిక వనరుల కొరత గా ఉంది.
ఆసియా దేశాలలో వ్యవసాయ జీడీపీలో పరిశోధన మరియు అభివృద్ధి రంగాలలో    ఖర్చు శాతాన్ని సరిపోల్చిన   భారతదేశం 2010 లో పరిశోధన మరియు అభివృద్ధి కోసం దాని వ్యవసాయ జీడీపీలో 31% ఖర్చు చేయగా, అదే సంవత్సరంలో చైనా దాని కంటే దాదాపు రెట్టింపు ఖర్చు పెట్టినది.  మన పొరుగు ఉన్న బంగ్లాదేశ్ ఆ సంవత్సరంలో పరిశోధన మరియు అభివృద్ధి కోసం  దాని వ్యవసాయ జీడీపీలో 38% ఖర్చు పెట్టింది. వనరుల కొరత  కారణం గా వ్యవసాయ ఉత్పాదకత పెంచే కొత్త వ్యవసాయ ఆవిష్కరణలు మరియు పద్ధతుల  విస్తరణ జరగలేదు. పైగా  వ్యవసాయం పరిశోధన లో విద్యార్థులకు  ఆసక్తి ఉండడం లేదు. ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయo ప్రధానమైన రాష్ట్రాలలో   వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో చేరే విద్యార్ధుల సంఖ్య  బలహీనంగా ఉంది. పరిశోధన మరియు అభివృద్ధి దిశగా ప్రైవేట్ రంగం నుంచి ప్రధాన సహకారం లేదు. వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రయివేట్ రంగాన్ని ఆకర్షించాలి.

2022 నాటికి రైతుల ఆదాయం పెంచాలన్న ప్రభుత్వ ఆశయం పై ఎన్నో సందేహాలు కలవు.  అశోక్ గులాటీ, మాజీ ఛైర్మన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్, రైతుల వాస్తవ ఆదాయం రెట్టింపు   (ఏడాదికి 12% వృద్ధి రేటు) అనునది ఒక "అద్భుతాలు యొక్క అద్భుతం"అన్నారు. ఇంకా కొంతమంది నిపుణుల  విశ్లేషణ ప్రకారం పెరుగుతున్న ఖర్చులు సర్దుబాటు తర్వాత  భారతీయ రైతుల ఆదాయం వాస్తవానికి 5% మాత్రమే సంవత్సరానికి గత దశాబ్దం లో (2003-2013) పెరిగింది అని దాని వలన  ప్రభుత్వ ఆశయం సందేహాస్పదంగా ఉందని అన్నారు.  

భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు నిరాసజనకం గా ఉంది.    రైతుల భవిష్యత్తు శాశ్వతంగా కాపాడి భారత వ్యవసాయ రంగం లో ఉన్న దోషాలు నివారించాలంటే, ముఖ్య విధాన పరమైన జోక్యాలు అవసరం.

No comments:

Post a Comment