27 November 2016

యూనిఫామ్ సివిల్ కోడ్ - చారిత్రక నేపథ్యం (Uniform Civil Code – Historical Background)



భారతదేశం లో మతగ్రంధములు, ఆచారాలు ఆధారంగా ఉన్న  వ్యక్తిగత చట్టాల స్థానంలో ప్రతి పౌరుడు పాటించవలసిన సాధారణ పాలక సూత్రాలను  యూనిఫాం సివిల్ కోడ్  రూపంలో ప్రతిపాదించారు. భారతదేశం లో వలస కాలంలో యుసిసి పై ఒక వాదన జరిగింది.  భారతదేశం లో బ్రిటిష్ వారు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మరియు తరువాత పార్సీలు కోసం వివిధ చట్టాలు అమలు పరిచినారు.1858లో విక్టోరియా మహారాణి ప్రకటన మత విషయాల్లో ప్రభుత్వ సంపూర్ణ తటస్థ వైఖరిని ప్రతిపాదించినది. వారసత్వ, పరంపర, వివాహాలు మరియు మతపరమైన వేడుకలు ఆధారంగా వ్యక్తిగత చట్టాలు కలవు.
1946 లో ఏర్పడిన రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగంను రూపొందించినది. రాజ్యాంగం నిర్మాతలకు లోతైన సామాజిక పరిజ్ఞానం ఉంది. వారు భారతదేశం లోని విబిన్న ప్రాంతాలు, మతాలు, జాతులు మరియు తెగలు, సంస్కృతులు కోసం భారత దేశం నకు ఒక పార్లమెంటరీ ప్రబుత్వం ను ఏర్పాటు చేసారు. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మద్య రాజ్యాంగ పరముగా అధికారాలను విభజించి కేంద్ర-రాష్ట్రాలకు అధికార పరిధి స్పష్టంగా తెలియజేస్తూ   సమాఖ్య వ్యవస్థ ను ఏర్పరిచినారు.
రాజ్యాంగ నేపధ్యం(Constitutional Background)
భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రబలంగా ఉన్న  విషాదకరమైన మరియు దురదృష్టకర పరిస్థితుల నుంచి మహిళలు మరియు శూద్రుల ఉపశమనానికి కొన్ని రీఫార్మేషన్స్ బ్రిటిష్ పాలకులు ప్రారంభించారు.అవి 1773 లో రెగ్యులేటింగ్ చట్టంతో  ప్రారంభమైనవి. 1795లో  శూద్రులకు ఆస్తి విషయం లో సమాన హక్కులు ఇవ్వబడినవి. 1804 లో ఆడ శిశువుల హత్య నిషేదించబడింది.1813 లో దిగువ కులాలతో సహా అందరు వ్యక్తులకు విద్యా హక్కు ఇవ్వబడింది మరియు బానిసత్వం నిషేధించారు.1819 లోశూద్రుల వధువు  బ్రాహ్మణునితో మొదటి 3 రాత్రులు గడపడం ను నిషేదించారు.1829 లో సతి దురాచారం మరియు దేవదాసి  సంప్రదాయం ను  నిషేధించారు 1830 లో నర బలి నిషేధించారు. 1831 లో ప్రభుత్వ సర్విసులలో కులo మరియు రంగు ఆధారంగా వివక్షత పాటించడం  చట్టవిరుద్ధo చేశారు.
1835 లో శూద్రుల మొదటి కుమారుడు గంగాదన్ ('Gangadan') అవ్వడం మరియు శూద్రులు కుర్చీ మీద కూర్చునే హక్కును కల్పించారు. దేవదాసి స్త్రీ మరియు బ్రాహ్మణుల పూజారి కు పుట్టిన సంతానం కు 'హరిజన్' అన్న పేరు పెట్టడం నిషేదించారు. 1863 లోచరక్ పూజ అనగా శూద్రులు సజీవంగా పెద్ద భవనాల పునాది క్రింద సమాధి చేయడాన్ని నిషేదించారు.1917 లో హిందువులలోని అన్ని కులాల వారికి సమాన శిక్ష సమానంగా ఉండేటట్లు చట్టం చేశారు.1928 లో బేగరి (Begari) సంప్రదాయం,1935 లో అణగారిన వర్గాలకు సమాన హక్కులు ఇచ్చారు. ఇవి అన్ని బ్రిటిష్ పాలకులు హిందూ  సమాజం ను ప్రజాస్వామికం చేయడానికి చేసిన  సంస్కరణలు. తదుపరి అవి ప్రజాస్వామిక రాజ్యాంగానికి పునాది అయినవి. హిందూ మతం కోడ్ బిల్ ప్రధానంగా  పై సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఉండవచ్చు,
భారత రాజ్యాంగం లోని 13 నిభందన ప్రకారం ప్రాధమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న అన్ని రకాల చట్టాలు చెల్లవు అని చెప్పింది.  సమానత,  సమన్యాయం,  అందరకు సమాన ప్రాణ రక్షణ, సమాన వ్యక్తిగత స్వేఛ్చ కు రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చినది.
రాజ్యాంగం లోని మూడోవ భాగం లో 25వ నిభందన పౌరులు  అందరికి  మత హక్కును ప్రసాదించినది. 26వ నిభందన మతసంస్థలను నెలకొల్పు కొని వాటి వ్యవహారాలను నడుపుకొనే స్వేఛ్చ ను ప్రసాదించినది.  27వ నిభందన ప్రకారం మతవ్యాప్తి ఖర్చు పై పన్ను విధించరాదని చెబుతుంది.  28 వ నిభందన ప్రకారం ప్రబుత్వ సహాయం తో నడిచే విద్యాసంస్థలలో మతబోధ జరగరాదని స్పష్టం చేసినది.
29వ నిభందన ప్రకారం పౌరులు అందరు  తమ బాష, లిపి సంస్కృతి లను కాపాడు కోవచ్చు. ప్రభుత్వ సహాయం తో నడిచే విద్యాసoస్థలలో జాతి,మత,కుల, బాష, లింగ ప్రాతిపదికలపై ప్రవేశం నిరాకరించరాదు. 30వ నిభందన ప్రకారం బాషపరమైన అల్స్పసంఖ్యక వర్గాల వారు తమ బాషా, సంస్కృతి, లిపి అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. వాటికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ విధంగా రాజ్యాంగం లో పొందుపరిచిన ప్రాధమిక హక్కులు  మైనారిటి లకు కూడా వర్తించు తాయి.
అదేవిధంగా కొన్ని నిభంధనలను ఆదేశ సూత్రాల పేర రాజ్యాంగం లోని నాల్గోవ   భాగం లో ఆర్టికల్ 38 నుంచి ఆర్టికల్ 51వరకు పొందుపరచారు. వీటిని న్యాయస్థానముల ద్వారా అమలు పరచలేము. కాని ప్రాధమిక హక్కులకు  న్యాయస్థానములు రక్షణ గల్పించగలవు.
రాజ్యాంగం లోని పార్ట్ IV లోని కొన్నిప్రధాన అంశాలు:
రాజ్యాంగం లోని నాల్గోవ భాగం లో ఉన్నఆదేశ సూత్రాలలో కొన్నిoటికీ మాత్రం(ఆర్టికల్ 44) ప్రభుత్వలు అధిక  ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ కారణాల దృష్ట్యా మిగతా వాటిని నిర్లక్షం చేసినవి. సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆదేశ సూత్రాలు అన్నింటిని అమలు పరచ వలసినదిగా న్యాయస్థానాలు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించ లేదు.

ప్రస్తుత వివాదం (Present Controversy)
అక్టోబర్ 2015 సుప్రీం కోర్టు యుసిసి అమలు లో ముస్లిం స్త్రీల పట్ల వివక్షతను తొలగించుటకు సూ-మోటో గా ఒక ప్రత్యేక పిల్(PILL) దాఖలు చేయవలసినదిగా ఆదేశించడం తో వివాదo కొత్త మలుపు తీసుకుంది. జమాత్ ఉలేమా ఇ హింద్ సుప్రీం కోర్ట్ ముందు ముస్లిం పర్సనల్ లా ఖురాన్ నుంచి  పుట్టినది అని అన్నది.  ఈ వాదన ఆధారంగా జమైత్ మహమ్మదీయ చట్టాలను అమలులో ఉన్న సాధారణ చట్టాలు గా  గా పరిగణించ లేము అన్నది. జమైత్ తరువాత అల్ ఇండియా  ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) కేసు విచారణ లోనికి వచ్చింది.  జమైత్ మరియు AIMPLB రెండు ముస్లిం వ్యక్తిగత చట్టాలు మహమ్మదీయ మతం యొక్క అంతర్భాగమైనవని వాదించారు. రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 25 లో పొందుపరిచిన రాజ్యాంగ హక్కులో  మతం ప్రచారం స్వేచ్ఛ కింది వ్యక్తిగత చట్టాలు వస్తాయని అని నొక్కిచెప్పారు. ఆదేశం సూత్రం అధికరణ 44 క్రింద చెప్పబడిన యుసిసి న్యాయసాద్యం కాదు అందువలన దాని అమలు తప్పని సరికాదు అని ప్రస్తావించిరి.
 AIMPLB మరియు కొన్ని ఇతర ముస్లిం సంస్థలు యుసిసిపై లా కమిషన్ యొక్క ప్రశ్నాపత్రం ట్రిపుల్ తలాక్ తో సహా ముస్లిం కమ్యూనిటీ కి వ్యతిరేకమని ప్రభుత్వం ముస్లిమ్స్ పై "యుద్ధం" ప్రకటించినదని ప్రభుత్వాన్ని నిందిస్తూ యుసిసి ప్రశ్నాపత్రంను  బహిష్కరించినవి.
భారతదేశం లా కమిషన్ చైర్మన్ BS చౌహాన్ మాట్లాడుతూ భారత దేశ కుటుంబ చట్టాల పునర్విమర్శ మరియు సంస్కరణ పై  సమగ్ర వ్యాయామం జరపడం కోసం  ఒక ప్రశ్నావళి ని  ప్రచురించటమైనది   అని అన్నారు. ప్రశ్నాపత్రం యొక్క లక్ష్యం "వివిధ సమూహాలు మరియు వివిధ సాంస్కృతిక పద్ధతుల పట్ల  అనుసరిస్తున్న వివక్షతకు  వ్యతిరేకం అని అన్నారు. చౌహాన్ మాట్లాడుతూ అత్యంత సమగ్ర పద్ధతిలో కుటుంబ చట్టంలో  సంస్కరణలు తేవడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రశ్నాపత్రం జారి చేసాము అన్నారు. భారతదేశం యొక్క సామాజిక ఫాబ్రిక్ కోర్ యొక్క  భిన్నత్వo,బహుళత్వo విషయం లో  రాజీ లేదు అన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్  కు అడ్డంకులు (Odds against the Uniform Civil Code )
భారతదేశం యొక్క రాజ్యాంగంలోని నిబంధనలను  ప్రారంభం నుండి అతిక్రమిస్తునే ఉన్నారు. రాష్ట్రపతి ఆర్డర్ ప్రకారం  1950 లో  ముస్లింలు మరియు క్రైస్తవులకు మినాహా దళితులకు రిజేర్వేషన్స్ కల్పించబడినవి.  సోమనాధ మందిర నిర్మాణం కు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు అందినవి మరియు ప్రధమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చే మందిరo ప్రారంభించబడినది. మన రాజ్యాంగ మూల సూత్రం లౌకిక వాదంకు వ్యతిరేకంగా  భారతీయ సంఘటన నిధి నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని హిందూ దేవస్థానాలకు నిధులు   మంజూరు చేసారు.
రాజ్యాంగ సభలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయిపటేల్ నేతృత్వంలోని అగ్రవర్ణ సభ్యులు చూపిన తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా యుసిసి(UCC) సాధ్యం కాలేదు కానీ నెహ్రూ ఆలోచన తో దానిని రాజ్యాంగం లోని నాల్గోవ భాగం లోని ఆదేశక సూత్రాల లో  ఒకటిగా ఉంచబడినది. భారతదేశం లో సాదారణ కుటుంబ చట్టాలు ఉన్నప్పటికీ, హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టము, హిందూ మైనారిటీ రక్షణ చట్టం. మరియు హిందూ దత్తత, నిర్వహణ చట్టంను కలిపి హిందూ కోడ్ బిల్ గా   1956 లో పెట్టారు. దీనితో నెహ్రూ కు స్వయంగా యుసిసి సాధ్యాసాధ్యాలపై  నమ్మకం లేదని తెలుస్తోంది.  అందువలన నెహ్రూ స్వయంగా తన ముందు మాటను మార్చి కామన్ ఫ్యామిలీ లాస్  ఆలోచన ను  వ్యతిరేకించెను.
హిందూ అవిభాజ్య కుటుంబ / హిందూ ఉమ్మడి కుటుంబంనకు  అందించిన ఆదాయ పన్ను మినహాయింపులను భారతదేశం లోని అన్ని సంఘాలకు  వర్తింప జేస్తూ   కామన్ ట్యాక్స్ చట్టాలు చేయడానికి వీలు ఉందేమో పరిశిలించాలి.
వ్యక్తిగత చట్టాల విషయం లో సిక్కులు, బౌద్ధులు తమను హిందువులుగా పరిగణిస్తూ రాజ్యాంగం లోని అధికరణ 25 లో వాడిన పదాల పట్ల  అభ్యంతరం తెలిపారు. అయితే అదే ఆర్టికల్ కృపాణం('kirpan' ) ధరించడం సిక్కుల మత విశ్వాసపు హక్కుగా పరిగణిoచినది.
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారతదేశం ప్రధానాధికారి(CEO)  ఆకార్ పటేల్ మాటలలో  మోడీ ప్రభుత్వం  దృఢమైన హిందుత్వ చిహ్నంగా మూడుసార్లు తలాక్ నిషేధం  మరియు  యుసిసి పై చర్చ ని పరిగణిoనిస్తుంది. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ రైటర్స్  మరియు ఉదారవాద జెఎన్యు ప్రొఫెసర్లు ఆకార్ పటేల్ తో అంగీకరిస్తున్నారు, వారు ఇది లింగ న్యాయం గురించి కాదు, ముస్లింలను "క్రమశిక్షణ”  లో ఉంచడంగా భావిస్తున్నారు.
దేశంలోని  వివిధ తెగలు, కులాల ప్రజలకు  వ్యక్తిగత చట్టాలు సంప్రదాయ చట్టాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి మరియు మాజీ న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలి ప్రకారం భారతదేశం లో ఆచరణలో సుమారు 200 వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా కామన్ సివిల్ లా పౌర అమలు సాద్యం కాదు.  కాంగ్రెస్ పార్టీ అదే అభిప్రాయం కలిగి ఉంది అని అయన అన్నారు.

హిందూ విశ్వాసాల ప్రకారం  వివాహం, పవిత్రమైనది మరియు  శాశ్వతమైనది. విడిపోవటంను   హిందూ విశ్వాసం విదేశీ భావన గా పరిగణిస్తుంది. ముస్లిం మతం లో వివాహం సామాజిక ఒప్పందం గా  ఉంది.  హిందూ లా లో విడాకులకు సంభందించి అనేక సంస్కరణలు  ప్రవేశపెట్టబడ్డాయి.

ముస్లిం మహిళలలో  లింగ వివక్షత సమస్య బహు తక్కువ. కాని దానిని పెద్దది చేసి చూపడం జరిగింది. అనేక  సంస్థలు మరియు అధికారులు నిర్వహించిన సర్వేలు ప్రకారం సాధారణంగా ఇతర వర్గాల మహిళలతో పోల్చిన ముస్లిం మహిళలు మరింత సాధికారం గా ఉంటారు. ప్రభుత్వం సాధారణ మహిళలకు సంబంధించిన అనేక ఇతర సమస్యలు విస్మరించినది. ముస్లిం మహిళల్లో విడాకుల రేటు 0.3% మాత్రమే పైగా మూడుసార్లు తలాక్ ప్రభావం తక్కువు గా ఉంటుంది. కాని దానిని పెద్దది చేసి ఒక జాతీయ సమస్య గాతయారు చేస్తున్నారు.
హిందూ  చట్టాలు మార్చవచ్చు. ముస్లిం చట్టాలు మహిళా వ్యతిరేక మనే అభిప్రాయం చాలా మంది లో కలదు. న్యాయవాది ఫ్లావియా ఆగ్నెస్ అభిప్రాయం లో ఆర్థిక హక్కుల విషయం లో కట్నం మరియు మేయిoటెన్స్ పరముగా ముస్లిం వివాహ ఒప్పందo మహిళలకు మంచిది. బహుభార్యాత్వంలో కూడా  బహు భార్యలకు  చట్టపరమైన మరియు సామాజిక హక్కులు ఉంటాయి అన్నది. 2010   సుప్రీంకోర్టు గృహహింస నిరోధక చట్టం క్రింద ఇచ్చిన తీర్పులో ఒక వివాహం కాని భాగస్వామ్యంలో  ఉన్న హిందూ మహిళ కు ఆర్ధిక వనరులు లేవు పైగా ఆ రకమైన సహజీవనం గడుపుతున్న వారిని ఉపపత్నులు(“concubines") గా సూచిoచడం జరిగింది.

నేర న్యాయ నిర్వహణలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు సివిల్ ప్రొసీజర్ కోడ్ క్రింద కొత్త చట్టాలను  జోడించడం ద్వారా కామన్ లా పరిధి  విస్తరించడం జరుగుతుంది.  జువెనైల్ జస్టిస్ చట్టం క్రింద ముస్లిమ్స్ కుడా ఇప్పుడు దత్తత సులభం చేయడం జరిగింది.  ఫ్యామిలీ లాస్ మాత్రమే ఇప్పుడు మతాలకు,కల్చర్స్ కు మరియు తెగలకు వేరుగా ఉన్నాయి.

స్త్రీవాది నందితా మీనన్ ప్రకారం హిందూ లా ను క్రోడికరించుట ఉత్తర భారతం లోని  ఉన్నత కులాల వారి దృష్టిలో అనాదిగా వస్తున్న మహిళల హక్కులకు వ్యతిరేకంగా  ఉన్నది.   అదేవిధంగా, 'మెహర్' వంటి పద్ధతులు కామన్ సివిల్ కోడ్ ను అనుసరించడం వలన ముస్లిం మహిళలు కోల్పోవుతారు. అందువలన అనేక మహిళా సంఘాలవారు  యుసిసి డిమాండ్ చేయుట లేదు. దానివల్ల వారు   ప్రామాణీకరణ బదులుగా  విభిన్న వ్యక్తిగత చట్టాలకు  లోబడి  లింగ న్యాయం మరియు వ్యక్తిగత స్వయంప్రతిపత్తి వంటివి కోరుతున్నారు.  

ఒక వైపు భారతదేశమును లౌకిక రాజ్యం నుంచి మత ప్రధాన రాజ్యంగా మార్చడానికి    ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రయత్నాలు జరుగుతున్నవి.   నేర మరియు పౌర చట్టాలలో  రాజ్యం యొక్క అధికారాన్ని ప్రశ్నించడానికి ఖాప్ పంచాయితీలు జరుగుతున్నవి. మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి రాజ్ ధాకరే మరియు శివసేన బహిరంగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంగించి సంప్రదాయాలు పరిరక్షించడం పేర “గోవిందా హండి” జరుపుతున్నారు.

మరొక వైపు ముస్లిం పర్సనల్ లా (Shariyat) అనువర్తిత చట్టం 1937, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939 మరియు ముస్లిం మహిళల చట్టo 1986 (విడాకులు హక్కుల రక్షణ) పట్ల అసహనం చూపుతూ ముస్లింల ప్రత్యేకమైన మతపరమైన మరియు సాంస్కృతిక పద్ధతులను భారతదేశ యొక్క రాజ్యాంగం యొక్క ఆత్మ కు బిన్నంగా కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నవి.


No comments:

Post a Comment