31 May 2025

అమ్రోహా నుండి ఇస్రో వరకు ఖుష్బూ మీర్జా అద్భుతమైన ప్రయాణం Khushboo Mirza's incredible journey from Amroha to ISRO

 

భారతీయ ముస్లిం మహిళ విద్యాసాదికారికత:

ఉత్తరప్రదేశ్‌లోని పట్టణం అమ్రోహా నుండి వచ్చిన ఖుష్బూ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్ర అన్వేషణ కార్యక్రమంలో కీలక పాత్ర వహించుట ద్వారా జాతీయ స్థాయికి ఎదిగింది. అమ్రోహా దేశానికి ఖుష్బూ మీర్జా వంటి శాస్త్రీయ మనస్సును బహుమతిగా ఇచ్చింది అని అమ్రోహా పట్టణ వాసులు గర్వపడతారు.ఖుష్బూ మీర్జా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం యొక్క గర్వించదగిన పూర్వ విద్యార్థిని,

ఖుష్బూ మీర్జా ఏడేళ్ల వయసులో తండ్రి సికందర్ మీర్జాను కోల్పోయినది కానీ తల్లి, ఫర్హత్ మీర్జా తన దివంగత భర్త పెట్రోల్ పంపును నిర్వహిస్తూ, ముగ్గురు పిల్లలను అందుబాటులో ఉన్న ఉత్తమ పాఠశాలల్లో చేర్పించింది మరియు ముగ్గురు పిల్లలు ఇంజనీర్లు కావాలనే తన భర్త కలను గౌరవించింది.

ఖుష్బూ 2006లో AMU నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బంగారు పతకంతో పట్టభద్రురాలైంది. ఖుష్బూ వాలీబాల్ క్రీడాకారిణి కూడా మరియు ముఖ్యంగా AMU చరిత్రలో విద్యార్థి సంఘం ఎన్నికలలో పోటీ చేసిన మొదటి మహిళ.

AMU నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తరువాత ఖుష్బూ ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరింది, చివరికి చంద్రయాన్-1 మిషన్ కోసం చెక్అవుట్ బృందానికి నాయకత్వం వహించింది చంద్రయాన్-1 మిషన్ చంద్రుని ఉపరితలంపై నీటి ఉనికిని నిర్ధారించింది. ఖుష్బూ చంద్రయాన్-1 మిషన్ బృందంలోని అతి పిన్న వయస్కురాలు మాత్రమే కాదు, మిషన్ విజయానికి కీలక పాత్ర పోషించింది.

ఖుష్బూ తరువాత చంద్రయాన్-2 కు దోహదపడింది మరియు 2015లో ఇస్రో టీమ్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడింది. నేడు, ఖుష్బూ ఇస్రో యొక్క ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో సేవలందిస్తోంది, భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమంలో తన పనిని కొనసాగిస్తోంది.

నేడు, ఖుష్బూ ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు మరియు కళాశాలలలో గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో బాలికల విద్య కోసం ప్రసంగించడానికి తరచూ అతిథి వక్తగా ఆహ్వానిoచబడుతుంది. ముస్లిం బాలికలు STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం)లో ఉన్నత విద్య మరియు కెరీర్‌లను కొనసాగించాలని ఖుష్బూ ప్రోత్సహిస్తుంది. బాలికలు ఇప్పుడు ఖుష్బూ నుండి ప్రేరణ పొంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో చేరుతున్నారు.

"చంద్రయాన్ ఎక్కడ ప్రస్తావించబడినా, ఖుష్బూ మీర్జా పేరు అక్కడ తప్ప్రక స్తావించబడుతుంది. ఖుష్బూ కథ దేశవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు బోర్డు గదులలో మహిళలకు స్పుర్తిదాయకం.

ఒక చిన్న పట్టణం అమ్రోహా నుండి ఇస్రో మరియు చంద్రుని వరకు ఖుష్బూ మీర్జా ప్రయాణం విద్య యొక్క పరివర్తన శక్తికి నిదర్శనం.

హజ్ అనేది ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరివర్తన మరియు దేవునితో బంధానికి మార్గం Hajj is not only a pilgrimage but path to spiritual transformation and bonding

 


 

మక్కాకు వార్షిక తీర్థయాత్ర హజ్, ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒకటి మరియు శారీరకంగా మరియు ఆర్థికంగా సామర్థ్యం ఉన్న ప్రతి వయోజన ముస్లింపై ఒక బాధ్యత. కానీ మతపరమైన విధిగా కాకుండా, హజ్ అనేది లోతైన ఆధ్యాత్మిక, పరివర్తనాత్మక ప్రయాణం,

ముస్లింలు హజ్ చేయడానికి ప్రధాన కారణం అల్లాహ్ ప్రత్యక్ష ఆదేశాన్ని నెరవేర్చడం. ఖురాన్‌లో, అల్లాహ్ ఇలా అంటున్నాడు: "స్తోమత ఉన్నవారు కాబా గృహాన్ని సందర్శించి హజ్ యాత్ర చేయాలి. " ఖురాన్ 3:97

హజ్ అనేది కేవలం ఒక సంప్రదాయం లేదా సాంస్కృతిక ఆచారం కాదు; ఇది అల్లాహ్‌కు విధేయత చూపే చర్య. ఇది సృష్టికర్త పట్ల సమర్పణ, భక్తి మరియు ప్రేమను ప్రదర్శిస్తుంది. ముస్లింలకు, హజ్ చేయడం వారి విశ్వాసాన్ని ధృవీకరిస్తుంది మరియు అల్లాహ్‌తో వారి సంబంధాన్ని బలపరుస్తుంది.

హజ్ ప్రవక్త ఇబ్రహీం (AS), ఆయన భార్య హజర్ (AS), వారి కుమారుడు ఇస్మాయిల్ ప్రయాణాన్ని, అలాగే ప్రవక్త ముహమ్మద్(స) చివరి తీర్థయాత్రను హజ్ తిరిగి గుర్తు చేస్తుంది.. హజ్‌లోని ప్రతి ఆచారం ఈ ఆశీర్వాద వ్యక్తుల అపారమైన విశ్వాసం మరియు త్యాగాన్ని గుర్తుచేస్తుంది:

కాబా చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణ) ప్రవక్త ఇబ్రహీం స్థాపించిన ఏకేశ్వరోపాసన వారసత్వాన్ని గుర్తుచేస్తుంది.

సఫా మరియు మార్వా కొండల మధ్య సయీ (పరుగు) హజ్రత్ హజర్ నీటి కోసం చేసిన తీరని అన్వేషణను గుర్తుచేస్తుంది.

స్తంభాలపై రాళ్ళు రువ్వడం (రామి) ప్రవక్త ఇబ్రహీం సాతాను ప్రలోభాలను తిరస్కరించడాన్ని ప్రతిబింబిస్తుంది.

హజ్ చేయడం ద్వారా, ముస్లింలు అల్లాహ్‌పై అచంచల విశ్వాసం, సహనం మరియు నమ్మకం యొక్క సందేశాలను అంతర్గతీకరిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే హజ్ చేస్తారో  మరియు వారు ఎటువంటి అసభ్యకరమైన లేదా తప్పు చేయకపోతే, అతను తన తల్లి అతనికి జన్మనిచ్చిన రోజుగా (పాపం నుండి విముక్తి పొందుతాడు)”. — బుఖారీ మరియు ముస్లిం

ఆధ్యాత్మిక పునర్జన్మకు హజ్ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. యాత్రికులు సరళమైన తెల్లని వస్త్రాలు (ఇహ్రామ్) ధరిస్తారు మరియు అల్లాహ్‌తో వారి సంబంధంపై మాత్రమే దృష్టి పెడతారు. శారీరకంగా కష్టతరమైన ఆచారాలు, ప్రార్థనలు మరియు త్యాగాలు ఆత్మను వినయం చేస్తాయి మరియు హృదయాన్ని శుభ్రపరుస్తాయి, గత పాపాలను తుడిచివేస్తాయి మరియు విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేస్తాయి.

హజ్ జాతీయత, సంపద మరియు హోదాను మించిపోయింది. ఇహ్రామ్ యొక్క తెల్లని వస్త్రంలో, ప్రతి యాత్రికుడు అల్లాహ్ ముందు సమానంగా నిలుస్తాడు, ఇస్లామిక్ సూత్రం సోదరభావం మరియు సార్వత్రిక సమానత్వాన్ని కలిగి ఉంటాడు.ఈ శక్తివంతమైన ఐక్యత ఇస్లాం యొక్క ప్రపంచ సోదరభావానికి నిదర్శనం, సానుభూతి, కరుణ మరియు భాగస్వామ్య మానవత్వాన్ని బలోపేతం చేస్తుంది.

హజ్ యాత్ర సహనం, ఓర్పు మరియు అల్లాహ్‌పై ఆధారపడటాన్ని పెంపొందిస్తుంది. . యాత్రికులు తక్కువ అదృష్టవంతులతో సానుభూతి చెందడం నేర్చుకుంటారు.జీవితంలోని ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో ఉండటానికి మరియు వాటిని ఇతరులతో ఉదారంగా పంచుకోవడానికి నిరంతరం గుర్తు చేస్తుంది.

ఆధ్యాత్మిక కోణానికి మించి, హజ్ అనేది అల్లాహ్ మరియు తోటి ముస్లింలతో అనుసంధాన ప్రయాణం. యాత్రికులు జీవితాంతం ఉండే బంధాలను ఏర్పరుస్తారు, ప్రార్థనలను పంచుకుంటారు.

యాత్రికులు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, హజ్ యొక్క పరివర్తనాత్మక ప్రభావం తరచుగా వారిని మరింత మనస్సాక్షిగా జీవించడానికి ప్రేరేపిస్తుంది. హజ్ అనేది కేవలం ఆచారాల సమితి కాదు; ఇది సమగ్రత, కరుణ మరియు భక్తితో కూడిన జీవితాన్ని గడపాలనే కోరికను రేకెత్తించే హృదయ ప్రయాణం.

హజ్ విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేస్తుంది, హృదయాన్ని శుభ్రపరుస్తుంది మరియు ప్రతి యాత్రికుడికి జీవిత అంతిమ ఉద్దేశ్యాన్ని అల్లాహ్‌ను ఆరాధించడం మరియు అతని ఆనందాన్ని కోరుకోవడం గుర్తు చేస్తుంది:.

ముస్లింలకు, హజ్ చేయడం అనేది వారి ఆధ్యాత్మిక మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి, జీవితంలో ఒకసారి లభించే అవకాశం.

 

జైలు సంస్కరణలు: ఖైదీల మానసిక ఆరోగ్య సంక్షోభం India’s prison Reforms: Inmate’s mental health crisis

 

భారతదేశ జైలు వ్యవస్థలో మానసిక ఆరోగ్యం తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడిన కోణంగా ఉంది  ఖైదు చేయబడిన వ్యక్తుల మానసిక అవసరాలు విస్మరించబడుతున్నాయి. భారతీయ జైళ్లలో వేలాది మంది ఖైదీలు అత్యంత ప్రాథమిక మానసిక ఆరోగ్య సేవలను పొందకుండా ఒంటరిగా బాధపడుతున్నారు.

రాఘవన్ మరియు రబియా (2018) పరిశోధన ప్రకారం, “ప్రిజన్ మెంటల్ హెల్త్ ఇన్ ఇండియా: రివ్యూ మానసిక రుగ్మతలు  Prison Mental Health in India: Review, psychiatric disorders”,: స్కిజోఫ్రెనియా, డిప్రెషన్, వంటి మానసిక రుగ్మతలు భారతీయ ఖైదీలలో అసమానంగా ప్రబలంగా ఉన్నాయి. మరణించిన ఖైదీలపై నిర్వహించిన ఒక అధ్యయనo ప్రకారం  దాదాపు 8% శవపరీక్షలలో మరణానికి ఆత్మహత్య కారణమని కనుగొన్నారు...2000 మరియు 2017 మధ్య, భారతదేశంలో కేవలం 12 పరిశోధన అధ్యయనాలు మాత్రమే ప్రిజన్ మెంటల్ హెల్త్ సమస్యను క్రమబద్ధంగా అన్వేషించాయి,

ఖైదు చేయబడిన వ్యక్తుల మానసిక ఆరోగ్యo  జైలు వాతావరణం ద్వారా కూడా తీవ్రతరం అవుతుంది,. రద్దీ మరియు సిబ్బంది కొరత తో కూడిన భారతీయ జైళ్లు భావోద్వేగ మరియు మానసిక ఒత్తిడికి నిలయాలు. గోప్యత లేకపోవడం, శారీరక మరియు భావోద్వేగ హింసకు గురికావడం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉండటం, చట్టపరమైన ఫలితాల గురించి అనిశ్చితి, పేలవమైన పారిశుధ్యం మరియు బయటి ప్రపంచంతో తగినంత సంబంధం లేకపోవడం ఇవన్నీ మానసిక ఒత్తిడిని పెంచుతాయి.

భారతదేశ జైలు జనాభాలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఉన్న విచారణ ఖైదీలు సంవత్సరాలుగా నిర్బంధించబడి, విచారణ కోసం ఎదురు చూస్తున్నారు.

2017 మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం ప్రకారం స్పష్టమైన చట్టపరమైన ఆదేశం ఉన్నప్పటికీ, భారత జైళ్లలో మానసిక ఆరోగ్య సేవల స్థితి చాలా తక్కువగా ఉంది. ఈ చట్టం ప్రకారం అన్ని రకాల  జైలు వైద్య అధికారులు మానసిక ఆరోగ్య సంరక్షణలో శిక్షణ పొందాలి మరియు ప్రతి రాష్ట్రంలో అంకితమైన మానసిక ఆరోగ్య సౌకర్యంతో కనీసం ఒక జైలును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో వాస్తవికత వేరే కథ చెబుతుంది.

ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 1,330 జైళ్లకు సేవ చేయడానికి కేవలం 25 మంది మనస్తత్వవేత్తలు లేదా మనోరోగ వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు - అంటే ప్రతి 22,929 మంది ఖైదీలకు ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు మాత్రమే. ఇది మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 నుండి చాలా దూరంగా ఉంది, ప్రిజన్ మాన్యువల్ 2016 ప్రతి 500 మంది ఖైదీలకు ఒక ప్రొఫెషనల్‌ని సిఫార్సు చేస్తుంది.

25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో జైలు సిబ్బందిలో మనస్తత్వవేత్తలు లేదా మనోరోగ వైద్యులు లేరు. బన్సాల్ మరియు మోతియాని (2025) ఇటీవల నిర్వహించిన అధ్యయనం, రీథింకింగ్ ఆన్ ది ఇంటర్‌ప్లే ఆఫ్ సబ్‌స్టెన్స్ అబ్యూస్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ ఇండియన్ ప్రిజన్స్: ఎ క్రిటికల్ అనాలిసిస్’, ప్రకారం దీర్ఘకాలిక నిధుల కొరత మరియు శిక్షణ పొందిన నిపుణుల తీవ్రమైన కొరత సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి.  

తీహార్ జైలులో ప్రవేశపెట్టబడిన విపశ్యన ధ్యానం మరియు సుదర్శన క్రియా యోగా ఖైదీల భావోద్వేగ శ్రేయస్సుపై సానుకూల ప్రభావాలను ప్రదర్శించాయి.

తక్కువ భావోద్వేగ మేధస్సు మరియు బలహీనమైన కోపింగ్ మెకానిజమ్స్ ఉన్న వ్యక్తులు మానసిక విచ్ఛిన్నాలకు ఎక్కువగా గురవుతారు. అటువంటి ఖైదీలను గుర్తించి మద్దతు ఇవ్వగల శిక్షణ పొందిన కౌన్సెలర్లు లేదా సామాజిక కార్యకర్తలు లేకపోవడం మానసిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.

ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి. మొదటిది, పూర్తి సమయం మానసిక వైద్య విభాగాలను జైళ్లలో, ముఖ్యంగా పెద్ద కేంద్ర జైళ్లలో పొందుపరచాలి. రెండవది, మానసిక ఆరోగ్య ప్రథమ చికిత్సలో జైలు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం. మూడవది, ముఖ్యంగా ప్రత్యేక సంరక్షణ అవసరమయ్యే సందర్భాలలో ఖైదీలను సమీపంలోని మానసిక ఆరోగ్య సంస్థలతో అనుసంధానించడానికి బలమైన రిఫెరల్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి,.

ఖైదీలందరికీ ప్రవేశ సమయంలో, శిక్ష సమయంలో మరియు విడుదలకు ముందు సాధారణ మానసిక అంచనాలను ప్రవేశపెట్టడం కూడా అంతే ముఖ్యం. ఖైదీలలో మానసిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి చట్టపరమైన మరియు విధాన చట్రాలు ఇప్పటికే ఉన్నాయి. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం నుండి మోడల్ జైలు మాన్యువల్ వరకు, సంరక్షణ భాష కాగితంపైనే ఉంది. అయితే, ఈ ఆదేశాలను అమలు చేయగల పరిస్థితులు లేవు.

జైలులో ఉంచిన వారి మానసిక ఆరోగ్యాన్ని విస్మరించటం  వారి ఆరోగ్య హక్కును ఉల్లంఘించడమే కాకుండా, వ్యక్తుల సంస్కరణ మరియు పునరేకీకరణ అవకాశాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇందుకు జైలు నిర్వాహకులు, మానసిక ఆరోగ్య నిపుణులు మరియు పౌర సమాజం కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైంది.

 

 

 

30 May 2025

ఎ.కె. ఫజ్లుల్ హక్: బెంగాల్‌లో అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరు A.K. Fazlul Haq: One of the best-loved leaders of Bengal

 


ఎ.కె. ఫజ్లుల్ హక్ అని ప్రసిద్ధి చెందిన అబుల్ కాసెం ఫజ్లుల్ హక్ 1873 అక్టోబర్ 26న బేకర్‌గంజ్ జిల్లాలోని బారిసల్ సబ్-డివిజన్ లో  జన్మించాడు. సర్ అశుతోష్ ముఖర్జీ పర్యవేక్షణలో న్యాయశాస్త్రంలో శిక్షణ పొందినాడు. ఎ.కె. ఫజ్లుల్ హక్ ముహమ్మదన్ విద్యా సమావేశం Muhammadan Educational Conference తో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాడు మరియు ముస్లిం లీగ్ ప్రారంభకులలో ఒకరు..

ఎ.కె. ఫజ్లుల్ హక్ 1916 లక్నో ఒప్పందం పై సంతకం పెట్టినవారిలో ఒకడు. 1917లో, ఎ.కె. ఫజ్లుల్ హక్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించాడు. అదే సంవత్సరం ఎ.కె. ఫజ్లుల్ హక్ కలకత్తా వ్యవసాయ సంఘం ఏర్పాటులో కూడా పాల్గొన్నారు. 1919లో జరిగిన బెంగాల్ కాంగ్రెస్ సమావేశానికి ఎ.కె. ఫజ్లుల్ హక్ అధ్యక్షత వహించారు మరియు జలియన్ వాలాబాగ్ పై కాంగ్రెస్ విచారణ కమిటీ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు.

ఖీలాఫత్ ఉద్యమానికి ఎ.కె. ఫజ్లుల్ హక్ బలమైన సమర్ధకుడు మరియు 1920 సెప్టెంబర్‌లో కలకత్తాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశంలో ఫజ్లుల్ హక్ సహాయ నిరాకరణకు అనుకూలంగా ఓటు వేశారు. ఫజ్లుల్ హక్ బెంగాల్ శాసనసభకు  ఎన్నికైనారు 1924లో విద్యా మంత్రిగా పదోన్నతి పొందారు. విద్యా మంత్రిగా ఫజ్లుల్ హక్ ఇస్లామియా కళాశాలను స్థాపించినాడు, అర్హులైన ముస్లిం విద్యార్థుల కోసం ఒక నిధిని సృష్టించడం జరిగింది..  

ఫజ్లుల్ హక్, లక్నో ఒప్పందం గురించి పునరాలోచించి  నెహ్రూ నివేదిక (1928)లోని  ఉమ్మడి ఓటర్ల వ్యవస్థ కు మద్దతు ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీలో ఆమోదించబడిన కౌలు సవరణ బిల్లును ఫజ్లుల్ హక్, తీవ్రంగా వ్యతిరేకించారు. మరియు నిఖిల్ ప్రజా పార్టీ స్థాపించారు.  1930 మరియు 1931లో రౌండ్ టేబుల్ సమావేశాల కోసం ఫజ్లుల్ హక్ లండన్‌కు వెళ్లారు,

1935లో, ఫజ్లుల్ హక్ కలకత్తా కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైనారు. నిఖిల్ ప్రజా పార్టీలోని తన సొంత వర్గాన్ని క్రిషక్ ప్రజా పార్టీ KPPఅని పేరు పెట్టారు.

జూన్ 1936లో, జరిగిన బెంగాల్ ప్రాంతీయ ఎన్నికలలో KPP ముస్లిం లీగ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

1937 లక్నో సమావేశంలో ఫజ్లుల్ హక్ ముస్లిం లీగ్ సభ్యత్వాన్ని తీసుకున్నాడు జిన్నా బెంగాల్ ముఖ్యమంత్రి ఫజ్లుల్ హక్‌ను ముస్లిం లీగ్ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు నామినేట్ చేశాడు, కానీ KPP-UML సంకీర్ణం మద్య విబేధాలు వచ్చి  , జిన్నా ఫజ్లుల్ హక్‌ను కేంద్ర పార్లమెంటరీ బోర్డు నుండి బహిష్కరించాడు

1938లో, ఫజ్లుల్ హక్ ప్రభుత్వం కానిస్టేబుళ్లలో కనీసం 50% మంది ముస్లింలు ఉండేవిధంగా పోలీసుల నియామక నియమాలను మార్చినది.. అన్ని ప్రభుత్వ నియామకాలలో ముస్లింలకు 60% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది. 1940లో ఫజ్లుల్ హక్ ప్రభుత్వం కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్య నియంత్రణను తొలగించి, ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత గల బోర్డుకు అప్పగించింది.

జూలై 1941లో, జాతీయ రక్షణ మండలిలో ఫజ్లుల్ హక్ బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో స్వీకరించారు.  జిన్నా సింకందర్ హయత్ ఖాన్ మరియు సాదుల్లాను ఫజ్లుల్ హక్ తో పాటు కౌన్సిల్ కు రాజీనామా చేయమని బలవంతం చేశాడు, కానీ హక్ లీగ్ వర్కింగ్ కమిటీకి కూడా రాజీనామా చేశాడు.

జిన్నాతో ఫజ్లుల్ హక్ కు గల విభేదాలు తీవ్రతరం అయినాయి ఫజ్లుల్ హక్ జిన్నా నిరంకుశ ప్రవర్తన పట్ల  ఎప్పుడూ సంతోషంగా లేడు మరియు తన ప్రసంగాలు మరియు చర్యల ద్వారా బెంగాల్ స్వయంప్రతిపత్తిని నొక్కి చెబుతూనే ఉన్నాడు.

జిన్నా బెంగాల్‌లోని ఫజ్లుల్ హక్ ప్రత్యర్థులను ఉపయోగించి ఫజ్లుల్ హక్ ను పదవి నుంచి తొలగించాడు. అయితే, ఫజ్లుల్ హక్ మెజారిటీ సబ్యుల మద్దతు కూడకట్టి ప్రోగ్రెసివ్ సంకీర్ణ మంత్రిత్వ వర్గం  ఏర్పాటును ప్రకటించాడు. గవర్నర్ జాన్ హెర్బర్ట్ ఫజ్లుల్ హక్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలిచాడు. కాని గవర్నర్ శరత్ బోస్‌ను డిఫెన్స్ ఆఫ్ ఇండియా పాలనలో అరెస్టు చేయడం, ఫజ్లుల్ హక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ జరిపిన కుట్రలు, చర్యల పలితంగా ఫజ్లుల్ హక్ ప్రభుత్వం బలహీనపడింది

అంత్య దశలో ఫజ్లుల్ హక్ రాజకీయ జీవితం అంధకారమయం అయింది. 1946 ఎన్నికలు ఫజ్లుల్ హక్ పార్టీ యొక్క క్షీణిస్తున్న రాజకీయ దశకు నిదర్శనం, ఎన్నికలలో లీగ్ 114 సీట్లు, కాంగ్రెస్ 86 సీట్లు (అన్నీ జనరల్) గెలుచుకుంది మరియు కెపిపి మూడు సీట్లను మాత్రమే పొందినది.

1946లో నెహ్రూ ఫజల్-ఉల్ హక్ పేరును జాతీయ మంత్రివర్గంలో చేర్చాలని ప్రతిపాదించాడు, కానీ లార్డ్ వేవెల్ దానికి తీవ్రంగా వ్యతిరేకంగా స్పందించాడు. అందువల్ల ఫజల్-ఉల్ హక్ కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు

ఫజల్-ఉల్ హక్ పాకిస్తాన్ ఆలోచనకు అంగీకరించి తూర్పు పాకిస్తాన్‌కు వెళ్లాడు తూర్పు పాకిస్తాన్ అడ్వకేట్ జనరల్ గా  హక్  నియమించబడినాడు. జిన్నా బెంగాలీలపై ఉర్దూను ఏకైక రాజ్య భాషగా విధించడం వల్ల తూర్పు పాకిస్తాన్ నిర్లక్ష్యం చేయబడిందని హక్ భావించాడు.

తూర్పు పాకిస్తాన్ లో మౌలానా భాషాని, షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ ఏర్పచినారు  ఫజ్లుల్ హక్ స్వయంగా కృషక్ శ్రామిక్ పార్టీ (KSP)ని స్థాపించి, అవామీ లీగ్‌తో చేతులు కలిపి యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాడు, దాని నాయకుడిగా ఫజ్లుల్ హక్ ఉన్నారు

1954లో తూర్పు పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో, ముస్లిం లీగ్ 10 సీట్లకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ 223 సీట్లు గెలుచుకుంది. ఫజ్లుల్ హక్ మరోసారి తూర్పు పాకిస్తాన్ ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ తూర్పు పాకిస్తాన్ లో రాజకీయ కారణాలపై చెలరేగిన అల్లర్ల వలన 1954 మే 30న ఫజ్లుల్ హక్ మంత్రివర్గం  రద్దు చేశారు. అయితే, తూర్పు పాకిస్తాన్ నుండి కేంద్ర పాలన ఉపసంహరించబడిన కొంతకాలం తర్వాత, ఫజ్లుల్ హక్,  చౌదరి ముహమ్మద్ అలీ పాకిస్తాన్ కేంద్ర  మంత్రివర్గం లో చేరి, పాకిస్తాన్ అంతర్గత మంత్రి పదవిని దక్కించుకున్నాడు. . ఉర్దూతో పాటు బెంగాలీకి జాతీయ భాష హోదాను కల్పించే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడంలో కూడా ఫజ్లుల్ హక్ కీలక పాత్ర పోషించారు

ఫజ్లుల్ హక్‌ వ్యక్తత్వ అంచనా:

ఫజ్లుల్ హక్‌ను అంచనా వేస్తూ1937లో వైస్రాయ్‌కు రాసిన లార్డ్ లిన్‌లిత్‌గో, సర్ జాన్ ఆండర్సన్, ఫజ్లుల్ హక్ "ముస్లిం రాజకీయాల్లో అత్యంత అనిశ్చిత వ్యక్తి, పూర్తిగా సూత్రప్రాయంగా లేనివాడు మరియు ఎవరూ విశ్వసించనివాడు" అని పేర్కొన్నారు.

హక్ బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలో బాగా తెలిసిన వ్యక్తి.  ప్రజలతో, ముఖ్యంగా రైతులతో ఫజ్లుల్ హక్ కున్న అనుబంధం ఎంత గొప్పదంటే, 1940లలో వివిధ రంగాల నాయకులు బెంగాల్ గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నప్పుడు, చాలా మంది రైతులు గాంధీ మరియు ఫజ్లుల్ హక్ పేరు మాత్రమే విన్నారని కనుగొన్నారు.

ఫజ్లుల్ హక్ బెంగాలీ దేశభక్తుడు బెంగాల్ స్వయంప్రతిపత్తి కోసం ఆరాటపడ్డాడు." ఫజ్లుల్ హక్ రాజకీయాలు ఆయనను  బెంగాల్ యొక్క అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరిగా చేశాయి."