3 May 2025

భారతదేశం మరియు తుర్క్మెనిస్తాన్ India and Turkmenistan

 



 మగ్త్యుంగులీ Magtymguly - ది సేజ్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకాన్ని ఇటివల డిల్లి లో ఆవిష్కరించడం జరిగింది. మగ్త్యుంగులీ అనే తుర్క్మినిస్తాన్ కవి  ప్రపంచ సాహిత్యానికి చేసిన సహకారాన్ని గుర్తు చేయడం జరిగింది.

మగ్త్యుంగులీ, ఇరానియన్-తుర్క్మెన్ కవి, తత్వవేత్త, సూఫీ మరియు యాత్రికుడు. మగ్త్యుంగులీ 1724లో ఇరానియన్ ప్రావిన్స్ గోలెస్తాన్‌లో జన్మించాడు మరియు 1827లో మరణించాడు మగ్త్యుంగులీ మధ్య ఆసియా అంతటా ప్రయాణించాడు, ఎంతో ఆరాధించబడ్డాడు మరియు గౌరవించబడ్డాడు. మెర్వ్ Merv నగరం లోని మగ్త్యుంగులీ  సమాధి చాలా మందికి తీర్థయాత్ర స్థలంగా మారింది.

మగ్త్యుంగులీ తుర్క్మెనిస్తాన్ సాహిత్యానికి గొప్ప ప్రతినిధిగా పరిగణించబడ్డాడు మగ్త్యుంగులీ కవిత్వం ఆధ్యాత్మికంగా పరిగణించబడింది.

మగ్త్యుంగులీ కి భారతదేశం లేదా తుర్క్‌మెనిస్తాన్‌లో భారతదేశం అని పిలువబడే హిందూస్తాన్ పట్ల ఉన్న ప్రేమ కలవాడు. మాగ్తింకులీ ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాలోని ఇతర దేశాలకు చేసిన ప్రయాణాల సమయంలో ఉత్తర భారతదేశాన్ని (పాకిస్తాన్‌లోని నేటి ఖైబర్-పఖ్తుంఖ్వా చుట్టూ) సందర్శించాడని చెబుతారు.

అక్బర్ ది గ్రేట్  సంరక్షకుడు/గురువు  బైరామ్ ఖాన్ లేదా  బైరామ్ బేగ్ తుర్క్మెనిస్తాన్‌లో జాతీయ వీరుడు. బైరామ్ ఖాన్ హుమాయున్ మరణించినప్పుడు అక్బర్ కు  రాజప్రతినిధిగా ఉన్నాడు మరియు అక్బర్ సామ్రాజ్యంపై తన పట్టును పదిలం చేసుకోవడానికి సహాయం చేశాడు. బైరామ్ ఖాన్ కుమారుడు రహీమ్ ఖాన్  అక్బర్ ఆస్థానాన్ని అలంకరించిన తొమ్మిది రత్నాలలో ఒకడు అయ్యాడు మరియు రహీమ్ కే దోహే అని పిలువబడే అతని కవితలు ఇప్పటికీ భారతదేశంలో ప్రతిధ్వనిస్తాయి.

బైరామ్ ఖాన్ తుర్క్మెనిస్తాన్ బహర్లు వంశానికి చెందినవాడు. బైరామ్ ఖాన్ తన జీవితమంతా మొఘల్ ఆస్థానంలో గడిపాడు. తుర్క్మెనిస్తాన్‌లో బైరామ్ ఖాన్ ను  తైమురిడ్-మొఘల్ వారసత్వానికి ప్రధాన సహకారిగా, గొప్ప యోధుడు, రాజనీతిజ్ఞుడు మరియు కవిగా మరియు అక్బర్ రాజప్రతినిధిగా గుర్తిస్తారు. బైరామ్ ఖాన్ విగ్రహం తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్కాబాద్ లో కలదు. బైరామ్ ఖాన్ జీవితం పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో బోధించబడుతుంది బైరామ్ ఖాన్ జీవితం తుర్క్మెనిస్తాన్ ప్రజలకు గర్వకారణం.

భారతదేశం మరియు తుర్క్మెనిస్తాన్ మధ్య సంబంధాలు ప్రాచిన కాలం నుంచి ఉన్నాయి. సింధు లోయ నాగరికత మరియు తుర్క్మెనిస్తాన్ మధ్య సంబంధాల కలవు. ప్రాచీన  యుగంలో బౌద్ధమతం భారతదేశం మరియు తుర్క్మెనిస్తాన్ మధ్య ఖచ్చితమైన సంబంధాలకు రుజువు. బౌద్ధమతం భౌగోళిక సరిహద్దులను అధిగమించి, విభిన్న జాతులను ఏకం చేస్తుంది. తుర్క్మెనిస్తాన్ పురాతన సిల్క్ రూట్‌లో ఒక ముఖ్యమైన స్టాప్‌గా మరియు విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉంది.

ప్రాచిన కాలం లో మహాయాన బౌద్ధ పాఠశాలను అనుసరించే బౌద్ధ సమాజం తుర్క్మెనిస్తాన్ ప్రాంతంలో స్థిరపడింది. దక్షిణ తుర్క్మెనిస్తాన్‌లోని పురాతన నగరమైన మెర్వ్‌ మధ్య ఆసియాలో బౌద్ధ సంస్కృతికి అత్యంత ముఖ్యమైన కేంద్రం.

చైనీస్ చరిత్రల ప్రకారం, పార్థియన్ యువరాజు అన్-షి-గావో క్రీ.శ. 148లో తుర్క్మెనిస్తాన్‌కు బౌద్ధ మిషనరీల బృందానికి నాయకత్వం వహించాడు. మెర్వ్ Merv నగరం లో లో ప్రాచీన బౌద్ధ స్మారక చిహ్నాలు కనుగొనబడినవి.  

పండితులు మరియు చరిత్రకారుల ప్రకారం, తూర్పు తుర్క్‌మెనిస్తాన్ మరియు మధ్య ఆసియాలో లభించిన బౌద్ధ రాతప్రతులు ప్రపంచంలో బౌద్ధ కానన్ యొక్క ఏకైక అసలు గ్రంథాలుగా మిగిలిపోయాయి.

గౌర్ కాలా స్థూపాల తవ్వకాలలో 75-సెం.మీ ఎత్తు గల బుద్ధుని తల లబించినది.. ఇది రెండవ మరియు మూడవ శతాబ్దాల కాలానికి చెందిన అత్యంత ఎత్తైన విగ్రహా౦ బుద్ధుని ముఖం ప్రశాంతత మరియు ఘనతను కలిగి ఉంది. బుద్ధుని తల విగ్రహం అష్కా బాద్‌లోని తుర్క్మెనిస్తాన్ జాతీయ మ్యూజియంలో ఉంచబడింది.ఇది బుద్ధుని మొదటి విగ్రహాలలో ఒకటిగా భావించబడుతుంది మరియు వాయువ్య భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉద్భవించిన గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్‌ను సూచిస్తుంది,  మెర్వ్‌లోని తవ్వకాల స్థలంలో బౌద్ధ కళకు సంబంధించిన అనేక ఇతర వస్తువులు బయటపడ్డాయి - బుద్ధుడు, బోధిసత్వులు, ఒక గొప్ప మహిళ మరియు వీణ వాద్యకారుల చిన్న విగ్రహాలు.

భారతదేశం మరియు తుర్క్‌మెనిస్తాన్ చరిత్ర అంతటా మరియు వివిధ యుగాలలో - బౌద్ధమతం మరియు తైమురిడ్-మొఘల్ వారసత్వం ద్వారా  ముడిపడి ఉన్నాయి.

 

No comments:

Post a Comment