మనకి రాజ్యాంగం అవసరం అని
మొట్టమొదట గోపాల కృష్ణ గోఖలే 1914లో చెప్పారు. ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యంగ పరిషత్ యొక్క
ఆవశ్యకత తెలిపారు. 1935లో భారత జాతీయ
కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్
ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్
మిషన్ ప్లాన్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి.
రాజ్యాంగ పరిషత్ లోని మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93
మంది సంస్థానాల నుండి,
నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిఎన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్
నుండి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ 208 స్థానలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి.
తర్వాత కాంగ్రెస్ తో విభీదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు
వేరే రాజ్యంగా పరిషత్ ని ఏర్పాటు చేసుకోంది.
భారత రాజ్యంగ పరిషత్
మొదటి సమావేశం కు ప్రొఫెసర్ సచ్చిదానంద
సిన్హా అద్యక్షత వహించారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషద్ కు
అద్యక్షుడిగా ఎన్నికైనారు. ప్రొఫెసర్ BN రావు రాజ్యాంగ పరిషత్ కు సలహాదారుగా
పనిచేసారు.
1946 లో ఎన్నికైన భారత
రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని
రూపొందించినది. రాజ్యంత పరిషత్ కు 15 మంది
స్త్రీలు ఎన్నికైనారు. వీరు రాజ్యాంగ నిర్మాణం లో
చురుకుగా పాల్గొన్నారు.
వారి పేర్లు
వరుసగా
1అమ్ము స్వామినాథన్(కేరళ) 2.ద్రాక్షాయణి వేలునాధన్(కేరళ) 3. బేగం ఐజాజ్ రసూల్(యునైటెడ్ ప్రావిన్స్) 4.
దుర్గా బాయి
దేశముఖ్(రాజమండ్రి – ఆంధ్ర ప్రదేశ్) 5.
హన్స్ జీవరాజ్
మెహత(బరోడా) 6. కమలా చౌదరి(లక్నో) 7. లీలా రాయ్(అస్సాం) 8. మాలతి చౌదరి(ఈస్ట్ బెంగాల్ నేటి బంగ్లా
దేశ్) 9. పూర్ణిమా బెనెర్జీ(అలహాబాద్)10. రాజకుమారి అమ్రిత్ కౌర్(లక్నో) 11. రేణుక రాయ్ (బెంగాలీ, ICS అధికారి కుమార్తె,లండన్ లో చదువు)12. సరోజినీ నాయుడు(హైదరాబాద్) 12. సుచేత కృపలానీ(అంబాల – హర్యానా) 14. విజయ లక్ష్మి
పండిట్(అలహాబాద్) 15. అన్నీ మాస్కారేన్(కేరళ)