జనరల్ కేటగిరీ రిజర్వేషన్ బిల్లు అగ్రకులాల కోసం ఎన్నికల గాలం గా పరిగణించబడుతున్నప్పటికి, ప్రభుత్వం వాస్తవంగా అర్హులైన పేదల గణాంకాలను తీసుకుంటే, కోటా పూర్తిగా ముస్లింలకు వెళ్లాల్సి ఉంటుంది.
రాజ్య సభ కూడా జనరల్ కేటగిరీ రిజర్వేషన్
బిల్లును పేద అగ్రకులాల కోసం ఆమోదించింది, కోటా బిల్లు చట్టంగా మారడానికి ఇక అధ్యక్షుడి
ఆమోదం మాత్రమే వేచి వుంది.
ముస్లింలు మరియు ఇతర మైనారిటీ మతస్తులతో సహా
ప్రస్తుతం ఉన్న కోటాలు లేని అన్ని గ్రూపులకు 10% జనరల్ కేటగిరి రిజర్వేషన్లు
వర్తించునని ప్రభుత్వ ప్రతినిధులు
పేర్కొన్నారు. ఎన్నికల ముందు అగ్ర కులాల కోసం ఈ రిజర్వేషన్లు తాయిలం అని
అనిపించినప్పటికీ ప్రభుత్వం అర్హులైన పేదల
గణాంకాల వివరాలను స్వికరించినట్లేతే ఈ రిజర్వేషన్లు దాదాపు పూర్తిగా ముస్లింలకు
వెళ్లాలి.అయితే, అర్హత ప్రమాణాలు విస్తృతంగా రుపొందిoచ బడినవి, దాదాపు
దేశంలోని ప్రతి ఒక్కరూ అర్హత సాధించారు.
సంవత్సరానికి 8 లక్షల గృహ ఆదాయం అర్హతగా నరేంద్ర మోడీ
ప్రభుత్వం ప్రకటించింది. ఐదు ఎకరాల పైన ఉన్న వ్యవసాయ భూమి, ఒక నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 1,000 చదరపు అడుగులు లేదా 100 గజాలు పైన ఉన్న ఇల్లు లేదా అంతకంటే
ఎక్కువ ఉన్న కుటుంబాలు, నొటిఫైడ్ కాని పురపాలక ప్రాంతాలలో 200 చదరపు యార్డ్ ప్లాట్లు కలిగి ఉన్న కుటుంబాలు అర్హతను కలిగి ఉండవు.
2011-12 భారతదేశ మానవాభివృద్ధి సర్వే (IHDS), జాతీయ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ మరియు
మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం తో కలసి సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం, సరాసరి సంవత్సారానికి 8 లక్షల గృహ ఆదాయం కేవలం దేశంలోని 1% కంటే అధిక కుటుంబాలకు మాత్రమె ఉంది అనగా
99% కుటుంబాల సరాసరి తలసరి అదాయం 8లక్షల
లోపుగానే ఉంది.
కానీ ప్రస్తుతం రిజర్వేషన్లు లేని వర్గాలలో ముస్లింలు
నిస్సందేహంగా పేదలుగా ఉన్నారు. 2011-12 నాటికి భారత దేశంలోని సగటు వార్షిక కుటుంబ
ఆదాయం 1.13
లక్షలు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్
తెగలవారు దానికoటే తక్కువగా సంపాదించగా, వారి తరువాత ముస్లింలు మరియు ఇతర వెనుకబడిన
వర్గాలు (OBC లు) వస్తారు.
భారత దేశం లో ఉన్నత కులాలు వారు సంపన్నులు. వారి గృహ ఆదాయం, భారత దేశంలోని సగటు గృహ ఆధాయం కన్నా
దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అలాగే, 2011-12 నాటికి, ఐదు గ్రామీణ గృహాలలో 5 ఎకరాల భూమి
కన్నా ఎక్కువ ఉన్న వారు 3 శాతం కన్నా తక్కువ ఉన్నారు. ముస్లింలలో ఈ నిష్పత్తి
కేవలం 1
శాతం
మాత్రమేనని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ ఎఫ్హెచ్ఎస్)
సంపద సూచి నుంచి పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థి డాక్టర్ నితిన్ కుమార్ భారతి సేకరించిన
వివరాల ప్రకారం 2005-06 నాటికి వెనుకబడిన కులాలతో పాటు, ముస్లింలు నిరుపేద ప్రజలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారు. వారు భారతదేశం లోని నిరుపేదలలో 20% ఉన్నారు. అగ్ర కులాలు అరుదుగా ఈ సమూహంలో ఉన్నాయి.