14 November 2022

భారతదేశములోని ముస్లిం స్త్రీ రచయితలు

 

అనాదిగా అన్ని సంస్కృతులలో/దేశాలలో  స్త్రీలు  చిన్నచూపు చూడబడ్డారు. కాని భారతదేశంలోని ముస్లిం మహిళలు  తమ దయనీయ స్థితిని, ఆర్ధిక లేమిని, పితృస్వామ్య అహంకారాన్ని ఎదుర్కొంటూ సంకల్పం మరియు ఆత్మవిశ్వాసం ద్వారా, పేదరికపు అడ్డంకులను అధిగమించి అపూర్వమైన విజయాన్ని సాధించారని చాలామందికి తెలియదు.

ముస్లిం మహిళలు అసాధారణమైన, అద్భుతమైన మరియు ప్రశంసనీయమైన అభివృద్దిని సాధించారు.

ఫాతిమా బీబీ (1989లో బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి), సురయా త్యాబ్జి; (1947లో మన జాతీయ పతాకాన్ని రూపొందించినది); బేగం అక్తర్ (గజల్ క్వీన్ అనే బిరుదును పొందిన మొదటి మహిళా గాయని), సానియా మీర్జా (ATS టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ) రొకేయా సఖ్వత్ హుస్సేన్, (1905లో మొదటి మహిళా సైన్స్ ఫిక్షన్  నవల సుల్తానాస్ డ్రీమ్ రచయిత్రి.) ఇస్మత్ చుగ్తాయ్, రషీద్ జహాన్, అంగారే దట్, ఖురతుల్ ఐన్ హైదర్, రజియా సుల్తానా, చాంద్ బీబీ మరియు భోపాల్‌ ను పరిపాలించిన  బేగమ్స్ వంటి ముస్లిం మహిళలు, ముఖ్యంగా సుల్తాన్ జహాన్, వంటి ప్రముఖ పాలకులు  ఉన్నప్పటికీ సామూహిక జీవితానికి వారి సహకారం తగినంతగా నమోదు చేయబడలేదు.

వాస్తవానికి, భారతీయ ముస్లిం మహిళలు, గతంలో మరియు వర్తమానంలో, కళ, విజ్ఞాన శాస్త్రం, దేశ నిర్మాణం లేదా రాజకీయాలు మొదలగు  రంగాలలో మార్గనిర్దేశం చేయడం, పాల్గొనడం మరియు అభివృద్ధికి సహకరించడం వంటి పనులు చేసారు.

ముస్లిం మహిళల సృజనాత్మక నైపుణ్యం, అభ్యాసం మరియు ఊహాజనిత తెలివితేటలు దాదాపు ప్రతి సాహిత్యం మరియు నాన్-ఫిక్షన్‌లో  ప్రతిధ్వనిస్తాయి.

అజర్మీ దుఖ్త్ సఫావి, రక్షంద జలీల్, రానా సఫావి, అన్నీ జైదీ, సమీ రఫీక్, నజియా ఎరుమ్, రానా అయూబ్, గజాలా వహాబ్, హుమా ఖలీల్, జెహ్రా నఖ్వీ, రీమా అహ్మద్, నస్రా శర్మ, సాదికా నవాబ్ సాహెర్, మొదలగు రచయిత్రులు పెర్షియన్, ఉర్దూ, మరియు ఇంగ్లీషు రంగాలలో విజయం సాదించారు.

సయ్యదా హమీద్, రషీద్ కిద్వాయ్, మధు రాజ్‌పుత్, భారతీ హరిశంకర్, షాహిదా ముర్తాజా, సబీహా హుస్సేన్ అయేషా మునీరా, అజ్రా ముసావి, షియాంగిని టాండన్‌లతో సహా అనేక మంది ప్రముఖ రచయిత్రిలు మరియు విద్యావేత్తలు సాహిత్య అభివృద్దిలో తమ సహకారం అందించారు.

సయ్యదా హమీద్, సలీహా అబిద్ హుస్సేన్, అత్యంత ఉదారవాద మరియు మానవతా స్ఫూర్తితో రచనలను చేసారు.

ఖుద్సియా సికందర్, షాజాన్ మరియు సుల్తాన్ జహాన్ భోపాల్ బేగముల పాలన, న్యాయం, లింగ సమానత్వం శాంతి మరియు సంస్కరణలను చూసింది. త్రివర్ణ పతాకాన్ని రూపొందించడంలో సూరయ్య తయ్యబ్జీ యొక్క అద్భుతమైన కళాత్మక నైపుణ్యం మరియు షాహిదా ముర్తాజా యొక్క విద్యాపరమైన ప్రతిభ,  గమనిoచదగినది.

ప్రముఖ రచయిత్రి మరియు కార్యకర్త బేగం అనీస్ రచనలు, అజ్రా ముసావి ఆత్మకథ ఆజాదీ కి చావోన్ మే (ఫ్రీడమ్ షేడ్‌లో) చదవదగినవి

రోకేయా సఖావత్ హుస్సేన్ యొక్క సైన్స్ ఫిక్షన్ నవల సుల్తానాస్ డ్రీం స్త్రీవాద, రాజకీయ మరియు పర్యావరణ ఆదర్శధామం.  రోకేయా సఖావత్ హుస్సేన్ యొక్క సైన్స్ ఫిక్షన్ నవల సుల్తానాస్ డ్రీం లోని  స్త్రీ-పురుష పాత్రలు తారుమారు చేయబడతాయి, కానీ పరిసరాలు మాత్రం మారవు.

బేగం అక్తర్‌ గజల్, దాద్రా మరియు తుమ్రీలలో అత్యంత నిష్ణాతులైన గాయకులలో ఒకరు. బేగం అక్తర్‌ సంగీతం మరియు కవిత్వాన్ని అసాధారణమైన సౌలభ్యంతో మిళితం చేసింది.

 

ఇస్మత్ చుగ్తాయ్ మరియు ఖురతుల్ ఐన్ హైదర్ యొక్క స్త్రీవాద౦ మరియు ముస్లిం మహిళల విద్యకు మార్గదర్శకుడైన షేక్ అబ్దుల్లా, బేగం అబ్దుల్లా, సుప్రసిద్ధ విద్యావేత్త ముంతాజ్ జహాన్, ప్రముఖ రచయిత్రి రషీద్ జహాన్ మరియు ప్రముఖ నటి బేగం ఖుర్షీద్ మీర్జా (రేణుకా దేవి)ల సహకారాన్ని విశ్లేషదగినది.

ఫైజా అబ్బాసీ, మయూరి చతుర్వేది, చాంద్ బీ, తౌసీఫ్ ఫాతిమా, భారతీ హరి శంకర్, రేఖా పాండే, అబిదా క్వాన్సర్, మధు రాజ్‌పుత్, బిలాల్ వానీ, నసీమ్ షా, షిరిన్ షేర్వానీ, శివంద్గిని టాండన్, రుచిక వర్మ, అనమ్ వాసే, హుమా యాకూబ్ మరియు ఇతరుల  సహకారాలు గుర్తు ఉంచుకోదగినవి.

 

No comments:

Post a Comment