జామియా స్థాపనలో పాత్రవహించిన ప్రముఖ మహిళలలో "సలీహా అబిద్ హుస్సేన్" ఒకరు..
సలీహా అబిద్ హుస్సేన్ 1913 ఆగస్టు 18న హర్యానాలోని పానిపట్లో జన్మించారు. సలీహా
తండ్రి ఖ్వాజా గులాం-ఉస్-సఖ్లైన్, ఒక ప్రఖ్యాత న్యాయవాది, సామాజిక సంస్కర్త మరియు రచయిత. తల్లి పేరు
ముష్తాక్ ఫాతిమా.
సలీహా అసలు పేరు మిస్దాఖ్ ఫాతిమా, కానీ ఆమె 'సలీహా' అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందారు.సలీహా
అబిద్ హుస్సేన్ ప్రఖ్యాత ఉర్దూ కవి మరియు సంస్కర్త ఖ్వాజా అల్తాఫ్ హుస్సేన్ హాలీ
మనవరాలు.
సలీహా ఉదారవాద మరియు మతపరమైన కుటుంబంలో పెరిగారు. సలీహా ప్రాథమిక
విద్య ఇంట్లోనే సాగింది,
సలీహా అరబిక్, పర్షియన్ మరియు ఉర్దూ భాషలలో లోతైన
జ్ఞానాన్ని సంపాదించారు.
సలీహా అబిద్ హుస్సేన్ పంజాబ్ విశ్వవిద్యాలయం (లాహోర్)లో నుండి
డిగ్రీని పొందారు. సలీహా సొంతంగా ఇంగ్లీష్ మరియు సాహిత్యాన్ని విస్తృతంగా
అభ్యసించింది,
మహాత్మా గాంధీ వంటి
ప్రముఖుల రచనలను ఉర్దూలోకి అనువదించినది.
సలీహా ఆబిద్ హుస్సేన్ భర్త, డాక్టర్ సయ్యద్ ఆబిద్ హుస్సేన్, జామియా వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
సలీహా ఆబిద్ హుస్సేన్ జామియాలో మహిళా విద్య మరియు సాధికారత
కోసం వాతావరణాన్ని సృష్టించింది. సలీహా జామియా యొక్క
తొలి సమావేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది.
1935లో జామియా కరోల్ బాగ్ నుండి ఓఖ్లాకు
మారినప్పుడు,
సలీహా సామాజిక
జీవితంలో మరియు విద్య వ్యాప్తిలో చురుకైన పాత్ర పోషించింది. తన రచనల ద్వారా, సలీహా జామియా యొక్క 'స్వదేశీ' (ఆత్మనిర్భరత) మరియు 'జాతీయ విద్య' ఆదర్శాలను ప్రోత్సహించింది.
సలీహా ఆబిద్ హుస్సేన్ యొక్క సాహిత్య రచనలు వాటి సరళత, సామాజిక ప్రయోజనం మరియు మానవ
సున్నితత్వానికి ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధి చెందాయి.సలీహా నవలలు, చిన్న కథలు, నాటకాలు మరియు జీవిత చరిత్రలతో సహా 50కి పైగా పుస్తకాలు రాశారు.
సలీహా అత్యంత ప్రసిద్ధ నవల "అజ్రా", ఇందులో సలీహా సామాజిక ఆచారాలు మరియు మహిళల
స్థితిని చిత్రీకరించింది.ఈ నవల బలవంతపు వివాహాలు, పరదా పద్ధతి యొక్క కఠినత్వం మరియు మహిళల
ఆర్థిక ఆధారపడటం వంటి సామాజిక దురాచారాలను ప్రశ్నించింది.
‘అజ్రా’ కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది సలీహా అబిద్ హుస్సేన్ యొక్క ప్రగతిశీల
ఆలోచనలకు మరియు సమాజంలో మార్పు తీసుకురావాలనే కోరికకు ప్రతిబింబం. అజ్రా నవలలో మహిళల
ఆత్మగౌరవం మరియు సంస్కరణలను ప్రోత్సహించారు.నేటికీ, అజ్రా నవల ఉర్దూ సాహిత్యంలో అత్యుత్తమ
నవలలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
సలీహా
“రేత్ కా మహల్” (ఇసుక కోట) మరియు “సాత్వన్ ఆంగన్” (ఏడవ ప్రాంగణం) వంటి ఆకర్షణీయమైన నవలలను కూడా
రాశారు.సలీహా అబిద్ హుస్సేన్ తన తాతగారైన ఖ్వాజా అల్తాఫ్ హుస్సేన్ హాలీ జీవితం
మరియు రచనలపై “యాద్గార్-ఎ-హాలీ” అనే ఒక సమగ్ర పరిశోధనా గ్రంథాన్ని కూడా
రచించారు.
సలీహా తన ఆత్మకథ, “సిల్సిలా-ఎ-రోజ్-ఓ-షబ్”ను రాశారు, ఇది జామియా మిలియా ఇస్లామియా చరిత్రకు మరియు
ఆ కాలపు సామాజిక-రాజకీయ మార్పులకు సంబంధించిన ఒక ముఖ్యమైన పత్రం కూడా
సలీహా అబిద్ హుస్సేన్
ఉర్దూలో ఆధునిక బాల సాహిత్యానికి మార్గదర్శకురాలిగా పరిగణించబడతారు. పిల్లల కోసం ఆమె
రచించిన ప్రధాన రచనలలో "అనోఖా ఔర్ కాలా కువాన్" మరియు "బచ్చోం కే
హాలీ" ఉన్నాయి.
సలీహా మహాత్మా గాంధీ
జీవిత చరిత్ర 'బాపు'ను ఉర్దూలోకి
అనువదించారు, ఇది సలీహా అహింసాత్మక
మరియు మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.
సలీహా అబిద్ హుస్సేన్ చేసిన
సేవలకు గాను 1983లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
సలీహా అబిద్ హుస్సేన్ జనవరి
8, 1988న
న్యూఢిల్లీలో మరణించారు. సలీహా అబిద్ హుస్సేన్ లెక్కలేనంత మంది మహిళలకు ప్రతీకగా
నిలుస్తారు, ఇంట్లో మరియు సమాజంలో మార్పు తీసుకురావడాన్నే తమ నిజమైన బహుమతిగా భావిస్తారు.
No comments:
Post a Comment