22 May 2021

ఐకానిక్ ఇంజనీర్, దాత గంగా రామ్ Ganga Ram, iconic engineer, philanthropist


సర్ గంగా రామ్ (1851-1927) పంజాబ్‌లోని మంగటన్‌వాలాలో Mangatanwala జన్మించాడు, అది ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. అతను రూర్కీలోని థామసన్ సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివాడు, అది నేడు భారతదేశంలో ఐఐటి-రూర్కీ.గా మారింది.  డిల్లి లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేసిన తరువాత, మోంట్‌గోమేరీ జిల్లాలో బ్రిటిష్ ఇండియా  ప్రభుత్వం నుండి 50,000 ఎకరాల/200 చదరపు మైళ్ళు బంజరు భూమిని లీజుకు తీసుకున్నాడు.  బంజరు భూమికి నీటి వసతిని ని కల్పించడానికి సర్ గంగారం పంజాబ్ గుండా ప్రవహించే అనేక నదుల నుండి నీటిని ఎత్తే lift దాదాపు 1,000 కిలోమీటర్ల పొడువున కాలువలను నిర్మించాడు. ఇందుకోసం ప్రత్యెక జలవిద్యుత్ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేశారు. విస్తారమైన ఎడారిని సుక్షేత్రాలుగా మార్చాడు’. సర్ గంగారం అపారమైన సంపదను సంపాదించాడు మరియు ఆస్పత్రులు మరియు కళాశాలల నిర్మాణానికి ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. అప్పుటి  పంజాబ్ బ్రిటిష్ గవర్నర్ అతను హీరోలా గెలిచాడు మరియు సాధువులా విరాళం ఇచ్చాడు‘he won like a hero and donated like a saint’అని వ్యాఖ్యానించాడు.

 

ఇంపీరియల్ ప్రభుత్వంలో వర్క్స్ సూపరింటెండెంట్‌గా, జనరల్ పోస్ట్ ఆఫీస్, లాహోర్ మ్యూజియం, ఎచిసన్ కాలేజ్, మాయో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ (ఇప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్), హేలీ కాలేజ్ ఆఫ్ కామర్స్, వికలాంగుల కోసం రవి రోడ్ హౌస్ మరియు హిందూ మరియు సిక్కు వితంతువుల హోం మొదలగు భవనాలను రూపకల్పన designed and built చేసి నిర్మించాడు. ఈ భవనాలు చాలా మాల్ ఆఫ్ లాహోర్ లో ఉన్నాయి.

బ్రిటిష్ ప్రభుత్వం అతనికి నైట్ హుడ్ ప్రధానం చేసింది రాయ్ బహదూర్బిరుదు లభించింది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఏదైనా ఆవిష్కరణను రూపొందించిన వారికి సర్ గంగారాం 2,500 రూపాయల”మేనార్డ్-గంగారాం అవార్డు Maynard-Gangaram Award” ప్రకటించాడు.  లాహోర్ మాల్‌లోని గంగా రామ్ ట్రస్ట్ భవనం లాహోర్ నగరంలో ఒక మైలురాయి.

 

 


 


లాహోర్ జనరల్ పోస్ట్ ఆఫీస్ Lahore General Post Office

 



ఓల్డ్ బిల్డింగ్, ఎచిసన్ కాలేజ్, లాహోర్


 


మాయో స్కూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్ట్

 



లాహోర్ మ్యూజియం

 



సర్ గంగా రామ్ హాస్పిటల్

లాహోర్ లో సర్ గంగా రామ్ హాస్పిటల్ (ఇప్పుడు 550 పడకలు) మరియు ఒక మెడికల్ కాలేజీని తన సొంత డబ్బుతో నిర్మించాడు. విభజన తరువాత మెడికల్ కాలేజీ మూసివేయబడింది, కాని గంగా రామ్ హాస్పిటల్ పనిచేయడం కొనసాగించింది మరియు దాని పేరును మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ పౌర సమాజ సంస్థలు దీనిని ప్రతిఘటించాయి. తరువాత పంజాబ్ ప్రభుత్వం ఫాతిమా జిన్నా మెడికల్ కాలేజీని స్థాపించింది మరియు దానికి గంగా రామ్ ఆసుపత్రి జతచేయబడింది. అతని జ్ఞాపకార్థం మరొక  ఆసుపత్రి 1951 లో డిల్లి లో స్థాపించబడింది.

 

పంజాబ్‌లోని లియాల్‌పూర్ (ఇప్పుడు ఫైసలాబాద్) జిల్లా జరన్‌వాల్లా తహసీల్‌లో ఘోడా రైలుప్రవేశపెట్టారు. ఇది ఒక ప్రత్యేకమైన ప్రజా రవాణా వ్యవస్థ, దీనిలో ఇరుకైన గేజ్ రైలు ట్రాక్‌లో గుర్రాలతో సాధారణ ట్రాలీలు లాగబడ్డాయి. ఇది అతను సృష్టించిన గంగాపూర్ గ్రామాన్ని బుచియానా వద్ద నిలిపివేసిన రైల్వే మార్గంతో అనుసంధానించింది. గ్రామీణ ప్రాంతం నుండి లాహోర్ రైల్వే స్టేషన్ వరకు దూరం ప్రయాణించడానికి గ్రామీణ ప్రజలు దీనిని ఉపయోగించారు. ఇది 1980 ల తరువాత పనిచేయటం లేదు కాని . ఇది 2010 లో పునరుద్ధరించబడింది. తన ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పశ్చిమ పంజాబ్  ను సుందరంగా మార్చిన ఘనత గంగారాం కు దక్కుతుంది.

 

సర్ గంగా రామ్ అవిభక్త భారత దేశ గొప్ప ఆత్మ.  బ్రిటీష్ ఇండియాలో ముఖ్యంగా లాహోర్లో  అర్బన్ స్కేప్ కు సౌందర్య స్పర్శను ఇవ్వడానికి సర్ గంగారం అందించిన సహకారం మరువలేనిది

 

లాహోర్ లోని అనేక చారిత్రాత్మక, వారసత్వ భవనాలను నిర్మించిన ప్రసిద్ధ వాస్తుశిల్పి సర్ గంగా రాం  యొక్క దిగ్గజ సమాధి ఆక్రమణలను తొలగించి  పునరుద్ధరించబడిందని పాకిస్తాన్ అధికారులు ఇటీవల ప్రకటించారు. ఇది త్వరలో ప్రజల కోసం తిరిగి తెరవబడుతుంది.

.



 

గంగా రామ్ యొక్క సమాధి The samadhi of Ganga Ram.

 

గంగా రామ్ సమాధిని తిరిగి తెరవడం లాహోర్ నగర అందానికి దోహదపడిన అసాధారణమైన ప్రతిభావంతులైన ఇంజనీర్ జ్ఞాపకార్థం ఒక చిన్న నివాళి మాత్రమే అవుతుంది, అతని అసాధారణ నైపుణ్యాలు మరియు అతని దాతృత్వం మరువ లేనివి. ఉపఖండం యొక్క మిశ్రమ వారసత్వానికి సర్ గంగారాం ఒక ప్రతిక.

-siasat సౌజన్యం తో 

 

No comments:

Post a Comment