18 May 2022

కుమారుల పట్ల భారతీయుల ప్రాధాన్యత Indians’ preference for sons

 






కొత్తగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5 2019-21) అధిక సంఖ్యలో భారతీయులు కుమారులకు ప్రాధాన్యతనిచ్చారని నిర్ధారిస్తుంది.

మేఘాలయలో మాత్రం కొడుకుల కంటే ఎక్కువ మంది కుమార్తెలకు ప్రాధాన్యత ఉంది.

 

* 15-49 వయస్సు వివాహితులలో  ఎక్కువ మంది కుమారులు కావాలనుకునే సంఖ్య,  ఎక్కువ మంది కుమార్తెలను కోరుకునే వారి సంఖ్యకన్నా  అనేక రెట్లు ఎక్కువగా ఉంది.;

* కనీసం ఒక కొడుకు ఉన్న వివాహితుడు, ఇప్పటికే కొడుకులు లేని  మరో వివాహిత వ్యక్తి కంటే ఎక్కువ మంది పిల్లలను కోరుకునే అవకాశం తక్కువ;

* ఈ ప్రాధాన్యతలు ఉన్నప్పటికీ, చాలా మంది భారతీయులు ఇప్పటికీ ఆదర్శవంతమైన కుటుంబంలో కనీసం ఒక కుమార్తె అయినా ఉండాలని విశ్వసిస్తున్నారు.

 

ఆదర్శ కుటుంబం

Ø ఎక్కువ మంది కుమారులు కావాలనుకునే వివాహిత పురుషుల సంఖ్య (16%) ఎక్కువ కుమార్తెలను కోరుకునే వారి సంఖ్య (4%) కంటే నాలుగు రెట్లు ఎక్కువ.

Ø ఎక్కువ మంది కుమారులు కావాలనుకునే వివాహిత మహిళల సంఖ్య (15%) ఎక్కువ కుమార్తెలను కోరుకునే వారి సంఖ్య (3%) కంటే ఐదు రెట్లు ఎక్కువ

 

 

 


 

 

 చాలా మందికి కనీసం ఒక కొడుకు మరియు కనీసం ఒక కుమార్తె కావాలి. ఐదింట నాలుగు వంతులు మంది పురుషులు మరియు స్త్రీలకు (81%)  కనీసం ఒక కొడుకు కావాలి,

Ø ఐదింట, నాలుగు వంతులు మంది స్త్రీలకు  (79%) ఒక కుమార్తె కావలి అదే నాలుగు ఇంట మూడు వంతుల పురుషులకు  (76%) కనీసం ఒక కుమార్తె కావాలి.

 

Ø పురుషులు మరియు మహిళలు ఇద్దరూ సగటున 2.1 మంది పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇది, NFHS-5 ప్రస్తుత మొత్తం సంతానోత్పత్తి రేటుకు దాదాపు సమానంగా ఉంటుంది.

 

Ø NFHS-4 (2015-16)లో, ఆదర్శ కుటుంబ పరిమాణం 2.2 వద్ద కొంచెం పెద్దదిగా ఉంది.

 

రాష్ట్రాల వారీగా ట్రెండ్‌లు

Ø రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో, మిజోరం (37%), లక్షద్వీప్ (34%) మరియు మణిపూర్ (33%), మరియు బీహార్‌లోని మహిళలు (31%) కుమార్తెల కంటే ఎక్కువ మంది కుమారులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

Ø బీహార్ స్త్రీలలో కుమార్తెల కంటే కుమారులను కోరుకొనే వారు  16శాతం ఎక్కువ మంది ఉన్నారు.

 

Ø మేఘాలయ మహిళలు కొడుకుల కంటే ఎక్కువ మంది కుమార్తెలను ఇష్టపడతారు.

Ø మేఘాలయ రాష్ట్రంలో, 21% మంది మహిళలు ఎక్కువ కుమార్తెలను కోరుకుంటున్నారు,

Ø ఇప్పటికే పిల్లలు ఉన్న వారి లో ఒక కొడుకు ఉన్నవారు మరొక బిడ్డను కోరుకునే అవకాశం తక్కువ. (మూలం: NFHS)

 

Ø మేఘాలయలో కుమారుల కంటే ఎక్కువ మంది కుమార్తెలను కోరుకునే పురుషులు(11%)  అత్యధికంగా ఉన్నారు.

Ø కానీ ఇతర రాష్ట్రాలలో వలె, మేఘాలయలో కూడా పురుషులకు   అధిక సంఖ్యలో (18%) కుమార్తెల కంటే ఎక్కువ మంది కొడుకులు కావాలి.

 

.

Ø మేఘాలయ స్త్రీలు కూతుళ్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల వివరణ “మాతృస్వామ్య  సమాజం," అని షిల్లాంగ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ అన్నారు NFHS-5 మేఘాలయను "మాతృస్వామ్య సమాజం"గా సూచిస్తుందని ఆమె పేర్కొంది. " 


 

 

 

 

ఇద్దరు పిల్లలు కలిగి వారిలో కనీసం ఒక కొడుకును కలిగి ఉన్నవారిలో, 10 మందిలో 9 మంది తమకు మూడవవాడు వద్దు అని చెప్పారు.

 

మూడో బిడ్డ కావాలా లేదా వద్దా:




Ø పెళ్లయి పిల్లలున్న వారిలో  ఇప్పటికే కొడుకు ఉన్నవారు, కొడుకులు లేని వారి కంటే, మరో బిడ్డను కోరుకునే అవకాశం తక్కువ. ఉదాహరణకు, ఇద్దరు పిల్లలు కలిగి వారిలో  కనీసం ఒక కొడుకును కలిగి ఉన్న, 10 మందిలో 9 మంది తమకు మూడవవాడు వద్దు అని చెప్పారు.

Ø దీనికి విరుద్ధంగా, ఇద్దరు పిల్లలుకలిగి వారిలో కొడుకులు లేనివారు  కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే తమకు ఇక పిల్లలు వద్దు అని చెప్పారు.

Ø ఒకటి, ముగ్గురు లేదా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న వివాహిత పురుషులు మరియు స్త్రీలలో కూడా ఇదే ధోరణి కన్పిస్తుంది.

No comments:

Post a Comment