17 May 2022

మునుపటి కంటే ఎక్కువ మంది పురుషులు మాంసాహారం/నాన్-వెజ్ తింటున్నారు: NFHS-5, హెల్త్ సర్వే డేటా More men eating non-veg than before: NFHS-5, Health survey data

 

NFHS యొక్క ఐదవ రౌండ్ జూన్ 17, 2019 మరియు ఏప్రిల్ 30, 2021 మధ్య రెండు దశల్లో నిర్వహించబడింది, ఇది 29 రాష్ట్రాలు మరియు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 707 జిల్లాలను కవర్ చేస్తుంది.

సర్వే సాధారణంగా ఒక సంవత్సరంలో పూర్తవుతుంది, కోవిడ్-19 వ్యాప్తి మరియు తదుపరి లాక్‌డౌన్ కారణంగా, తాజా రౌండ్ సర్వే రెండు దశల్లో పూర్తయింది.

2019-21లో నిర్వహించి ఇటీవల విడుదలైన NFHS-5 డేటా 15-49 సంవత్సరాల మద్య వయస్సు గల మాంసాహారం తీసుకోని పురుషుల నిష్పత్తిని చూపుతుంది - సర్వేలో మాంసాహారం/నాన్-వెజ్ అనగా  'చేపలు, చికెన్ లేదా మాంసం' గా జాబితా చేయబడినవి.. 2019-21లో మాంసాహారం తీసుకోని పురుషుల శాతం 16.6 శాతంగా ఉంది 

Ø 15-49 ఏళ్ల మధ్య ఉన్న 83.4 శాతం మంది పురుషులు మరియు 70.6 శాతం మంది స్త్రీలు రోజూ, వారానికో లేదా అప్పుడప్పుడూ మాంసాహారం తింటారు. NHFS-4లో ఆ సంఖ్య పురుషులలో  78.4 శాతం మరియు మహిళలలో 70 శాతంగా ఉంది.


దేశాన్ని కుదిపేస్తున్న వెజ్/నాన్ వెజ్ చర్చల మధ్య రియాలిటీ చెక్:

Ø మునుపెన్నడూ లేనంతగా ఎక్కువ మంది ప్రజలు మాంసాహారం/నాన్ వెజ్ తింటున్నారు మరియు 2015-16 మరియు 2019-21 మధ్య నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) డేటా ప్రకారం ఆరేళ్లలో మాంసాహారం తినే భారతీయ పురుషుల నిష్పత్తి బాగా పెరిగింది.

Ø 2019-21లో నిర్వహించి ఇటీవల విడుదలైన NFHS-5 డేటా, 15-49 సంవత్సరాల వయస్సు గల పురుషులలో  మాంసాహారం తీసుకోని వారి నిష్పత్తిని చూపుతుంది - NFHS-5 సర్వేలో 'చేపలు, చికెన్ లేదా మాంసం' మాంసాహారం/నాన్-వెజ్ గా  జాబితా చేయబడింది. వీరు 2019-21లో 16.6 శాతంగా ఉంది. ఇది 2015-16లో నిర్వహించిన NFHS-4 సర్వే లో నివేదించబడిన 21.6 శాతం నుండి 5 శాతం-పాయింట్ తగ్గుదల.

Ø అయితే, ఇక్కడ లింగ వైరుధ్యం ఉంది: 'చేపలు, చికెన్ లేదా మాంసం' ఎప్పుడూ తినని అదే(15-49)  వయస్సులో మహిళల నిష్పత్తి 2019-21లో స్వల్పంగా తగ్గి  29.4 శాతంగా ఉంది, ఇది 2015-16లో 29.9శాతం గా ఉంది.  

Ø NFHS-5 సర్వేలో 15-49 ఏళ్ల మధ్య ఉన్న 83.4 శాతం మంది పురుషులు మరియు 70.6 శాతం మంది మహిళలు రోజూ, వారానికోసారి లేదా అప్పుడప్పుడు మాంసాహారం తింటారు.

Ø NHFS-4లో ఆ సంఖ్య పురుషులకు 78.4 శాతం మరియు మహిళలకు 70 శాతంగా ఉంది.

వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి కూడా బాగా పెరిగింది:

Ø NHFS-5లో 57.3 శాతం మంది పురుషులు మరియు 45.1 శాతం మంది మహిళలు కనీసం వారానికి ఒకసారి చేపలు, కోడి మాంసం లేదా మాంసం తింటున్నట్లు నివేదించారు. ఇది 2015-16లో నివేదించబడిన NHFS-4 గణాంకాల కంటే ఎక్కువ:

Ø NHFS-4 గణాంకాల ప్రకారం వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి 48.9 శాతం పురుషులు మరియు 42.8 శాతం మహిళలుగా ఉంది..

Ø పురుషులలో, మాంసాహారం తినేవారిలో ఈ వర్గం(15-49)   2019-21లో లక్షద్వీప్‌లో అత్యధికంగా (98.4 శాతం) మరియు రాజస్థాన్‌లో అత్యల్పంగా (14.1 శాతం) ఉంది. లక్షద్వీప్‌తో పాటు అండమాన్ & నికోబార్ దీవులు (96.1%), గోవా (93.8%), కేరళ (90.1%) మరియు పుదుచ్చేరి (89.9%) టాప్ 5 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నాయి, ఇక్కడ పురుషులు కనీసం వారానికి ఒక సారి మాంసాహారాన్ని తింటారు. ఈ జాబితాలో రాజస్థాన్‌తో పాటు హర్యానా (13.4%), పంజాబ్ (17%), గుజరాత్ (17.9%), హిమాచల్ ప్రదేశ్ (21.1%) రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయి.

 2015-16 మరియు 2019-21 మధ్య ఆరేళ్ల కాలంలో, కనీసం వారానికి ఒకసారి చేపలు, చికెన్ లేదా మాంసం తినే పురుషుల నిష్పత్తి సిక్కింలో ఎక్కువగా పెరిగింది (49.1 శాతం నుండి 76.8 శాతానికి) మరియు త్రిపుర (94.8 శాతం నుండి 76.1 శాతం )లో చాలా వరకు తగ్గింది.

మతపరమైన సమూహాలలో,

Ø 15-49 సంవత్సరాల వయస్సు గలవారిలో  80 శాతం క్రైస్తవ పురుషులు మరియు 78% మహిళలు కనీసం వారానికి ఒక్కసారైనా మాంసాహార ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు.

ఇతర మత సమూహాలకు సంబంధిచిన వారిలో  

Ø హిందూ పురుషులు: 52.5%, మహిళలు: 40.7%; ముస్లిం పురుషులు: 79.5%, మహిళలు: 70.2%; సిక్కు పురుషులు: 19.5%, మహిళలు: 7.9%; బౌద్ధ/నియో-బౌద్ధ పురుషులు: 74.1%, మహిళలు: 62.2%; మరియు జైన పురుషులు 14.9%, స్త్రీలు: 4.3% కనీసం వారానికి ఒక్కసారైనా మాంసాహార ఆహారాన్ని తీసుకుంటారు.

NFHS పరిశోధనలు 'చేపలు, చికెన్ లేదా మాంసం' కంటే ఎక్కువ మంది గుడ్లు తీసుకుంటారని చూపిస్తున్నాయి.

Ø 2019-21లో 84.7 శాతం మంది పురుషులు రోజూ, వారానికోసారి లేదా అప్పుడప్పుడు గుడ్లు తినడం నివేదించారు - 2015-16లో నమోదైన 80.3 శాతం కంటే ఇది 4 శాతం ఎక్కువ

Ø ఆ సంఖ్యస్త్రీలలో 2015-16 లో ఉన్న  70.8 శాతం నుండి2019-21లో  72 శాతానికి పెరిగింది..

ఎరేటెడ్ డ్రింక్స్ తిసుకొనే  పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి సంవత్సరాలుగా తగ్గుముఖం పట్టిందని డేటా కూడా చూపిస్తుంది.

Ø 2019-21లో, 86.4 శాతం మంది పురుషులు మరియు 84.3 శాతం మంది మహిళలు ఎరేటెడ్ డ్రింక్స్ తాగినట్లు నివేదించారు, ఇది ఆరేళ్ల క్రితం అనగా 2015-16 లో పురుషులలో 88.3 శాతం ఉండగా మరియు స్త్రీలలో 83.5 శాతం గా ఉంది.

Ø డేటా ప్రకారం మూడు అంశాలు పప్పులు/బీన్స్; పండ్లు; మరియు ఆకుపచ్చ, ఆకు కూరలు - 2019-20లో దాదాపు పురుషులు మరియు మహిళలు అందరూ ప్రతిరోజూ, వారానికోసారి లేదా అప్పుడప్పుడు తినేవారు

Ø అలాగే, 2019-20లో 96.2 శాతం మంది పురుషులు మరియు 94.2 శాతం మంది మహిళలు పాలు మరియు పెరుగును ప్రతిరోజూ, వారానికోసారి లేదా అప్పుడప్పుడు తీసుకుంటారు,

Ø అయితే 2019-20లో ఫ్రైడ్/వేయించిన ఆహారాన్ని తినే వారి నిష్పత్తి స్త్రీలలో 95.6 శాతం మరియు పురుషులలో 92.6 శాతంగా ఉంది.

 

 


No comments:

Post a Comment