31 May 2022

పట్టణ భారతదేశంలో ముస్లింలు మరియు దళితుల నివాసాల విభజన పెరిగింది: అధ్యయనం Increasing residential segregation of Muslims, and Dalits in urban India: Study

 

పాఠశాలలు, ఆరోగ్య సేవలు, పైపు నీరు మరియు మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాల పరంగా భారతీయ నగరాల్లో దళితులు మరియు ముస్లింల పట్ల విభజన (segregation) పెరుగుతోందని తాజా అధ్యయనం మరోసారి కనుగొంది.

 

ఇటీవలి అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో నివాస ప్రాంత విభజన మరియు ప్రజా సేవలు, పక్షపాతం మరియు పరిమిత ఆర్థిక చలనశీలత దళితులు మరియు ముస్లిం వర్గాలను పీడిస్తున్నప్పుడు, మతపరమైన అల్లర్లు, సామాజిక తరగతి, విద్య మరియు హోదాతో సంబంధం లేకుండా నగరాల్లో ముస్లింలలో  ఘెట్టోయిజేషన్‌కు దారితీశాయి. ప్రాథమిక సేవల లభ్యతలో భారతీయ నగరాలు "అధిక స్థాయి అసమానత"ని కలిగి ఉన్నాయని కనుగొన్న ఈ అధ్యయనం తాజాది.

 

నలుగురు విద్యావేత్తలు-నవీన్ భారతి, దీపక్ మల్ఘన్, సుమిత్ మిశ్రా, అందలీబ్ రెహమాన్ ప్రచురించిన అధ్యయనం ఇలా పేర్కొంది: "పట్టణీకరణ యొక్క విముక్తి వాగ్దానం లక్షలాది దళితులు మరియు ముస్లింలపట్ల  ఫలించలేదు." ఎలైట్ లేదా అతి ధనవంతులు అయినప్పటికీ, దళితులు మరియు ముస్లింలు  కొన్ని పరిసర ప్రాంతాలకు బహిష్కరించబడతారు అని  అధ్యయనం చెబుతుంది.

 

సెంటర్ ఫర్ ది అడ్వాన్స్‌డ్ స్టడీ ఆఫ్ ఇండియా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం చెందిన నవీన్ భారతి, ఆర్టికల్ 14 ప్రముఖ పోర్టల్ తో మాట్లాడుతూ పట్టణ అల్లర్లు మరియు ప్రస్తుత పరిస్థితులలో  ముస్లిములు, విభిన్న పరిసరాల్లో ఉండటం సురక్షితం కాదు. వీరినిఅల్లరి మూకలుసులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చు. పైగా మీరు ముస్లిం అయితే మీకు సులభంగా గృహాలు లభించవు అన్నారు.

 

అంతకుముందు, పట్టణ ప్రాంతాలలో ముస్లింల ఆహారపు అలవాట్లు వారి విభజనకు ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పబడ్డాయి, కానీ ప్రస్తుతం కేవలం ముస్లిం  పేరు మరియు నామకరణం మాత్రమే వారి విభజనకు తగిన కారణం అయింది..

 

మత ప్రాతిపదికన భారతీయ నగరాల విభజన గురించి జరిగిన  అనేక పరిశోధనా పత్రాలు మరియు అధ్యయనాలకు  ఖచ్చితమైన డేటా లేదు. - భారతదేశ జనాభా గణన మత ప్రాతిపదికన ఎటువంటి గణన చేయదు.  కాని  మెజారిటీ సమాజంలో ఉన్న విస్తృతమైన పక్షపాతాలు రైట్ వింగ్ గ్రూపుల పునరుజ్జీవనం ఈ మధ్య పెరిగింది.


 

No comments:

Post a Comment