29 July 2022

హిందూ-ముస్లిం ఐక్యతలో విశ్వాసo ఉంచిన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక గురువులు-సాదు, సంత్ మరియు ఫకీర్లు

 

ఎడమ నుండి: తుకారాం, షిర్డీ సాయిబాబా, శిశునాల షరీఫా, లల్లేశ్వరి మరియు సరహపాద. ఫోటోలు: బరోడా ఆర్ట్ గ్యాలరీ, పబ్లిక్, వికీపీడియా

భారతదేశ ఆధ్యాత్మిక చరిత్ర మహోన్నత మైనది. భారతదేశ ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్తలు హిందూ మతం మరియు ఇస్లాం మధ్య విభజనను తగ్గించడానికి ప్రయత్నించారు. భారతీయ ఆలోచనను బహువచనంలో అర్థం చేసుకోవాలి.  ఇందులో హిందూ, బౌద్ధ, జైన మరియు సిక్కు ఆలోచనలు మాత్రమే కాకుండా క్రైస్తవ మరియు ఇస్లామిక్ ఆలోచనలు కూడా ఉన్నాయి.

మరణించిన వందల సంవత్సరాల తరువాత, షిర్డీ సాయిబాబా (1838-1918) భారత దేశం లోనే కాదు ప్రపంచం లో అత్యంత విస్తృతంగా గౌరవించబడే సాధువులలో ఒకరు. ఆయనను లక్షలాది మంది హిందువులు, ముస్లింలు మరియు ఇతరులు పూజిస్తారు. హిందూ తల్లిదండ్రులకు జన్మించి, ఫకీరు ద్వారా పెరిగిన షిర్డీ సాయిబాబా హిందూ-ముస్లిం విభజనను అసహ్యించుకున్నాడు. అతను హిందూ మతం మరియు ఇస్లాం మతం రెండింటి యొక్క ప్రధాన సందేశం ప్రేమ, సేవ మరియు స్వేచ్ఛ అని నమ్మాడు.

ముస్లింలు మరియు హిందువులను ఆకర్షించిన మరొక సెయింట్ కబీర్ (1398-1448/55). అతను నేత కార్మికుల ముస్లిం కుటుంబానికి జన్మించాడు లేదా దత్తత తీసుకున్నాడు కాబట్టి అతనికి ఇస్లాం గురించి బాగా పరిచయం ఉంది. కానీ అతని దోహాలను  పరిశీలిస్తే, అతనికి హిందూ ఆలోచన మరియు పురాణాల గురించి కూడా సన్నిహిత జ్ఞానం మరియు అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. అతను మతపరమైన సనాతనవాదం మరియు నిరంకుశత్వాన్ని విమర్శించాడు

సరహపాద (100-200 CE) ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త, మహాసిద్ధుడు, సిద్ధుల సిద్ధుడు మరియు గొప్ప బ్రాహ్మణుడుగా గౌరవించబడ్డాడు.

అభినవగుప్తా (950-1016) ఒక శైవ ఋషి.అతను భారతదేశం యొక్క గొప్ప తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, రచయితలు మరియు దార్శనికులలో ఒకరు. ఆధ్యాత్మిక సాధన కోసం, హృదయంలో స్వచ్ఛంగా మరియు గంభీరంగా ఉండాలని అతను చెప్పాడు;

భారత దేశంలో జన్మించిన అత్యంత గౌరవనీయమైన తత్వవేత్తలలో ఒకరైన బసవన్న (1136-96) బ్రాహ్మణ సంప్రదాయo  మరియు దాని చుట్టూ నిర్మించిన మత గ్రంథాలు మరియు అభ్యాసాలను విమర్శించాడు. బసవన్న కుల వ్యవస్థను మరియు లింగ వివక్షతను సవాలు చేశాడు మరియు తిరస్కరించాడు. శివారాధనలో అతని కొత్త ఆరాధన తరువాత లింగాయతిజం అని పిలువబడింది. అతను శివ భక్తులలో కుల వివక్షకు వ్యతిరేకంగా వాదించాడు; కలిసి భోజనం చేయడం తప్పనిసరి అని భావించారు, ఈ పద్ధతిని దాసోహా అని పిలుస్తారు, ఇది సిక్కు దేవాలయాలలో లoగర్ వలె ఉంటుంది.

అల్లమ ప్రభువు (సుమారు 1100), ఒక సంచరించే సన్యాసి, ఒక ఆధ్యాత్మిక కవి మరియు ఋషి. వైదిక సంప్రదాయాన్ని తిరస్కరించారు మరియు చిత్ర పూజ, కుల వ్యవస్థ, ఆచారాలు మొదలగు వాటిని ప్రశ్నించి, అపహాస్యం చేశారు.

భారతదేశం లో కొందరు  మహిళా సాధువులు కూడా బాగా ప్రసిద్ధి చెందినారు..

అత్యంత గౌరవనీయమైన మహిళా సాధువులలో ఒకరు అక్క మహాదేవి (1130-60), నేడు, అక్క మహాదేవి కర్ణాటకలో ఇంటి పేరు, ఆమె పేరు మీద రోడ్లు మరియు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

శ్రీనగర్ సమీపంలో జన్మించిన లల్లేశ్వరి (1320-92), ముస్లింలకు లల్లా ఆరిఫా మరియు హిందువులకు లల్లా యోగీశ్వరి. ఆమె సంచరించే సన్యాసిగా మారింది. సామాజిక కట్టుబాట్లను పట్టించుకోకుండా, అక్క మహాదేవి లాగా, ఆమె పాడుతూ, నృత్యం చేస్తూ ఆనంద పారవశ్యంలో నడిచింది.

తమిళనాడులోని తంజావూరుకు చెందిన నందనార్ (700-800) అంటరానివారిగా పరిగణించబడే పులయ్య కులంలో జన్మించిన గొప్ప శివభక్తుడు. నేడు అనేక శివాలయాల్లో నందనార్ గొప్ప సాధువుగా పూజలందుకుంటున్నారు.

తుకారాం (1608-50) భారతదేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సాధువులలో ఒకరు.

రవిదాస్ (జననం 1371) సౌమ్యుడు మరియు దయగల జ్ఞాని.

తులసీదాస్ (జననం 1600) సంస్కృత రామాయణాన్ని అవధి బాష లో రచించినాడు.

శంకర్‌దేవ్ (1449-1568) జీవితం మరియు బోధనలు భారతదేశ సాంస్కృతిక మరియు మత చరిత్రలో అత్యంత ముఖ్యమైనవి.  శంకర్‌దేవ్ పండితుడు, సాధువు, నాటక రచయిత, కళాకారుడు మరియు సంఘ సంస్కర్త. దేవుడు మానవులందరిలో ఉంటాడని బోధించాడు. మరియు అన్ని రకాల ప్రజలకు - శూద్రులు, గిరిజనులు, ముస్లింలు భోదించాడు.

శిశునాల షరీఫా (1819-89) ఇస్లాం మరియు హిందూ తత్వశాస్త్రం అబ్యసించిన కవి మరియు సాధువు. భారతదేశం యొక్క గొప్ప హెర్మెనిటికల్ సంప్రదాయానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. శిశునాల షరీఫా శివభక్తుడైన ఖాద్రీకి జన్మించాడు. షరీఫా లింగాయత్ సంప్రదాయం, రామాయణం, మహాభారతం మరియు పురాణాలను పాఠశాలలో అబ్యసించాడు. జూలై 3, 1889న, శివ మంత్రాల పఠనo తో , షరీఫా తన శరీరాన్ని భూమికి అర్పించాడు; ముస్లింలు ఖురాన్ నుండి ఆయతులు పఠించారు, హిందువులు వేదాల నుండి శ్లోకాలను పఠించారు. కర్ణాటకలోని శిశువినాహల వద్ద ఉన్న షరీఫా సమాధిని ఇప్పుడు హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ సందర్శిస్తున్నారు.

సూఫీయిజం అనేది ఇస్లాం యొక్క ఒక అంశం లేదా ఆధ్యాత్మిక కోణం. సూఫీయిజం ను ప్రచారం చేసిన వారిలో ప్రసిద్దులు  నిజాముద్దీన్ ఔలియా (1238-1325). ఔలియా  ఇతర విశ్వాసాల నుండి ప్రజలను ఇస్లాంలోకి మార్చకుండా చిస్తీ క్రమం అనుసరించేటట్లు చేసాడు.

మహ్మద్ ప్రవక్తపై బుల్లెహ్ షా (1680-1758) కు గల నిజమైన నమ్మకం అతనిని ఇతర ఆధ్యాత్మికతలను మరియు మోక్షo పొందడానికి  హిందూ ఆధ్యాత్మికతను నేర్చుకోకుండా నిరోధించలేదు.

పైన వివరించిన ఉంచిన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక గురువులు సాదు,సంత్  మరియు ఫకీర్ల ఆలోచనా విధానంలో, కోపం, కామం, దురాశ లేదా ద్వేషానికి చోటు లేదు.

No comments:

Post a Comment