21 October 2024

కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ Nawab of Kurnool Ghulam Rasool Khan Kurnool, Andhra Pradesh

 


1823లో, గులాం రసూల్ ఖాన్ ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలు నవాబుగా సింహాసనాన్ని అధిష్టించాడు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులలో భయాన్ని కలిగించాడు. తన చిన్నతనం నుండి, గులాం రసూల్ ఖాన్ విదేశీ పాలకుల పట్ల అసహ్యం కలిగి ఉన్నాడు మరియు అధికారం చేపట్టిన తరువాత, తన రాజ్యాన్ని బ్రిటిష్ ఆధిపత్యం నుండి రక్షించడానికి గులాం రసూల్ ఖాన్ అన్ని చర్యలు తీసుకున్నాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకుని అందుకు అవసరమైన సన్నాహాలు చేశాడు. 

నిజాం రాజ్య యువరాజు ముబారిజుద్-దౌలా గా పిలబడే గోహర్ అలీ ఖాన్‌తో గులాం రసూల్ ఖాన్  కూటమిని ఏర్పరచుకున్నాడు.  గులాం రసూల్ ఖాన్ కర్నూలులోని తన కోటను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీగా మార్చాడు. అయితే, గులాం రసూల్ ఖాన్ పై అసూయతో అతని బంధువులు, ఆంగ్లేయులతో కుమ్మక్కయ్యారు మరియు గులాం రసూల్ ఖాన్ పై కుట్ర పన్నారు.

23 ఆగష్టు 1839, నవాబ్ గులాం రసూల్ ఖాన్ యొక్క పై అసూయతో అతని బంధువులు నవాబు యుద్ధ సన్నాహాలను గురించి బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ ఫ్రేజర్‌కు తెలియజేశారు. దీని గురించి ఆందోళన చెందిన ఈస్టిండియా కంపెనీ ఎడ్వర్డ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఈ విషయాన్ని పరిశోధించి వెంటనే రిపోర్టు చేసే బాధ్యతను అప్పగించింది. జనరల్ ఫ్రేజర్‌కు రాసిన లేఖలో, ఎడ్వర్డ్ పరిస్థితిని వివరించాడు, "కర్నూలు నవాబు యొక్క ఆయుధశాల అపారమైనది" మరియు యుద్ధానికి నవాబ్ గులాం రసూల్ ఖాన్ సంసిద్ధతను స్పష్టంగా చెప్పడం కష్టం. నవాబ్ గులాం రసూల్ ఖాన్ తోటలు మరియు రాజభవనాలను ఆయుధాల కర్మాగారాలుగా మార్చాడు.

జనరల్ ఫ్రేజర్ యొక్క నివేదిక పై ఈస్ట్ ఇండియా కంపెనీ తక్షణ చర్యను గైకొన్నది మరియు వారు కల్నల్ A.B డైసెట్ ఆధ్వర్యంలో కంపనీ దళాలను కర్నూల్ కోటను స్వాధీనం చేసుకోవడానికి మరియు నవాబ్ గులాం రసూల్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి పంపారు.. 1839 అక్టోబరు 12న ఈస్టిండియా కంపెనీ సేనలు కర్నూలు కోటపై చుట్టుముట్టాయి. ఆరు రోజుల పోరాటం అనంతరం  చివరకు జొహరాపురం గ్రామ సమీపంలో నవాబ్ గులాం రసూల్ ఖాన్‌ను అరెస్టు చేసి  తిరుచిరాపల్లి జైలుకు తరలించారు.

జైలు లో కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ అంతమోదించడానికి బ్రిటీష్ పాలకులు నిశ్చయించు కొన్నారు.. నవాబు గులాం రసూల్ ఖాన్ కు విషపూరితమైన ఆహారాన్ని అందించడానికి అతని వ్యక్తిగత సేవకుడికి బ్రిటీష్ అధికారులు లంచం ఇచ్చారు. విషపూరితమైన ఆహారాన్ని సేవించిన 12 జూలై1840న  నవాబు గులాం రసూల్ ఖాన్ మరణించినాడు.  నవాబ్ సేవకుడిపై హత్య నేరం మోపబడింది మరియు కంపెనీ నవాబ్ సేవకునికి మరణశిక్ష విధించింది. బ్రిటీష్ పాలకులు ఈ కుట్రను కప్పిపుచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ చరిత్ర చివరికి నిజాన్ని వెల్లడించింది.

నేటికీ ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత ప్రజలు గులాం రసూల్‌ఖాన్‌ను స్మరిస్తూ కందనవోలు నవాబు కథ (కర్నూలు నవాబు కథ) అనే జానపద పాటను పాడుతారు. 

No comments:

Post a Comment