22 January 2026

రాజస్థాన్‌లోని కాయంఖానీ సమాజంపై డాక్యుమెంటరీ Documentary on Rajashthan Kayamkhanis community



న్యూఢిల్లీ:

"వీపుపై బుల్లెట్ గాయం తగిలిన ఒక్క కాయంఖానీ కూడా లేడు," అని భారత సైన్యానికి చెందిన ఒక అనుభవజ్ఞుడు/వెటరన్ అంటారు. కాయంఖానీ సమాజంలోని చాలా మంది తమ జీవితాన్ని యూనిఫాం, క్రమశిక్షణ మరియు దేశ సేవకు అంకితం చేశారు.

'కాయంఖానీ బ్రేవ్‌హార్ట్స్' అనే డాక్యుమెంటరీ, రాజస్థాన్‌కు చెందిన కాయంఖానీ అనే ముస్లిం సమాజం యొక్క గాథ. కాయంఖానీ సమాజంలో సైన్యం లేదా పోలీసు ఉద్యోగానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు మరియు దేశ సేవను గర్వకారణంగా, బాధ్యతగా భావిస్తారు.

కాయంఖానీ సమాజంలోని వారికి దేశభక్తి కేవలం ఒక నినాదం కాదు, తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం. సరిహద్దులో దేశాన్ని రక్షించిన, శత్రువుల బుల్లెట్లను ధైర్యంగా ఎదుర్కొన్న, వీరమరణాన్ని గౌరవంగా భావించే ధైర్యవంతులైన మట్టి బిడ్డల కథకు 'కాయంఖానీ బ్రేవ్‌హార్ట్స్' డాక్యుమెంటరీ ఒక దృశ్యరూపక పత్రం.

'కాయంఖానీ బ్రేవ్‌హార్ట్స్' డాక్యుమెంటరీ వాస్తవాల ప్రదర్శన మాత్రమే కాకుండా, భావోద్వేగం, త్యాగం మరియు దేశభక్తితో నిండిన ఒక అనుభూతిని అందిస్తుందని డాక్యుమెంటరీ టీజర్ సూచిస్తుంది. టీజర్ ని చూస్తున్నప్పుడు, ప్రేక్షకులు గర్వంగా  దేశ రక్షణలో కేవలం కర్తవ్యానికే ప్రాధాన్యత ఉంటుందని, మతానికి కాదని అర్థం చేసుకోక తప్పదు.

రాజస్థాన్‌లోని కాయంఖానీ ముస్లిం సమాజ చరిత్ర శౌర్యం, క్రమశిక్షణ మరియు దేశ సేవతో నిండి ఉంది. కాయంఖానీ సమాజంలోని దాదాపు ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా సాయుధ దళాలతో సంబంధం కలిగి ఉంది. కాయంఖానీ యువత కల పెద్ద వ్యాపారవేత్త కావడమో లేదా ఉన్నత ప్రభుత్వ పదవిలో అధికారి కావడమో కాదు, భారత సైన్యం, పారామిలిటరీ దళాలు లేదా పోలీసులలో చేరి తమ మాతృభూమికి సేవ చేయడమే.

కాయంఖానీ సమాజానికి చెందిన సైనికులు ఇప్పటివరకు నాలుగు శౌర్య చక్రాలు, 18 సేనా పతకాలు మరియు ఐదు విశిష్ట సేవా పతకాలను సాధించారు. కాయంఖానీలకు ఇవి కేవలం గౌరవం మాత్రమే కాదు, బాధ్యతకు చిహ్నం. త్యాగం విషయానికి వస్తే, కాయంఖానీ సమాజం ఏమాత్రం వెనుకబడలేదు.

ప్రస్తుతం "సైనికుల గ్రామంగా" పిలువబడే దండూరి గ్రామంలో, 18 మంది కాయంఖానీ ముస్లింలు దేశం కోసం వీరమరణం పొందారు. అదేవిధంగా, ఝఝోట్ మరియు నువా గ్రామాల నుండి ఒక్కొక్కరు 10 మంది అమరవీరులు కూడా తమ మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించారు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, ఆ తల్లుల కన్నీళ్లను, ఆ కుటుంబాల గర్వాన్ని, మరియు అటువంటి ధైర్యవంతులైన కుమారులకు జన్మనిచ్చిన నేల సారాన్ని సూచిస్తాయి.

’కాయంఖానీ బ్రేవ్‌హార్ట్స్’ డాక్యుమెంటరీ కాయంఖానీ అమరవీరుల కథలను చాలా సున్నితంగా మరియు ప్రభావవంతమైన రీతిలో ప్రదర్శిస్తుంది. కెమెరావర్క్, ఎడిటింగ్ మరియు గ్రాఫిక్స్ ఉన్నత ప్రమాణాలతో ఉంటాయి, ప్రేక్షకులను కథనంతో భావోద్వేగపరంగా అనుసంధానిస్తాయి. పరిశోధన, కృషి మరియు ప్రామాణికత ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.

కాయంఖానీ ముస్లింలు ఆవులను తమ అత్యంత విలువైన ఆస్తిగా భావిస్తారు మరియు వాటికి హాని కలిగించడం ఊహించలేరు.

’కాయంఖానీ బ్రేవ్‌హార్ట్స్’ డాక్యుమెంటరీ లక్ష్యం భారతదేశం సహకారం మరియు శాంతియుత సహజీవనం కు వేదిక.భారతదేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్న ముస్లిం సమాజాలలో కూడా ప్రగతిశీల, సానుకూల మరియు దేశ నిర్మాణ ఆలోచనలను ప్రోత్సహిస్తుంది.

’కాయంఖానీ బ్రేవ్‌హార్ట్స్’ యూనిఫాంకు మతం లేదని, దేశం కోసం చిందిన ప్రతి రక్తపు బొట్టు పూర్తిగా భారతీయమైనదని మనకు గుర్తు చేస్తుంది.

’కాయంఖానీ బ్రేవ్‌హార్ట్స్’ డాక్యుమెంటరీ నిస్సందేహంగా ప్రేక్షకులను కదిలించడమే కాకుండా, వారిని ఆలోచింపజేసి, గర్వపడేలా చేసి, దేశానికి సేవ చేయడానికి వారిలో స్ఫూర్తిని నింపుతుంది. ఇది కేవలం కాయంఖానీ సమాజం కథ మాత్రమే కాదు, దేశానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే భారతదేశం యొక్క కథ కూడా.

 

మూలం: Awaz, The Voice January 17th, 2026

 

బైక్ ఆంబులెన్స్ దాదా కరీముల్ హక్‌పై బయోపిక్ సినిమా Biopic Film on Bike Ambulance Dada Karimul Haque

 



ఉత్తర బెంగాల్ ప్రాంతాలలో తన తాత్కాలిక బైక్ అంబులెన్స్‌లో రోగులను ఆసుపత్రికి తరలించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన కరీముల్ హక్ జీవితంపై టాలీవుడ్ స్టార్ దేవ్ నటిస్తున్న 50వ చిత్రం ఆగస్టులో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

బైక్ అంబులెన్స్ దాదా అనేది ఒక బెంగాలీ బయోపిక్. ఇందులో టాలీవుడ్ సూపర్‌స్టార్ దేవ్, గ్రామీణ బెంగాల్‌లో ప్రాణాలను కాపాడటానికి తన మోటార్‌సైకిల్‌ను అంబులెన్స్‌గా ఉపయోగించినందుకు పద్మశ్రీ అవార్డు పొందిన నిజ జీవిత హీరో కరీముల్ హక్ పాత్రలో నటిస్తున్నారు. బైక్ అంబులెన్స్ దాదా చిత్రానికి వినయ్ ముద్గిల్ దర్శకత్వం వహించారు.

బైక్ అంబులెన్స్ దాదా  అనే చిత్రం దశాబ్దాలుగా రోగులకు సేవ చేయడానికి మరియు వారిని తన తాత్కాలిక అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కరీముల్ హక్  యొక్క నిస్వార్థ సేవలను ప్రజలకు గుర్తు చేసింది.

కరీముల్ హక్ కథ పశ్చిమ బెంగాల్‌లోని తేయాకు తోటలలో ప్రారంభమవుతుంది. 1995లో, హక్ తన అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం ప్రజల సహాయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తల్లిని అత్యవసరంగా వైద్య సదుపాయానికి తరలించాల్సి వచ్చింది.తల్లిని సకాలంలో తరలించడానికి కరీముల్ హక్ కి అంబులెన్స్ దొరకలేదు, మరియు కరీముల్ హక్ తల్లి చికిత్స కోసం ఎదురుచూస్తూ మరణించింది.

ఈ విషాదం కారణంగా, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సరైన సమయానికి వాహనం దొరక్క ఎవరూ చనిపోకుండా చూడటానికి తాను కృషి చేస్తానని కరీముల్ హక్ ప్రతిజ్ఞ చేశాడు.

కరీముల్ హక్ క్ తన బైక్ అంబులెన్స్ ఆలోచనను ఒక సంఘటన ద్వారా పొందాడు. ఒకసారి కరీముల్ హక్ సహోద్యోగి పొలంలో కుప్పకూలిపోయాడు. సాధారణ అంబులెన్స్ సకాలంలో అక్కడికి చేరుకోలేకపోవడంతో, కరీముల్ హక్ అతన్ని తన వీపుకు కట్టుకుని, తన బైక్‌పై కూర్చోబెట్టుకుని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కరీముల్ హక్ సహోద్యోగి అనారోగ్యం నుండి కోలుకోవడంతో, ఈ పద్ధతిని కొనసాగించడానికి కరీముల్ హక్ కు స్ఫూర్తి లభించింది.

గత మూడు దశాబ్దాలుగా, డూయార్స్ ప్రాంతంలోని ధలబారి మరియు దాని చుట్టుపక్కల ఉన్న 20కి పైగా గ్రామాలకు కరీముల్ హక్ అంబులెన్స్ సేవలను అందిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజలకు రోడ్లు మరియు విద్యుత్ సౌకర్యాలు అందుబాటులో లేవు. స్థానికులకు సమీపంలోని ఆసుపత్రి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2019 నాటికి, కరీముల్ హక్ సుమారు 5,000 నుండి 5,500 మందిని ఉచితంగా తరలించాడు.

కరీముల్ హక్ కుటుంబ పొదుపులో ఎక్కువ భాగం రోగులకు ఉచిత చికిత్స అందించడానికే ఖర్చవుతుంది.

ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన కరీముల్ హక్, ఈ రోజు మానవ సేవకు సజీవ చిహ్నంగా నిలిచారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ అంబులెన్స్‌లు అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో, కరీముల్ హక్ మోటార్‌బైక్ అందరికీ చివరి ఆశ్రయం అవుతుంది.

కరీముల్ హక్ తన బైక్‌ను అంబులెన్స్‌గా మార్చి, తుఫాను, వర్షం లేదా తీవ్రమైన చలిలో కూడా పగలు రాత్రి తేడా లేకుండా రోగుల వద్దకు పరుగెత్తుతాడు. ఎలాంటి ప్రతిఫలం లేదా గుర్తింపు ఆశించకుండా మానవ ప్రాణాలను కాపాడటమే కరీముల్ హక్ జీవిత ఏకైక లక్ష్యం.

హీర్ రంఝా Heer Ranjha

 

హీర్ రంఝా అనేది ఒక పంజాబీ జానపద విషాద గాథ; ఇది పంజాబ్‌లోని నాలుగు ప్రసిద్ధ విషాద ప్రేమకథలలో ఒకటి. మిగిలిన మూడు మీర్జా సాహిబాన్, సోహ్ని మహివాల్ మరియు సస్సీ పున్నున్. హీర్ రంఝా కథకు సంబంధించి అనేక కవితాత్మక వర్ణనలు ఉన్నాయి; వాటిలో 1766 లో వారిస్ షా రచించిన హీర్ అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇది హీర్ సియాల్, ధీడో రంఝా మధ్య ప్రేమ కథను చెబుతుంది.

హీర్ రంఝా కథ ను పలువురు కవులు రచించారు. మొదట హీర్ రంఝా కథ అక్బర్  కాలానికి చెందిన దామోదర్ గులాటి వివరించాడు. దామోదర్ గులాటి కథ హీర్ రంఝా పంజాబీ సాహిత్యంలో అత్యంత పురాతనమైన హీర్ గా పరిగణించబడుతుంది.

16 శతాబ్దపు కవి షా హుస్సేన్ , భై గురుదాస్ ఆ తరువాత మన్సారామ్ మున్షీ 1744లో హీర్ రంఝా కథను చిత్రాలతో కూడిన వ్రాతప్రతి రూపంలో రూపొందించారు.వారిస్ షా 1766 లో తన నవలలో హీర్ రంఝా కథను వివరించాడు, వారిస్ షా హీర్ రంఝా కథకు లోతైన అర్థం ఉందని పేర్కొన్నాడు, ఇది భగవంతుడి పట్ల మనిషికి ఉన్న అలుపెరగని అన్వేషణను సూచిస్తుంది అని అన్నాడు

హీర్ యొక్క మొట్టమొదటి పర్షియన్ వర్షన్ 1575 మరియు 1579 మధ్య తాజిక్ కవి హయత్ జాన్ బాకీ కొలాబీ రచించారు. వారిస్ షా కాలం నాటికి, పర్షియన్ భాషలో హీర్ యొక్క తొమ్మిది కూర్పులుEditions  వాడుకలో ఉన్నాయి, వాటిలో మితా చెనాబి (1698) మరియు అఫరీన్ లాహోరీ (1730) రచనలు కూడా ఉన్నాయి

పర్షియన్ భాషలో హీర్ యొక్క సుమారు ఇరవై అనువాదాలు తెలిసినవి ఉన్నవి. హిందీ (బ్రజ్) భాషలోని తొలి కూర్పులను సిక్కు పంత్ సమాజానికి చెందిన హరి దాస్ హరియా (సుమారు 1520లు–50లు) మరియు అక్బర్ ఆస్థానంతో సంబంధం ఉన్న గంగ్ భట్ (సుమారు 1580లు–90లు) వివరించారు; గంగ్ భట్ 1565లో ఒక పద్య సంవాదాన్ని రాశారు. దామోదర్ మరియు వారిస్ షా రచనలతో పాటు, హాఫిజ్ బర్ఖుర్దార్ రంఝా, ఫజల్ షా సయ్యద్ మరియు అహ్మద్ యార్ వంటి వారి రచనలతో కలిపి పంజాబీ భాషలోనే హీర్ గురించి యాభైకి పైగా అనువాదాలు ఉన్నాయి.

హీర్ (ఇజ్జత్ బీబీ) చాలా అందమైన మహిళ, సియాల్ తెగకు చెందిన సంపన్న కుటుంబంలో జన్మించింది, జాట్ వంశానికి చెందిన ధీడో రంఝా నలుగురు సోదరులలో చిన్నవాడు, పంజాబ్ లోని చీనాబ్ నది ఒడ్డున ఉన్న తఖ్త్ హజారా గ్రామంలో నివసిస్తున్నాడు.. తన తండ్రికి ఇష్టమైన కుమారుడు కావడంతో, రంఝా తన సోదరుల మాదిరిగా కస్టపడి వ్యవసాయం చేయకుండా వేణువు ('వాంజ్లీ'/ 'బన్సూరి') వాయిస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతాడు. రంఝా తండ్రి మౌజు చౌదరి మరణించిన తరువాత, తన సోదరులతో భూమి విషయంలో గొడవపడి, తన ఇంటిని విడిచి రంఝా వెళ్లిపోతాడు.

వారిస్ షా ఇతిహాసం వెర్షన్ లో, రంఝా సోదరుల భార్యలు అతనికి ఆహారాన్ని వడ్డించడానికి నిరాకరించినందున ఇంటిని విడిచిపెడతాడు. చివరికి రంఝా,  హీర్ గ్రామానికి చేరుకుని హీర్ తో ప్రేమలో పడతాడు. హీర్ తండ్రి రంఝాకు తన పశువులను మేపే పనిని ఇస్తాడు. రంఝా రోజూ పని తర్వాత పొలాల్లో తన పిల్లనగ్రోవి వాయిస్తాడు, హీర్ ఆ సంగీతానికి ముగ్ధురాలై చివరికి రంఝా తో ప్రేమలో పడుతుంది. వారు చాలా సంవత్సరాలు రహస్యంగా కలుసుకుంటారు, హీర్ యొక్క అసూయపడే మామ కైదో, మరియు ఆమె తల్లిదండ్రులు చుచక్, మల్కీలకు హీర-రంఝా దొరికిపోతారు. హీర్, కుటుంబం మరియు స్థానిక మత గురువు (మౌల్వి) బలవంతం మీద, ఖేరా వంశానికి చెందిన సైదా ఖేరా అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది.

హీర్ పెళ్లి తో రంఝా గుండె పగిలిపోయింది. రంఝా ఒంటరిగా పల్లెటూళ్ళలో తిరుగుతూ, చివరికి ఒక జోగి (సన్యాసి)ని కలుస్తాడు. తిల్లా జోగియన్ ("సన్యాసుల కొండ") వద్ద జోగిల కంఫాత (గుచ్చిన చెవి pierced ear) శాఖ స్థాపకుడు గోరఖ్ నాథ్ ను  కలిసిన తరువాత, రంఝా స్వయంగా జోగి అవుతాడు, తన చెవులను కుట్టిoచుకొని  భౌతిక ప్రపంచాన్ని త్యజిస్తాడు. భగవంతుని నామాన్ని జపిస్తూ, రంఝా పంజాబ్ అంతటా తిరుగుతాడు, చివరికి హీర్ ఇప్పుడు నివసిస్తున్న గ్రామాన్ని కనుగొంటాడు.

ఇద్దరూ హీర్ గ్రామానికి తిరిగి వస్తారు, అక్కడ హీర్ తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరిస్తారు - అయినప్పటికీ కథ యొక్క కొన్ని వెర్షన్లు తల్లిదండ్రుల అంగీకారం కేవలం మోసం మాత్రమే అని పేర్కొన్నాయి. పెళ్లి రోజున, మామ కైడో,  హీర్ ను శిక్షించడానికి, హీర్, రంఝాల  వివాహం జరగకుండా ఉండటానికి హీర్ ఆహారంలో విషం కలుపుతాడు. ఈ వార్త విన్న రంఝా,  హీర్ కు సహాయం చేయడానికి పరుగు పరుగున  వస్తాడు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది, హీర్ విషం తిని మరణించింది దీంతో మరోసారి గుండె పగిలిన రంఝా మిగిలిన విషపూరితమైన ఆహారాన్ని తిని హీర్ పక్కనే మరణిస్తాడు.

హీర్, రంఝా లను హీర్ స్వస్థలం ఝాంగ్ లో ఖననం చేశారు. ప్రేమించిన జంటలు, ఇతరులు తరచుగా వారి సమాధిని సందర్శిస్తారు

వారసత్వం, ప్రభావంLegacy and Influence

లైలా మజ్ను, ససుయి పున్హున్Sassui Punnhun వంటి కథలతో పాటు విషాద ప్రేమకథల కిస్సా శైలిలో హీర్ రంఝా కూడా ఉంది. 

 హీర్ రంఝా ప్రేమ కథాంశం కుటుంబ సభ్యులచే వ్యతిరేకించబడి ఇద్దరు ప్రేమికులు మరణించడంతో ముగుస్తుంది కాబట్టి, ఈ కథను తరచుగా షేక్స్పియర్ నాటకం రోమియో అండ్ జూలియట్ తో పోలుస్తారు

చలన చిత్రములు, టీవీ సీరియల్స్ :

·       హీర్ రంఝా ప్రేమ కథాంశం తో 1928 నుంచి నేటి వరకు అనేక చలన చిత్రములు రుపొందిoచబడినవి.

·       2013లో, 'హీర్ రంఝా' అనే టెలివిజన్ సీరియల్ PTV హోమ్‌లో ప్రసారమైంది.

·       హీర్ రంఝా అనేది 2020 నాటి ఒక భారతీయ పంజాబీ భాషా చారిత్రక నాటక టెలివిజన్ ధారావాహిక, ఇది జీ పంజాబీలో ప్రసారమైంది మరియు హీర్, రంఝా జానపద కథ ఆధారంగా రూపొందించబడింది

సంగీతంలో In Music

·       బాలీ జగ్‌పాల్ అనే బ్రిటిష్ సంగీతకారుడు హీర్ రంఝా కథకు అంకితం చేస్తూ "రంఝా" అనే పాటను రచించారు.

·       బ్రిటిష్ సంగీతకారుడు పంజాబీ MC తన 2003 పాట జోగిలో హీర్ మరియు రంఝా కథను ప్రస్తావించారు. దీనిని శాస్త్రీయ/సాంప్రదాయ కళాకారుడు గులాం అలీతో సహా వివిధ గాయకులు పాడారు.

·       ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీ ఖాన్ తన ఖవ్వాలీ ఖూనీ అఖియాన్‌లో సస్సూయి(-పున్హున్) మరియు సోహ్ని (-మహివాల్) లతో పాటు హీర్‌ను ప్రస్తావించారు; ఈ జానపద ప్రేమికుల కథలు దేవునితో భక్తుడి సంబంధానికి ఉపమానాలుగా మారాయి నిజమైన ప్రేమ సంపూర్ణమైనది, ప్రమాదకరమైనది మరియు తరచుగా ప్రాణాంతకమైనది, కానీ అది ఐక్యతకు ఏకైక మార్గం అని చూపిస్తుంది.

·       క్వీన్ సినిమాలోని "రంఝా", రావణ్ సినిమాలోని "రంఝా రంఝా" మరియు బార్ బార్ దేఖో సినిమాలోని "దరియా" వంటి ప్రసిద్ధ బాలీవుడ్ పాటలలో హీర్, రంఝా కథ ప్రస్తావించబడింది.

·       తమాషా సినిమాలో (2015) హీర్, రంఝా ప్రేమకథను ప్రస్తావిస్తుంది మరియు హీర్ పేరుతో ప్రారంభమయ్యే ఒక పాటను కలిగి ఉంది.

·       కుల్దీప్ మానక్ తన 2007 పాట రంఝా జోగి హోయాలో హీర్, రంఝా కథ గురించి పాడారు.

·       షఫ్కత్ అమానత్ అలీ యొక్క తొలి సోలో ఆల్బమ్, తబీర్ (2008)లోని ఖైరేయాన్ దే నాల్ పాట హీర్ రంఝా కథను చెబుతుంది.

·       2012 హిందీ చిత్రం జబ్ తక్ హై జాన్ లోని ఒక పాటకు "హీర్" అని పేరు పెట్టారు.

·       2018 హిందీ చిత్రం రేస్ 3లో "హీరియే" అనే పాట ఉంది, ఇది హీర్ మరియు రంఝాలను సూచిస్తుంది.

·       2020లో, ప్రముఖ భారతీయ యూట్యూబర్ భువన్ బామ్ "హీర్ రంఝా" పాటను రాసి పాడారు. ఈ పాట 10 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది.

·       రాఫ్ సపెర్రా యొక్క 2023 సింగిల్ "రంఝా"లో, హీర్‌కు వివాహం జరిగిన తర్వాత మరియు రంఝా జోగిగా మారిన తర్వాత, అతని తిరిగి రాక కోసం హీర్ పడే విరహ వేదన పాదబడింది..