8 June 2023

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముస్లింలు విద్య మరియు ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నందున మరింత మెరుగైన అవకాశాలు కోరుకొంటున్నారు.

 

2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం సమాజం కీలకమైన విద్య మరియు ఉపాధి రంగాలలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది, రాష్ట్ర జనాభాలో ముస్లింలు 9.56% ఉన్నప్పటికీ, రాష్ట్రం ఏర్పడిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత కూడా  రాజకీయ అధికారం, అభివృద్ధి, వనరులు మరియు పాలనా నిర్మాణంలో ముస్లిముల  వాటా స్వల్పంగానే ఉంది.

భారతదేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు విద్యా స్థితిగతులను అధ్యయనం చేసిన సచార్ కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తన రాష్ట్ర-నిర్దిష్ట సర్వే state-specific survey లో, ముస్లిములలో పేదరికం తగ్గినప్పటికీ  ప్రభుత్వ ఉపాధి మరియు విద్య రంగం లో ముస్లింల వాటా పెద్దగా పెరగలేదని గుర్తించింది.

సచార్ కమిటీ సభ్యుడు అబుసలేహ్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రాయలసీమ వంటి పట్టణ ప్రాంతాల్లో ముస్లింలు సాపేక్షంగా ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారని, ముస్లింల స్థితి ఉపాధిలో గణనీయంగా మెరుగుపడలేదని అన్నారు. ఉన్నత స్థాయి విద్య కొందరికే అందుబాటులో ఉంటుంది. విద్యారంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల ఇంతకుముందు లబ్ధి పొందిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది" అని అబుసలేహ్ షరీఫ్ అన్నారు.

ప్రధాన కార్యక్రమాలలో మైనారిటీ కమ్యూనిటీ లబ్ధిదారులకు వచ్చే వాటాను అంచనా వేయాలని నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వైవిధ్యమైన విద్యార్థులను diversity of students కలిగి ఉన్న ఉత్తమ విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రి అవార్డులను ప్రతి సంవత్సరం ఇవ్వవచ్చు మరియు మైనారిటీలకు సహాయం చేసినందుకు ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు మరియు సంస్థలకు ఇలాంటి అవార్డులు ఇవ్వవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ముస్లిం అక్షరాస్యత పెరగలేదు ఎందుకంటే పేదలకు పాఠశాలలు సమీపంలో అనగా నడిచే దూరంలో లేవు. ముస్లింలలో అత్యధికులు చేతివృత్తుల వారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారికి వృత్తి ఆధారిత శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముస్లిం ప్రజల కోసం కమ్యూనిటీ పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంది.

 

 

 

No comments:

Post a Comment