5 June 2023

ఉర్దూ ప్రెస్ యొక్క ప్రాముఖ్యత మరియు రీడర్‌షిప్‌పై ప్రభావం Significance of Urdu Press and Impact on Readership

 

ముస్లిం సమాజం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో టీ స్టాల్స్‌లో, పాన్ షాపుల్లో, సమావేశాలలో ఉర్దూ పేపర్ చదవడం సర్వసాధారణం గా కనిపించే దృశ్యం.

ఉర్దూ పాఠకుల సంఖ్య తగ్గిపోయిందనే నమ్మకానికి విరుద్ధంగా, వాస్తవానికి, ముస్లిం సమాజంలో ఉర్దూ పాఠకుల సంఖ్య పెరిగింది. ముస్లిం జనాభా క్రమంగా పెరిగింది మరియు దేశంలో మదర్సాల సంఖ్య కూడా పెరిగింది. 2017 నివేదిక ప్రకారం, కేవలం ఉత్తరప్రదేశ్‌లో 16,400 కంటే ఎక్కువ మదర్సాలు ఉన్నాయి మరియు ఈ సంఖ్య లో మసీదులలో మరియు ముస్లిం ప్రాంతాలలో నిర్వహించబడుతున్న ప్రైవేట్ మదర్సాలను చేర్చలేదు.

ఈ మదర్సాలలో లక్షలాది మంది విద్యార్థులు ఉర్దూ భాష నేర్చుకుంటున్నారు మరియు ఉర్దూ వార్తలను చదవుతున్నారు  ఎందుకంటే ఇది వారికి ఉర్దూ పఠనము లో సహాయపడుతుంది మరియు వారికి దేశ పరిస్థితుల  గురించి అవగాహన కల్పిస్తుంది. అంతేకాకుండా టైర్3 మరియు4 నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడాఉర్దూ పాఠకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో, మధ్యతరగతి మరియు ఉన్నత తరగతి ముస్లిం కుటుంబాలు తమ పిల్లలకు ఉర్దూ మరియు అరబిక్ నేర్చుకునేలా ప్రైవేట్ ట్యూటర్‌లను నియమించడం ప్రారంభించాయి. అరబిక్‌తో లిపి సారూప్యత మరియు మతంతో దాని అనుబంధం కారణంగా, ఉర్దూ భారతదేశంలోని ముస్లింలలో చాలా ప్రజాదరణ పొందిన భాషగా మిగిలిపోయింది.

ఉర్దూ వార్తాపత్రికలు (అది ప్రింట్ లేదా డిజిటల్ కావచ్చు) చదవడానికి అనేక కారణాలు కలవు. ముస్లిం సమాజం ఎల్లప్పుడూ మధ్యప్రాచ్యం గురించి మరియు ఇతర ముస్లిం మెజారిటీ దేశాల గురించిన వార్తలు చదవడానికి ఆసక్తి చూపుతుంది. ముస్లిం తీర్థయాత్రలకు కేంద్రమైన సౌదీ అరేబియాలో జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకోవాలి అనుకొంటున్నారు. ఈ వార్తలను ఉర్దూ ప్రెస్ మాత్రమే వివరంగా వివరిస్తుంది. ఇతర ఇంగ్లీష్ మరియు హిందీ వార్తా మూలాలు అటువంటి వార్తలను కవర్ చేస్తాయి కానీ అవి అంత వివరంగా లేవు. ఇది ప్రజలు సాధారణ మాధ్యమాల కంటే ఉర్దూ మాధ్యమాన్ని చదవడానికి మరియు ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం. అరబ్ లీగ్ మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (OIC) వంటి సంస్థల గురించిన వార్తలను కూడా ఉర్దూ ప్రెస్ అందిస్తుంది. ఇది ముస్లిం సమాజానికి ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.

ఉర్దూ మీడియా మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వార్తలను కవర్ చేస్తుంది, ఇది సాధారణంగా ఇతర వార్తా మాధ్యమాల ద్వారా ప్రసారం చేయబడదు.

ఉర్దూ వార్తాపత్రికలు అనేక మతపరమైన సమస్యలపై కథనాలను ప్రచురిస్తాయి మరియు ముస్లిం ప్రజలకు విద్యను అందించే ప్రసిద్ధ ముస్లిం వ్యక్తుల గురించి కధనాలను ప్రచురిస్తాయి.

భారతదేశంలో ఇస్లాంతో ఉర్దూ భాష కున్న అనుబంధం ఉర్దూ ప్రెస్ యొక్క విశ్వసనీయతను మరింత పెంచుతుంది. ఒక ముస్లిం ఇతర భాషల్లోని వార్తాపత్రికలతో పోలిస్తే ఉర్దూ వార్తాపత్రికలో చదివే వార్తపై ఎక్కువ నమ్మకం ఉంచుతాడు. భాష ద్వారా సృష్టించబడిన పరిచయ భావం పాఠకుడిని వార్తలపై విశ్వాసాన్ని పెంచుతుంది.

యుపికి చెందిన సీనియర్ ఉర్దూ జర్నలిస్టు జహీర్ ముస్తఫా ఉర్దూ ప్రెస్ యొక్క ప్రాముఖ్యతను క్రింది విధంగా వివరించారు. "ఒక భారతీయ ముస్లిం పవిత్ర ఖురాన్ ఉర్దూ వార్తాపత్రిక పై విశ్వాసం ఉంచుతాడు " అనిఅన్నారు.

ప్రభుత్వానికి మరియు సమాజానికి మధ్య ఉర్దూ వార్తాపత్రిక ఒక వారధిగా పని చేస్తుంది. సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న సానుకూలమైన పనిని ఎల్లప్పుడూ హైలైట్ చేసి ప్రచురిస్తుంది   మరియు అదే సమయంలో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి చేరేలా చూస్తుంది, తద్వారా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించగలదు.

ఉర్దూ ప్రెస్ ఎల్లప్పుడూ ఇరుపక్షాల ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది మరియు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.

ఉర్దూ ప్రెస్ నిజానికి ప్రభుత్వానికి మరియు మైనారిటీ కమ్యూనిటీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించగలదు. ఉర్దూ ప్రెస్ మైనారిటీ కమ్యూనిటీపై ప్రభావం చూపగల చాలా శక్తివంతమైన మాధ్యమం.

ఉర్దూ ప్రెస్‌ని మైనారిటీ సమాజం మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా నిశితంగా గమనిస్తోంది. భారతదేశంలోని చాలా ఎంబసీలు మరియు కాన్సులేట్‌లు ఉర్దూ ప్రెస్‌ను ట్రాక్ చేస్తాయి. ఉర్దూ ప్రెస్‌ పాశ్చాత్య శక్తులతో పాటు మధ్య-ప్రాచ్య మరియు ముస్లిం-ఆధిపత్య దేశాలలో కూడా సమాన ఆసక్తిని కలిగిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) వంటి కొన్ని రాయబార కార్యాలయాలు ప్రత్యేక ఉర్దూ ప్రెస్ విభాగాన్ని కలిగి ఉన్నాయి. విదేశీ దౌత్యవేత్తలు ఉర్దూ ప్రెస్ జర్నలిస్టులను కలవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు, ఎందుకంటే ఉర్దూ ప్రెస్ జర్నలిస్టులు మత పెద్దల తర్వాత మైనారిటీ కమ్యూనిటీ యొక్క ప్రతినిధులు మరియు వాయిస్‌గా పరిగణించబడతారు.

ఉర్దూ వార్తాపత్రిక మరియు వార్తా పోర్టల్ అంతర్జాతీయ సమాజంలో దేశం యొక్క సానుకూల చిత్రాన్ని నిర్మించడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడతాయి. యుకె, యుఎస్ మరియు ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా భారతదేశంలోని ఉర్దూ జర్నలిస్టులను కలిసినప్పుడల్లా తమ మైనారిటీ అనుకూల అంశాలను హైలైట్ చేస్తాయి మరియు తమ దేశాలలో మైనారిటీలకు ఉన్న సమాన హోదా మరియు ప్రాతినిధ్యం గురించి మాట్లాడతాయి.అందుకు కారణం  భారతదేశంలోని మైనారిటీ కమ్యూనిటీ మనస్సులలో తమ దేశం మరియు ప్రభుత్వాల పట్ల సానుకూల వైఖరిని నిర్మించడమే.

దేశవ్యాప్తంగా గత సంవత్సరం, మార్చిలో, మన దేశం ఉర్దూ ప్రెస్ యొక్క ద్విశతాబ్దిని వివిధ కార్యక్రమాలతో జరుపుకుంది. భారతదేశంలో ఉర్దూ జర్నలిజానికి పునాది సదాసుఖ్ లాల్ మరియు హరిహర్ దత్తా వేసారు. 1822లో కోల్‌కతా నుండి ప్రచురించబడిన భారతదేశపు మొదటి ఉర్దూ వార్తాపత్రిక జామ్ ఇ జహాన్ నుమా యొక్క సంపాదకుడు మరియు ప్రచురణకర్తలు సదాసుఖ్ లాల్ మరియు హరిహర్ దత్తా.

1857లో ఉర్దూ ప్రెస్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. “ఢిల్లీ ఉర్దూ అఖ్బర్” సంపాదకుడు మౌల్వీ ముహమ్మద్ బకర్ బ్రిటిష్ వారిచే చంపబడినాడు మరియు  బ్రిటిష్ వారు స్వాతంత్ర్య పోరాట వార్తలు ప్రచురించిన  ఉర్దూ వార్తాపత్రిక ప్రచురణకర్తలకు 50,000 రూపాయల వరకు జరిమానా విధించారు మరియు అరెస్టు చేసి అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు పంపారు

లాలా లజపతిరాయ్ తన జాతీయవాద వార్తాపత్రిక వందేమాతరం Vande Matram ఉర్దూలో ప్రచురించారు. ఉర్దూ ప్రెస్ యొక్క మిశ్రమ వారసత్వం,సంస్కృతి  మరియు స్వాతంత్ర్య పోరాటానికి సహకారం అందిచినది. భగత్ సింగ్ మరియు వీర్ సావర్కర్ కూడా ఉర్దూలో రాశారు.

ఉర్దూ ప్రెస్ ప్రింట్ మరియు డిజిటల్ ఎడిషన్ కలిగి ఉంది. డిజిటల్ దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠకులకు మాత్రమే కాకుండా విదేశాలలో నివసిస్తున్న భారతీయ మైనారిటీ ప్రవాసులకు కూడా చేరువయ్యే సామర్థ్యాన్ని అందిస్తుంది. సెల్ ఫోన్లు మరియు మొబైల్ ఇంటర్నెట్ వ్యాప్తి తో డిజిటల్ మాధ్యమానికి మరింత ఊపందుకుంది. డిజిటల్ మీడియా శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన కథనాలను ఒకేసారి మిలియన్ల మంది వ్యక్తులకు అందించడానికి స్కోప్ ఇస్తుంది.

జాతీయ స్థాయిలో ఉర్దూ ప్రెస్ సరైన మార్గంలో ఉపయోగించినట్లయితే అది ప్రభుత్వానికి మరియు దేశానికి చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

 

 

No comments:

Post a Comment