బోహ్రా, ఖోజా మరియు మెమన్ మొదలగు గుజరాతి ముస్లిం వర్తక సంఘాలు పశ్చిమ భారతదేశం యొక్క శక్తివంతమైన వాణిజ్య స్ఫూర్తికి సజీవ చిహ్నంగా నిలిచాయి. జనాభా రీత్యా ఈ గుజరాతీ ముస్లిం వ్యాపార సమూహాలు చిన్నవి అయినప్పటికీ, 19వ శతాబ్దంలో ఆర్ధికంగా గొప్ప అభివృద్దిని సాధించారు.
దక్షిణాసియా ముస్లిం జనాభాలో కేవలం 1% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాతి ముస్లిం వర్తక సంఘాలు తమ సంస్థాగత నైపుణ్యం, నావికా నైపుణ్యం మరియు మహాసముద్రాలలో విస్తరించి ఉన్న అంతర్జాతీయ వ్యాపార సంబంధాలతో, అద్భుతమైన బలం మరియు ప్రభావం పొందారు..అసమానతలకు వ్యతిరేకంగా, మైనారిటీ గుజరాతి ముస్లిం వ్యాపార సమూహాలు ఇతరులతో సరిపోల్చని విజయగాథను వ్రాయగలిగారు.
బోహ్రా, ఖోజా మరియు మెమన్ వ్యాపార సముహాల జీవన విధానం,సామాజిక నిర్మాణం, వ్యాపార నీతి మరియు రాజకీయ, ఆర్థిక ఆటుపోట్లు పరిశీలించిన
వారు ఎక్కడ వెళ్ళిన , అక్కడ వేళ్ళూనుకుని స్థానిక ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చెందించడం లో సహాయపడ్డారు. వ్యాపారులుగా కాకుండా, వారు నివసించే ప్రాంతాలలో భాగమయ్యారు.
ఆంగ్లేయులు బొంబాయిని తన సొంతం చేసుకోవడానికి ముందు, సూరత్ భారతదేశ వాణిజ్య కిరీటానికి రత్నం. 18వ శతాబ్దంలో ముస్లిం సముద్ర
వాణిజ్యం దెబ్బ తిన్నప్పుడు కూడా, సూరత్ ప్రాంతీయ మరియు ప్రపంచ వాణిజ్య చక్రంలో
కేంద్రంగా ఉంది.
18వ శతాబ్దం చివరి నాటికి, గుజరాతి ముస్లిం వ్యాపార సమూహాలు తమ
“జమాత్ ఖానాలు” - కమ్యూనిటీ కేంద్రాల ద్వారా వాణిజ్య సంబంధాలను ఏర్పర్చడమే కాకుండా
స్థానిక పాలకులతో నేర్పుగా చర్చలు జరిపారు. మెమన్లు స్థానిక పాలకుల అధిక పన్నులు
మరియు హిందూ వడ్డీ వ్యాపారుల పోటి తో విసిగిపోయి, జునాగఢ్కు మకాం మార్చారు
మరియు చివరికి అనుకూలమైన రాయితీలను పొందిన తర్వాత ఆహ్వానం మేరకు మాత్రమే తిరిగి
వచ్చారు.
గుజరాతి ముస్లిం వర్తక సంఘాల పరిధులు భారతదేశ తీరాలకు మించి విస్తరించాయి. 18వ శతాబ్దం నాటికి, గుజరాతీ ముస్లిం వ్యాపారులు జెడ్డా నుండి జాంజిబార్ వరకు మార్గాలను రూపొందించారు. వీటిని నావిగేట్ చేయడంలో వారి నైపుణ్యం వారిని ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడమే కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్దికి తోడ్పడింది.
బ్రిటిష్ రాజ్ కాలం లో
గుజరాతి ముస్లిం వర్తక సమాజాలకు కరువు, ప్రకృతి వైపరీత్యం, యుద్ధం మరియు స్థానభ్రంశం సమయాల్లో, బ్రిటిష్ వారు తరచుగా సహాయ హస్తం అందించారు.
బ్రిటిష్ వలసరాజ్యాల
న్యాయస్థానాలు కూడా గుజరాతి ముస్లిం వర్తక సమాజాల పట్ల ఎక్కువ సౌమ్యతతో వ్యవహరించాయి, వారి సమాజ వ్యవస్థలు చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకున్నాయి. జమాత్లు
కార్పొరేట్ సంస్థల వలె పనిచేశాయి, మతపరమైన దానాల రూపంలో మూలధనాన్ని సమీకరించాయి.
ప్రముఖ ఖోజా వ్యాపారులు అగా
ఖాన్ I ను సవాలు చేసినప్పుడు జరిగిన ప్రసిద్ధ 1866 వివాదం, బ్రిటిష్ కోర్టులు అగా ఖాన్కు సమాజ ఆస్తిపై అధికారాలను అప్పగించడంతో
ముగిసింది.
1880 మరియు 1912 మధ్య, మత నాయకత్వంలో మార్పులు వారి
గుర్తింపులను మరింత నిర్వచించాయి. బోహ్రాలు మరియు ఖోజాలు ఒకే మత అధిపతికి కేంద్ర
అధికారం యొక్క నమూనా వైపు అడుగులు వేశారు, అయితే
మెమోన్లు స్థానిక ఉలేమాను మార్గదర్శక దీపాలుగా ఆధారపరుస్తూ సంప్రదింపుల శైలిని
ఎంచుకున్నారు.
గుజరాతి ముస్లిం వర్తక సంఘాలు ఖిలాఫత్ ఉద్యమం, భారత జాతీయవాదం కు తమ మద్దతును
ప్రకటించాయి. రంగూన్ మెమన్ జమాత్ సింగపూర్ తిరుగుబాటుకు మద్దతు ఇవ్వడం జరిగింది. .
నేటికి బోహ్రాలు మరియు ఖోజాలలో మతపరమైన బంధాలు ఎక్కువగా చెక్కుచెదరకుండా
ఉన్నాయి.