అలీఘర్:
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయపు (AMU) B.P.Ed. విద్యార్థిని అయిన ఆఫ్రిన్ జబీన్, ఇంగ్లీష్ ఛానల్ను విజయవంతంగా ఈదిన మొదటి AMU విద్యార్థిగా చరిత్ర సృష్టించారు.
జూలై 29, 2025న 11°C వద్ద శీతల జలాలను మరియు తీవ్రమైన ప్రవాహాలను ఎదుర్కొని ఆఫ్రిన్ జబీన్, లండన్ సమయం ప్రకారం తెల్లవారుజామున 3:45 గంటలకు ప్రారంభమై 13 గంటల 13 నిమిషాల్లో డోవర్ (UK) నుండి కాప్ గ్రిస్-నెజ్ (ఫ్రాన్స్) వరకు 34 కిలోమీటర్ల సోలో వన్-వే ఈతను ఆఫ్రిన్ జబీన్ పూర్తి చేసింది.
ఆఫ్రిన్ జబీన్ తన స్వస్థలం పశ్చిమ బెంగాల్ మరియు భారతదేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చింది..ఆఫ్రిన్ జబీ పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మెదినిపూర్లోని నిరాడంబరమైన నేపథ్యం వచ్చినది.
ఆల్-ఇండియా ఇంటర్-యూనివర్శిటీ
అక్వాటిక్ ఛాంపియన్షిప్లలో ఆఫ్రిన్ జబీ విద్యాసాగర్
విశ్వవిద్యాలయానికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించింది, జాతీయ స్థాయిలో పశ్చిమ బెంగాల్ తరపున రెండుసార్లు పోటీ పడింది మరియు 13 కి.మీ, 21 కి.మీ మరియు 24 కి.మీ.ల దూరం ఈతపోటీలను గెలుచుకుంది.
ప్రపంచంలోని అతి పొడవైన ఈత పోటీ - గంగానదిలో 81 కి.మీ మారథాన్లో బాలికలలో 2వ స్థానాన్ని ఆఫ్రిన్ జబీ పొందినది.
ఆఫ్రిన్ జబీన్ సోదరుడు ఆదిల్ మొహమ్మద్ (AMUలో కెమిస్ట్రీ విభాగంలో PhD విద్యార్థి) మరియు వదిన రిజ్వానా యాస్మీన్ (AMUలో నానోటెక్నాలజీలో బంగారు పతక విజేత).
AMU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నైమా ఖాటూన్, ఆఫ్రిన్ జబీన్ విజయాన్ని "సామూహిక వేడుక మరియు గర్వం" యొక్క క్షణంగా ప్రశంసించారు.ఆఫ్రిన్ అసాధారణ విజయం AMU విద్యార్థుల తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.
సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ
డీన్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం చైర్పర్సన్ ప్రొఫెసర్ ఇక్రమ్ హుస్సేన్
ఆఫ్రిన్ జాబీ అద్భుతమైన విజయానికి అభినందించారు
No comments:
Post a Comment