19 August 2025

కాలానికి అనుగుణంగా మదర్సాలు ఆధునికరించబడాలి.. Madrasas must embrace modernisation with changing times

 

 

 మదర్సా లేదా మక్తబ్ అంటే ఒక పాఠశాల. శతాబ్దాలుగా, మదర్సా ఇస్లామిక్ విద్యకు ప్రధానంగా ముస్లిం సమాజంలోని దిగువ వర్గాలకు కేంద్రంగా మారింది,.

8వ మరియు 13వ శతాబ్దాల మధ్య, ముస్లింలు సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, విద్య మరియు మేధో వృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించారు. ముస్లిములు వేదాంత అధ్యయనాలను ప్రవేశపెట్టారు మరియు వైద్యం, ఆప్టిక్స్ మరియు భాషాశాస్త్రం వంటి ఆధునిక విషయాల సూత్రాలను అబ్యసించారు. సంస్కృతం, పర్షియన్ మరియు గ్రీకు భాషల నుండి అరబిక్ లోనికి అనువదించినారు.

బాగ్దాద్‌లోని బైతుల్ హిక్మా (జ్ఞానం మరియు జ్ఞానాన్ని పొందే అకాడమీ) ఖండాల నుండి విద్యార్థులను ఆకర్షించింది. అల్-ఖ్వారిజ్మి (ఆల్జీబ్రా స్థాపకుడు) మరియు ఇబ్న్ అల్-హేతం (ఆప్టిక్స్ మార్గదర్శకుడు) వంటి ముస్లిం పండితులు ముస్లింల స్వర్ణయుగాన్ని సూచిస్తారు.

మంగోలు దండయాత్ర (ముస్లిం స్వర్ణయుగ క్షిణత) తరువాత ముస్లిం పండితులు మధ్య ఆసియా మరియు భారతదేశంలో సురక్షితమైన ఆశ్రయం పొందారు.

డిల్లి సుల్తానేట్ కాలంలో (1203-1206), మదర్సాలు మతపరమైన-కమ్-న్యాయపరమైన అధికారులు, అధికారులు మరియు పండితులను తయారు చేసినవి. జౌన్‌పూర్, అహ్మదాబాద్, బీహార్ షరీఫ్, గుల్బర్గా, బీదర్, మాండ్, దౌలతాబాద్ మరియు బెంగాల్‌లలో మదర్సాలను స్థాపించారు. ఈ సంస్థలన్నీ హేతుబద్ధమైన పాఠ్యాంశాల ఆధారంగా విద్యా నమూనాను అభివృద్ధి చేశాయి.

మదరసాలు తర్కం, గణితం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, కవిత్వం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, న్యాయ శాస్త్రం (ఫిఖ్) మరియు ఇస్లామిక్ చట్టం వంటి అంశాలను బోధించాయి. కొన్ని మదర్సాలు కళలలో తరగతులను కూడా నిర్వహించాయి.

మదర్సాలలో విద్యార్థులకు ఉచిత వసతి మరియు ఆహారం అందించేవారు. ధనవంతులైన విద్యార్థులు మాత్రమే ట్యూషన్ ఫీజులు చెల్లించారు మరియు పేద విద్యార్థులు సేకరించిన విరాళాలు నుండి ఆర్థిక సహాయం పొందారు. ఈ మదర్సాలు భారతీయులు గణితం, సైన్స్, వైద్యం, సంస్కృతి మరియు ఆర్థిక శాస్త్రాలలో అభివృద్ధి చెందడానికి సహాయపడ్డాయి.

బ్రిటిష్ పాలనలో, స్థానిక భాష మరియు మదర్సా విద్య ఉనికికి ముప్పు ఏర్పడినది.  1983లో, ఈస్ట్ ఇండియా కంపెనీ, తన నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో పర్షియన్ స్థానంలో ఇంగ్లీషును అధికారిక ఉత్తర ప్రత్యుత్తర భాషగా మార్చింది. ఖాజీలు మరియు ఉలేమా స్థానంలో బ్రిటిష్ చట్టంలో శిక్షణ పొందిన న్యాయమూర్తులు వచ్చారు.

మదర్సాలు క్రమంగా వాటి ఔచిత్యాన్ని కోల్పోయాయి. మదర్సాల ఆధునీకరణలో మొదటి ప్రధాన అడుగు మదర్సత్ ఉల్-ఉలుమ్ ముసల్మానన్-ఎ-హింద్ లేదా మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల, దీనిని 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు - సర్ సయ్యద్ ప్రముఖ భారతీయ ముస్లిo విద్యా సంస్కర్త. మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల 1920లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా వికసించింది మరియు ముస్లింలలో ఆధునిక, శాస్త్రీయ మరియు ఆంగ్ల-మాధ్యమ విద్యను ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజాన్ని మరియు మదరసాలను అనేక విధాలుగా సంస్కరించడంలో కూడా సహాయపడింది.

ఒక సర్వేలో తరచుగా మదరసా పేద కుటుంబాలకు ఏకైక ఎంపిక అని, మరియు అది ఉర్దూ, అరబిక్ మరియు ఖురాన్ కంఠస్థం (హిఫ్జ్) కలిగిన పాత పాఠ్యాంశాలను కలిగి ఉందని, సైన్స్, గణితం, ఇంగ్లీష్ మొదలైన వాటికి పరిమితమైన అవగాహనను ఇస్తుందని తేలింది.

 2006 నాటికి, ప్రాథమిక పాఠశాల పిల్లలలో కేవలం 9.39% మంది మాత్రమే మదరసాలకు హాజరయ్యారు, వీరిలో 90% కంటే ఎక్కువ మంది తక్కువ ఆదాయ కుటుంబాల నుండి వచ్చారు.

1986లో, భారతదేశం సైన్స్, గణితం మరియు భాషలను సాంప్రదాయ పాఠ్యాంశాల్లోకి చేర్చడానికి మదరసా ఆధునీకరణ పథకాన్ని ప్రారంభించింది.

1993లో, భారత ప్రభుత్వం మదరసాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని గుర్తించింది

2009 తర్వాత, కేంద్ర ప్రభుత్వం మదరసా పథకాల ఆధునీకరణ (MOMS) మరియు మదరసాలలో నాణ్యమైన విద్యను అందించే పథకం (SPQEM) వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది,

జమియాతూర్ రజా బరేలీ, అల్-జామియాతుల్ అష్రఫియా (అజంగఢ్), మరియు నద్వతుల్ ఉలామా (లక్నో) వంటి ప్రముఖ సంస్థలు ఆధునిక విద్యా విభాగాలతో మత విద్యను అనుసంధానించాయి.

శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మరియు నవీకరించబడిన బోధన అందుబాటులో ఉంటే తప్ప ఆధునిక విషయాలను జోడించడం మాత్రమే సరిపోదని నిపుణులు అంటున్నారు. సంప్రదాయాన్ని ఆవిష్కరణతో సమతుల్యం చేయడం ప్రభుత్వాలు, మదర్సా బోర్డులు మరియు పౌర సమాజం మధ్య సహకారాన్ని కోరుతుంది.

భారతదేశ మదర్సాల ఆధునీకరణకు విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు మరియు స్థానిక సమాజాల మధ్య సహకారం అవసరం. మదర్సాలు అట్టడుగున ఉన్న ముస్లింలకు సాధికారత కల్పించే సమగ్ర సంస్థలుగా అభివృద్ధి చెందవలయును..

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో 24,010 మదర్సాలు ఉన్నాయి, వాటిలో 4,878, 2018-19లో గుర్తింపు పొందలేదు. మదరసాలలో ఎన్రోల్ ఐనవారిలో 7-19 సంవత్సరాల వయస్సు గల ముస్లిం పిల్లలు 4% లేదా అంతకంటే తక్కువ మంది ఉన్నారు.

జాతీయ విద్యా విధానం 2020 సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం విద్యను సరళీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. అటువంటి విధాన రూపకల్పనలో మదర్సాలు ప్రధానమైనవి.

21వ శతాబ్దంలో, చాలా మదర్సా పాఠశాలలు శాస్త్రీయ పాఠ్యాంశాలను స్వీకరించాయి. సింగపూర్‌లోని మదర్సాలు టాబ్లెట్‌లు మరియు కృత్రిమ మేధస్సులో కోర్సులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను చేర్చాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ మదర్సాలు కూడా ముందుకు సాగాలి.

No comments:

Post a Comment