25 February 2014

వచ్చే2014 లోక్ సభ ఎన్నికలలో 10 %మంది కొత్త వోటర్లు


2014 లోక్ సభ ఎన్నికలలో మొత్తం 81.5 కోట్ల మంది వోటర్లు పాల్గొబోతున్నారు.వీరిలో పురుషులు 52.4% కాగా స్త్రీలు 47.6%  గా ఉన్నారు. 2009లో లోక్ సభ వోటర్ల సంఖ్య 71.4 కోట్లు గా ఉంది.  2009 లోక్ సభ ఎన్నికల కన్నా ఇప్పుడు అనగా 2014 లో  దాదాపు  10కోట్ల మంది అధికంగా,  అనగా మొత్తం వోటర్లలో 13.5% మంది అధికం గా వోటర్లుగా నమోదు అయినారు. ఇటివల ఎలెక్షన్ కమిషన్ ప్రకటించిన సవరించిన ఎన్నికల జాబితా ప్రకారం 2014 లో జరిగే లోక్ సభ  ఎన్నికలలో ఇంతవరుకు జరిగిన అన్నీ ఎన్నికలలో కన్నా అధికంగా 10% మంది కొత్త వోటర్లు అనగా మెదటిసారి ఎన్నికలలో వోటు చేసేవారు దాదాపు  3.91కోట్ల మంది  అదనంగా పాల్గొబోతున్నారు. ఇది ఒక రికార్డ్. 60సంవత్సరాల క్రితం మొదటిసారి జరిగిన ఎన్నికలలో కన్నా దాదాపు ఏదు రేట్ల మందిఅధికంగా ఈ సారి 2014 లో జరిగే ఎన్నికలలో వోటు వేస్తున్నారు. దేశ జనాభా లెక్కల ప్రకారం2014 లో  దేశ జనాభాలో 18 సంవత్సరాలకన్నా అధికం గా ఉన్న వారు 83.3 కోట్ల మండి ఉన్నారు. వీరిలో 98% మంది ఈ సారి జరిగి ఎన్నికలలో వోటు వేయుటకు నమోదు అయినారు.
   
మొదట సారి ఓటు చేసేవారిలో 18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన  2.3 కోట్ల మంది కొత్తగా   వోటర్లుగా నమోదు చేయించుకొన్నారు..   ఈ రికార్డును సమీప భవిషత్తు లో దాటే సూచనలు లేవు, ఎందుకనగా దేశ ఉత్తర ప్రాంతంలో కన్నా, దేశ దక్షిణ ప్రాంతం లో జననాల రేటు తగ్గుతుంది. వచ్చే ఎన్నికలలో 18-19 సవత్సరాల మద్యవయస్సు కలిగి , కొత్తగా వోటు నమోదు చేసుకొన్నావారిలో  96 లక్షల మండి  స్త్రీ వోటర్లు కాగా మొత్తం కొత్త వోటర్లలో  వారి శాతం 41% గా ఉంది. అదే పురుషులులలో కొత్తగా వోటు నమోదు చేసుకొన్నవారు 1.4 కోట్ల మంది ఉన్నారు

ఎలెక్షన్ కమిషన్ డాటా ప్రకారం 18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగి,వోటర్లుగా నమోదు చేసుకొన్న వారి సంఖ్య జార్ఖండ్ లో అధికంగా అనగా మొత్తం వోటర్లలో9% అధికంగా నమోదు అయినది. చత్తిస్గధ్ లో 4.9%,రాజస్తాన్ లో 4.8%,ఉండగా హిమాచల్ ప్రదేశ్ లో 1.3%.మహారాస్త్ర లో 1.4%, కేరళ మరియు కర్ణాటకా లో 1.8% గా ఉంది.

నాగాలాండ్ లో 18-19 సంవత్సరాల వయస్సు ఉండి కొత్తగా వోటు నమోదు చేసుకొన్న వారిలో స్త్రీ లు ఆదికముగా 50.4% ఉన్నారు. ఆతరువాత మిజోరాం, మణిపుర్ లలో 49.9% అధికంగా ఉన్నారు.. అదే విధంగా హర్యానాలో 28.3% గాను,మహారాష్ట్రా లో 35.5% గాను పంజాబ్,చండీగఢ్,గుజరాత్ లలో 36.2% గాను కొత్తగా వోటు నమోదు చేసుకొన్నవారిలో స్త్రీలు ఉన్నారు. యూ.పి. లో 18-19 సంవత్సరాల మద్య వయసు ఉన్నవారు 30.81లక్ష మంది ఉన్నారు వీరిలో పురుషులు 60.4% కాగా స్త్రీలు 39.6% గా ఉన్నారు.  దేశ వ్యాప్తం గా ఉన్న  మొత్తం వోటు చేసే వారి సంఖ్యలో  18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన వారి శాతం కేవలం 2.8% మాత్రమే ఉంది.
 
80 స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో కొత్తగా నమోదు చేసుకొన్న1.8 కోట్ల మంది వోటర్లతో సహా మొత్తం 13.44 కోట్ల మంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 16% శాతం కలిగి ఉంది.  మహారాస్ట్రా లో 7.9 కోట్లమంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 9.69%శాతం  కలిగి ఉంది, పశ్చిమ బెంగాల్ లో 6.25 కోట్ల మంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 7.69%శాతం ,ఆంధ్ర ప్రదేశ్ లో 6.24 కోట్ల మంది అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 7.65%శాతం ను , బిహార్లో 6.21 కోట్ల మంది, అనగా దేశం లోని మొత్తం వోటర్లలో 7.62%శాతం ను  కలిగి ఉంది.  డిల్లీ లో 1.21 కోట్ల మంది మొత్తం వోటర్లు గా నమోదు అయినారు.

లోక్ సభ లోని మొత్తం545 స్థానాలలో, 120 స్థానాలకు ప్రతినిద్యం వహించే యూ.పి.,బిహార్ దేశం లోని మొత్తం వోటర్లలో25% వోటర్లను కలిగి ఉన్నారు.  యూ.పి.,మహారాష్ట్రా,పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు దేశం లోనే అత్యధిక వోటర్లను కలిగిన పెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయి. 3.62లక్షల వొట్ల తో లేదా మొత్తం దేశం లోని వోటర్లులలో 0.044% శాతం తో సిక్కిం అత్యంత తక్కువ వోటర్లను కలిగి ఉంది. గుజరాత్ లో 4 కోట్ల మంది లేదా దేశం మొత్తం వోటర్లలో 4.89% మంది వోటర్లు ఉన్నారు.
భారత దేశం లోని 28 రాష్ట్రాలలో, దేశం లోని మొత్తం వోటర్లలో 98,27%, డిల్లీ లో 1.48%, మిగతా 6 రాష్ట్రాలలో 0.253% వోటర్లు నమోదు అయినారు.  యూ.పి. లో 15.5% మంది, ఉత్తరా ఖండ్ లో 15.3% మంది, రాజస్తాన్ లో 14.2%,బిహార్ లో 13.9%,ఛత్తీస్ ఘడ్ లో 13%, పుంజాబ్ లో 11.8%, మేఘాలయాలో 21%, పందుచ్చేరి లో 15.8%, త్రిపురాలో 14.4% చండీగడ్ లో 11.5%, దాద్రా-నాగర్ హవేలి లో 25%, తమిళ్ నాడులో 29.3% మండి, హర్యానా లో 28% మండి, మద్య ప్రదేశ్ లో 25% మంది,వెస్ట్ బెంగాల్ లో 19% కొత్తగా వోటర్లుగా నమోదు చేసుకొన్నారు.
గత 20 సంవత్సరాలలో వోటు నమోదు చేసుకొన్న వారి సంఖ్య దేశవ్యాప్తం గా  64%పెరిగింది. దేశ జనాభా 43% పెరిగింది.గత  20సంవత్సరాలలో డిల్లీ వోటర్లు రెండింతలు కాగా,యూ.పి. లో 70%,మద్య ప్రదేశ్ ,బిహార్ లలో25% వోటర్లు పెరిగినారు. కేవలం గత 10సంవత్సరాలలో వెస్ట్ బెంగాల్ లో వోటర్లు 30% పెరిగినారు. 
దేశం లోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం 0.0035% “ఇతర” ఓటర్లు ఉన్నారు. “ఇతర” వోటర్లు అధికం గా కర్ణాటకలో2589 మంది,   ఆతరువాత ఉత్తర ప్రదేశేష్ లో అధికం గా ఉన్నారు.
భారత దేశం లో క్రమం గా స్త్రీ వోటర్ల సంఖ్య పెరుగు తుంది. వోటు నమోదు, వోటు హక్కు వినియోగం స్త్రీలలో పెరుగు తుంది. 2014 లోక్ సభ ఎన్నికలకు గాను 8రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో స్త్రీ వోటర్లు,పురుష వోటర్ల కన్న అధికం గా ఉన్నారు. డిల్లీ లో దేశం లో కల్లా అతి తక్కువుగా స్త్రీవోటర్లు 44.57% గా ఉన్నారు, ఆ తరువాత యూ.పి. లో 45.2% స్త్రీ వోటర్లు ఉన్నారు.అత్యధికంగా పాందుచ్చేరి లో స్త్రీ వోటర్లు 52%,కేరళలో 51.9% ఉన్నారు.

మొన్న జరిగిన డిల్లీ ఎన్నికలలో ప్రతి వెయ్యి మంది పురుష వోటర్లకు 804 మండి స్త్రీ వోటర్లు నమోదు అయినారు. అదేవిధం గా మొన్న జరిగిన 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో 3 రాష్ట్రాలలో అధికం గా స్త్రీ వోటర్లు తమ వోటు వినియోగించుకొన్నారు. 2రాష్ట్రాలలో స్త్రీ పురుష వోటర్ల మద్య వోటు వినియోగం లో తేడా బాగా తగ్గింది. 1962 నుంచి 2012 వరకు జరిగిన 16 పెద్ద రాష్ట్రాల ఎన్నికలలో మొత్తం మీద ప్రతి వెయ్యి మండి పురుష వోటర్లకు 883 వరకు స్త్రీవోటర్లు వోటు హక్కు వినియోగింఛు కొన్నారు.  

 



No comments:

Post a Comment