9 March 2014

2014 లో జరిగే 16వ లోక్ సభ ఎన్నికలు –కొన్ని విశేషాలు



·       2014 లోక్ సభ ఎన్నికలలో 81.46 కోట్ల మంది వోటర్లు పాల్గొబోతున్నారు. (ఈ సంఖ్య 2009 ఎన్నికల లోని వోటర్ల సంఖ్య కన్నా 10 కోట్లు ఎక్కువ) ఈ సంఖ్య మొత్తం యూరప్ ఖండం లో ని జనాభా కన్నా ఎక్కువ.

·       పురుషులు 42.67 కోట్ల మండి, స్త్రీలు 38.79 కోట్ల మంది ఇతరులు 28,314 మంది,11844 మంది ఎన్‌ఆర్‌ఐ లు  వోటర్లుగా నమోదు అయినారు.

·       మొత్తం వోటర్లలో 18-19 సంవత్సరాల మద్య వయస్సు కలిగిన వారు 2.3 కోట్ల మంది.
·       543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగును.

·       దేశ వ్యాప్తం గా 131 లోక్ సభ స్థానాలను ఎస్‌సి/ఎస్‌టి ల కోసం రిజర్వే చేయడం జరిగింది.
·       ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సబ్యులను రాష్ట్ర పతి లోక్ సభ కు నామినెట్ చేయును.
·       కొత్త లోక్ సభ జూన్1న ఏర్పడ వచ్చును.

·       మంత్రి వర్గం ఏర్పర్చడానికి కనీసం 272 సబ్యుల మద్దత్తు అవసరం
·       యూ‌పి,బిహార్,ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మొదలగు 5 రాష్ట్రాలలో మొత్తం వోటర్లలో సగం మంది ఉన్నారు.

·       ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు అనగా మొత్తం 73 రోజుల వ్యవధిలో 9 దఫాలుగా  ఎన్నికలు జరుగును (2009 లో 75 రోజుల వ్యవధి లో 5 ధఫాలుగా  ఎన్నికలు జరిగినాయి.)

·       ఎన్నికల కౌంటింగ్ మరియు ఫలితములను మే 16 న ప్రకటిస్తారు
.
·       7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగును.

·       ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా,సిక్కిం లలో లోక్ సభ ఎన్నికల తో పాటు రాష్ట్ర శాసన సభ ఎన్నికలు కూడా  జరుగును.
·       ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ధఫాలు గా ఏప్రిల్ 30న తెలంగాణా ప్రాంతంలోనూ,మే 7నా సీమాంద్ర ప్రాంతం లోనూ, ఒరిస్సా లో ఏప్రిల్ 10,మరియు 17న, సిక్కిం లో ఏప్రిల్ 12న లోక్ సభ/రాష్ట్ర శాసన సభ ఎన్నికలు నిర్వహించ బడును
.
·       దేశవ్యాప్తం గా 9,30,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడినవి.
·       96% వోటర్లకు ఫోటో ఐడెంటిటీ కార్డు లు ఇవ్వబడినవి.
·       ఎన్నికలలో EVM లు అనగా ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ఉపయోగించడం జరుగుతుంది.
·       దాదాపు 1కోటి 10 లక్షల మంది ఎన్నికల అధికారులు ఎన్నికలను నిర్వహిస్తారు.

·       మొదటి ధఫా వోటింగ్ ఏప్రిల్ 7న, 2రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 6 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       రెండోవ ధఫా వోటింగ్ ఏప్రిల్ 9న, 5 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 7 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       మూడోవ ధఫా వోటింగ్ ఏప్రిల్ 10న, 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 92 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       నాల్గోవ  ధఫా వోటింగ్ ఏప్రిల్ 12న, 3 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 5 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       అయిదోవ ధఫా వోటింగ్ ఏప్రిల్ 17న, 13రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 122 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       ఆరోవ  ధఫా వోటింగ్ ఏప్రిల్ 24న, 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 117 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       ఎడోవ  ధఫా వోటింగ్ ఏప్రిల్ 30న, 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 89 పార్లమెంటరీ స్థానాలకు జరుగును.
·       ఎనిమిదో   ధఫా వోటింగ్ మే 7న, 7 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 64 పార్లమెంటరీ స్థానాలకు జరుగును
·       తొమ్మిదో   ధఫా వోటింగ్ మే12న, 3రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో 41 పార్లమెంటరీ స్థానాలకు జరుగును
·       మొత్తం పార్లమెంటరీ స్థానాలు 543. ప్రస్తుత ప్రభుత్వ పని కాలం మే 31న ముగియును.
·       డిల్లీ, కేరళ లో ఏప్రిల్ 10న,తమిళనాడులో ఏప్రిల్ 24న,కర్ణాటక లో ఏప్రిల్ 17న, ఒక రోజు పోలింగ్ జరుగును. మొత్తం 21రాష్ట్రాలలోనూ, పుదుచ్చేరి  కేంద్రపాలిత ప్రాంతo లోను ఒక రోజు పోలింగ్ నిర్వహించ బడును.  
·       ఆంధ్ర ప్రదేశ్ ,మణిపుర్,ఒరిస్సా,రాజస్తాన్,త్రిపురాలలో రెండు రోజులు పోలింగ్ నిర్వహించ బాదును.

·       బిహార్,ఉత్తర్ ప్రదేశ్ లలో పోలింగ్ 6 రోజులు జరుగును.
·       జమ్ము-కాశ్మీర్,పశ్చిమ బెంగాల్ లో 5 రోజులు పోలింగ్ జరుగును.
·       జార్ఖండ్,ఛత్తీస్ గడ్,అస్సామ్,మద్య ప్రదేశ్, మహారాష్ట్రాలో 3 రోజులు పోలింగ్ జరుగును.

·       ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అనగా ఎన్నికల ప్రకటన వెలుబడిన రోజు నుంచి 5-3-14 నుంచి అమలు లోనికి వచ్చినది.
·       మొదటిసారిగా  వోటర్లకు NOTA (none of the above)ఆప్షన్ ఇవ్వబడినది.(NOTA ఆప్షన్ మొదటిసారిగా డిల్లీ వోటర్లకు  మొన్న జరిగిన అసెంబ్లి ఎన్నికలలో ఇవ్వబడినది)
·       మార్చ్ 9న బూత్ వారి వోటర్ల లిస్ట్ ను పరిశీలించవచ్చును మరియు కొత్తగా వోటర్లుగా చేరుటకు దరఖాస్తు చేయవచ్చును.దీనికోసం ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాంపులను నిర్వహించును.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు

·       ఆంధ్ర ప్రదేశ్, లో లోక్ సభ ఎన్నికల తో పాటు రాష్ట్ర శాసన సభ ఎన్నికలు కూడా  జరుగును.

·       తెలంగాణా ప్రాంతం లో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 2న,ఆంధ్ర ప్రాంతం లో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న వెలుబడును.
·       నామినేషన్లు స్వీకరణకు తెలంగాణాలో ఏప్రిల్ 9, ఆంధ్ర ప్రాంతం లో ఏప్రిల్ 19 చివరి తేదీ గా ప్రకటించడమైనది.
·       నామినేషన్ల ఉపసంహరణకు తెలంగాణాలో ఏప్రిల్ 12, ఆంధ్ర ప్రాంతం లో ఏప్రిల్ 23 చివరి తేదిగా
నిర్ణయించడమైనది. 
·       ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ధఫాలు గా ఏప్రిల్ 30న తెలంగాణా ప్రాంతంలోనూ,మే 7నా సీమాంద్ర ప్రాంతం లో మొత్తం 42లోక్ సభ స్థానాలకు, 294 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించ బడును.

·       ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 6.24 కోట్లమంధి వోటర్లు ఎన్నికలలో తమ వోటు హక్కును వినియోగించు కొందురు.(2009 ఎన్నికలలో 5.78 కోట్ల మంది వోటర్లు గా నమోదు అయినారు)
·        తెలంగాణ ప్రాంతం లో 17 లోక్ సభ స్థానాలు, 119 అసెంబ్లి స్థానాలు కలవు. సీమాంద్ర ప్రాంతం లో 25 లోక్ సభ స్థానాలు 175 అసెంబ్లి స్థానాలు కలవు.
·       69,014 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరిగింది.
·       మే 16 న ఎన్నికల కౌంటింగ్ ప్రారంబించబడును.

·       ప్రస్తుత అసెంబ్లి పదవి కాలం జూన్ 2 తో ముగియును.
·       ఆంధ్ర ప్రదేశ్ 2 కొత్త రాష్ట్రాలుగా అనగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గా జూన్ 2న ఆవిర్భవించును.(appointed day)
·       ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర పతి పాలన కలదు, రాష్ట్ర అసెంబ్లి శుప్తచేతనావస్థ (suspended animation) లో కలదు.
·       ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే అనగా 5-3-14 నుంచి అమలులోనికి వచ్చును.  


No comments:

Post a Comment