6 November 2015

ప్రసిద్దికెక్కిన 10 మంది భారత స్వాతంత్ర సమర వీర వనితలు



 "భారతీయ మహిళలకు  మరింత రక్షణ అవసరం". మన సోదరిమణులకు  సొంత స్వదేశీయుల నుండి రక్షణ కావాలి. ఇది స్వతంత్ర భారతదేశం కు అవమానకరం. ఇది ఈ నాటి నినాదం! మనం బ్రిటిష్ వారి నిరంకుశ ఆధిపత్యం నుండి స్వేచ్ఛ పొందుటకు మన సోదరిమణులు ఎ విధంగా వారి సొంత జీవితం బలి ఇచ్చారో మర్చిపోతే ఎలా ?  వారు మన  భవిష్యత్తు మెరుగ్గా ఉండుటకు వారు  పురుషులు తో భుజం భుజం కలిపి  పోరాడారు. ఇప్పుడు దానికి బదులుగా స్త్రీని  అత్యంత నీచంగా చూపుతూ , మన తోటి పౌరులు వారిని వివిధ రకాలుగా దోపిడి చేయటానికి  ప్రయత్నిస్తున్నారు. ఒక మహిళ ప్రపంచానికి మనలను  తీసుకు రాకపోతే మనం ఎప్పుడూ ఈ అందమైన ప్రపంచంను  చూసే వారం కాదు.  స్త్రీ పట్ల గౌరవం ఒక దేశం ప్రతిష్టను పెంచుతుంది మరియు దేశాన్ని సుసంపన్నం చేస్తుంది.
ఆ త్యాగమూర్తులను తలoచుకొంటు  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన కొందరు  మహిళా స్వాతంత్ర్య సమర వీర వనితలను  గురించి అధ్యయనం చేద్దాం.
10) )సుచేతా కృపలానీ:
సుచేత కృపలానీ అంబాలా లో జన్మించిన అసాధారణ తెలివైన బెంగాలీ మహిళ. ఆమె మన  దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని రావడం కోసం  మహాత్మా మహాత్మా గాంధీ కలసి పని చేసారు. శ్రిమతి  సుచేతా కృపలానీ క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో దేశానికి ఎనలేని సేవ  చేశారు.  ఆమె ప్రతిభ కారణం గా ఆమెను యుపి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రతిష్టాత్మక స్థానం అప్పజెప్పినారు. ఆమె   ఉత్తరప్రదేశ్ తోలి మహిళ ముఖ్య మంత్రియే కాదు  భారతదేశం లో  రాష్ట్ర  ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి మహిళ. ఆమె సొంత ఆరోగ్యo మరియు కుటుంబo విడిచిపెట్టి దురాగతాల బాధితుల తల్లి గా మరియు ఇతరులకు  సహాయం చేసేవారిగా పేరు తెచుకొన్నారు.
9) )ఇందిరా మహాత్మా గాంధీ:-

ఇందిరా మహాత్మా గాంధీ, భారతదేశం యొక్క చరిత్రలో అత్యంత ప్రధాన  గుర్తింపును పొందిన భారతీయ మహిళ. ఆమె చాలా చిన్న వయస్సు నుండి ఆమె భారత జాతీయ ఉద్యమo  లో చురుకుగా పాల్గొన్నారు. ఆమె  1930 లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి  పిల్లలకు  శిక్షణఇచ్చి  వానర సేన” బ్రిగేడ్ స్థాపించింది.  ఆమె అపారమైన మేధస్సు మరియు సహనశక్తి కారణం గా  ఆమె భారతదేశం యొక్క ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యారు. దేశం యొక్క ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధి లో ఆమె ఇచ్చిన తోడ్పాటు అద్భుతమైనదిగా  ఉంది. ఆమె కమ్యూనిజం మరియు మతపరమైన సనాతనవాదం కు వ్యతిరేకి. రాజకీయాలు మరియు పోరాట రంగంలో, ఇందిరా మహాత్మా గాంధీ యొక్క పేరు భారత దేశ చరిత్ర ప్రతి పేజీలో బంగారు  అక్షరాల తో వ్రాయబడి ఉంటుంది.
8) )విజయలక్ష్మి  పండిట్:

 
విజయలక్ష్మి  పండిట్, దేశం మరియు స్వదేశీయుల కోసం నవ్వుతూ మరియు నిస్సంకోచంగా  అనేక సార్లు కారాగారవాసం అనుభవించిన  గొప్ప మహిళ. ఆమె జవహర్ లాల్ నెహ్రూ సోదరి మరియు దేశభక్తి ఆమె రక్తoలో ఉంది.  ఆమె క్విట్-ఇండియా మరియు సహాయనిరాకర ఉద్యమం పాల్గొన్నారు. ఆమె ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మొట్టమొదటి మహిళా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆమె కుల తత్వం,  సనాతన సంప్రదాయాలు నిషేధించేందుకు ప్రయత్నించారు  మరియు దేశంలో స్త్రీ సాధికారత తీసుకొచ్చేoదుకు గట్టిగా  ప్రయత్నించిన  ఒక డైనమిక్ వ్యక్తి.
7) )కమలా నెహ్రూ:
 
.
"ఢిల్లీ బ్యూటీ” గా పేరుగాంచిన కమలా నెహ్రూ, ప్రధాన లక్ష్యం సమాజంలో స్త్రీ కి ఉన్నత స్థానం కల్పించడం  మరియు  దేశంలో శాంతిని స్థాపించడం. అత్యంత దేశభక్తి, నిజాయితీ గల మహిళ. ఆమె తన ఉత్తమ రోజులను  జైలులో  గడిపారు అది ఆమెకు  మాతృభూమి పట్ల  గల  ఆప్యాయతను నిరూపిస్తుంది. ఆమె స్వదేశీ ఉద్యమం సమర్ధించి దిగుమతి వస్తువులను   భోగి మంటల పాలు  చేసింది. ఆమె యువ మహిళల సమూహం తో సారాయి విక్రయించే మరియు విదేశీ వస్తువుల దుకాణాల ముందు పికటింగ్ చేసింది.ఆమె  మహాత్మా మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాల చేత ప్రేరణ పొంది  మరియు శ్రీమతి కస్తూర్బా తో కలసి గాంధీజీ ఆశ్రమం లో  గడిపారు
6) )కస్తూర్బా మహాత్మా గాంధీ :
మీకు  ప్రసిద్ధ మహిళల సత్యాగ్రహ ఉద్యమం గుర్తు లేదా? ఆప్యాయంగా” బా “అని పిలిచే  కస్తూర్బా మహాత్మా గాంధీ యే, ఈ ప్రసిద్ధ ఉద్యమ నాయకురాలు.  ఆమె మహాత్మా మహాత్మా గాంధీ యొక్క భార్య మరియు ఆమె భర్త ప్రతి అడుగు లో  మద్దతు ఇచ్చేది. చంపారన్ ఉద్యమం నుండి క్విట్-ఇండియా  ఉద్యమం వరకు  కస్తూర్బా మహాత్మా గాంధీ తన భర్త తో భుజం భుజం కలిపి పోరాడింది. ఆమె మహిళల విద్యావిధానంలో వృద్ధి మరియు  వర్గ తేడాలు నిషేధించేందుకు ప్రయత్నించారు మరియు పిల్లలకు పరిశుభ్రత, క్రమశిక్షణ బోధించాడు. ఆమె అనేక  సార్లు ఖైదు కు  గురికావలసి వచ్చింది కానీ ఆమె నిర్భయముగా ధైర్యం గా  బయటపడ్డారు. కస్తూర్బా మహాత్మా గాంధీ నిజమైన దేశభక్తి కల మహిళ  జైలులో ఆమె భర్త కౌగిలిలో మరణించారు


5) )అరుణ అసఫ్ ఆలీ 
:

మహిళ విద్య  ప్రబలంగా సమాజంలో లేని  సమయం లో , అరుణ అసఫ్ ఆలీ ఒక గ్రాడ్యుయేట్ మరియు కలకత్తాలో ఒక ఉపాధ్యాయురాలు. అసఫ్ ఆలీ తో వివాహం తరువాత , ఆమె కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యులు  అయ్యారు మరియు అనేక ఉద్యమాలకు మరియు నిరసనలకు నాయకత్వం వహిoచినారు.. ఆమె అనేక సార్లు ఖైది కాబడ్డారు కానీ ఆమె తన మానసిక ధైర్యం కోల్పోలేదు.. ఆమె తీహార్ జైలులో నిరాహారదీక్ష నిర్వహించారు మరియు ఆ నిరాహార దీక్ష వృతాంతం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విశేషమైన ఖ్యాతి పొందింది. ఆమె క్విట్ ఇండియా  ఉద్యమం సమయంలో అజ్ఞాతం లో ఉన్నారు. తన ధైర్యం మరియు వీరోచిత కార్యక్రమాలకోసం అరుణ అసఫ్ ఆలీ భారతరత్నఅవార్డు పొందారు. ఆమెను గ్రాండ్ ఓల్డ్ లేడీ అఫ్ ఇండియా అని పిలిచెదరు..
(4) బేగం హజరత్ మహల్:-

ఆమె  అత్యంత అందమైన బేగం అవద్. ఆమె భర్త లేకపోవడంతో మొత్తం అవద్  ప్రాంతం పరిపాలన బాధ్యతలు స్వీకరించారు మరియు బ్రిటిష్ వారి చేతి నుండి స్వేచ్ఛ పొందారు. అది నమ్మదగని విషయం గా ఉందా?   అవును ఇటువంటి విశిష్ట వ్యక్తిత్వాలు  ఆ కాలంలో కూడా ఉనికిలో ఉన్నాయి.  బేగం హజ్రత్ మహల్ కూడా తన  మొదటి ప్రయత్నం లో విదేశీయుల నుండి  లక్నో రక్షించారు  కానీ చివరికి ఆమె బ్రిటిష్ వారు లక్నో తిరిగి స్వాధీనపరచుకొన్నప్పుడు నేపాల్ లో ఆశ్రయం పొందారు. హోదా మరియు డబ్బు మరియు అనేక ఇతర మార్గాలు ద్వారా బేగం ను కోనేoదుకు బ్రిటిష్ వారు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నం ఆమె గౌరవం మరియు దేశభక్తి ముందు విఫలమైంది. భారత ప్రభుత్వం ఆమె ధైర్యo, ఆత్మ గౌరవంను గౌరవిస్తూ  ఒక స్మారక స్టాంపును జారీ చేసింది.
(3) మేడం భికాజీ కామా:-


మనం  మన  భారతదేశం యొక్క జండా ను చూసి గర్వ పడతాము. అవును మనం  ఖచ్చితంగా గర్వ పడతాము. భారతదేశం కోసం మూడు రంగుల జండా రూపకల్పన చేసిన గ్రేట్ మేడమ్ కామా కు మనం రుణపడి ఉన్నాము. ఇది అద్భుతమైన విషయం కదా!  భారతదేశం యొక్క జండా ఒక విదేశీ దేశంలో ఎగర వేసిన మొదటి మహిళ మేడమ్ కామా. మనం ఇలాంటి  ప్రదర్శన  ఒక మహిళ నుండి  ఊహించగలమా ? చక్కదనం మరియు దేశభక్తి ఆమెను  సొంత దేశం కోసం పోరాడటానికి  ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి ప్రోత్సహించినది. ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం కు  వందనం.

(2) సరోజినీ నాయుడు 
: -
చక్కటి  ప్రసంగ నైపుణ్యం మరియు నిర్భయమైన వైఖరి, సరోజినీ నాయుడు కు నాయకత్వ  హోదా ఇచ్చినవి. ఆమె శాసనోల్లంఘన ఉద్యమంలో ఒక శక్తివంతమైన వ్యక్తి. మహాత్మా మహాత్మా గాంధీ తో అనేక సార్లు పోరాడింది. ఆమె సగర్వంగా జైలు శిక్ష అంగీకరించారు మరియు ఈ దేశం లోని  మహిళల్లో విద్య మరియు హిందూ -ముస్లిం సమానత్వంఅ కొరకు పోరాడింది. ఆమె ప్రసిద్ధ విజయాలు సత్యాగ్రహ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం.రౌలట్  చట్టం మరియు మాంటేగ్ చెల్మ్స్ఫోర్డ్ సంస్కరణలు  ఆమె కు ప్రపంచవ్యాప్తంగా కీర్తి మరియు గౌరవాన్నితెచ్చినాయి. ఆమె బ్రిటిష్ వాసుల దాడులకు  భయభ్రాంతులకు గురిఅవలేదు. ఆమె తన మాతృభూమి  కోసం జీవితాంతం పాటుపడినది.

(1)రాణి లక్ష్మీ బాయి:


ధైర్యం, సాహసం అను పదాలు గుర్తుకు వచ్చినప్పుడు మనకు వెంటనే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు వస్తుంది. వారసత్వ లోప  సిద్ధాంతం (Doctrine of Lapse) కారణంగా, ఝాన్సీ రాణి ఆమె సొంత ప్రాంతం యొక్క వారసత్వాన్ని పోగొట్టుకొంది మరియు ఝాన్సీ రాజ్యం ను బ్రిటీష్ వారు  స్వాధీనం చేసుకొన్నారు. ఈ యువ యువరాణి ఆగ్రహిoఛి విదేశీయులకు  వ్యతిరేకంగా తన దళములతో  తిరుగుబాటు నిర్వహించారు. ఆమె చివరి శ్వాస వరకు శత్రువు తో  పోరాడారు మరియు ఒక వీర వనిత లాగా మరణించారు. ఆమె చేసిన సాహసానికి  శత్రువుల మన్ననలను కుడా పొందినది. అవును, రాణి లక్ష్మీ బాయి విషయంలో బ్రిటిష్ వారు కూడా ఆమె ధైర్య,సాహసాలను  మెచ్చుకున్నారు.

Top of Form

No comments:

Post a Comment