భారతదేశం యొక్క అన్ని వర్గాల
పురుషులు మరియు మహిళలు చేసిన త్యాగాలు మరియు
సుదీర్ఘ పోరాట ఫలితమే మనం 15 వ ఆగస్టు 1947 న సాధించిన స్వేచ్ఛమరియు స్వాతంత్య్రం. భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్, సుభాష్ చంద్ర
బోస్ మరియు మహాత్మా మహాత్మా గాంధీ వంటి స్వాతంత్ర్య సమర సమరయోదులు నిర్వహించిన
పాత్రకు సరిఅయిన గుర్తింపురాగా, భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం ఉలేమా
పాత్ర (ముస్లిం మతం గురువులు/పండితులు) ఎక్కువగా విస్మరిoచబడినది.
1857 తిరుగుబాటు (భారతదేశం మొదటి స్వాతంత్ర్యం యుద్ధo) విఫలమయిన
తరువాత తిరుగుబాటుకు ఒక ప్రధాన శక్తిగా నిలచిన ఉలేమా బ్రిటిష్ పీడనకు ప్రధాన
లక్ష్యంగా మారింది. మొత్తం 2,00,000 మంది పురుషులు మరియు స్త్రీలు ఆ సమయంలో స్వాతంత్రం కోసం
బలి అయినారు. వీరిలో 51,200 వరకు ఉలేమా ఉన్నారు. ఈ ఉలేమాలో సుమారు 5,000 మందిని
ఒక్క ఢిల్లీలోనే ఉరితీశారు.
భారత ప్రధమ స్వాతంత్ర్య
సంగ్రామం ఇరవై సంవత్సరాల తరువాత 1877 లో షేకుల్ హింద్ మౌలానా మహాముదుల్
హసన్ “సంరాతుట్ తర్బియాట్” (Samratut Tarbiyat') అనే సంస్థ ను
స్థాపించారు. ఈ సంస్థ యొక్క లక్ష్యం బ్రిటిష్
వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు సిద్ధం చేయడం. ఈ సంస్థ దాదాపు మూడు
దశాబ్దాలుగా బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాడి తుదకు 1909 లో అది జమాతుల్
అన్సార్ గా గుర్తించబడినది మరియు దిని బాద్యతలు మౌలానా ఒబైదుల్లా సింది
స్వీకరించారు.
జమాతుల్ అన్సార్ నిషేధం తరువాత 1913 లో “నజ్జారతుల్
మారిఫ్” అనే సంస్థ బ్రిటిష్ వలసవాదులను ఈ
దేశం నుంచి వేళ్ళగొట్టడానికి ఏర్పడింది.
అదే సంవత్సరం షేకుల్ హింద్ మౌలానా మహాముదుల్ హసన్, మౌలానా ఒబైదుల్లా సింది, మౌలానా అబుల్ కలాం అజాద్
వంటి ఉలేమా నాయకుల కింద “లేఖల ఉద్యమం లేదా రేష్మి రుమాల్ తెహ్రీక్” అని
ప్రాచుర్యంలోకి వచ్చిన స్వాతంత్య్ర ఉద్యమం ప్రారంభమైనది. ఈ ఉద్యమం టర్కీ, ఇంపీరియల్ జర్మనీ,ఆఫ్గనిస్తాన్
సహాయంతో బ్రిటీష్ పాలన నుండి భారతదేశం ను విముక్తి చేయడానికి పూనుకొంది.
అయితే 1916 లో “రేష్మి రుమాల్
తెహ్రీక్”, మౌలానా ఉబైడుల్లా సింధీ రాసిన పట్టు
వస్త్రం మీద అక్షరాలు బహిర్గతం అవుటతో వైఫల్యం చెందినది. తదుపరి బ్రిటిష్ పాలనా
ప్రభుత్వం తీసుకొన్న 224 మంది ఉలేమా నిర్భంధం తో అది విఫలం చెందినది. మౌలానా
మెహమూద్ హసన్ మరియు అతని సహచరులు మౌలానా వహీద్ అహ్మద్ ఫైజాబాది, మౌలానా అజీజ్
గుల్, హకీం సయ్యద్ నుస్రత్ హుస్సేన్, మౌలానా హుస్సేన్ అహ్మద్
మరియు మౌలానా హుస్సియన్ మదని వారిలో ముఖ్యులు.
వారు మక్కా లో నిర్భందించబడి వారు
దీర్ఘకాలం పాటు చెరసాలలో కొనసాగుటకు మాల్ట పంపబడినారు.
మార్చి 1919 లో జమైత్
ఉలమా-ఇ-హింద్ ప్రారంభించబడినది.
బ్రిటిష్ వారిని మరియు భారత జాతీయ కాంగ్రెస్ ను పాక్షిక స్వేచ్ఛ కొరకు అనేక మంది భారతీయులు సమర్ధిస్తున్న సమయంలో జమైత్
ఉలేమా-ఇ-హింద్ భారతదేశం పూర్తి స్వేచ్ఛ కొరకు డిమాండ్ చేయడం అనేకమంది పూర్తిగా
మర్చిపోయారు అనేది ఒక వాస్తవం. ఈ డిమాండ్ ను
జనవరి 1924 లో మౌలానా
సయ్యద్ హుస్సేన్ అహ్మద్ మదని ద్వారా కాకినాడ (Cocanada) లో చేయబడి మరియు మార్చ్ 1926 లో ఈ మేరకు ఒక
తీర్మానం కలకత్తాలో మొదటిసారి కోసం ఆమోదించ బడినది.
1928 లోజమైత్ 'మోతిలాల్ నెహ్రూ నివేదిక' ను
తిరస్కరించినది అందుకు కారణం అది జమైత్ డిమాండ్ అయిన పూర్ణ స్వరాజ్యం బదులు బ్రిటిష్
పాలనలో స్వయం ప్రతిపత్తిని (autonomy) కోరడమే. ఈ కారణంగా చేత 1929 వరకు ఇది కాంగ్రెస్
ను వ్యతిరేకిoచినది. డిసెంబర్ 1929 లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రసిద్ధ లాహోర్ సమావేశాలు
జమైత్ భావనకు అనుకూలంగా కాంగ్రెస్ భారతదేశపు
పూర్తి స్వేచ్ఛ కోసం డిమాండ్ చేసిన తరువాత
తిరిగి కాంగ్రెస్ తో సంభందాలు ఏర్పర్చుకొంది. నిజానికి ఉలేమా 5 సంవత్సరాల ముందే
పూర్ణ స్వరాజ్య డిమాండ్ ను లేవదీసినది. అలాగే జమైత్ సైమన్ కమిషన్ ను 1926 లో
వ్యతిరేకిoచినది ఆ తరువాత 1927 లో కాంగ్రెస్ సైమన్
కమిషన్ ను వ్యతిరేకించినది.
1929 లో ఉలేమా “దండి మార్చ్” కోసం మహాత్మా గాంధీ పిలుపుకు
పూర్తి మద్దతు తెల్పినది. పర్యవసానంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా హఫిజుర్ రెహమాన్ సియోర్వి, మౌలానా ఫక్రుద్దీన్
మౌలానా సయ్యద్ మహ్మద్ మియాన్ మరియు మౌలానా బషీర్ అహ్మద్ భాటియా వంటి అనేక అనేకమంది
మౌలానాలు అరెస్టు కాబడినారు. చేశారు.
కనీసం ఇరువురు ఉలేమా ప్రముఖులు శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో తరువాతి సంవత్సరం అరెస్టు
కాబడినారు.
1932 లో 'రెండవ శాసనోల్లంఘన ఉద్యమం' సందర్భంగా 1,00,000 మంది
నిరసకారులతో ముఫ్తీ కిఫయతుల్లా దెహ్లావి ఢిల్లీలో ఆజాద్ పార్క్ అందు అరెస్టు కాబడినారు.
వారి అరెస్టు తరువాత మౌలానా హుస్సేన్
అహ్మద్ మదని, మౌలానా అహ్మద్
సయీద్ దెహ్లావి, మౌలానా హఫిజుర్ రెహమాన్ సిహరి, మౌలానా సయ్యద్ మహ్మద్ మియాన్ దియోబంది, మౌలానా హబిబుర్ రెహమాన్ లుధియాన్వి మరియు అనేక ఇతర ఉలేమా అరెస్ట్
కాబడినారు. రెండవ శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో అరెస్టు కాబడిన 90 వేల మంది లో 44.5 వేల మంది ఉలేమా మరియు ముస్లిం స్వాతంత్ర పోరాట
యోధులు.
1940 లో మౌలానా హుస్సేన్ అహ్మద్ మదని మరోసారి బచ్చరావున్(Bachhraon) వద్ద భారతదేశం
కోసం సంపూర్ణ స్వాతంత్ర్య సమస్యను లేవనెత్తారు. దాని కోసం వారు యూనిటీ కాన్ఫరెన్స్
కు వెళ్ళే మార్గంలో అరెస్టు అయి ఆరు నెలల
జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
ఉలేమా ఆగష్టు 5, 1942 న “క్విట్
భారతదేశం” యొక్క తీర్మానం ఆమోదించింది ఆ
తరువాత కాంగ్రెస్ ఆగస్టు 9 న బాంబే సెషన్
లో క్విట్ ఇండియా తీర్మానం ను ఆమోదించినది. ఇది అనేక కాంగ్రెస్ మరియు ఉలేమా నాయకుల దీర్ఘ
నిర్బందానికి దారితీసింది.
ఉలేమా గట్టిగా రెండు
దేశాల సిద్ధాంతం మరియు పాకిస్తాన్ యొక్క ఏర్పాటును వ్యతిరేకించారు. ఆతరువాత జమైత్ లో ఒక చీలిక వచ్చి ఒక వర్గం ముస్లిం లీగ్ పక్షాన నిలిచారు. ఈ ప్రక్రియలో మౌలానా హుస్సేన్ అహ్మద్ మదని, మౌలానా ఆజాద్ తదితరులు అప్పటికే రాజకీయంగా బలంగా ఉన్న ముస్లిం
లీగ్ హింస రాజకీయాలకు బాధితులు అయ్యారు. ఉలేమా
భారతదేశం అంతటా వేధింపులను ఎదుర్కొన్నది.
చివరికి దేశం మత ఆధారంగా విభజించబడింది అయినప్పటికీ మనం అవిభక్త భారతదేశం
కోసం పోరాడి మరిణించిన పురుషుల-మహిళల త్యాగం ఎన్నటికి మర్చిపోరాదు.
1857 తిరుగుబాటులో
ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక బ్రిటిష్ సైన్యం జనరల్ తోమ్సన్ (Tomson) తన జీవిత చరిత్ర “తిరుబాటు
మతగురువులు” (Rebellion
Clerics) లో రాశాడు: "సర్వశక్తి
అధికారాలు కల ఆక్రమణ దేశం కు వ్యతిరేకంగా, ప్రణాళిక మరియు సూత్రధారిగా యుద్ధo చేయడమే దేశభక్తి
అయితే నిస్సందేహంగా మౌల్విస్ (ఉలమా) తమ దేశానికి నమ్మకమైన నిజమైన దేశభక్తులు. వారి తరువాత
వచ్చిన తరాలు వారిని హీరోలు గా గుర్తుంచుకుంటుంది."
(“If to fight for one’s
country, plan and mastermind wars against occupying mighty powers are
patriotism, then undoubtedly maulvis(Ulama ) were the loyal patriots to their
country and their succeeding generations will remember them as heroes”).
No comments:
Post a Comment