భారత దేశంలో స్థానిక బాష ఉర్దూ లో ఉన్నత విద్యను అందించడానికి ఏర్పాటు చేసిన మొట్టమొదటి
విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం.
ఏప్రిల్ 24 న ఉస్మానియా విశ్వవిద్యాలయ సెంటెనరీ వేడుకలు ముగిసినవి. ఇది భారత దేశం లో ప్రాంతీయ బాష అయిన ఉర్దూ భాష లో ఉన్నత విద్యను ప్రవేశపెట్టిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం. 1917 ఏప్రిల్లో నిజాం మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఒక ఫర్మానా ద్వారా " పురాతన మరియు ఆధునిక వ్యవస్థలలో ఉత్తమ భౌతిక, మేదోపరమైన మరియు ఆధ్యాత్మిక సంస్కృతి నెలకొల్పుటకు” ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
పురాతన మరియు ఆధునిక, ఓరియంటల్ మరియు ఆర్ట్స్, విజ్ఞాన శాస్త్రాలు మరియు
ప్రస్తుత వ్యవస్థ లోని లోపాలను
సరిదిద్దే విధంగా హైదరాబాద్ రాజ్య అద్వర్యం
లో ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ఫర్మానా పేర్కొంది. హైదరాబాద్ రాష్ట్రానికి
ఉర్దూ భాష అధికార భాష అయినందున, అది బోధన
మాధ్యమంగా ఎంపిక చేయబడింది. కానీ అదే సమయం లో విదేశీ భాషల నుండి మెరుగైన మరియు ఉత్తమమైన దానిని సంగ్రహించేందుకు వీలుగా ఇంగ్లీష్ బోధన తప్పనిసరి
చేసింది .
ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం, అదే సంవత్సరం ఆగస్టులో దార్ ఉత్-తర్జుమా లేదా బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్స్ అండ్ కంపైలేషన్స్ ఏర్పాటు చేయబడింది. మౌల్వి అబ్దుల్ హక్ దాని డైరెక్టర్గా నియమించబడ్డారు. బ్యూరో మానవీయ శాస్త్రాలు, సహజ విజ్ఞాన శాస్త్రాలు, భూగోళ శాస్త్రం, చట్టం, ఇంజనీరింగ్, వైద్యశాస్త్రం, విద్య, ఫైన్ ఆర్ట్స్ లో వందల కొద్ది ఉత్తమ పుస్తకాలని అనువదించింది. బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్స్ అండ్ కంపైలేషన్స్ చేసిన ఈ కృషిని యూనివెర్సిటీ సందర్శించిన అనేక మంది ప్రముఖ విద్వాంసులు, విద్యా ప్రముఖలు మెచ్చుకొన్నారు.
నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ బ్యూరో సందర్శించిన తరువాత ఇలా అన్నారు: "విదేశీయుల సంకెళ్ళు నుండి విముక్తి పొందిన రోజు, మన విద్య అందరికీ సహజంగా అందుబాటులో ఉంటుంది. నేను చాలాకాలంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మన స్థానిక రాజ్యాలు పరిష్కరించవలసిన ఒక ముఖ్యమైన సమస్య. మీ రాజ్యం ఉర్దూ మాధ్యమం ద్వారా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనీ ప్రతిపాదించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ఆలోచనకు నా సంపూర్ణ అభినందనలు తెల్పుతున్నాను".
స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ C. రాజగోపాలాచారి ఉస్మానియా విశ్వవిద్యాలయం 'నిజమైన విద్యాపీఠ్' అని వర్ణించారు.
జాతీయ సమైక్యత అనేది ఒక గొప్ప ఆదర్శంగా మరియు ప్రత్యక్షమైన రియాలిటీగా ఉన్న ఒక విద్యాసంస్థను సృష్టించడం ద్వారా జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో ఇతర విశ్వవిద్యాలయాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం సహకరించాలని నిజాం కోరుకున్నాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి ఇంటర్మీడియట్ పరీక్షలు 1921 లో, మొదటి డిగ్రీ (BA) పరీక్షలు 1923 లో మరియు 1925 లో మొట్టమొదటి MA మరియు LLB పరీక్షలను నిర్వహించింది. 1927 లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ స్థాపించబడింది. Ph.D. కార్యక్రమాలు 1938 లో ప్రారంభించబడ్డాయి.
మొదటి సంవత్సరంలో 143 మంది విద్యార్థులను చేర్చుకున్న
ఆర్ట్స్ కాలేజ్, తరువాతి సంవత్సరంలో 465 మంది
విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చింది. 1948 నాటికి విద్యార్థుల సంఖ్య 17,350 కు పెరిగింది.
ఈ విశ్వవిద్యాలయo ఆర్ట్స్ కాలేజీలో బోధించడానికి భారతదేశం
మరియు విదేశాల నుండి ప్రముఖ విద్వాంసుల సేవలను కోరింది మరియు ఒకదాని తరువాత
ఒకటి మిగతా ఫ్యాకల్టిలు స్థాపించ బడినవి. హైదరాబాదులోని
అనేక ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా సంస్థలు రసద్దాహ్-ఎ
నిజామియా (నిజామియా అబ్సర్వేటరీ) మరియు ఇండస్ట్రియల్ లాబరేటరీ (సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఆస్ట్రానమీ), మరియు
ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (RRL) స్థాపించబడినవి.
తరువాత, యూనివర్సిటీ బోధన మాధ్యమంగా ఉర్దూ కు బదులు ఆంగ్లం ప్రవేశపెట్టబడినది.. అనేక ఫాకల్టిలు1948 మరియు 1968 మధ్యకాలంలో చేర్చబడ్డాయి. అనేక పరిశోధన సంస్థలు జోడించబడ్డాయి మరియు దూర విద్యా కేంద్రాలు ప్రారంభించబడ్డాయి.
Great blog, Thanks.
ReplyDeleteinnallaha sayubtiluhu, masha allah in arabic, obesity in islam, symptoms of black magic to separate husband and wife, famous female personalities in islamic history, sad story about father and son, things that will take you to jannah, learn quran online, learn quran online uk, quran teacher online,
quran teacher needed, need quran teacher online