8 July 2025

భారతీయ ముస్లింలలో విద్యా సమీకరణ Educational Mobilization Among Indian Muslims

 


భారత దేశం లో ముఖ్యంగా ఇతర మతపరమైన మైనారిటీలతో పోల్చినప్పుడు,ముస్లింలు స్థాపించిన ఆధునిక విద్యాసంస్థలు అతి తక్కువు గా ఉన్నవి.

భారత దేశం లో ముస్లిముల జనాభా పరిమాణం(మొత్తం జనాభాలో 14%) మరియు ముఖ్యంగా వారి తలసరి ఆదాయం (PCI)కి సంబంధించి భారతదేశ విద్యా అభివృద్ధిలో ముస్లింల ప్రమేయం యొక్క వాస్తవాన్ని పరిశీలించుదాము..

భారత దేశం లో ముస్లిం మైనారిటీ గుర్తింపు పొందిన సంస్థలు:

17 విశ్వవిద్యాలయాలు మరియు 1239 ఉన్నత విద్యా కళాశాలలు మైనారిటీ హోదాను పొందాయి.

జమ్మూ & కాశ్మీర్:13 విశ్వవిద్యాలయాలు మరియు 50 అనుబంధ కళాశాలలు.

మదర్సాలు: సుమారు 24,000 (గుర్తింపు పొందినవి మరియు గుర్తించబడనివి, రెండూ కలుపుకొని), మదర్సాలు గణితం, సహజ శాస్త్రాలు మరియు ఆంగ్ల భాషను కూడా బోధిస్తాయని భారత ప్రభుత్వం లోక్‌సభలో ధృవీకరించింది. మదర్సాలు ఎక్కువగా గ్రామీణ లేదా సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఉన్నాయి, ఈ మదర్సాలలో దాదాపు రెండు మిలియన్ల మంది విద్యార్థులు ఉన్నారు వారు  సాధారణంగా ముస్లిం జనాభా నుండి వస్తారు, ఎక్కువగా వారు ఆర్థిక పరిమితుల కారణంగా ఆధునిక విద్యను పొందలేకపోతున్న పేద లేదా బిపిఎల్ కుటుంబాలకు చెందినవారు.

ఇరవై లక్షలకు పైగా విద్యార్థులు మదర్సాలో చదువుతున్నారు. కేవలం 2.99% మంది ముస్లిం విద్యార్థులు మదర్సాను ఎంచుకుంటారు, అయితే ఎక్కువ మంది ఆధునిక విద్యను ఎంచుకుంటారు”.

(ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్; మార్చి 11, 2024)

భారత దేశం లోని ప్రధాన మత సమూహాలలో ముస్లింలు అత్యల్ప ఆస్తి/ నెలవారీ తలసరి వినియోగదారు వ్యయం lowest asset/ Monthly Per-capita Consumer Expenditure (MPCE) స్థాయిలను కలిగి ఉన్నారని హిందూత్వ వాచ్; జూన్ 30, 2023 తెలిపింది.

“తాజా ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే (AIDIS) మరియు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నుండి యూనిట్ స్థాయి డేటా యొక్క HT విశ్లేషణ ప్రకారం, భారతదేశంలోని ప్రధాన మత సమూహాలలో ముస్లింలు అత్యంత పేదవారు మరియు వారు అత్యల్ప ఆస్తి మరియు వినియోగ స్థాయిలను కలిగి ఉన్నారు.”

“భారతదేశంలో ఇతర మత సమూహాల కంటే ముస్లింల జనాభా అధిక వేగంతో పెరుగుతుందని తరచుగా అంటున్నారు. కాని ఇటువంటి వ్యాఖ్యానాలలో ఎక్కువ భాగం సమాచారం లేనివి. ముస్లిం అగ్ర కులాలు కూడా హిందూ OBCల కంటే పేదవారు.”

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీయేతర ముస్లింలు కాని వారు, పస్మాండ ముస్లింలు కాని వారి సగటు ఆస్తి విలువ average asset value, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీయేతర హిందువుల సగటు విలువ కంటే తక్కువగా ఉండటమే కాకుండా, హిందూ ఓబీసీల కంటే కూడా తక్కువగా ఉంది, ఇది ముస్లిం అగ్ర కులాలు అసమాన ఆర్థిక శక్తిని అనుభవిస్తున్నారనే వాదనలు నిజం కాదని చూపిస్తుంది.

(HT; జూన్ 30, 2023)

గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతీయ ముస్లింలు ఉన్నత విద్యలో పురోగతిని సాధించారు, సాంప్రదాయ సెమినరీలు తరచుగా ప్రజల దృష్టిని ఆక్రమిస్తున్నప్పటికీ, అవి విస్తృత ముస్లిం విద్యా దృశ్యంలో అతి తక్కువ భాగాన్ని మాత్రమే సూచిస్తాయి.

ముగింపు/సూచనలు:

·       కొత్త సంస్థలను సృష్టించడానికి తొందరపడే ముందు, సమాజ సమీకరణపై దృష్టి మళ్లాలి

·       ముస్లిం సమాజం ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాల నమోదును ప్రోత్సహించవలసి ఉంది.  

·       ఉన్నత మాధ్యమిక మరియు విశ్వవిద్యాలయ స్థాయిలలో డ్రాపౌట్ రేట్లను తగ్గించాలి.

·       ఉన్న మైనారిటీ సంస్థలలో విద్యార్థుల నమోదు రేటు  పెంచవలసి ఉంది..

·       విద్యా అంతరాలను తగ్గించడానికి, నాణ్యమైన విద్యను పొందేందుకు అందుబాటులో ఉండేలా రూపొందించబడిన విద్యా హక్కు (RTE) చట్టం మరియు ఇతర ప్రభుత్వ పథకాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి.

ఈ చొరవలు విద్యా రంగంలో గణనీయమైన సానుకూల మార్పును తీసుకురాగలవు. 

No comments:

Post a Comment