15 May 2014

వేసవి ఫలాలు:


.

వేసవి వచ్చేసింది. భానుడు తన వేడిమి తీవ్రతని చూపిండం అప్పుడే ప్రారంభించాడు. సీజన్‌లో వచ్చే ఫలాలని, వాటి రసాలని తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు.

ప్రకృతిలో మనకి అనేక రకాల మధుర ఫలా లు ఉన్నాయి. దాదాపుగా ఇవన్నీ మనకి ఎక్కువగా లభించే కాలం వేసవి కాలమే

వేసవి దొరికే ఫలాలలోని కేలరీలు :
అరటి... 168 కేలరీలు
సపోటా....98 కేలరీలు
పైనాపిల్‌.... 45 కేలరీలు
పుచ్చకాయ.... 25 కేలరీలు
జామ..... 51 కేలరీలు
కమలాలు... 45 కేలరీలు
దానిమ్మ..... 65 కేలరీలు
బొప్పాయి..... 35 కేలరీలు
ఖర్జూరం... 315 కేలరీలు
ద్రాక్ష.... 58 కేలరీలు
మామిడి..... 75 కేలరీలు

వేసవి కాలములో లబించే ఫలాలు వాటి ఉపయోగాలు:
అరటిపండుజీర్ణశక్తి ని  పెంచుతుంది. బాగా పండి న అరటి పళ్లని చిన్నారులతో తినిపిస్తే జీర్ణశక్తి పెరగటమే కాక మంచి ఆరో గ్యాన్ని అందిస్తాయి. ఐరన్,పోటాసియం కలిగి దేహాన్ని రోజంతా చురుకుగా ఉంచును.

రేగు పళ్లు, లో ఉండే టార్జానిక్‌ ఆవ్లుం మానవ శరీరంకి ఎంతో మేలు చేకూ ర్చుతుంది

నిమ్మ, లో దొరికే సిట్రిక్‌ ఆవ్లుం ఆరోగ్యానికి మంచిది. నీరు,నిమ్మ రసము, ఉప్పులేదా పంచదార తో కలిపి తయారు చేసిన జ్యూస్ త్రాగిన వేసవిలో దాహము తగ్గును. 
  
ఖజ్జూరం తీసుకుంటే సత్వరం శక్తి అందు తుంది కనుక దానిని వేసవిలో విరివిగా తీసుకోవటం ఉత్తమంగా వైద్యులు చెప్తారు.

 పుచ్చకాయ ముక్కలు నాలుగు తింటే కడుపులో చల్లగా, హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. శరీరానికి కావలసిన పోషకపదార్థాలను అందిస్తుంది. గుండె పనితీరు, రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు డయాబెటిస్‌తో బాధ పడేవారికి మేలు చేస్తుంది. మరో విషయం చర్మ సంరక్షణకి దీని గుజ్జు భలేగా పనిచేస్తుంది.. రుచిగా ఉండి దాహాన్ని తీర్చడమే కాకుండా, అనేక వ్యాధుల నివారణకీ ఉపయోగపడుతుంది.

  బొప్పాయి ముక్కలు తింటే కడుపు నిండుతుంది. దాహార్తిని అరికట్టువచ్చు. బొప్పాయి లో కైమోపపైన్,పపైన్,ఉంది జీర్ణ క్రియకు, ప్రోటీన్ల అరుగుదలకు తోడ్పడును.

వేసవిలో ఎక్కువగా వచ్చేవి ఈ పండ్లే. పండ్లలో రారాజు మామిడి. మధుర ఫలం మామిడి. మామిడి లో సిలినియం, ఐరన్ అధికంగా ఉండును. పండ్లుగా తినడమేకాదు, ఎన్నో రుచికరమైన పదార్థాలు కూడా చేసుకోవచ్చు. మామిడి పండ్ల గుజ్జుతో ఐస్‌క్రీములు, కేకులు, ఫ్రూట్‌ సలాడ్‌,. మామిడికాయతో చేసే పచ్చళ్లు మాగాయ, ఆవకాయ, ముక్కల పచ్చడి... ఇలా ఎన్నో రకాలు రకాలుచేసుకోవచ్చు.

తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఉదర సంబంధిత క్యాన్సర్, గర్భిణి స్త్రీలలో రక్త హీనత, కీళ్ళనొప్పులు, మూత్ర పిండములలో రాళ్ళు తయారయ్యేవారూ, తెల్లద్రాక్ష పళ్ళను ప్రతిరోజూ తీసుకుంటూ వుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొబ్బరిబోండాలు నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్‌ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.

నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా విటమిన్ ‌- ఏ, బి స్వల్పంగా, విటమిన్‌ సి ఎక్కువగా ఉంటాయి. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది., నారింజ సులభంగా జీర్ణ అవుతుంది. నారింజను వాడితే, అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. మలబద్ధకం పోతుంది. . శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది.

ఆలు బకరా పండ్లు అధికమైన గుజ్జును (పీచు పదార్ధంను) కలిగి జీర్ణ క్రియకు తోడ్పడును దీనిలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులనుండి శరీరాన్ని రక్షించును.

లిచి (lychee):వేసవి కాలంలో శరీరానికి కావలసిన అన్నిరకాల విటమిన్లు, ప్రోటీన్లు, సిట్రిక్ ఆసిడ్,కొవ్వు,ఇనుము, ఫాస్ఫరస్ అందిస్తుంది

అంజిరా (ఫిగ్స్) దీనిలో పోటాసియం అధికం గా ఉండుటవలన శరీరారోగ్యమును కాపాడును.

జామ కాయ: దీనిని పేదవారి ఆపల్ అందురు. ఆంగ్లంలో guava,హింది లో అమ్రూద్ అందురు. దీనిలో సి విటమిన్ అధికంగా ఉంది. విరోచనాలు,రక్తవిరోచనాలు, దగ్గు-జలుబు తగ్గించును. తక్కువ కాలరీలను,ఫాట్,సోడియం కలిగి ఉండును.

 ఖర్బూజ నీటిని అధికంగా కలిగి అధిక తీపిని కలిగి ఉంటుంది. వేసవికాలం లో అధికంగా తింటారు. విటమిన్ ఏ, విటమిన్ సి, జింక్, పోటాసియంలను కలిగిఉంది, కర్బూజా ముక్కలు తింటే కడుపు నిండుతుంది. దాహార్తిని అరికట్టువచ్చు

   ఫైనాఫిల్ లో బ్రోమిలియన్ ఎంజైమ్ అధికంగా ఉంది, కొవ్వు పదార్ధాల,ప్రోటీన్ల అరుగుదలకు తోడ్పడును. ఆంటీ-ఇన్ఫ్లమేటరీ గా పనిచేయును.
సపోట
సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్(Anti parasitic) సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి. సపోటా లోని విటమిన్‌ ''కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ 'సీ 'శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు.. ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయినిక్‌ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి.

పళ్ళవలన ఉపయోగాలు:
పళ్లలో అనేక విటమి న్లు, మాంస కృతులు సమృద్ధిగా ఉండటమే కాకుం డా పిండి పదార్ధాలు 5 నుండి 20 శాతం వరకు ఉంటాయి. పైగా గ్లూకో జ్‌, ఫ్రక్టోజ్‌లు సమపాళ్లలో ఉండటం, ఆర్గానిక్‌ ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల వేసవి తాపం కారణంగా శక్తి నశించిన వారికి వెంటనే చక్కటి ఉప శమనాన్నిఫలాలు  ఇస్తాయి.
రక్తంలో పేరుకు పోయే కొవ్వుని తగ్గించడమే కాకుండా గుండె పోటుని తగ్గించే రసాయనాలు ఫలాలలో ఉన్నాయి. క్యాన్సర్‌ కారకాలను తగ్గించడం లో ఫలాలు ముందుంటాయి. చర్మం ఆరోగ్యవంతంగా తయారు కావటానికి... శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు పళ్లు ఉపయోగ పడతాయి. వేసవిలో వడదెబ్బ, డిహైడేషన్‌, అతిసారం తదితర వ్యాదుల నుండి రక్షించుకునేందుకు పళ్లుఉపయోగపడతాయి శరీరంలోని పొటాషియం, సోడియం తదితర రసాయనాలను నేరుగా రక్తంలో కలిసేలా చేస్తాయి పళ్లు. ఇక పుచ్చకాయ, ఖర్భూజాలు శరీర రుగ్మతలను నిరోధిస్తాయి. మధుమేహంతో బాధ పడేవారు సైతం పళ్లని తీసుకుంటే మంచిది. జ్యూస్‌ల కన్నా పండ్లను బాగా కడిగి నేరుగా తింటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.








No comments:

Post a Comment