15 September 2022

బేగం మహబూబ్ ఫాతిమా: ఢిల్లీలో బ్రిటిష్ వారిచే జైలుకి పంపబడిన మొదటి ముస్లిం మహిళ

 

1932 ఏప్రిల్ 21న ఢిల్లీలోని అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకి  'క్రౌన్‌కి వ్యతిరేకంగా యుద్ధం' చేసినట్టు అభియోగాలు మోపబడిన ఒక ముస్లిం మహిళ తీసుకురాబడింది. నియమం ప్రకారం, ఆమె ఒక న్యాయవాదిని నియమించుకోవాలని  లేదా స్వయంగా వాదించుకోవలసిందిగా కోరబడింది. దౌర్జన్యం మరియు బానిసత్వం పునాది ఉన్న బ్రిటిష్ ఇండియా కోర్టులో తన కేసును వాదించడానికి తాను ఇష్టపడటం లేదని ఆ ముస్లిం మహిళ కోర్టు ముఖంగా చెప్పింది.

ఆ ముస్లిం మహిళ అభిప్రాయం ప్రకారం, న్యాయస్థానం, న్యాయానికి ప్రాతినిధ్యం వహించుటలేదు, ఎందుకంటే దానిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చట్టవిరుద్ధం మరియు దానికి భారతదేశంపై  తన ఆక్రమణను కొనసాగించే హక్కు లేదు. మేజిస్ట్రేట్ చే ధైర్యసాహసాలు కలిగిన ఆ ముస్లిం మహిళకు ఆరు నెలల జైలు శిక్ష మరియు యాభై రూపాయల జరిమానా విధించబడింది. జరిమానా చెల్లించలేని పక్షంలో 45 రోజుల పాటు జైలుశిక్షను అనుభవించ వలసి ఉంటుంది.

ఇంతకీ ఆ మహిళ పేరు తెలుసా?

ఆ మహిళ పేరు బేగం మహబూబ్ ఫాతిమా. జలియన్ వాలాబాగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సత్యవతితో పాటు మహబూబ్ ఫాతిమాను అరెస్టు చేశారు. చరిత్రకారుల ప్రకారం, ఢిల్లీలో 'క్రౌన్’కి  వ్యతిరేకంగా యుద్ధం' చేసినందుకు జైలు శిక్ష అనుభవించిన మొదటి ముస్లిం మహిళ బేగం మహబూబ్ ఫాతిమా. ఆమె భర్త పేరు తాహిర్ మొహమ్మద్.

No comments:

Post a Comment