27 June 2024

భారతదేశం యొక్క "హిజాబీ బైకర్" India’s “Hijabi Biker”

 


ఢిల్లీ NCR:

రోష్నీ మిస్బా కు మోటార్‌బైక్‌లపై అమిత ప్రేమ కలదు.  హిజాబీ బైకర్‌గా పిలువబడే, ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల రైడర్ రోష్నీ మిస్బా హోండా CBR 250 ccని నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ హిజాబీలకు ప్రేరణగా మారింది.

పంజాబీ-ముస్లిం, వ్యాపారవేత్త, అరబ్, న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఇస్లామిక్ స్టడీస్ అద్యయనం చేస్తున్న  మరియు "భారతదేశంలో అత్యంత వేగవంతమైన బైక్‌ను కలిగి ఉన్న ఏకైక అమ్మాయి" అయిన రోష్నీ మిస్బా తొమ్మిదవ తరగతిలోనే  బైక్‌లు నడపడం ప్రారంభించింది.

రోష్నీ మిస్బా కు చిన్నతనం నుంచి బైక్‌లపై మక్కువ ఉండేది.  యువ రైడర్ రోష్నీ మిస్బా డిల్లీనగరంలోని అనేక బైకింగ్ గ్రూపులలో సబ్యురాలు మరియు ఢిల్లీలో ఉన్న మహిళా బైకర్స్ గ్రూప్ లో చురుకైన సబ్యురాలు కూడా.. యువ రైడర్‌ రోష్నీ మిస్బా ఈ రోజు వరకు, భారతదేశం అంతటా 24,000 కిలోమీటర్లు ప్రయాణించినది మరియు 60 కంటే ఎక్కువ బైక్‌లను నడిపినది, 

No comments:

Post a Comment