హమీద్ దల్వాయి ఒక సంస్కరణవాద ఆలోచనాపరుడు మరియు కార్యకర్త, ముస్లిం సమాజంలో సంప్రదాయవాద మతాధికారుల
ఆధిపత్యాన్ని మరియు గుర్తింపు ఆధారిత రాజకీయాలను దల్వాయి సవాలు చేశాడు. విద్య, లింగ సమానత్వం, హేతువాదం మరియు లౌకిక పౌరసత్వాన్ని స్వీకరించడంలో నిజమైన పురోగతి ఉందని
దల్వాయి వాదించారు.
ట్రిపుల్ తలాక్ మరియు మహిళల హక్కులపై జాతీయ చర్చకు దశాబ్దాల ముందు, దల్వాయి ముస్లిం మహిళల హక్కుల సంస్కరణలను
ప్రతిపాదించాడు. భారతదేశ ప్రజాస్వామ్య
చట్రంలో వీలినమవడం ముస్లిముల మనుగడకు కీలకమని పట్టుబట్టారు. భారతీయ ముస్లింలు
రాజకీయ సామాజిక వివక్షత మరియు అంతర్గత సంస్కరణలకు ప్రతిఘటనను ఎదుర్కొంటున్నందున, దాల్వాయి ఆలోచనలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి.
దల్వాయి స్ఫూర్తితో ముస్లిం రాజకీయాలను పునరుద్ధరించడం అంటే ప్రతిచర్యాత్మక
వైఖరి నుండి చురుకైన సంస్కరణకు, మతపరమైన ప్రతీకవాదం
నుండి విద్య మరియు ఉపాధి వంటి నిజమైన సమస్యలకు మరియు మైనారిటీ గుర్తింపు నుండి
సమాన పౌరసత్వానికి వెళ్లడం - ఇతర అట్టడుగు వర్గాలతో పొత్తులను నిర్మించడం మరియు
భారతదేశంలో నమ్మకమైన, లౌకిక మరియు ఆధునిక రాజకీయ పాత్రను తిరిగి
పొందడం.
హమీద్ దల్వాయి ఆలోచన ప్రధాన అంశాలు:
హమీద్ దల్వాయి స్వల్ప జీవితాన్ని గడిపాడు, కానీ తన ముస్లిం సమాజానికి కఠినమైన వాస్తవాలను
ధైర్యంగా తెలియజేసారు. ఆధునికతను ముస్లిములు అలవరచుకోవాలని మరియు అంగీకరించాలని హమీద్
దల్వాయి వాదించారు.. ముస్లింలు తమను తాము కేవలం మైనారిటీగా కాకుండా సమాన పౌరులుగా
మరియు లౌకిక ప్రజాస్వామ్య రక్షకులుగా పరిగణించాల్సిన అవసరం ఉందని దల్వాయి తెలియజేశారు.
నేడు భారత ముస్లిం రాజకీయాల్లో ముఖ్యమైనది గుర్తింపు నుండి మార్పు, మత నాయకుల నుండి ప్రజాస్వామ్య నాయకులకు మార్పు మరియు నిష్క్రియాత్మక ప్రతిస్పందన నుండి
పరివర్తన లక్ష్యంగా చేసుకున్న చురుకైన చర్యకు మారడం.
భారతీయ ముస్లింలు దల్వాయి వాదనలతో ఎకిభవిస్తే, వారు భారతదేశ ప్రజాస్వామ్యంలో తమ స్థానాన్ని తిరిగి
పొందవచ్చు మరియు మైనారిటీగా
కాకుండా దృఢమైన, ప్రగతిశీల మరియు సమాన పౌరులుగా మారవచ్చు.హమీద్
దల్వాయి రాజకీయ ఆలోచనకు మరియు భారతదేశంలో ముస్లిం రాజకీయాల భవిష్యత్తుకు అది
నిజమైన ఘనత అవుతుంది.
హమీద్ దల్వాయి అనేది భారతదేశంలోని
సాధారణ రాజకీయ చర్చలలో కనిపించని పేరు. కానీ మీరు భారత ముస్లిం రాజకీయాలపై ఆసక్తి
ఉన్న వ్యక్తి అయితే, తప్పనిసరిగా దల్వాయి జీవిత చరిత్ర మరియు రచనలు అద్యయనం
చేయాలి..
1932లో మహారాష్ట్రలోని
రత్నగిరి పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో జన్మించిన దల్వాయి
రచయిత, సామాజిక కార్యకర్త మరియు సంస్కర్త. హమీద్
దల్వాయి సల్ప కాలం జీవించాడు. 1977లో 44 సంవత్సరాల వయసులో దల్వాయి మరణించారు. దల్వాయి ముస్లిం సమాజాన్ని పునరుద్ధరించడంలో మరియు
భారతదేశంలో ముస్లిం రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేయడం అనే తన అవిశ్రాంత కృషిలో
నిమగ్నమయ్యారు.
చాలా మంది భారతీయ ముస్లింలు మతం మరియు సమాజ
విషయాలలో నిమగ్నమై ఉండగా, దల్వాయి ఆధునికత, న్యాయం, హేతుబద్ధత మరియు సమాజాన్ని పెంపొందించడం ప్రస్తావించారు.
భారతీయ ముస్లింలు గుర్తింపు ఆధారిత రాజకీయాల నుండి దృష్టిని మరల్చాలని
మరియు విద్య, సామాజిక సంస్కరణ మరియు దేశం యొక్క ఆధునిక
ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం వైపు దృష్టి పెట్టాలని భావించారు.
భారతీయ ముస్లింలు కొత్త రకమైన సామాజిక మరియు రాజకీయ బహిష్కరణను
ఎదుర్కొంటున్నారు మరియు వారు తమలో తాము సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు.
హమీద్ దల్వాయి ఆలోచనలు ఎక్కువగా దృష్టిని
ఆకర్షిస్తాయి. దల్వాయి రాజకీయ ఆలోచన భారతీయ ముస్లింలకు ప్రతికూల ప్రతిచర్యను ఎలా
నివారించవచ్చో, నాయకత్వాన్ని ఎలా తిరిగి పొందవచ్చో మరియు
భారతదేశ ప్రజాస్వామ్యంలో వారి పాత్రను ఎలా పునరుద్ధరించవచ్చో చూపిస్తుంది.
ఈ వ్యాసం దల్వాయి రాజకీయాలను, మరియు ఆధునిక యుగంలో
భారతీయ ముస్లిం రాజకీయాల్లో అవసరమైన మార్పును ఎలా రేకెత్తించగలదో పరిశీలిస్తుంది.
హమీద్ దల్వాయి అనుసరించిన రాజకీయాలు: సంక్షిప్త సారాంశం
దల్వాయి రాజకీయాలు రెండు రంగాలలో ఆధారపడి ఉన్నాయి.
ఒకటి, ముస్లిం సమాజం కూడా ఆధునిక విలువలు అయిన లింగ సమానత్వం, హేతుబద్ధత మరియు లౌకికవాదం ను అవలంబిస్తుందని దల్వాయి
ఆశించారు, రెండు, ముస్లింలైన భారతీయులు తమను తాము ప్రజాస్వామ్య, బహువచన మరియు లౌకిక దేశంలో భాగంగా భావిస్తారని దల్వాయి ఆశించారు.
రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చడం
సామాజిక పరివర్తన లేకుండా రాజకీయ పరివర్తన ఉండదని దల్వాయికి
నమ్మకం కలిగింది. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం మరియు
ముస్లిం వ్యక్తిగత చట్టంలో ముస్లిం మహిళలకు హక్కులు లేకపోవడం వంటి పద్ధతులను దల్వాయి బహిరంగంగా ప్రశ్నించారు.
1966లో ముంబైలో ముస్లిం వ్యక్తిగత చట్టంలో సంస్కరణలు కోరుతూ మొట్టమొదటి ముస్లిం మహిళా మార్చ్ను దల్వాయి ఏర్పాటు చేశారు - ఆ
కాలంలో ముస్లిం మహిళా మార్చ్అనేది ఒక చారిత్రాత్మక సంఘటన . ముస్లిం మహిళలకు
సామాజిక కట్టుబాట్లు నుండి స్వేఛ్చ
ప్రధానం చేయడం మొత్తం సమాజాన్ని విముక్తి చేయడంలో ముఖ్యమైనది
అని దల్వాయి అభిప్రాయ పడ్డారు..
లౌకికవాదం మరియు హేతువాదం
తన కాలంలోని చాలా మంది ముస్లిం నాయకుల మాదిరిగా కాకుండా, మతాన్ని వ్యక్తిగత వ్యవహారంగా ఉంచాలని దల్వాయి భావించారు.. అధికారం కోసం ఇస్లాంను వాడుకోవడాన్ని
దల్వాయి ఇష్టపడలేదు మరియు భారతీయ ముస్లింల భవిష్యత్తు
లౌకిక రాజకీయాలను స్వీకరించడంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ముస్లింలు తాము
"మైనారిటీ సమాజం" అనే మనస్తత్వం నుండి బయటపడి భారతదేశంలో సాధారణ
పౌరులుగా మారాలని దల్వాయి భావించారు..
గుర్తింపు రాజకీయాలపై విమర్శ
ముస్లిం లీగ్ మరియు ఇతర ముస్లిం గ్రూపులు ఆచరించే గుర్తింపు ఆధారిత
రాజకీయాలను దల్వాయి తీవ్రంగా విమర్శించారు. ఇది
ముస్లింలను వెనుకబడిన వారిగా మార్చిందని మరియు ఆధునిక యుగంలోని నిజమైన సమస్యలైన
పేదరికం, విద్య, ఉపాధి మరియు సామాజిక అభివృద్ధితో వారు నిమగ్నమవ్వకుండా నిరోధించిందని
అన్నారు.
ఒంటరితనం కాదు, ఏకీకరణ
భారతీయ ముస్లింలు తమను తాము ఏకాంతంగా ఉంచుకోకూడదని, దానికి విరుద్ధంగా సమాజంతో కలిసిపోవాలని దల్వాయి భావించారు. మతం కారణంగా
ప్రత్యేక అధికారాలను కోరుకునే బదులు, భారతదేశ ప్రజాస్వామ్య
మరియు లౌకిక రాజకీయాలలో ముస్లింలు పూర్తిగా పాల్గొనాలని దల్వాయి కోరుకున్నారు.
దల్వాయి రాజకీయాల ప్రాముఖ్యత
దల్వాయి రాజకీయాలు తన కాలానికి
ముందున్నందున అవి ముఖ్యమైనది. 1960లు మరియు 70లలో, భారతదేశంలో ముస్లిం రాజకీయాలు ఎక్కువగా
వ్యక్తిగత చట్టాన్ని మరియు సమాజ హక్కులను పరిరక్షించడంపై కేంద్రీకృతమై ఉన్నప్పుడు, దల్వాయి సంభాషణను సంస్కరణ, హేతుబద్ధత మరియు కలిసి రావడం వైపు నడిపించాడు.
పరివర్తన కోసం ఒంటరి స్వరం
సుప్రీంకోర్టు తీర్పులు మరియు ట్రిపుల్ తలాక్పై భారతీయ చర్చకు చాలా కాలం
ముందు దల్వాయి ముస్లిం వ్యక్తిగత చట్టంలో మార్పును
ఊహించాడు. సమాజ అభివృద్ధికి మహిళల హక్కులు చాలా అవసరమని దల్వాయి బాగా తెలుసు.
విష ప్రచారాలను ఎదుర్కోవడం
ముస్లింలు ఎల్లప్పుడూ మెజారిటీవాదానికి వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండాలి
మరియు అందువల్ల వారికి మతపరమైన గుర్తింపు అవసరం అనే కథనాన్ని దల్వాయి
అంగీకరించలేదు. భయంతో నడిచే రాజకీయాలు, దల్వాయి అభిప్రాయం
ప్రకారం, సమాజంలో ప్రతిచర్యాత్మక మతాధికార శక్తిని
బలోపేతం చేశాయి మరియు వాస్తవ పురోగతిని తీసుకురాలేదు.
భారతీయ ముస్లింలు ఈ రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు: పెరుగుతున్న
ఇస్లామోఫోబియా, అధికారంలో తక్కువ సీట్లు మరియు పెరుగుతున్న
ఆర్థిక మరియు సామాజిక పురోగతి మరియు వారి స్వంత సమాజంలో ఆధునికతకు ప్రతిఘటన కూడా
ఉంది. దల్వాయి ప్రకారం గుర్తింపు రాజకీయాల్లో లేదా బాధితులలో కూరుకుపోయే బదులు, ముస్లింలు సంస్కరణ, విద్య మరియు ఆధునిక రాజకీయాలపై దృష్టి పెట్టవచ్చు.
లౌకికవాదం ఒక మనుగడ సాంకేతికత Secularism
as a Survival Technique
దల్వాయికి, లౌకికవాదం అనేది సౌకర్యం కాదు, కేవలం మనుగడ వ్యూహం, భారతదేశం వంటి బహుళత్వం ఉన్న దేశంలో, ఏ సమాజం కూడా విచ్చినకర అంశాలలో చిక్కుకోవడం ద్వారా ఎప్పుడూ అభివృద్ధి
చెందదు.
భారతదేశంలో ముస్లిం రాజకీయాలకు దల్వాయి ఎందుకు అవసరం
దల్వాయి మరణానికి ముందు మరియు తరువాత భారతీయ ముస్లిం
రాజకీయాలను మనం గుర్తించినట్లయితే, దల్వాయి ఆలోచనకు తగిన
గుర్తింపు లభించలేదని మనం కనుగొంటాము. బదులుగా, ముస్లిం రాజకీయాలు రెండు వ్యూహాల మధ్య ఊగిసలాడుతూనే ఉన్నాయి:
రక్షణ రాజకీయాలు: మతపరమైన గుర్తింపును, ముఖ్యంగా వ్యక్తిగత చట్టాన్ని రక్షించడంలో ప్రభుత్వం తో శాశ్వత బేరసారాలు
సంకేత రాజకీయీకరణ Symbolic politicising లో మతపరమైన లేదా సమాజ-ఆధారిత పార్టీ
ప్రాతినిధ్యాన్ని హైలైట్ చేయడం. ఈ విధానం విస్తృత పొత్తులను ఏర్పరచదు లేదా
సామాజిక-ఆర్థిక ఎజెండా అంశాలను కోరదు.
ఈ వ్యూహం విఫలమైంది. ప్రస్తుతం, ముస్లింలు పార్లమెంటులో తక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు ప్రాప్యత లేకపోవడం మరియు సమాజ హింసకు ఎక్కువగా గురవుతున్నారు. ఇంతలో, మత నాయకులు ఇప్పటికీ సమాజంలో చర్చను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు, మార్పును ఇష్టపడరు మరియు విమర్శనాత్మక ఆలోచనలను అణచివేస్తారు.
దల్వాయి రాజకీయ ఆలోచనలు కొత్త
మార్గాన్ని ముందుకు తీసుకురాగలవు:
గుర్తింపు నుండి పౌరసత్వం వరకు ముస్లిం రాజకీయాలు గుర్తింపు ఆధారంగా
కాకుండా పౌరసత్వం ఆధారంగా ఉండాలి. "మైనారిటీ సమాజం"గా హక్కులను క్లెయిమ్
చేయడానికి బదులుగా, ముస్లింలు సమాన భారతీయ పౌరులుగా హక్కులను
క్లెయిమ్ చేసుకోవాలి. ఈ దృష్టి ముస్లింలు అట్టడుగున ఉన్న ఇతర సమూహాలతో
సహకరించడానికి వీలు కల్పిస్తుంది.
మతాధికారుల నియంత్రణ నుండి ప్రజాస్వామ్య నాయకత్వం వరకు
ముస్లిం రాజకీయాల్లో మతాధికారుల నియంత్రణకు వ్యతిరేకంగా దల్వాయి ఎప్పుడూ
హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆధునిక ప్రపంచంలో ముస్లిం రాజకీయ నాయకులు విద్య, సామాజిక సేవ మరియు అట్టడుగు కార్యకలాపాల నుండి
ఉద్భవించాలి, మతపరమైన అధికారం నుండి కాదు.
సింబాలిక్ సమస్యల నుండి నిజమైన సమస్యల వరకు
ముస్లిం రాజకీయాలు కేవలం మతపరమైన చిహ్నాలు మరియు వ్యక్తిగత చట్టంపై దృష్టి
పెట్టకూడదు. నిరుద్యోగం, గృహనిర్మాణంలో
అన్యాయమైన ప్రవర్తన, తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం మరియు
విద్యను పొందడం వంటి నిజమైన సమస్యలను కూడా పరిష్కరించాలి.
ప్రతిస్పందించడం మాత్రమే కాదు, అభివృద్ధి మరియు
పురోగతి వైపు సానుకూల చొరవ తీసుకోవడం కూడా భారతీయ ముస్లిం బాధ్యత అని దల్వాయి
నొక్కి చెప్పారు. ఆ సానుకూల విధానం నేటి అవసరం.
ఈరోజు భారతీయ ముస్లిం రాజకీయాలను ఎలా సుసంపన్నం చేయవచ్చు
దల్వాయి ఊహించిన విధంగా భారతీయ ముస్లిం రాజకీయాలను సంస్కరించడానికి, కొన్ని చర్యలు అవసరం.
1. విద్యే మూలస్తంభం.
ముస్లింలు ఆధునిక మరియు శాస్త్రీయ విద్యను నొక్కి చెప్పాలి. విద్య లేకుండా
సంస్కరణలు వ్యర్థమని దాల్వాయి అన్నారు. పాఠశాలల్లో, స్కాలర్షిప్లలో మరియు నైపుణ్య అభివృద్ధిలో పెట్టుబడి పెట్టండి. రాజకీయ
నాయకులు కేవలం మతపరమైన పాఠశాలలను కోరుతూ కాకుండా విద్యలో ప్రభుత్వ మద్దతును
పొందాలి.
2. కేంద్రంలో మహిళలు
దల్వాయి మహిళల హక్కులను బలంగా విశ్వసించారు.నేడు, ముస్లిం మహిళలను మార్పు అవసరమైన వ్యక్తులుగా
మాత్రమే కాకుండా రాజకీయ మరియు సామాజిక ఉద్యమాలలో నాయకులుగా కూడా చూడాలి.
3. లౌకిక భాగస్వామ్యాలను
ఏర్పరచుకోవడం
ముస్లిం రాజకీయాలు తనను తాను ఒంటరిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు దళితులు, ఆదివాసీలు,
OBCలు మరియు అన్ని ఇతర
అణగారిన వర్గాలతో పొత్తులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇటువంటి పొత్తులు రాజ్యాంగంలో
పొందుపరచబడిన న్యాయం, సమానత్వం మరియు హక్కులకు మద్దతుగా పెద్ద
వేదికను నిర్మించగలవు.
4. హేతుబద్ధమైన మరియు
ఉదారవాద ఆలోచనలను ప్రోత్సహించడం
ముస్లింలు హేతుబద్ధతను స్వీకరిస్తారని దల్వాయి ఆశించారు. ముస్లిం సంస్థలు చర్చ, కొత్త ఆలోచనలు మరియు కళాత్మక వ్యక్తీకరణకు
స్థలం కల్పించాలి. సమాజ మనస్సులను ప్రభావితం చేయడానికి రచయితలు, కళాకారులు మరియు మేధావులకు ప్రోత్సాహం అవసరం.
5. గుర్తింపు సమూహాల
వెలుపల రాజకీయ భాగస్వామ్యం
ముస్లిం పార్టీలు ఉన్నప్పటికీ, దల్వాయి ముస్లింలను
సాధారణ పార్టీలలోకి ప్రవేశించి, జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టాలి.
6. అంతర్గత
సంప్రదాయవాదాన్ని సవాలు చేయడం
అంతర్గత సంప్రదాయవాదాన్ని ఎదుర్కోకుండా ఎటువంటి పరివర్తన సాధ్యం కాదు.
దల్వాయి మతాధికారుల అధికారాన్ని బహిరంగంగా సవాలు చేశారు మరియు నేటి ముస్లింలు కూడా
ఇదే తరహాలో వ్యక్తిగత చట్టం, ఆధునికత మరియు బహుళత్వం
స్వీకరించాల్సిన అవసరం ఉంది. సంస్కరణ స్వరాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.
ఆధునిక సందర్భంలో దల్వాయి
దల్వాయి రాజకీయాలు కొన్ని రంగాలలో భారతీయ ముస్లింలకు
హెచ్చరిక లాంటివి.. ముస్లింలు గుర్తింపు ఆధారిత రాజకీయాలపై దృష్టి సారించి, మార్పును అంగీకరించకపోతే, వారు సమాజంలో మరియు రాజకీయాల్లో అసంబద్ధంగా
ఉంటారని దల్వాయి హెచ్చరించారు.
ప్రస్తుత భారతదేశంలో, ముస్లింలు అపనమ్మకం, శత్రుత్వం మరియు బహిష్కరణలను ఎదుర్కొంటున్నారు..
దల్వాయి రాజకీయాలు వారికి బలం మరియు శక్తిని తిరిగి పొందే మార్గాన్ని
అనుమతిస్తాయి. ముస్లింలు సంస్కరణ, ఆధునికత మరియు లౌకిక
పొత్తులను స్వీకరించగలుగుతారు.
హమీద్ దల్వాయి స్వల్ప జీవితాన్ని గడిపాడు, కానీ అది పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. హమీద్ దల్వాయి తన సమాజానికి కఠినమైన వాస్తవాలను ధైర్యంగా తెలియజేసారు మరియు ఆధునికతను మార్చుకోవాలని మరియు అంగీకరించాలని చెప్పారు. ముస్లింలు తమను తాము కేవలం మైనారిటీగా పరిగణించకూడదని, సమాన పౌరులుగా మరియు లౌకిక ప్రజాస్వామ్య రక్షకులుగా పరిగణించాల్సిన అవసరం ఉందని హమీద్ దల్వాయి తెలియజేశారు.
భారతీయ ముస్లిం రాజకీయాల్లో హమీద్ దల్వాయి నేడు ముఖ్యమైనవారు. భారతీయ ముస్లింలు దల్వాయి సూత్రాలను అవలంబిస్తే, వారు భారతదేశ ప్రజాస్వామ్యంలో తమ స్థానాన్ని తిరిగి పొందవచ్చుమరియు బలహీన మైనారిటీగా కాకుండా దృఢమైన, ప్రగతిశీల మరియు సమాన పౌరులుగా జీవించవచ్చు. . అదే హమీద్ దల్వాయి రాజకీయ ఆలోచనకు - మరియు భారతదేశంలో ముస్లిం రాజకీయాల భవిష్యత్తుకు నిజమైన నివాళి అవుతుంది.
Writer:
న్యూ ఏజ్ ఇస్లాం కరస్పాండెంట్, 8 సెప్టెంబర్ 2025
New Age Islam Correspondent, 8 September 2025
తెలుగు లో స్వేచ్చానువాదం:
ముహమ్మద్ అజ్గర్ అలీ, రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ సీనియర్ అద్యాపకులు,
తెనాలి.
He disowned Islam, he claims to be an Atheist.
ReplyDelete