ఫఖ్రుల్
హాజియా బేగం హసన్ 1870లో జన్మించారు. ఫఖ్రుల్ హాజియా బేగం తండ్రి ప్రభుత్వ ముద్రణాలయంలో (Government Printing Press) కాలిగ్రాఫర్గా (అందమైన అక్షర రచన చేసేవారు) పనిచేసేవారు. హాజియా బేగం తండ్రికి
బాంబే నుండి హైదరాబాద్కు బదిలీ కావడంతో, హాజియా హసన్ తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్కు
వచ్చారు మరియు క్రమంగా ఆ నగర సంస్కృతిలో మమేకమయ్యారు.
హైదరాబాద్
నిజాం పాలనలో తాలూక్దార్గా పనిచేసిన అమీర్ హసన్తో ఫఖ్రుల్ హాజియా బేగం వివాహం
జరిగింది. (హైదరాబాద్ రాజ్యంలో తాలూక్దార్ అంటే జిల్లా స్థాయి రెవెన్యూ మరియు
పరిపాలనా అధికారి). ఫఖ్రుల్ హాజియా హసన్, అమీర్ హసన్ యొక్క మూడవ భార్య.
ఫఖ్రుల్ హాజియా
బేగం హసన్ మరియు అమీర్ హసన్లకు మొత్తం 14 మంది
పిల్లలు ఉన్నారు.అమీర్ హసన్ ఉద్యోగ రీత్యా ఆ కుటుంబం ఒక ప్రాంతం నుండి మరొక
ప్రాంతానికి మారాల్సి వచ్చేది,. ఫలితంగా, ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ తన
మాతృభాష అయిన పర్షియన్, ఇంట్లో మాట్లాడే ఉర్దూ, అలాగే ఇంగ్లీష్ మరియు కొద్దిగా ఫ్రెంచ్ భాషలతో పాటు అనేక ప్రాంతీయ భాషలను
కూడా నేర్చుకున్నారు.
ఫఖ్రుల్ హాజియా
బేగం హసన్ దృఢ సంకల్పం మరియు పట్టుదల
కలిగిన మహిళ; విశాలమైన మరియు చురుకైన ఆలోచనా దృక్పథం కలిగినవారు,
పాఠశాల
రోజుల్లో ఫఖ్రుల్ హాజియా బేగం సరోజినీ నాయుడును కలిశారు, వారిద్దరూ
మంచి స్నేహితులయ్యారు. సరోజినీ నాయుడు స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొనడం
ప్రారంభించినప్పుడు, ఫఖ్రుల్ హాజియా బేగం హసన్, సరోజినీ నాయుడు ప్రభావానికి లోనయ్యారు. ఫఖ్రుల్
హాజియా బేగం హసన్ ఖరీదైన
విదేశీ వస్త్రాలను వదిలివేసి, సాధారణ ఖాదీ చీరలను ధరించడం మొదలుపెట్టారు. అలాగే తన కుమారులు కూడా ఖాదీ
దుస్తులు మరియు టోపీలు ధరించేలా చేశారు.
1921లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని
ప్రారంభించి, ప్రజలు విదేశీ వస్తువులను వదిలి స్వదేశీ ఉత్పత్తులను స్వీకరించాలని
పిలుపునిచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా ప్రజలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఈ ఉద్యమంలో
భాగంగా, హైదరాబాద్లోని ట్రూప్ బజార్లో ఉన్న "ఆబిద్ మంజిల్" ఆవరణలో
విదేశీ వస్త్రాల దహన కార్యక్రమం నిర్వహించారు. ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ తన
కుమారులు మరియు కుమార్తెలతో కలిసి, తమ పరిచయస్తులు మరియు పొరుగువారి నుండి విదేశి వస్త్రాలను
సేకరించడమే కాకుండా, వారిని కూడా సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు.
తన కుమారుల
ఉన్నత విద్య కోసం ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ వారిని చదువు కోసం జర్మనీకి పంపాలని
నిర్ణయించుకున్నారు. ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ పెద్ద కుమారుడు మెహదీ హసన్ లీప్జిగ్లో పీహెచ్డీ
పూర్తి చేశారు. రెండవ కుమారుడు జాఫర్, హైడెల్బర్గ్లో తన చదువును పూర్తి చేశారు.
హాజియా బేగం
ఇంకో కుమారుడు అబిద్ హసన్ సఫ్రానీ ఇంజనీరింగ్ చదవడానికి బెర్లిన్లోని టెక్నిష్
హోచ్స్కూల్కు వెళ్లారు. తన చదువు సమయంలో, అబిద్ హసన్ జర్మనీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ను
కలుసుకుని స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు.
ఫఖ్రుల్ హాజియా హసన్ తన కుమారులను అద్భుతంగా
తీర్చిదిద్దారు; వారు తర్వాతి కాలంలో హైదరాబాద్లో
ప్రసిద్ధ "హసన్ సోదరులు"గా గుర్తింపు పొందిన ప్రముఖ మరియు శక్తివంతమైన
స్వాతంత్ర్య సమరయోధులుగా ఎదిగారు. ఫఖ్రుల్ హాజియా హసన్ బేగం మరియు ఆమె కుమారులు స్వాతంత్ర్య పోరాటంలో
భాగమయ్యారు.
ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ కుమారుడు ఆబిద్ హసన్ INA (ఆజాద్ హింద్ ఫౌజ్)లో కీలక బాధ్యతలు
నిర్వహించారు, ప్రసిద్ధ నినాదమైన "జై
హింద్"ను అందించిన ఘనత కూడా ఆబిద్ హసన్ కే దక్కుతుంది.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి మరియు INA పతనం తర్వాత, 1945 ఆగస్టు ప్రాంతంలో, బ్రిటిష్ దళాలు ఆబిద్ హసన్ను అరెస్టు
చేసి సింగపూర్లోని ఒక జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచాయి.
INA విచారణలుగా
పిలువబడే 'ఎర్రకోట విచారణల' (Red Fort Trials) సమయంలో, ఆబిద్ హసన్ పై దేశద్రోహం ఆరోపణలతో విచారణ జరిగింది. ఆబిద్ హసన్ తో
పాటు, అనేకమంది ఇతర INA అధికారులు కూడా మరణశిక్ష లేదా కఠిన
శిక్షల ముప్పును ఎదుర్కొన్నారు.
ఆ సమయంలో, ఫఖ్రుల్
హాజియా బేగం హసన్ స్వయంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్
నెహ్రూ మరియు సరోజినీ నాయుడులను కలిసి, తన
కుమారుడితో పాటు ఇతర INA అధికారుల విడుదలకు మద్దతు కూడగట్టేలా
ప్రచారం చేశారు.
స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం ఉన్న రాజకీయ
నాయకులు మరియు గవర్నర్-జనరల్ లార్డ్ మౌంట్బాటన్ జోక్యం, అలాగే పెరుగుతున్న ప్రజా ఒత్తిడి
కారణంగా, చివరికి INA ఖైదీలు విడుదలయ్యారు.
ఇతర INA ఖైదీల
పట్ల ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ చూపిన మాతృత్వపు ఆప్యాయతను చూసి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ (నేతాజీ), మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరియు జాకీర్
హుస్సేన్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ ను
ఆప్యాయంగా "అమ్మజాన్" అని పిలవడం ప్రారంభించారు.
ఫఖ్రుల్ హాజియా బేగం హసన్ తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారు.
No comments:
Post a Comment