చౌదరి జబర్దస్త్ ఖాన్ త్యాగీ ఉత్తర ప్రదేశ్లోని హాపూర్లోని భండా పట్టికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు చౌదరి జబర్దస్త్ ఖాన్ త్యాగీ హాపూర్లోని ఒక ప్రముఖ భూస్వామ్య కుటుంబానికి చెందినవారు.జబర్దస్త్ ఖాన్ 1857 భారత తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్థానిక బలగాలను సమీకరించారు.
జబర్దస్త్ ఖాన్, నవాబ్ వలీదాద్ ఖాన్కు సన్నిహిత మిత్రుడు. 1857లో హాపూర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ఆరుగురు తమ్ముళ్లతో కలిసి విప్లవ దళాలకు నాయకత్వం వహించాడు.
చరిత్రకారుడు విఘ్నేష్ కుమార్ రాసిన వివరాల ప్రకారం, 1857 నాటికి నవాబ్ చౌదరి జబర్దస్త్ ఖాన్ నలభై ఏళ్ల వయసులో మంచి పలుకుబడి కలిగి అనుచరులను సమీకరించుకున్నారు. గులావతి ప్రాంతాన్ని నవాబ్ వలీదాద్ ఖాన్ స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి దానిని పాలించాలనే అవగాహన వారి మధ్య ఉండేది. అత్యంత రహస్యంగా పనిచేస్తూ, జబర్దస్త్ ఖాన్ హాపూర్ నుండి గఢ్-గంగా వరకు ఉన్న భూభాగాన్ని నియంత్రించారు మరియు మలగఢ్కు చెందిన నవాబ్ వాలిదాద్ ఖాన్తో పొత్తు పెట్టుకున్నారు. జబర్దస్త్ ఖాన్ ప్రతిఘటనను సమర్థవంతంగా సమన్వయం చేయడానికి మరియు బ్రిటిష్ దళాలపై దాడి చేయడానికి తన కార్యకలాపాలను అత్యంత రహస్యంగా అమలు చేసేవారు. బ్రిటిష్ దళాల నుండి గులావతిని స్వాధీనం చేసుకోవడంలో జబర్దస్త్ ఖాన్ కీలక పాత్ర పోషించారు.
1857 సెప్టెంబరులో ఢిల్లీ పతనమైన తర్వాత నవాబ్ వలీదాద్ ఖాన్ దళాలు ఎదురుదెబ్బలు తిన్నాయి, అలాగే అక్టోబరులో జబర్దస్త్ ఖాన్ కూడా ఓటమిని చవిచూశారు. 1857 అక్టోబర్లో తన ఆరుగురు తమ్ముళ్లతో పాటు బ్రిటిష్ దళాలచే అరెస్టు చేయబడ్డాడు. బ్రిటిష్ వారు జబర్దస్త్ ఖాన్ ను, ఆయన ఆరుగురు తమ్ముళ్లను బంధించి, ప్రజలందరూ చూస్తుండగా ఒక రావి చెట్టుకు ఉరితీశారు; అయితే ఆ ఉరివేతతో జబర్దస్త్ ఖాన్ మరణించలేదు. దాంతో, విల్సన్ అనే ఆంగ్ల అధికారి జబర్దస్త్ ఖాన్ కాల్చి చంపాడు.
జబర్దస్త్ ఖాన్ ను చంపిన మరియు ఆయన సోదరులను
ఉరితీసిన ఆ రావి చెట్టు ఉన్న ప్రదేశం, ప్రస్తుతం
హాపూర్-బులంద్షహర్ రోడ్డుపై ఉన్న హాపూర్ తహసీల్ కార్యాలయానికి మరియు టెలిఫోన్
ఎక్స్ఛేంజ్ భవనానికి ఆనుకుని ఉన్న గోడ వద్ద ఉంది.
No comments:
Post a Comment