9 May 2025

కేరళ అక్షరాస్యత మిషన్‌ ఐకాన్‌ కె వి రబియా, 59 సంవత్సరాల వయసులో మరణించారు K V Rabiya, an icon of Kerala’s literacy mission, dies at 59

 



 

తిరురంగడి (మలప్పురం జిల్లా), కేరళ :

కేరళ వయోజన అక్షరాస్యత కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించిన కె వి రబియా 59 సంవత్సరాల వయస్సులో మలప్పురంలో మరణించారు. మలప్పురం జిల్లాలోని వెల్లికక్కడ్‌కు చెందిన రబియా, వికలాంగుల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసింది మరియు వేలాది మంది మహిళలు అక్షర ప్రపంచంలోకి ప్రవేశించడానికి ప్రేరణనిచ్చింది.

.పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే, రబియాకు 12 సంవత్సరాల వయసులో పోలియో సోకింది, అది చివరికి రబియాను దివ్యాంగురాలిగా మార్చింది. అయినప్పటికీ, రబియాతన పాఠశాల విద్యను పూర్తి చేసి కళాశాలలో చేరింది. అయితే, డిగ్రీ కోర్సు పూర్తి చేయలేకపోయింది.

ఆ తర్వాత రబియా పుస్తక ప్రపంచం లో అడుగు బెట్టి సైన్స్ నుండి సాహిత్యం వరకు ప్రతిదీ చదవడం ప్రారంభించింది. వీల్‌చైర్‌లోనే నడిచే రబియా, నామమాత్రపు రుసుముతో స్థానిక పిల్లలకు ట్యూషన్ తరగతులు తీసుకోవడం కూడా ప్రారంభించింది.

1980ల చివరలో ప్రారంభమైన కేరళ అక్షరాస్యత ఉద్యమంలో రబియా భాగమైంది రబియా జూన్ 1990లో స్థానిక వృద్ధ మహిళలు మరియు గృహిణులకు  అక్షరాస్యత తరగతులను బోధించడం ప్రారంభించింది సనాతన కుటుంబాలకు చెందిన మహిళలకు  విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి వారికి తరగతులపై ఆసక్తి కలిగించినది..

త్వరలోనే రబియా పూర్తి సమయం అక్షరాస్యత బోధకురాలిగా మారింది. తరువాత, రబియా మహిళల కోసం ఒక లైబ్రరీని కూడా స్థాపించింది మరియు రోడ్లు, విద్యుత్, టెలిఫోన్ మరియు నీటి కనెక్షన్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేని తన ప్రాంతం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.

రబియా చలనం (ఉద్యమం) Chalanam (movement) అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది, సాహిత్య కార్యక్రమాలకు కూడా నాయకత్వం వహించింది.

రబియా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఆరు పాఠశాలలను ప్రారంభించింది మరియు ఒక చిన్న తరహా తయారీ యూనిట్ ద్వారా 250 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి సాధికారత కల్పించింది. వరకట్నం మరియు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ఉద్యమంలో ముందంజలో ఉంది. మలప్పురంలో ఇ-అక్షరాస్యత అక్షయ Akshaya కార్యక్రమంలో కూడా రబియా చురుకుగా పాల్గొంది.

2000 సంవత్సరంలో, రబియాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, రబియా దానిని అధిగమించి, సామాజిక సేవకు తిరిగి వచ్చింది.

రబియా తన ఆత్మకథ, స్వప్నంగల్క్కు చిరాకుకలుండు (కలలకు రెక్కలు ఉన్నాయి Swapnangalkku Chirakukalundu (Dreams Have Wings))లో, తన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని మరియు తన కలలను ఎలా సాధించానో  చెప్పింది. రబియా జ్ఞాపకం, మౌన నోంబరంగల్ Mouna Nombarangal (నిశ్శబ్ద బాధలు)తో సహా మరో నాలుగు పుస్తకాలను కూడా రచించింది. రబియా జీవితంపై రబియా మూవ్స్ Rabiya Moves అనే డాక్యుమెంటరీ కూడా రూపొందించబడింది.

2000లో కేంద్ర ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కన్నగి దేవి స్త్రీ శక్తి పురస్కార్‌తో సహా రబియా అనేక గౌరవాలను అందుకుంది. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సంయుక్తంగా ఏర్పాటు చేసిన పేదరిక వ్యతిరేక యువ వాలంటీర్ అవార్డును కూడా రబియా గెలుచుకుంది.

2022లో, సామాజిక సేవకు గాను రబియా కు పద్మశ్రీ పురస్కారం లభించింది

 

మూలం: ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, తిరువనంతపురం, మే 05, 2025

 

No comments:

Post a Comment