ఢాకా మస్లిన్ వస్త్రం యొక్క నాజుకుతనం,సున్నితత్వం అద్వితియమైనది. ఢాకా మస్లిన్ దారాల కౌంట్ 1,200 వరకు ఉండేది, కానీ ఇటీవలి సంవత్సరాలలో అత్యధికంగా 300 వరకు సాధించబడింది
ఢాకా
మస్లిన్ మేఘనా నది యొక్క సారవంతమైన మైదానాలలో ప్రత్యేకంగా పెరిగే ఫుటి కర్పాస్
పత్తి మొక్క నుండి ఉద్భవించింది. అత్యుత్తమ మస్లిన్ను తరతరాలుగా మాస్టర్
కళాకారులు మాత్రమే నేయగలరని చెబుతారు.
తాంటిస్ అని పిలువబడే ఈ కళాకారులు మస్లిన్ను చాలా సన్నగా మరియు తేలికగా
నేసేవారు, మస్లిన్ తరచుగా "చర్మంపై మేఘాల పోర ను" పోలి ఉండేది. మొఘల్ మహిళా పరిచారకులు సన్నటి మస్లిన్ యొక్క అనేక పొరలలో కప్పబడి ఉన్నారని యూరోపియన్
ప్రయాణికులు గుర్తు చేసుకున్నారు. ముస్లిన్ వస్త్రం యొక్క పారదర్శకత మరియు
అతీంద్రియ సౌందర్యం అసమానమైనవి.
అరబ్ వ్యాపారి సులేమాన్ తన పుస్తకం, “సిల్సిల్టు-టి తవారిఖ్” లో ఢాకా మస్లిన్ గురించి, ఇలా రాశాడు, “మస్లిన్ చాలా చక్కగా మరియు సున్నితంగా ఉంటుంది, దానితో తయారు చేసిన దుస్తులను సిగ్నెట్-రింగ్ ద్వారా
పంపవచ్చు. ఇది పత్తితో తయారు చేయబడింది.”
మస్లిన్ రకాలకు అబ్రవాన్ ("ప్రవహించే నీరు") మరియు బాఫ్ట్-హవా ("నేసిన గాలి") abrawan (“running water”) and baft-hawa (“woven air”) వంటి కవితా పేర్లు ఇవ్వబడ్డాయి,. మస్లిన్తో తయారు చేసిన మొత్తం వస్త్రాలు రింగ్ గుండా వెళతాయి.
మొఘల్ ఆస్థానంలో మస్లిన్
మొఘల్ చక్రవర్తుల పోషణలో, ఢాకా మస్లిన్ ప్రతిష్ట పరాకాష్టకు చేరుకుంది. అక్బర్ చక్రవర్తి తన “ఐన్-ఇ-అక్బరి”లో వివిధ రకాల మస్లిన్ బట్టలను జాగ్రత్తగా జాబితా చేశాడు, అత్యుత్తమమైన, మాల్మల్ ఖస్సాను ప్రత్యేకంగా రాజ ఉపయోగం కోసం రిజర్వు చేశాడు. ఈ ఫాబ్రిక్ చక్రవర్తి వార్డ్రోబ్లలో ఒక ముఖ్యమైన భాగం, ముఖ్యంగా భారతదేశంలోని తీవ్రమైన వేసవి వేడి నుండి ఉపశమనం కలిగించే సామర్థ్యం కోసం ఇది విలువైనది.
అక్బర్ వారసుడు జహంగీర్, మస్లిన్
యొక్క సద్గుణాలను ప్రశంసించాడు, దీనిని
"స్వల్పంగా వీచే గాలితో నృత్యం చేయడం"గా అభివర్ణించాడు.⁶ మస్లిన్తో తయారు చేసిన రాజ వస్త్రాలు తరచుగా బంగారం
మరియు వెండి దారాలతో అలంకరించబడి ఉండేవి. మొఘల్ ఆచార పద్ధతుల్లో మస్లిన్ను
ఉపయోగించడం ఒక ప్రత్యేక ఆకర్షణీయమైన సంప్రదాయం. ఇది స్వచ్ఛత మరియు గొప్పతనాన్ని
సూచింటానికి ఉపయోగించబడింది. మతపరమైన మరియు దౌత్యపరమైన ఆచారాలలో మస్లిన్ ఉనికి
దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంచింది, మస్లిన్ శుద్ధి మరియు ప్రతిష్టకు పర్యాయపదంగా మారింది.
ఢాకా మస్లిన్ మరియు యూరోపియన్ అరిస్టోక్రటీస్
ఢాకా మస్లిన్ యొక్క కీర్తి ఉపఖండం దాటి చాలా దూరం వ్యాపించింది, 17వ మరియు 18వ శతాబ్దాలలో యూరోపియన్ కులీనులను ఆకర్షించింది. మస్లిన్ వస్త్రాన్ని ఐరోపాకు పరిచయం చేసిన వారిలో పోర్చుగీసు వారు మొదటివారు, తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని లాభదాయకమైన ఎగుమతిగా మార్చింది.
ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటోనిట్టే మస్లిన్ గౌన్లను ఆరాధించింది. ఫ్రెంచ్ ప్రభువులు తరచుగా తేలిక మరియు పారదర్శకంగా ఉండే మస్లిన్ దుస్తులు ధరించేవారు. బ్రిటన్లో, మస్లిన్ అధునాతనతకు చిహ్నంగా మారింది,
యూరోపియన్ కవులు మరియు రచయితలు తరచుగా ఢాకా మస్లిన్ను దైవిక అందంతో
పోల్చారు. కొందరు దీనిని "చంద్రకాంతి దారాలు"గా అభివర్ణించారు, మరికొందరు దాని ఆకృతిని మేఘం యొక్క సున్నితమైన
స్పర్శతో పోల్చారు.
ఢాకా మస్లిన్ విషాద పతనం
ప్రపంచవ్యాప్త ప్రశంసలు ఉన్నప్పటికీ, వలస పాలన మరియు పారిశ్రామికీకరణ ప్రారంభంతో ఢాకా మస్లిన్ విషాదకరమైన
క్షీణతను ఎదుర్కొంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నేత కార్మికులపై
తీవ్రమైన పన్నులు విధించింది, అనేక మందిని
పేదరికంలోకి నెట్టివేసింది. అభివృద్ధి చెందుతున్న మస్లిన్ నేత సంఘాలను క్రమబద్ధంగా
కూల్చివేసారు.
బ్రిటన్లో పారిశ్రామికీకరణ వలన మస్లిన్ కు దెబ్బ తగిలింది. మాంచెస్టర్లోని
యాంత్రిక వస్త్ర మిల్లులు చౌకైన, యంత్రాలతో
తయారు చేసిన బట్టలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి, ఇవి ప్రపంచ మార్కెట్లను ముంచెత్తాయి, చేతితో నేసిన మస్లిన్ పోటిను తట్టుకోలేక పోయింది. . పోటీని తొలగించడానికి
బ్రిటిష్ అధికారులు చేతితో నేసే మస్లిన్మాస్టర్
వీవర్ల బొటనవేళ్లను కత్తిరించాలని ఆదేశించారు.
10వ శతాబ్దం ప్రారంభంలోనే, ఒక
అరబ్ యాత్రికుడు “ఈ వస్త్రాలు ... మధ్యస్థ పరిమాణంలో ఉన్న వలయం ద్వారా లాగగలిగేంత
సూక్ష్మంగా నేయబడ్డాయి.
ముఖ్యంగా ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, ఫుటి కర్పాస్ మొక్క నిర్లక్ష్యం కారణంగా అంతరించిపోయింది. తరతరాలుగా
అందించబడిన మస్లిన్ వడకడం మరియు నేయడం యొక్క సంక్లిష్టమైన జ్ఞానం బెంగాల్ కళాకారులు
కోల్పోయినారు.
సాంస్కృతిక వారసత్వం మరియు ఆధునిక పునరుజ్జీవనం
ఢాకా మస్లిన్ సాంస్కృతిక వారసత్వం కొనసాగుతుంది. బ్రిటిష్ మ్యూజియం మరియు విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం వంటి మ్యూజియంలు మస్లిన్ బట్ట యొక్క నమూనాలను సంరక్షిస్తాయి, వాటిని కోల్పోయిన యుగం నుండి సంపదగా పరిగణిస్తాయి. మస్లిన్ వస్త్ర పరిపూర్ణ సౌందర్యం సందర్శకులలో విస్మయాన్ని రేకెత్తిస్తూనే ఉంది.
ఇటీవలి సంవత్సరాలలో, ఢాకా
మస్లిన్ను పునరుద్ధరించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బంగ్లాదేశ్ పరిశోధకులు, సంవత్సరాల తరబడి ప్రయోగాల తర్వాత, ఫుటి కర్పాస్ ప్లాంట్ విజయవంతంగా తిరిగి
కనుగొన్నారు. సాంప్రదాయ నేత కార్మికులకు ఇప్పుడు వారి పూర్వీకుల సంక్లిష్టమైన
డిజైన్లు మరియు పద్ధతులను ప్రతిబింబించడానికి శిక్షణ ఇస్తున్నారు.
ఆరు మీటర్ల పొడవున్న ఢాకా మస్లిన్ చీరను నేయడం ఒక అద్భుతమైన ఆధునిక
చొరవ,నేయడానికి ఆరు నెలలకు పైగా పట్టింది. నేడు, ఢాకా మస్లిన్ను విలాసవంతమైన వస్త్రంగా తిరిగి
పరిచయం చేస్తున్నారు,
ఢాకా మస్లిన్ చరిత్రలో అత్యంత అసాధారణమైన వస్త్రాలలో ఒకటిగా
మిగిలిపోయింది, మొఘలుల సామ్రాజ్య న్యాయస్థానాల నుండి
యూరప్లోని సెలూన్ల వరకు,
ఇది సాంస్కృతిక అధునాతనత యొక్క ఎత్తును
సూచిస్తుంది. మస్లిన్ క్షీణత పారిశ్రామికీకరణ మరియు వలస దోపిడీ నేపథ్యంలో
చేతివృత్తుల సంప్రదాయాల దుర్బలత్వాన్ని గుర్తు చేస్తుంది.
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న పునరుజ్జీవన ప్రయత్నాలు ఈ "నేసిన గాలి"
యొక్క శాశ్వత ఆకర్షణకు నిదర్శనం. ఢాకా మస్లిన్ కేవలం వస్త్రం కంటే ఎక్కువ - అందం, చాతుర్యం మరియు మానవ సృజనాత్మకతకు చిహ్నం.
No comments:
Post a Comment