22 June 2025

భారతదేశంలో మొట్టమొదటి చెవిటి, మూగ మరియు అంధుల కోసం ఏర్పాటు చేయబడిన మదర్సా India’s First Inclusive Madrasa for the Deaf, Mute and Blind

 



పుణే (మహారాష్ట్ర):

2011 జనాభా లెక్కల ప్రకారం, భారత దేశ జనాభాలో సుమారు 2.2%, అంటే దాదాపు 26.8 మిలియన్ల మంది, వైకల్యంతో జీవిస్తున్నట్లు గుర్తించారు.సాధారణం గా భారతదేశంలో వైకల్యం ఉన్న పిల్లలు తరచుగా పాఠశాలల నుండి డ్రాప్-అవుట్ అవుతారు, అవకాశాలు నిరాకరించబడతారు మరియు భారంగా పరిగణించబడతారు. సమాజం వారికి ప్రత్యామ్నాయాలు అందించదు కాబట్టి చాలామంది పిల్లలు భిక్షాటన చేయడం లేదా ఒంటరిగా ఉండటం జరుగుతుంది,.

మహారాష్ట్రలోని పూణేలో గల మదర్సా  జామియా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్‌లో భారతదేశంలోని అంతటా 17 రాష్ట్రాల నుండి మూగ, చెవిటి మరియు దృష్టి లోపం ఉన్న వికలాంగ ముస్లిం విద్యార్థులకు ఉచిత ఇస్లామిక్ మరియు సమకాలీన విద్యను అందిస్తుంది.

జామియా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ (ఒక మతపరమైన పాఠశాల/సెమినరీ)సంస్థ 2013లో స్థాపించబడింది మదరసా జామియా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ భారత దాదాపు 210 మంది మూగ, చెవిటి మరియు అంధ విద్యార్థులకు (యువతీ-యువకులకు)కు ఉచిత ఇస్లామిక్ మరియు సమకాలీన విద్యను అందిస్తుంది.

మహారాష్ట్రలోని పూణేలోని జామియా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్‌ మదర్సా లో  ప్రస్తుతం 70 మందికి పైగా వికలాంగ బాలికలకు కూడా విద్యను అందిస్తోంది

జామియా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ లోగల చాలా మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల నుండి వస్తారు, ఇక్కడి చాలా మంది విద్యార్థులు భారతదేశం అంతటా వివిధ వేదికలపై తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలను పొందారు. చాలామంది తమ పాఠశాలకు ప్రాతినిధ్యం వహించారు మరియు వివిధ రంగాలలో స్థానాలను పొందారు.

జామియా మదరసా 1 నుండి 12వ తరగతి వరకు సైన్స్, కంప్యూటర్లు, ఇస్లామిక్ అధ్యయనాలు మరియు ఉన్నత విద్య వంటి అంశాలతో సహా ఉచిత విద్యను అందిస్తుంది.

జామియా మదరసా విద్యార్థులు వివిధ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలలో ప్రవేశం పొందారు. జామియా మదర్సా ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. జామియా మదరసా విద్యార్ధిని-విద్యార్ధులకు విద్య, ఆహారం, వసతి మరియు యూనిఫాంలు కూడా ఉచితంగా అందించబడతాయి.

2021లో, జామియా మదర్సా మూగ, అంధ మరియు చెవిటి మహిళల కోసం ప్రత్యేక విభాగాలను ప్రారంభించింది,

మదరసా జామియా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్‌లో, దృష్టి లోపం ఉన్న పిల్లలకు మతపరమైన మరియు అధికారిక విద్యను పొందడానికి ఉపకరణాలు మరియు మద్దతు ఇవ్వబడుతుంది.

జామియా మదర్సా విద్యార్ధినుల కోసం మహిళా సహాయకులతో ప్రత్యేక గదులను ఏర్పాటుచేసింది.

వికలాంగ విద్యార్థులు నాణ్యమైన విద్య, సరైన మౌలిక సదుపాయాలు మరియు క్యాంపస్‌లో ఆట మరియు సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనే అవకాశాలను పొందేలా మదరసా జామియా కృషి చేస్తోంది. వారు ఇతర విద్యార్థుల మాదిరిగానే పోటీ పడటానికి మరియు అభివృద్ధి చెందడానికి వారికి సమాన అవకాశాలను అందించడం జామియా మదరసా లక్ష్యం.

జామియా మదరసా ఇప్పటికే డిజిటల్ లెర్నింగ్ టూల్స్, స్మార్ట్ బోర్డులు మరియు సమగ్ర సౌకర్యాలను అందిస్తోంది, తద్వారా విద్యార్థులు ఆధునిక మరియు అందుబాటులో ఉండే విద్యను పొందుతున్నారు. జామియా సాంకేతికత మరియు అనుకూలీకరించిన బోధనా పద్ధతుల ద్వారా తన పరిధిని ఆవిష్కరిస్తూ మరియు విస్తరిస్తూనే ఉంది.

జామియా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ వికలాంగ పిల్లలకు నాణ్యమైన ఇస్లామిక్ మరియు సమకాలీన విద్యను అందిస్తూనే ఉంది, వారికి జ్ఞానం మరియు విశ్వాసంతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

No comments:

Post a Comment