4 April 2016

యంగర్ మ్యానేజ్మెంట్( Anger Management)లేదా కోపాన్ని నిగ్రహించడం- నిర్వహణ పద్దతులు.


కోప నిర్వహణ లేదా యంగర్ మ్యానేజ్మెంట్(Anger Management) అనగా  కోపాన్ని నియంత్రిచుటకు అవసరమైన  నిగ్రహాన్ని పాటించడం లో శిక్షణ మరియు ప్రశాంతత సాధన లో  నైపుణ్య౦ పొందుట  గా చెప్పవచ్చును. కోపం సాధారణంగా  చిరాకు వలన మరియు  ముఖ్యమైనది పొందటం లో వైఫల్యం వలన  ఏర్పడును. కోపం అంతర్లీన భయం లేదా చేతకానితనం వంటి  భావాలకు  ఒక నిరోధ(defencise)   స్పందనగా  ఉంటుంది. కోపం నిర్వహణ కార్యక్రమాలను  తార్కికంగా విశ్లేషించ వచ్చును. గుర్తించదగిన కారణం వలన పొందిన ఒక ప్రేరణ గా  కోపం ను భావిoచ వచ్చును.

 కోప నిర్వహణ సిద్ధాంతం ప్రాథమికంగా మనిషి కోపానికి మూలకారణాలు గుర్తించడానికి మరియు వాటిని అతని జీవితం నుండి తొలగించడానికి ప్రయత్నిస్తుంది.  కోపం పొందినప్పుడు మానవుడు  తన కోపం అధిగమించడానికి వివిధ చర్యలు తీసుకోoటాడు  మరియు అందులో  అతను విఫలమైతే అప్పుడు అతను  అనేక ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇస్లాం గట్టిగా తమ కోపం నియంత్రించుకోమని  ప్రజలను ప్రోత్సహిస్తుంది.  అల్లాహ్ దివ్య ఖురాన్ లో అంటాడు: “ కలిమిలో, లేమిలో, ఏ స్థితి లో ఉన్నా తమ సంపదను ఖర్చుచేసే వారు, కోపాన్ని దిగ మ్రింగుకొనే వారు,ఇతరుల తప్పులను క్షమించే వారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” 3: 134. 

ఒక మనిషి ప్రవక్త (స) వద్దకు వచ్చి  "నాకు సలహా ఇవ్వండి." అని అడిగాడు. ప్రవక్త(స) అతనితో” కోపo పొందవద్దు” అన్నారు.  ఆ మనిషి పదేపదే అడిగిన ఆ ప్రశ్న కు సమాధానంగా ప్రవక్త(స) ప్రతిసారీ అదే జవాబి చ్చారు. (బుఖారి)

కోప నిర్వహణ లేదా యంగర్ మ్యానేజ్మెంట్
మొదటి దశ -కోపానికి కారణాలు:
ఇస్లాం అట్టడుగు స్థాయి నుండి ప్రతి సమస్యను  పరిష్కరించడానికి కృషిచేస్తుంది. కోపం పట్ల  కూడా ఇస్లాం అలాగే ప్రవర్తిస్తుంది. ఒక వ్యక్తి యొక్క కోపానికి ఉన్న కొన్ని   సాధారణ కారణాలు ఈ విధంగా వివరించ వచ్చు:
I. ఆహoకారం:
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "భూమి పై విర్రవీగుతూ నడవ కండి. మీరు భూమిని చిల్చను లేరు, పర్వతాల ఎత్తుకు చేరలేరు.” 17:37. ఇస్లాం మతం అహంకారం మరియు దురహంకారం నుండి నుండి ప్రజలను  నిషేధిస్తుంది. ఏదో ఒక దానిపై  అహంకారం కలిగి ఉన్నప్పుడు, మానవుడు చాలా వేగంగా కోపం పొందుటకు అవకాశం ఉంది అది అతని  పరిపూర్ణ అజ్ఞానం నకు కారణం అవుతుంది.

II. దురాశ
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "అల్లాహ్ తన అనుగ్రహాన్ని విరివిగా  ప్రసాదించినప్పటికి పిసినారితనం చూపే వారు, ఈ పిసినారితనం తమకు మేలైనదని భావించరాదు. కాదు, ఇది వారికొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కుడబెడుతూ ఉన్నదే ప్రళయం నాడు వారి పాలిట కంఠపాశం అవుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. మీరు ఏదైతే చేస్తారో అది అల్లాహ్ కు తెలుసు.” - 3: 180.
పై వాక్యాలు అత్యాశ నుండి ప్రజలను విముఖులను చేస్తుంది.   అత్యాస వ్యక్తి   కోరికలు పెంచుతుంది మరియు వ్యక్తుల అత్యాశ కు అంతం ఉండాలి. తాను కోరుకున్నది పొందలేన్నప్పుడు, అది కోపం కు దారితీస్తుంది.

III. అసూయ
ప్రవక్త ముహమ్మద్ (స)అన్నారు: "ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల కోపం  తో ఉండరాదు మరియు అసూయా తో ఉండరాదు, ఇతరుల పట్ల మొఖం తిప్పుకోరాదు మరియు అల్లాహ్ యొక్క బానిసలు గా ఉండాలి అని  అన్నారు. మూడు రాత్రులు కంటేఎక్కువ  తన సోదరుడిని  త్వజించుట ఒక ముస్లిం వ్యక్తి కి హలాల్ కాదు. "-మాలిక్.
 ఇస్లాం మతం సామరస్యం మరియు బంధం మీద గొప్ప ప్రాముఖ్యత ఉంచుతుంది. చేదు భావాలు కోపం మరియు చివరికి సంబంధాల విచ్చిన్నానికి   దారితీయును.కాబట్టి మనస్సు లో అట్టి  ఘోరమైన భావాలు ఉoడకుండా  వాటిని నివారించుట  అవసరం.

IV. గూఢచర్యం మరియు అనుమానం:
“విశ్వాసులారా! అతిగా అనుమానించడం మాని వేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గుడాచారులుగా వ్యవరించకండి. మీలో ఎవరూ ఎవరిని పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకోంటారు. అల్లాహ్ కు బయపదండి. అల్లాహ్ అత్యధికంగా పశ్చాతాపాన్నిస్వికరించేవాడు, కరుణిoచేవాడు.”-దివ్య ఖురాన్ 49:12.
ఇతరులపై  గూఢచర్యం చేయుటవలన అతనికి వ్యక్తులను గురించిన చాలా నిజాలు తెలుస్తాయి దానితో అతడు వారి పట్ల వ్యతిరేక దృక్పదం ఏర్పరచు కొంటాడు అది చివరకు  కోపానికి  దారితీస్తుంది.

రెండోవ దశ -కోపాన్ని అధిగమించుట:
ప్రవక్త ముహమ్మద్ (స) ప్రకారం “కుస్తీ పోటిలో గెల్చిన వాడు బలవంతుడు కాదు, కోపాన్ని జయించినవాడు బలవంతుడు”. -బుఖారి మరియు ముస్లిం. ఈ  హదీసుద్వారా తనలోని ఆహాన్ని(కోపంను) జయించినవాడు బలవంతుడు అని తెలస్తుంది. ఇస్లాం కోపం నుండి  ప్రజలను  నిషేధిస్తుంది దానితో పాటు కోపం అధిగమించడానికి చర్యలు అందిస్తుంది. క్రింది  వివిధ పద్ధతుల ద్వారా కోపాన్ని జయించ వచ్చు:

I. క్షమించడం
సాత్వికత  మరియు ఓర్పు కోపంనకు  వ్యతిరేకం మరియు మానవుని  పరిపూర్ణ లక్షణాలు గా  భావించ వచ్చు. ప్రతీకారం తీర్చుకోనే  శక్తిని కలిగి ఉన్నాఒక వ్యక్తి ని మన్నించటం  మరియు అతని పట్ల దయ చూపటం మానవుని  పరిపూర్ణ లక్షణాలు గా చెప్పబడినవి. అల్లాహ్ ఖురాన్ లో చెప్పారు "ప్రవక్తా! మృదత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోదించు. మూర్ఖులతో వాదానికి దిగకు.” –దివ్య ఖురాన్ 7: 199.
ప్రవక్త ముహమ్మద్ (స) కూడా చెప్పారు "క్షమ ఒక వ్యక్తి యొక్క స్థితి ని లేవనెత్తుతుంది; మన్నించటం ద్వారా అల్లాహ్ మీమ్మలను గౌరవిస్తాడు. "
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు " కోపాన్ని దిగ మ్రింగుకొనే వారు,ఇతరుల తప్పులను క్షమించే వారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” 3:134.
ఒకసారి హజ్రత్  హసన్ పరిచారిక ఆయన మీద ఒక    వేడి గిన్నె సూప్ పోసింది. హజ్రత్ హసన్ కోపంతో ఆమెను  శిక్షించునని భావించి  ఆమె చాలా భయపడ్డది. ఆమె వెంటనే క్రింది  ఆయత్ చదివ సాగింది. "కోపం ను దిగమింగ్రిన వారు " హసన్ నవ్వి నేను కోపంతో లేను  అన్నారు. అప్పుడు ఆమె ఆయత్  యొక్క తదుపరి భాగం వల్లించసాగింది  " మరియు ప్రజలు పట్ల  క్షమాపణ భావం ." హసన్ ఆమెను  క్షమించినట్లు  చెప్పారు. అప్పుడు ఆమె ఆయత్ ను " ప్రదర్శించే వారి పట్ల అల్లాహ్  ఇష్టపడతారు." అని చెప్పి ముగించినది.  హసన్ ఆమెను క్షమించి బానిసత్వం నుండి ఆమెను విముక్తి చేసేను.
అందువలన, దివ్య ఖురాన్ తన కోపం నియంత్రించమని,   వ్యక్తిని  క్షమించమని తన భావోద్వేగాలను నియంత్రణలో  ఉంచాలని మనకు బోధిస్తోంది.

II.బహుమతి  గుర్తు పెట్టుకొని ఉండటం
అల్లాహ్ ఖురాన్ లో చెప్పారు " కోపాన్ని దిగ మ్రింగుకొనే వారు,ఇతరుల తప్పులను క్షమించే వారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” 3:134.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) అన్నారు , "ఎవరైతే కోపాన్ని దిగమింగుతారో అతనిని అల్లాహ్ పునరుత్థాన దినమున సమస్త మానవజాతి  ముందు అతనిని పిలుస్తారు  మరియు అతను కోరుకుంటున్న హోర్-అల్-అయన్ (Hoor Al-Ayn) అతనికి ప్రసాదిస్తారు." - అబూ దావూద్.

కోపం సైతాను ప్రభావం నుండి వస్తుంది దానిని అణుచుట వలన  అల్లాహ్ నుండి అధిక ప్రతిఫలాలను స్వికరించ వచ్చు. ద్వేషం యొక్క నిరాశావాద మనోభావాలను నియంత్రించినవారు అల్లాహ్ కు   చాలా ప్రియమైన వారు. వారికి  స్వర్గం లో స్థానం దొరుకును అని అర్థం. అందువల్ల ఎవరికైనా బహుమతులుగా  సహనము, దయ మరియు క్షమాపణ మొదలగు సద్గుణాలు  వస్తే వాటిని గుర్తుంచుకోవాలి.
III. విన్నపం

అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "ఒక వేళ ఎప్పుడైనా షైతాన్ నిన్ను ఉసిగోలిపితే అల్లాహ్ శరణు  వేడు. అయన అన్ని వినేవాడు. అన్ని తేలిసినవాడు.” 7:200.
ఒకసారి ప్రవక్త(స) కూర్చొని ఉండగా  ఇరువురు  పురుషులు ఒకరితో ఒకరు వాదన చేస్తున్నారు.  వారిలో ఒకరి  ముఖం ఎర్రబడి  మరియు అతని మెడ మీద సిరలను ఉబ్బినవి.  ప్రవక్త(స) నాకు అతను  చెప్పబోయే  పదం తెలుసు అన్నారు. అతను సైతాన్ నుండి అల్లాహ్ ను  శరణు కోరుకోవాలి  అనగా తన కోపం దూరంగా పెట్టాలి అన్నారు.

ఇస్లాం  శాంతి మరియు సామరస్యాన్ని ప్రబోదించే ధర్మం. దాని అనుచరులు దాని నిజమైన సారాంశం బోధించాలి.  ప్రకృతి ద్వారా  మానవ శాంతిని ప్రేమను కోరుకొంటాడు కాని  ఇప్పటికీ మనo ఇతరులు పట్ల  ద్వేషం మరియు కోపం కలిగి ఉన్నాము.ఇది షైతాన్ పని.  వ్యక్తి యొక్క ప్రత్యక్ష మరియు ప్రధాన  శత్రువు  సైతాన్ ఒకరి ఇష్టానికి వ్యతిరేకంగా వివిధ పరిస్థితులలో వివిధ రకాల సర్దుబాట్లు, నటించడం ప్రోత్సహిస్తుంది.

IV. వజూ
వజూ కోపానికి  వ్యతిరేకంగా ఒక కవచం లాగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ (స) “కోపం దెయ్యం నుండి వస్తుంది, దెయ్యం అగ్ని నుండి సృష్టించబడింది మరియు అగ్ని మాత్రమే నీరు ను ఆర్ప గలగదు.” అని అన్నారు. కాబట్టి  మీరు  కోపం రాగానే వజూ చేయాలి.

V. స్థానం మార్చడం
ప్రవక్త ముహమ్మద్ (స) "కోపం ఎవరికైనా కలుగుతే అతను ముందు  కూర్చుని ఉండాలి మరియు అది సహాయపడక పోతే అతను నేలపై పడుకుని ఉండాలి."అని  చెప్పారు –తిర్మిజి.

VI. నిశ్శబ్దoగా ఉండుట:
ప్రవక్త ముహమ్మద్ (స) మీలో ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు  అతను నిశ్శబ్దంగా ఉండాలని” అని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన  చర్య మరియు సూచన ఎందుకంటే కోపం లో మన చర్యలు, మన మాట న్యాయం గా ఉండక పోవచ్చు.
మూడోవ దశ పలితాల దశ
కోప నిర్వహణ సిద్ధాంతంలో తదుపరి స్థాయి 'ప్రతికూల ప్రభావాల స్థాయి' అని అంటారు.
అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు "ముసా ఆగ్రహం తో,విచారం తో తన జాతి ప్రజల వద్దకు మరలి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా అన్నాడు: నేను లేనప్పుడు నా స్థానం లో మీరు చాలా చేడ్డగా ప్రవర్తించారు. మీ ప్రభువు ఆజ్ఞ కొరకు నిరిక్షించే ఓపిక కుడా మీలో లేకుండా పోయిoదా?  అతను శిలా పలకాలను విసిరి వేసాడు. తన సోదరుడు (హరూన్)తల వెంట్రుకలను పట్టుకొని అతన్ని లాగాడు.” 7:150.
ముసా ఇలా  అన్నాడు, " ప్రభూ! నా సోదరున్ని  క్షమించు. మమ్మల్లి నీ కారుణ్యం లోకి ప్రవేశింపజెయ్యి."- దివ్య ఖురాన్ 7: 151
ఈ ఆయతుల ద్వారా  ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, అతను సాధారణంగా మూడు తప్పుడు పనులు చేయును. మొదటిది వ్యక్తి తన ఆలోచన  సామర్థ్యాన్ని కోల్పోయి  తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు  మరియు ప్రవక్త ముసా అలాగే   అల్లాహ్ అతనికి ఇవ్వబడిన  మాత్రలు(tablets) విసిరే వేసినాడు. రెండవది  వ్యక్తి పట్ల అమర్యాదగా ప్రవర్తించి తన కోపం ఇతరుల పై వ్యక్తం చేయును అలాగే  ప్రవక్త ముసా,  ప్రవక్త హరూన్ యొక్క  జుట్టు పట్టుకొని లాగినాడు. మూడవది వ్యక్తి తన తప్పు తెలుసుకుంటాడు మరియు క్షమాపణ అడుగుతాడు అలాగే  ప్రవక్త ముసా   తన తప్పు గ్రహించి అతనిని  మరియు అతని సోదరుడుని  క్షమించమని  అల్లాహ్ ను శరణ కోరారు.

వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు దాని పలితం ఆ  వ్యక్తి పై పడుతుంది కాబట్టి  ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కోపం నివారించేందుకు ప్రయత్నించాలి. కోపం లో  అతను తప్పుడు నిర్ణయాలు తీసుకొంటాడు, తన కోపాన్ని వ్యక్తం ఎవరిపైనో వ్యక్తం చేయును   మరియు అతను తరువాత దశలో తన కోపం పట్ల  విచారిoచును. కాబట్టి ఒక క్షణం  సహనo వహించుట  తరువాత దశలో విచారం నుండి మనలను నిరోధిస్తుంది.

 కోపం ఒక మానసిక పరిస్థితి, మరియు ఇది చెడు మరియు దూకుడు చర్యల పలితం. దిని ద్వారా నష్టాలు మాత్రమే ఉందును లాభాలు ఉండవు. కోపం నియంత్రించ లేని అతను అతని మనస్సు మీద నియంత్రణ కోల్పోతాడు. వ్యక్తి తన చర్యలు వలన తనను  మరియు  ఇతరులను  బాధిoచును.  అతను అన్నిచోట్ల కోపంతో ప్రదర్శించ రాదు కానీ అతను చెడు పనులు లేదా అవినీతి చూసినపుడు మాత్రo వాటి  సంస్కరణ కొరకు ప్రయత్నించాలి. ఇది ఈ ప్రపంచంలో మరియు పరలోకం లో విజయవంతం అగుటకు తోడ్పడును. అందువలన కోపం రాకుండా ఉండుట అత్యంత తెలివైన  ఉత్తమమైన మార్గం.


No comments:

Post a Comment