19 September 2024

భక్తి మరియు వారసత్వం కు ప్రతిక చెక్క తో నిర్మించబడిన జీనత్ బక్ష్ మసీద్ Zeenath Baksh Masjid : Piety and Heritage build in Wood

 


1400 సంవత్సరాల క్రితం ముస్లింలు మొదటిసారిగా భారత తీరానికి వచ్చినప్పుడు, భారత దేశం వారిని ఆదరించింది. భారత-అరేబియా వాసుల మద్య రాకపోకలు మన దేశం యొక్క సాంఘిక, సాంస్కృతిక మరియు నిర్మాణ వారసత్వంపై ప్రభావాన్ని చూపాయి. . చెక్కతో నిర్మించిన జీనత్ బక్ష్ మసీదు అటువంటి వాటిలో ఒకటి.

కర్నాటకలోని మంగళూరులోని జీనత్ బక్ష్ మసీదు భారతీయ చారిత్రక సంపదలలో ఒకటి. జీనత్ బక్ష్ మసీదు శతాబ్దాలుగా మనుగడలో ఉంది మరియు చెక్కతో చేసిన మసీదు మాత్రమే కాదు, కర్ణాటకలో పురాతనమైనది మరియు భారతదేశంలో మూడవ పురాతన మస్జిద్ కూడా..

ఏడవ శతాబ్దంలో, హజారత్ మహమ్మద్ మాలిక్ బిన్ దీనార్ మరియు అతని చిన్న బృందం,  మక్కా నుండి తిరిగి వస్తుండగా  మరణించిన మాజీ చెరుమాన్ పెరుమాళ్ రాసిన లేఖతో కొడంగల్లూర్ మలబార్ తీరానికి వచ్చారు. రాజ్యంలో ఇస్లాం విశ్వాసాన్ని బోధించడానికి అనుమతిని అందించమని లేఖ మరణించిన చెరుమాన్ కుమారుడు, ప్రస్తుత రాజు కి సూచించింది. అతిథుల పవిత్రత మరియు నిజాయితీని గమనించిన తరువాత, రాజు తన రాజ్యంలో భూములు మరియు ఇతర సౌకర్యాలను మంజూరు చేశాడు.

మహమ్మద్ ప్రవక్త(స) యొక్క మొదటి తరం శిష్యుడైన మాలిక్ దీనార్ తన బృందంతో కలిసి మొత్తం పది మసీదులను స్థాపించారు. కొడంగల్లూర్‌లో మొదటి మస్జిద్‌ను స్థాపించారు. జీనత్ బక్ష్ రెండవది మరియు క్రీ.శ. 643లో నిర్మించబడింది. జీనత్ బక్ష్ మస్జిద్ మంగళూరు నగరంలోని బందర్ ప్రాంతంలో ఉంది. గతంలో జీనత్ బక్ష్ మస్జిద్ ను బెలియే పల్లి లేదా మాలిక్ దినార్ వాల్య జుమాత్ మస్జిద్ Beliye Palli or Malik Dinar Valya Juma-ath Masjid అని పిలుస్తారు. ఇది మాలిక్ దీనార్ దగ్గిర బంధువులచే నిర్మించబడింది.

జీనత్ బక్ష్ మస్జిద్ శతాబ్దాల క్రితం, పూర్తిగా చెక్కతో తయారు చేయబడింది. చెక్కతో చేసిన జీనత్ బక్ష్ మస్జిద్ యొక్క ప్రాచీన వైభవాన్ని స్థానిక ప్రజలు మరియు స్పాన్సర్లు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. చారిత్రిక జీనత్ బక్ష్ మస్జిద్ సంరక్షకులు జీనత్ బక్ష్ మస్జిద్ కు తగిన గుర్తింపు మరియు నిర్వహణ కోసం పర్యాటక శాఖ మరియు వక్ఫ్ బోర్డు నిధులు పొందాలని ఆశిస్తున్నారు.

పునర్నిర్మాణం తర్వాత మస్జిద్ లోపలి భాగం  పైకప్పు ఇత్తడి షీట్తో రక్షించబడిన  చెక్క స్తంభాలను కలిగిన  రాతి గోడలను కలిగిఉంది.   . రాతి గోడలను తొలగించినప్పటికీ, మస్జిద్ నిలిచి ఉంటుంది

మైసూర్ టైగర్, టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దం రెండవ భాగంలో అసలు నమూనా చెక్కుచెదరకుండా మసీదును పునరుద్ధరించాడు. టిప్పు సుల్తాన్ మస్జిద్ పేరును తన కుమార్తె జీనత్ బక్ష్ పేరుగా  మార్చాడు మరియు గత 400 సంవత్సరాలుగా ఆ పేరు అలాగే ఉంది. . 19వ శతాబ్దంలో, నాలుగు మినార్లను జోడించడం ద్వారా కొత్త రూపాన్ని సంతరించుకుంది.

జీనత్ బక్ష్ మస్జిద్ ప్రాంగణం లో ట్యాంక్‌ వజు ఖానా కలదు. మస్జిద్ లోని పదహారు చెక్క స్తంభాలపై చెక్కిన పువ్వులు, గంటలు మరియు అరబిక్  టెస్ట్స్ ప్రవక్త జీవిత వృత్తాంతాలను వివరిస్తాయి ప్రతి చెక్క స్తంభాలలోని  చెక్కపై చెక్కబడిన కళ ఈ ప్రాంత సాంస్కృతిక సమ్మేళనాలకు ప్రతిబింబం. ప్రతి స్తంభం ఒకే చెక్కతో తయారు చేయబడింది. నేల, గోడలు మరియు తలుపులు కూడా టేకు చెక్క మరియు రోజ్‌వుడ్‌తో అలంకరించబడ్డాయి.

జీనత్ బక్ష్ మస్జిద్ లో ప్రార్థనలు    క్రీ.శ. 18 ఏప్రిల్ 643న ప్రారంభం అయినాయి. . మాలిక్ బిన్ అబ్దుల్లా కుమారుడు మూసా బిన్ మాలిక్‌తో మొదటి ఖాజీ (మేజిస్ట్రేట్)గా నియమించబడినాడు అని రికార్డులు రుజువు చేస్తున్నాయి. జీనత్ బక్ష్ మస్జిద్ దాని విలువైన వారసత్వం కోసం మాత్రమే కాదు, కమ్యూనిటీ కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందింది.

జీనత్ బక్ష్ మస్జిద్ యొక్క యతీంఖానా (అనాథాశ్రమం), వివాహ వేడుకల సమయంలో నిరుపేదలకు నిధులు సమకూరుస్తుంది మరియు ఆర్థిక స్థోమత లేని వారికి ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తుంది.

జీనత్ బక్ష్ మస్జిద్ అద్భుతమైన దక్షిణ భారత చరిత్రలో మసీదు సోదరభావం, నిర్మలమైన దైవభక్తి మరియు భిన్నత్వంలో సామరస్యాన్ని కలిగి ఉంటుంది..

No comments:

Post a Comment