దేశ జనాభాలో
ముస్లింలు సుమారు 7.1% ఉన్నప్పటికీ, 1947 నుండి లోక్సభకు కేవలం 18 మంది ముస్లిం మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. ఐదు లోక్సభలలో ఒక్క ముస్లిం
మహిళా ఎంపీ కూడా లేరు.
ఎన్నికైన 18 మంది మహిళా ముస్లిం సబ్యులలో మందిలో అధికశాతం, అంటే 13 మంది రాజకీయ కుటుంబాల నుండి వచ్చినవారే. అంతేకాకుండా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణతో సహా ఏ దక్షిణాది రాష్ట్రం కూడా లోక్సభకు ఒక్క ముస్లిం మహిళను కూడా ఎన్నుకోలేదు.
2025 వరకు ఏర్పడిన 18 లోక్సభలలో ఐదింటిలో ఒక్క ముస్లిం మహిళా సభ్యురాలు కూడా లేరు. ప్రస్తుత లోక్సభలో, సమాజ్వాదీ పార్టీకి చెందిన ఇక్ర హసన్ చౌదరి అనే ఒకే ఒక్క ముస్లిం మహిళా ఎంపీ ఉన్నారు.
ముస్లిం
మహిళా ఎంపీల జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మోఫిదా అహ్మద్ (1957), జోహ్రాబెన్
అక్బర్భాయ్ చావడా (1962–67), మైమూనా సుల్తాన్ (1957–67), నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన బేగం అక్బర్ జెహాన్ అబ్దుల్లా (1977–79; 1984–89), కాంగ్రెస్ పార్టీకి చెందిన రషీదా హక్ (1977–79), మొహ్సినా కిద్వాయ్ (1977–89), అబిదా
అహ్మద్ (1981–89), నూర్ బాను (1996; 1999–2004), సమాజ్వాదీ పార్టీకి చెందిన రుబాబ్ సయీదా (2004–09), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా
ముఫ్తీ (2004–09; 2014–19), సమాజ్వాదీ పార్టీ, లోక్ దళ్ మరియు బహుజన్ సమాజ్ పార్టీలకు చెందిన తబస్సుమ్ హసన్ (2009–14), తృణమూల్
కాంగ్రెస్కు చెందిన మౌసమ్ నూర్ (2009–19), బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన కైసర్ జెహాన్ (2009–14), తృణమూల్
కాంగ్రెస్కు చెందిన మమతాజ్ సంఘమిత్ర (2014–19), సజ్దా అహ్మద్ (2014–24), కాంగ్రెస్ పార్టీకి చెందిన రాణి నారా (1998–2004; 2009–14), తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నుస్రత్ జెహాన్ రూహి (2019–24), మరియు సమాజ్వాదీ
పార్టీకి చెందిన ఇక్ర హసన్ చౌదరి (2024–ప్రస్తుతం) ఉన్నారు.
No comments:
Post a Comment