బేగం ఫైజున్నేసా చౌధురానీ 1834లో బెంగాల్ ప్రెసిడెన్సీ (వలసవాద భారతదేశం)లోని టిప్పెరా జిల్లాలోని లక్సమ్ కింద పశ్చిమగావ్లో ఒక ప్రముఖ బెంగాలీ ముస్లిం కుటుంబంలో జన్మించారు.బేగం ఫైజున్నేసా తండ్రి పేరు ఖాన్ బహదూర్ అహ్మద్ అలీ చౌదరి మరియు తల్లి పేరు అరాఫ్-ఉన్-నెస్సా చౌధురానీ సాహెబా. ఫైజున్నేసా తన తల్లిదండ్రులకు పెద్ద కూతురు. ఫైజున్నేసా కుటుంబం మొఘల్ రాజవంశానికి చెందినదని చెబుతారు.ఫైజున్నేసా తల్లి, అరఫ్–ఉన్–నెస్సా, 1864లో పశ్చిమగావ్ నవాబ్ బారి మసీదును నిర్మించిన పరోపకారి.
ఫైజున్నేసా విద్య పట్ల అంకితభావం కలిగి ఇంటివద్దనే ఒక బోధకుడి సహాయం తో విద్య
అబ్యసించినది.ఫైజున్నేసా అరబిక్, పెర్షియన్, బెంగాలీ మరియు సంస్కృతము మొదలగ్ నాలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించింది.
ఫైజున్నేసా ఉదారవాద మరియు ప్రగతిశీల స్వభావాన్ని కలిగి ఉంది. మహిళా విద్య
మరియు సామాజిక సంక్షేమానికి పాటుపడిన మార్గదర్శక బెంగాలీ ముస్లిం మహిళ.
ఫైజున్నేసా 1860లో ముహమ్మద్ ఘాజీని వివాహం చేసుకుంది.
ఫైజున్నేసా వివాహం కేవలం ఐదు సంవత్సరాలకే విడాకులతో ముగిసింది, మరియు వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. విడాకుల తర్వాత ఫైజున్నేసా తన తండ్రి ఇంటికి
తిరిగి వచ్చింది.
ఫైజున్నేసా తల్లి 1883లో మరణించింది. ఫైజున్నేసా తన తల్లి ఆస్తినంతా వారసత్వంగా పొందింది
మరియు పశ్చిమ్ గావ్ భూస్వామి అయ్యింది.భూస్వామి అయిన తర్వాత, బేగం ఫైజున్నేసా సామాజిక సంక్షేమ కార్యకలాపాలపై
ప్రత్యేక ఆసక్తిని కనబరిచింది.
1873లో, ఫైజున్నేసా బేగం కోమిల్లాలో బాలికల కోసం ఒక
ఉన్నత పాఠశాలను స్థాపించింది, ఇది భారత ఉపఖండంలో
ప్రైవేట్గా స్థాపించబడిన తొలి బాలికల పాఠశాలలలో ఒకటి, దీనిని ఇప్పుడు నవాబ్ ఫైజున్నేసా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలగా
పిలుస్తారు.
ఫైజున్నేసా పశ్చిమ్గావ్లో ఒక పాఠశాలను కూడా స్థాపించింది, తరువాత దీనిని కళాశాలగా అప్గ్రేడ్ చేశారు
మరియు ఇప్పుడు నవాబ్ ఫైజున్నేసా డిగ్రీ కళాశాలగా పేరు పెట్టారు.
1893లో, ఫైజున్నేసా తన గ్రామంలో బురఖా ధరించిన మహిళల
కోసం, ముఖ్యంగా నిరుపేద మహిళల కోసం ఒక ఛారిటబుల్
డిస్పెన్సరీని స్థాపించింది.
ఫైజున్నేసా అనేక ప్రాథమిక పాఠశాలలను స్థాపించింది మరియు సామాన్య ప్రజల
అవసరాలను తీర్చడానికి రోడ్లు, వంతెనలు మరియు
చెరువులను కూడా నిర్మించింది.
ఫైజున్నేసా బేగం 1894 హజ్ యాత్రలో, మక్కాలో యాత్రికుల కోసం ఒక విశ్రాంతి గృహాన్ని
మరియు మదీనాలో ఒక మదర్సాను స్థాపించింది.
ఫైజున్నేసా చౌధురానీ పశ్చిమగావ్లోని తన నివాసం పక్కన పది గోపురాల మసీదును
కూడా స్థాపించారు. ఇక్కడ, ఇస్లామిక్ జ్ఞానం బోదించబడుతుంది.
ఫైజున్నేసా బేగం “బంధబ్, ఢాకా ప్రకాష్, ముసల్మాన్ బంధు, సుధాకర్ మరియు ఇస్లాం ప్రచారక్” వంటి అనేక వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లకు
మద్దతు ఇచ్చింది.
1889లో, ఫైజున్నేసా సామాజిక సేవకు గాను బెంగాల్ జిల్లా
మేజిస్ట్రేట్ డగ్లస్, ఫైజున్నేసా కు "నవాబ్" అనే బిరుదు
ఇవ్వాలని రాణి విక్టోరియాకు సిఫార్సు చేశారు.
అయితే, బెంగాల్లోని సంప్రదాయవాద ముస్లింలు ఈ విషయం
తెలుసుకున్నప్పుడు, వారు ఆ బిరుదును వ్యతిరేకించారు, ఇది పురుష బిరుదు అని మరియు స్త్రీకి తగదని
వాదించారు.
"నవాబ్" అనే
బిరుదుకు తీవ్ర వ్యతిరేకత మరియు ముస్లిం సమాజం నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా, విక్టోరియా రాణి ఫైజున్నేసా కు
"నవాబ్" కు బదులుగా "బేగం" అనే బిరుదును ఇస్తామని
ప్రకటించింది, కానీ ఈ మార్పు బేగం ఫైజున్నెసాకు కోపం
తెప్పించింది మరియు ఫైజున్నేసా ఆ బిరుదును అంగీకరించడానికి నిరాకరించింది.
చివరికి, బ్రిటిష్ పార్లమెంట్ ఈ విషయాన్ని
పరిష్కరించడానికి జోక్యం చేసుకుని ఫైజున్నెసా బేగంకు
అనుకూలంగా తీర్పు ఇచ్చింది, ఫైజున్నెసా బేగంకు
"నవాబ్" అనే బిరుదును మంజూరు చేసింది. ఈ గౌరవాన్ని పొందిన దక్షిణాసియాలో
మొదటి మహిళ ఫైజున్నెసా బేగం. 1889లో దక్షిణాసియాలో మొట్టమొదటి మహిళా నవాబ్ ఫైజున్నెసా బేగం అయ్యింది.
ఫైజున్నెసా బేగం 1903లో మరణించింది. ఫైజున్నెసా
బేగం మరణానికి ముందు, తన సంపద మొత్తాన్ని దేశానికి విరాళంగా
ఇచ్చింది.
ఫైజున్నెసా బేగం కొమిల్లాలో బురఖా ధరించిన బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించినది.
ఇది ఒక ముస్లిం మహిళ సాహసోపేతమైన నిర్ణయం.
ఫైజున్నెసా బేగం పాచింగావ్లో పది సమాధులతో కూడిన
మసీదును మరియు ఇప్పుడు నవాబ్ ఫైజున్నెసా ప్రభుత్వ కళాశాలగా పిలువబడే సెకండరీ
స్కూల్ విద్యార్థుల కోసం ఒక మదర్సాను కూడా నిర్మించింది. కోమిల్లాలో విక్టోరియా
కళాశాల స్థాపన కోసం ఫైజున్నెసా బేగం పది
వేల రూపాయలను కూడా విరాళంగా ఇచ్చింది.”
No comments:
Post a Comment