బలూచిస్తాన్లో జన్మించిన ఫకీర్/సాధువు హజ్రత్
బాబాజాన్, దైవసాక్షాత్కారం పొంది మక్కాలో యాత్రికులకు సేవ
చేసింది.. పూణేలో స్థిరపడిన హజ్రత్ బాబాజాన్ 1931లో మరణించే ముందు, తన ఆధ్యాత్మిక శక్తిని మెహర్
బాబాకు బహుమతిగా ఇచ్చింది. హజ్రత్ బాబాజాన్ జ్ఞానోదయ వారసత్వం మెహర్ బాబా
కొనసాగిస్తున్నారు..
బలూచిస్తాన్లోని ఒక ముస్లిం రాజరిక కుటుంబంలో గుల్రుఖ్
లేదా "గులాబీ ముఖం"Rose-Faced,"
జన్మించిన హజ్రత్
బాబాజాన్ 18 సంవత్సరాల వయసులో పెద్దలు
కుదిర్చిన వివాహం నుండి పారిపోయి ఆధ్యాత్మిక ప్రయాణం వైపు మరలింది మరియు ఆధ్యాత్మిక ప్రయాణం చివరకు దేవుని
సాక్షాత్కారానికి దారితీసింది, గుల్రుఖ్ను ఒక గౌరవనీయమైన
ఫకీర్గా మార్చింది.
మధ్యప్రాచ్య తీర్థయాత్రల నుండి పూణేలోని వేప చెట్టు కింద స్థిరపడటం వరకు, హజ్రత్ బాబాజాన్ చూపిన ప్రేమ మరియు అద్భుతాలు
లెక్కలేనన్ని జీవితాలను ఉద్ధరించాయి, అవతార్ మెహర్ బాబా, హజ్రత్ బాబాజాన్ వారసత్వం, జ్ఞానోదయ
లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు..
నేటికీ, భక్తులు మహారాష్ట్రలోని పూణేలోని హజ్రత్ బాబాజాన్ దర్గాకు తరలివస్తున్నారు. అద్భుతమైన ఆధ్యాత్మిక గురువు హజ్రత్ బాబాజాన్ యొక్క శాశ్వత కృప మరియు దైవిక
ప్రేమను అనుభవిస్తున్నారు. హజ్రత్ బాబాజాన్ జ్ఞానోదయం పొందిన మానవ ఆత్మలలో
ఉన్నతంగా నిలుస్తుంది, హజ్రత్ బాబాజాన్ దైవిక సందేశం లెక్కలేనన్ని
జీవితాలను తాకింది. హజ్రత్ బాబాజాన్ ఆత్మ యొక్క నిజమైన విప్లవకారుడు.
గుల్రుఖ్ ("గులాబీ లాంటి ముఖం") లేదా హజ్రత్ బాబాజాన్ ప్రారంభ
జీవితం సాంప్రదాయబద్దంగా నడిచినది. హజ్రత్ బాబాజాన్ 18 సంవత్సరాల వయసులో పెద్దలు కుదిర్చిన వివాహం నుండి పారిపోయి బుర్ఖాలో
మారువేషంలో, ఖైబర్ పాస్ పాదాల వద్ద ఉన్న పెషావర్ సరిహద్దు
నగరానికి ప్రయాణించింది.
పెషావర్ సమీపంలో ఒక హిందూ సద్గురువు మార్గదర్శకత్వం లో రావల్పిండి సమీపంలోని పర్వతాలలో గుల్రుఖ్ తీవ్రమైన
ఏకాంతంలోకి వెళ్లిపోయింది. దాదాపు పదిహేడు నెలలు, గుల్రుఖ్ తీవ్రమైన రియాజత్ riyazat, లోతైన ఆధ్యాత్మిక తపస్సులు spiritual austerities కొనసాగించినది. ఆధ్యాత్మిక అభ్యాసాలు
కొనసాగిస్తూ గుల్రుఖ్ పంజాబ్లోని
ముల్తాన్కు ప్రయాణించింది. ముప్పై ఏడు సంవత్సరాల వయస్సులో తన ఆధ్యాత్మిక అన్వేషణ లో
అత్యున్నత స్థాయికి చేరిన గుల్రుఖ్ కు, ఒక ముస్లిం సాధువు
అంతిమ బహుమతి అయిన దైవసాక్షాత్కారాన్ని God-realisation ప్రసాదించాడు.
హజ్రత్ బాబాజాన్ మధ్యప్రాచ్యం, సిరియా, లెబనాన్ మరియు ఇరాక్లలో అసాధారణ ప్రయాణాలను
ప్రారంభించారు.పురుషుడిగా మారువేషంలో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు టర్కీ గుండా ప్రయాణించి, హజ్రత్ బాబాజాన్ చివరకు అరేబియాకు చేరుకుంది.
పవిత్ర కాబా వద్ద, హజ్రత్ బాబాజాన్ తను ఎంచుకున్న
ప్రదేశం నుండి రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు (సలాత్) చేసింది. హజ్రత్ బాబాజాన్ కరుణ
మక్కాలో ప్రకాశించింది, హజ్రత్ బాబాజాన్, మక్కా షరీఫ్లో యాత్రికులకు సేవ చేశారు హజ్రత్ బాబాజాన్ పేదలకు ఆహారాన్ని పంచేది మరియు అనారోగ్య యాత్రికులకు సేవ
చేసేది. తరువాత హజ్రత్ బాబాజాన్ మదీనాలోని ప్రవక్త
ముహమ్మద్(స) సమాధి వద్ద నివాళులర్పించింది, తన ప్రార్థనలు మరియు దయగల చర్యలను కొనసాగించింది.
హజ్రత్ బాబాజాన్ మక్కా నుండి బాగ్దాద్ గుండా తిరిగి, పంజాబ్కు, తరువాత దక్షిణాన నాసిక్కు తిరిగి వచ్చింది. హజ్రత్ బాబాజాన్ చివరకు
పంచవతిలో మరియు తరువాత బొంబాయిలో కొంతకాలం స్థిరపడింది, అక్కడ హజ్రత్ బాబాజాన్ కీర్తి వ్యాపించడం
ప్రారంభమైంది. 1905 నాటికి, హజ్రత్ బాబాజాన్ పూణేకు చేరుకుంది, దానిని తన చివరి నివాసంగా ఎంచుకుంది.
పూణేలో, ఒక అసాధారణమైన వృద్ధ మహిళ-హజ్రత్ బాబాజాన్, కొద్దిగా వంగి, తెల్లటి జుట్టు మరియు సరళమైన, ధరించిన దుస్తులతో, నగరం అంతటా తిరుగుతూ వివిధ ప్రదేశాలలో కూర్చుంటుంది లేదా విశ్రాంతి
తీసుకునేది. హజ్రత్ బాబాజాన్ నిడాంబరమైన ఫకీర్
జీవితాన్ని స్వీకరించింది, సౌకర్యం పట్ల ఉదాసీనంగా
ఉంది. హజ్రత్ బాబాజాన్ కు భక్తులు ఇచ్చిన నైవేద్యాలు తక్షణమే పేదలతో పంచుకోబడ్డాయి
పూణేలో స్థిరపడి, చార్ బావ్డీని హజ్రత్ బాబాజాన్ తన దైవిక ఉనికి తో ఆద్యాత్మిక ప్రదేశం
గా మార్చారు. ప్రజలు భక్తి తో హజ్రత్ బాబాజాన్ 'జియారత్' కోసం రావడం ప్రారంభించారు. హజ్రత్ బాబాజాన్
అద్భుతాల కథలు పెరిగాయి. హజ్రత్ బాబాజాన్ ఆద్యాత్మిక శక్తి, పాపులను సాధువుగా మరియు తప్పిపోయిన వారిని
జ్ఞానోదయం వైపు మళ్ళించింది.
1931 సెప్టెంబర్ 21న హజ్రత్ బాబాజాన్ మరణించారు.
హజ్రత్ బాబాజాన్ రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టు కింద (ఇప్పుడు రద్దీగా ఉండే రహదారి)
కూర్చున్న చోటే అందమైన తెల్లని పాలరాయి దర్గా నిర్మించబడింది. అన్ని మతాల ప్రజలు
పూణేలోని హజ్రత్ బాబాజాన్ దర్గా సందర్శిస్తూ, ఆశీర్వాదాలను కోరుతూనే ఉన్నారు.
కొన్ని కథనాల ప్రకారం, మరణించే ముందు, హజ్రత్ బాబాజాన్ తన చివరి, అత్యున్నత ఆద్యాత్మిక చర్యను
చేశారు. హజ్రత్ బాబాజాన్ తన అపారమైన ఆధ్యాత్మిక
శక్తిని మరియు కృపను 'మెర్వాన్ షెరియార్ ఇరానీ' అనే యువ పార్సీ బాలుడికి బదిలీ చేసింది, అప్పుడు 'మెర్వాన్ షెరియార్ ఇరానీ' పంతొమ్మిది సంవత్సరాల
వయస్సులో ఉన్నాడు.
దక్కన్ కళాశాలలో విద్యార్థి అయిన మెర్వాన్ తరచుగా వేప చెట్టు కింద హజ్రత్ బాబాజాన్ విశ్రాంతి తీసుకొనే స్థలo గుండా సైకిల్ తొక్కుకొంటూ
వెళ్ళేవాడు. కొందరు హజ్రత్ బాబాజాన్ ను సాధువుగా
గౌరవిస్తారని తెలిసినప్పటికీ, మెర్వాన్ పెద్దగా
పట్టించుకోలేదు. ఆసక్తితో, చివరికి మెర్వాన్
హజ్రత్ బాబాజాన్ ను సందర్శించడం ప్రారంభించాడు.. తరచుగా వారు లోతైన నిశ్శబ్దంలో కలిసి కూర్చునే వారు.
1914 జనవరిలో మెర్వాన్ బయలుదేరడానికి సిద్ధమవుతూ, హజ్రత్ బాబాజాన్ చేతులను ముద్దు
పెట్టుకున్నాడు. హజ్రత్ బాబాజాన్, మెర్వాన్ ముఖాన్ని పట్టుకుని మెర్వాన్ నుదిటిపై
ముద్దు పెట్టింది.. ఆ క్షణంలో, మెర్వాన్ లో ఒక అఖండమైన
బరాకా (దైవ కృప) ప్రవహించింది. దాని ప్రభావం వలన మెర్వాన్ దాదాపు తొమ్మిది నెలలు లోతైన, కోమా లాంటి స్థితిలో
పడిపోయాడు.బౌతిక ప్రపంచానికి,ఇది కోమాగా
కనిపిస్తుంది; నిజానికి, ఇది ఒక లోతైన అంతర్గత పరివర్తన.
ఆధ్యాత్మికవేత్త హజ్రత్ బాబాజాన్ ఆధ్యాత్మిక
శక్తిని పూర్తిగా గొప్ప పని కోసం ఎంచుకున్న వ్యక్తికి అందించింది. ఈ పవిత్ర విధిని
నెరవేర్చిన వెంటనే, హజ్రత్ బాబాజాన్ తన శరీరాన్ని విడిచిపెట్టింది.
దాదాపు ఒక సంవత్సరం తర్వాత, మెర్వాన్ షెరియార్ ఇరానీ తన కళ్ళు తెరిచాడు. కానీ మెర్వాన్ షెరియార్ ఇరానీ పూర్తిగా మారిపోయాడు.
ఇప్పుడు మెర్వాన్ షెరియార్ ఇరానీ లో ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి, ఒక దివ్య కాంతి నివసిస్తుంది.
హజ్రత్ బాబాజాన్ దైవిక ముద్దుతో స్పర్శించబడిన మెర్వాన్ షెరియార్ ఇరానీ లెక్కలేనన్ని
జీవితాలను మార్చి, బలూచిస్తాన్ నుండి వచ్చిన గులాబీ ముఖం గల
సాధువు వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్న అవతార్ మెహర్ బాబాగా మారారు.
No comments:
Post a Comment