1817లో జన్మించిన నవాబ్ సికందర్
బేగం 1844-1868 వరకు భోపాల్ను పాలించారు, మొదట రీజెంట్గా, తరువాత స్వతంత్రంగా.
దూరదృష్టి గల నాయకురాలైన నవాబ్ సికందర్ బేగం విద్య, ఆరోగ్య సంరక్షణ, న్యాయం మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. నవాబ్ సికందర్ బేగం చారిత్రాత్మక
హజ్ యాత్ర పుస్తకం తారిఖ్-ఎ-సఫర్-ఎ-మక్కా. నవాబ్ సికందర్ బేగం ను భోపాల్ యొక్క
మార్గదర్శక మహిళా పాలకుడిగా గుర్తించింది
భారత దేశం లోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన మధ్యప్రదేశ్ రాజధానిగా, భోపాల్ చారిత్రాత్మకతను కలిగి ఉంది. ఇంపీరియల్ మరియు ఆధునిక భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు మరియు పట్టణాలకన్నా భోపాల్ మహిళా సాధికారత విషయం లో ముందు ఉన్నది.భోపాల్ నగర చరిత్ర వంద సంవత్సరాలకు పైగా మహిళల ఆధిపత్య పరంపరను వెల్లడిస్తుంది.
18వ
శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు, భోపాల్
రాజ్యం మొత్తం భారతదేశంలో నలుగురు మహిళా నవాబులు(కుద్సియా బేగం, సికందర్ బేగం,షాజహాన్ బేగం, సుల్తాన్ జహాన్) 107 ఏళ్లు పరిపాలించిన ఏకైక
రాచరిక రాష్ట్రం, మరియు వారి పాలన అపూర్వమైనది.వారు రాజ్య అభివృద్ధికి సాధ్యమైన ప్రతి
అడుగును వేశారు, వారి పరిపాలనా సామర్థ్యాలకు రుజువును అందించారు.
నవాబ్ సికందర్ బేగం 1817
సెప్టెంబర్ 10న భోపాల్లోని గౌహర్ మహల్లో జన్మించారు. సికందర్ బేగం తల్లి నవాబ్
కుద్సియా బేగం (భోపాల్ యొక్క మొదటి మహిళా పాలకుడు), మరియు
తండ్రి పేరు నాసిర్ మొహమ్మద్ ఖాన్. 1835లో, సికందర్
బేగం నవాబ్ జహంగీర్ మొహమ్మద్ ఖాన్ను వివాహం చేసుకుంది.
1844లో, తన
భర్త మరణం తరువాత, సికందర్ బేగం తన కుమార్తెకు
రీజెంట్గా భోపాల్ రాజ్యాన్ని పాలించడం
ప్రారంభించింది.1844 నుండి 1860 వరకు, సికందర్ బేగం రీజెంట్గా పరిపాలించింది, మరియు
1860
నుండి మరణించే వరకు, సికందర్ బేగం భోపాల్ పాలకురాలుగా అధికారంలో ఉంది.
సికందర్ బేగం ఒక
ప్రతిష్టాత్మక మహిళా పాలకురాలు, సికందర్
బేగం కమాండింగ్
వ్యక్తిత్వం కలిగి ఉంది మరియు యుద్ధ కళలలో శిక్షణ పొందింది. సికందర్ బేగం కత్తిసాము, గుర్రపు
స్వారీ, ఈటె విసరడం మరియు పోలో వంటి ఆటలలో ప్రావీణ్యం సంపాదించింది. సికందర్ బేగం
సైన్యాన్ని నడిపించింది మరియు వేటాడటం కూడా చాలా ఇష్టం.
భోపాల్ బేగం నవాబ్ సికందర్ బేగం(1844-1868), 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు.1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు అణచివేయబడిన తరువాత, భోపాల్ రాజ్య పాలుకులు చూపిన విధేయతకు 1858 విక్టోరియా మహారాణి ప్రకటనలో బహుమతి లభించింది.
భోపాల్ బేగం సికందర్ తన స్వంత హక్కుతో భోపాల్ను పరిపాలించడానికి నవాబ్ బిరుదును పొందాడు అలాగే 19-తుపాకీల వందనం ఇవ్వబడింది, పొరుగురాజు కు కోల్పోయిన భూభాగం మరల భోపాల్ రాజ్య పరం అయినది మరియు “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా” బిరుదు ఇవ్వబడినది. ఆ సమయంలో ఈ గౌరవం బ్రిటీష్ సామ్రాజ్యంలో క్వీన్ విక్టోరియాతో పాటు పొందిన ఏకైక మహిళా నైట్గా భోపాల్ బేగం సికందర్ నిలిచింది, “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా” బిరుదు భోపాల్ బేగం సికందర్ ప్రత్యేక హోదాను, అలాగే బ్రిటీష్ వారితో భోపాల్ బేగం కున్న సన్నిహిత సంబంధాన్ని నొక్కి చెబుతుంది.
నవాబ్ సికందర్ బేగం రాజ్య పాలన ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.
బాలికల విద్య యొక్క
ప్రాముఖ్యతను గుర్తించి, సికందర్ బేగం బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించింది మరియు రాజ్యం లోని ప్రతి
జిల్లాలో ఉర్దూ మరియు హిందీ మీడియం పాఠశాలల స్థాపనను నిర్ధారించింది.
సికందర్ బేగం యెమెన్, టర్కీ మరియు అరేబియా నుండి పండితులను ఆహ్వానించి బాలికల కోసం విక్టోరియా స్కూల్ను స్థాపించారు, తద్వారా భోపాల్లోని బాలికలు హస్తకళలలో సాంకేతిక శిక్షణ పొందుతారు మరియు ప్రాథమిక విద్యా విషయాలపై జ్ఞానాన్ని పొందుతారు.
రీజెంట్గా తన పాలనను
ప్రారంభించిన సికందర్ బేగం, తన
తల్లి కుద్సియా బేగం లాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాలకురాలు. భోపాల్ అభివృద్ధికి సికందర్
బేగం సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేసింది.
1854లో, సికందర్
బేగం భోపాల్లో వైద్య విభాగాన్ని స్థాపించి, అందులో
శిక్షణ పొందిన యునాని వైద్యులను నియమించింది.
సికందర్ బేగం భోపాల్
యొక్క సమగ్ర సర్వేను కూడా పూర్తి చేసింది.
పన్ను వ్యవస్థను
మెరుగుపరచడానికి మరియు మెరుగైన ఆర్థిక చట్రాన్ని స్థాపించడానికి, సికందర్
బేగం కస్టమ్స్ కార్యాలయం మరియు సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. రాజ్యం పై తన
పట్టును బలోపేతం చేయడానికి, సికందర్
బేగం ఒక నిఘా విభాగాన్ని స్థాపించింది. అదనంగా, కమ్యూనికేషన్ను
మెరుగుపరచడానికి సికందర్ బేగం ఒక పోస్టల్ సర్వీస్ను ఏర్పాటు చేసింది, ఇది
భోపాల్ మరియు ఇతర భారతీయ రాజ్యాల మధ్య మెరుగైన అనుసంధానాన్ని సులభతరం చేసింది.
న్యాయ రంగంలో, సికందర్
బేగం ప్రశంసనీయమైన చొరవలు తీసుకుంది. ప్రజలకు మెరుగైన న్యాయం జరిగేలా అప్పీలేట్
కోర్టును స్థాపించింది.
1847లో, సికందర్
బేగం మజ్లిస్-ఎ-షురా (పార్లమెంట్)ను స్థాపించింది. ప్రభువులు మరియు మేధావులతో
కూడిన ఈ పార్లమెంట్ చట్టాలను ఆమోదించడం, సిఫార్సులు
చేయడం మరియు సంస్కరణలను సూచించడం లక్ష్యంగా పెట్టుకుంది.
1862లో, సికందర్
బేగం పర్షియన్ స్థానంలో ఉర్దూను రాజ్య అధికారిక భాషగా ప్రకటించింది.
సికందర్ బేగం తాను అమలు
చేసిన పని మరియు మార్పులను సర్వే చేయడానికి వ్యక్తిగతంగా గ్రామాలను సందర్శించింది.
ఆర్కిటెక్చర్
సికందర్ బేగం ఎర్ర
ఇసుకరాయితో చేసిన మోతీ మసీదు (మసీదు), అలాగే
మోతీ మహల్ మరియు షౌకత్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించింది.
షౌకత్ మహల్ యూరోపియన్
మరియు ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పాల మిశ్రమం, ఇందులో
గోతిక్ అంశాలు ఉన్నాయి.
హజ్ తీర్థయాత్ర
సికందర్ బేగం హజ్ తీర్థయాత్ర చేపట్టాలని నిర్ణయించుకుంది, ఆ సమయంలో పరిమిత సౌకర్యాలు మరియు కష్టతరమైన ప్రయాణ పరిస్థితుల కారణంగా ఇది చాలా సవాలుగా పరిగణించబడింది. ఈ ప్రయాణాన్ని చేపట్టిన మొదటి మహిళా పాలకురాలు ఆమె.
1863లో, సికందర్
బేగం తన తల్లి కుద్సియా బేగం మరియు దాదాపు వెయ్యి మంది వ్యక్తుల బృందంతో కలిసి, మక్కా
ప్రయాణాన్ని ప్రారంభించింది.
సికందర్ బేగం తన తీర్థయాత్రను
ప్రారంభించినప్పుడు, ఇద్దరు సన్నిహిత బ్రిటిష్ మహిళా స్నేహితులు ప్రయాణ
అనుభవాలను నమోదు చేయమని కోరారు, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరూ
స్త్రీ దృక్కోణం నుండి హజ్ తీర్థయాత్రను వివరించలేదు.
1863లో తన హజ్
యాత్రను ముగించుకుని భోపాల్కు తిరిగి వచ్చిన తర్వాత, సికందర్
బేగం తన బ్రిటిష్ స్నేహితుల కోరికను నెరవేర్చి, తన అనుభవాలను “తారిఖ్-ఎ-సఫర్-ఎ-మక్కా/ఎ పిల్గ్రిమేజ్ టు మక్కా” అనే
పుస్తకంలో నమోదు చేసింది.
సికందర్
బేగం ఈ పుస్తకాన్ని తన బ్రిటిష్ స్నేహితులకు అంకితం చేసింది. ఈ పుస్తకం ఈ రకమైన
మొదటి పుస్తకం, ఎందుకంటే సికందర్
బేగం ముందు ఏ భారతీయ పాలకుడు కూడా హజ్ యాత్ర చేపట్టలేదు లేదా దాని వివరాలను నమోదు
చేయలేదు.
సికందర్ బేగం 1868 అక్టోబర్ 30న మూత్రపిండాల వైఫల్యం కారణంగా మరణించింది. సికందర్ బేగం ను ఫర్హాత్ అఫ్జా బాగ్లో ఖననం చేశారు.
సికందర్
బేగం ఒక దార్శనిక మరియు ధైర్యవంతురాలైన మహిళ, సికందర్ బేగం భోపాల్
సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది
No comments:
Post a Comment