6 November 2025

బీహార్ స్వాతంత్ర్య సమరయోధుడు: షా ముహమ్మద్ ఒజైర్ మునేమి (1899–1961) Freedom Fighter of Bihar: Shah Muhammad Ozair Munemi(1899–1961)

 


 


షా ముహమ్మద్ ఒజైర్ మునేమి (1899–1961) బీహార్‌కు చెందిన సూఫీ- పండితుడు, సంస్కర్త మరియు స్వాతంత్ర్య సమరయోధుడు, మునేమి భారతదేశ స్వాతంత్ర్య యుగంలో విద్య, సామాజిక న్యాయం మరియు మానవీయ పాలనను అభివృద్ధి చేశాడు.

షా ముహమ్మద్ ఒజైర్ మునేమి (1899–1961) భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం మరియు బీహార్ యొక్క ఆధునిక రాజకీయ చరిత్రలో విశిష్ట వ్యక్తులలో ఒకరు. మునేమి ఆధ్యాత్మికత, విద్య మరియు రాజకీయాలను సజావుగా సమతుల్యం చేసిన దార్శనికుడు, మునేమి ఒక కార్యకర్త, విద్యావేత్త మరియు సంస్కర్త.

మునేమి అనే పేరుకు  ఆధ్యాత్మిక మూలం గౌరవనీయమైన సూఫీ సన్యాసి హజ్రత్ షా ముహమ్మద్ మునిమ్ పాక్ పచ్నవి సుమ్మ పట్నావి. సూఫీ సన్యాసి హజ్రత్ షా ముహమ్మద్ మునిమ్ పేరు పాట్నా నగరంలోని మితాన్ ఘాట్‌లో ఉన్న ఖాంకా మునేమియా-కమరియా, అనే పుణ్యక్షేత్రం కు సంభందించినది అది  నేటికీ సూఫీ భక్తి మరియు అభ్యాసానికి శాశ్వత కేంద్రంగా ఉంది.

బీహార్‌లోని పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌లోని సంపన్న జమీందార్ కుటుంబంలో జన్మించిన మునేమి డిప్యూటీ మేజిస్ట్రేట్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ కుమారుడు. మునేమి తల్లి కూడా ధనవంతురాలు. మునేమి తాత సయ్యద్ షా ముహమ్మద్ ఉమర్, ఫుల్వారీ షరీఫ్‌లో ఒక మిడిల్ స్కూల్‌ను స్థాపించారు, అక్కడ మునేమి తన ప్రారంభ విద్యను పొందాడు.

మునేమి పాట్నాలోని బీహార్ నేషనల్ కాలేజీలో విద్యార్థిగా, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో (1920–21) పాల్గొనడానికి తన చదువును విడిచిపెట్టాడు, తరువాత బీహార్ విద్యాపీఠ్ (సదకత్ ఆశ్రమం) నుండి పట్టభద్రుడయ్యాడు.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా మునేమి పాల్గొన్నాడు.. 1926 నుండి 1930 వరకు, మునేమి బీహార్ విద్యాపీఠంలో ఉర్దూ మరియు పర్షియన్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.

మునేమి 1931 నుండి 1942 వరకు, బీహార్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు, అప్పటి దాని అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తో సన్నిహితంగా పనిచేశాడు.

మునేమి క్విట్ ఇండియా ఉద్యమం (1942–44) సమయంలో అరెస్టు చేయబడ్డాడు మరియు మహాత్మా గాంధీ, ఖాన్ అబ్దుల్‌ గఫార్ ఖాన్, ఇతర జాతీయ నాయకుల తో పాటు పాట్నా జైలు మరియు హజారీబాగ్ సెంట్రల్ జైలు పాలయ్యాడు.. జైలు శిక్ష కాలం న్యాయం, సమానత్వం మరియు సామాజిక సంస్కరణల కోసం మునేమి సంకల్పాన్ని మరింత బలపరిచింది.

పాట్నా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా (1940–41), మునేమి కాంగ్రెస్ మైదాన్ సమీపంలోని కదమ్ కువాన్ వద్ద  బీహార్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి దాదాపు 8–10 కుంటాల భూమిని విరాళంగా ఇచ్చారు,  ఇది దేశభక్తి మరియు దాతృత్వాన్ని ప్రతిబింబించే చర్య.

విద్యా పురోగతికి మునేమి జాతీయ పాఠశాలను స్థాపించారు. దీనిని బాపు మహాత్మా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రారంభించారు, తరువాత మునేమి దాని గౌరవ అధ్యాపక సభ్యుడిగా కూడా పనిచేసారు. 1952లో, మునేమి ఫుల్వారీ షరీఫ్ హై స్కూల్‌ను స్థాపించారు, ఆయన నిబద్ధతను మరింతగా స్థిరపరిచారు.

1946లో బీహార్ శాసన మండలికి ఎన్నికై 1949లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అయ్యాడు. మునేమి తరువాత అనేక ముఖ్యమైన శాఖలకు   జైలు, రిలీఫ్, పునరావాసం Jail, Relief, Rehabilitation, and Transport మరియు రవాణా వంటి మంత్రిత్వ శాఖలకు  మంత్రిగా పనిచేశాడు. వరుసగా మూడు కాంగ్రెస్ క్యాబినెట్లలో మంత్రి పదవులు నిర్వహించిన కొద్దిమంది నాయకులలో మునేమి ఒకరు, మునేమి ప్రతిసారీ మూడు కంటే ఎక్కువ విభాగాలను పర్యవేక్షించారు.

మునేమి జైలు వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. జైలు లైబ్రరీని స్థాపించాడు, ఖైదీలకు విద్యా పరీక్షలను ప్రవేశపెట్టాడు మరియు ఖైదీలకు వారి శ్రమకు వేతనం లభించేలా చూసారు.ఖైదీలకు తివాచీలు (కలీన్) నేయడం మరియు జొన్న వంటి పంటలను పండించడం వంటి వాటిలో శిక్షణ ఇప్పించారు.రోడ్డు నిర్మాణ పనుల ద్వారా ఖైదీలు  వేతనాలు సంపాదించడానికి వీలు కల్పించడం ద్వారా ఖైదీల జీవితాలకు గౌరవం తెచ్చాడు.

1939లో, మునేమి,  షా ముసా కుమార్తె హుస్నా ఖాటూన్‌ను వివాహం చేసుకున్నాడు,

షా ముహమ్మద్ ఒజైర్ మునేమి జీవితం విద్య, ఆధ్యాత్మికత మరియు సామాజిక సంస్కరణల ఆదర్శాలను అందంగా పెనవేసుకుంది. వారసత్వంగా వచ్చిన ఆధ్యాత్మిక మనస్సాక్షి ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ప్రజా సేవ యొక్క గొప్ప సంప్రదాయాన్ని మునేమి నెలకొల్పారు.

 

No comments:

Post a Comment