6 November 2025

తోప్కాపి ప్యాలెస్ 500 సంవత్సరాల నిరంతర దివ్య ఖురాన్ పారాయణ సంప్రదాయాన్ని సంరక్షిస్తుంది Topkapı Palace Preserves 500-Year Tradition of Continuous Quran Recitation

 

ఇస్తాంబుల్:

 

ఇస్తాంబుల్ నడిబొడ్డున  ఉన్న  తోప్కాపి ప్యాలెస్ ఒట్టోమన్ సుల్తాన్ యావుజ్ సుల్తాన్ సెలిమ్ పాలనలో ప్రారంభమైన 500 సంవత్సరాల నాటి నిరంతర దివ్య ఖురాన్ పారాయణ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. 28 మంది హఫీజ్‌లు పగలు మరియు రాత్రి రొటేషన్ లో దివ్య ఖురాన్‌ను పఠిస్తారు, ప్రతిరోజూ ఒక పూర్తి దివ్య ఖురాన్ పారాయణం పూర్తవుతుంది.

1517లో సుల్తాన్ సెలిమ్ ఈజిప్ట్ నుండి ఇస్తాంబుల్‌కు పవిత్ర అవశేషాలను తీసుకువచ్చిన తర్వాత ప్రారంభమైన ఈ రౌండ్-ది-క్లాక్ పారాయణం ఎప్పటికీ ఆగలేదు. అవశేషాలలో ప్రవక్త ముహమ్మద్ (స)పవిత్ర మాంటిల్, ఆయన లేఖలు, కత్తి, ఉహుద్ యుద్ధం నుండి విరిగిన దంతం మరియు ఆయన గడ్డం వెంట్రుకలు ఉన్నాయి. నలుగురు ఖలీఫాల అవశేషాలు, ప్రవక్త(స) సహచరులు మరియు కాబా కీలు కూడా ఉన్నాయి.

తోప్కాపి ప్యాలెస్ విభాగం అధిపతి మాట్లాడుతూ, సుల్తాన్ సెలిమ్ ఈ ఆచారాన్ని 40 హఫీజ్‌లతో ప్రారంభించాడని, అప్పటి నుండి, ప్రతి తరం ఈ ఆధ్యాత్మిక విధిని అంతరాయం లేకుండా కొనసాగిస్తోంది. ఖురాన్ పారాయణం ప్రత్యక్షంగా చూసే సందర్శకులను తరచుగా ఆశ్చర్యపరుస్తుంది.

ఈ దివ్య ఖురాన్ పారాయణం సంప్రదాయం ఒట్టోమన్ ఆధ్యాత్మిక వారసత్వం మరియు ఆధునిక టర్కీ మధ్య సజీవ లింక్. ప్రతి సంవత్సరం, 365 పూర్తి దివ్య ఖురాన్ పారాయణాలు పూర్తవుతాయి దివ్య ఖురాన్ పారాయణం  ప్రవక్త(స) మరియు దివ్య ఖురాన్ పట్ల శాశ్వత ప్రేమను ప్రతిబింబిస్తుంది.

No comments:

Post a Comment