16 May 2024

భారత పార్లమెంటులో ముస్లింల అల్ఫ-ప్రాతినిద్యం

 


భారత పార్లమెంటులో ముస్లింలు అతి  తక్కువగా ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 200 మిలియన్ల ముస్లింల రాజకీయ శక్తి క్రమంగా క్షీణిస్తోంది.

అధికార పక్షం తో పాటు ప్రతిపక్ష పార్టీల్లోనూ ముస్లిం ప్రాతినిధ్యం పడిపోయింది.

2014లో అవుట్‌గోయింగ్ పార్లమెంట్‌లో 30 మంది ముస్లిం ఎం.పి.లు  మరియు కేవలం ఒక ముస్లిం బిజెపి సభ్యుడు గా ఉన్నారు.

ముస్లింలు ప్రస్తత పార్లమెంట్ లో 543 సీట్లలో 25 స్థానాలను కలిగి ఉన్నారు మరియు బిజెపిలో ఒక ఎం.ఫి కూడా లేదు.

భారతదేశం ముస్లింలు ఎక్కువగా అట్టడుగున ఉన్న marginalized దేశం నుండి వారు "చురుకుగా మినహాయించబడిన“actively excluded,” " దేశంగా మారిందని న్యూ ఢిల్లీలోని అశోకా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు అలీ ఖాన్ మహమూదాబాద్ అన్నారు.

1980ల మధ్యకాలంలో, ముస్లింలు భారతదేశ జనాభాలో 11% ఉన్నారు మరియు పార్లమెంటులో 9% స్థానాలను కలిగి ఉన్నారు;

నేడు ముస్లింలు జనాభాలో 14% మరియు పార్లమెంటులో 5% కంటే తక్కువ సీట్లు కలిగి ఉన్నారు.

పార్లమెంటులోని 10 మంది సభ్యులలో తొమ్మిది మంది హిందువులు,

హిందువులు 1.4 బిలియన్ల జనాభా కలిగి  భారతదేశ జనాభాలో 80 శాతం ఉన్నారు.

రాష్ట్ర స్థాయిలో ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం కాస్త మెరుగ్గా ఉంది.

భారతదేశంలో 28 రాష్ట్రాలలోని రాష్ట్ర శాసనసభలలో 4,000 కంటే ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు మరియు ముస్లిం శాసన సభ్యులు కేవలం 6% కలిగి ఉన్నారు.

2006లో సచార్ కమిటి నివేదిక ప్రకారం ముస్లింలు హిందువులు, క్రైస్తవులు మరియు భారతదేశంలోని అట్టడుగు కులాల ప్రజలు అక్షరాస్యత, ఆదాయం మరియు విద్యను పొందడంలో వెనుకబడి ఉన్నారు. బహుళ స్వతంత్ర అధ్యయనాల ప్రకారం వారు అప్పటి నుండి కొన్ని లాభాలను పొందారు, కానీ ఇప్పటికీ గణనీయమైన ప్రతికూలతలో ఉన్నారు.

భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒక్కదానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రిగా లేరు; బిజెపి మరియు దాని మిత్రపక్షాలు 19 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను కలిగి ఉన్నాయి.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 16% మంది ముస్లింలు ఉన్నారు, రాష్ట్ర శాసనసభ్యులలో కేవలం 7% మంది మాత్రమే ముస్లింలు.

అధికార పక్షం మరింత శక్తివంతంగా మారడంతో, హిందూ ఓటర్లను దూరం చేస్తారనే భయంతో భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు ముస్లిం అభ్యర్థులను నామినేట్ చేయడానికి విముఖత చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు.

బిజెపి 2014 మరియు 2019 ఎన్నికలలో కలిపి కేవలం 13 మంది ముస్లిం అభ్యర్థులను మాత్రమే నిలబెట్టింది మరియు ఎవరూ ఎన్నిక కాలేదు.

ఈ ఏడాది పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న 430 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఒక్క అబ్యర్ది ముస్లిం అయిన ఎం అబ్దుల్ సలాం(మలప్పుర౦). గెలిస్తే, 2014 తర్వాత భారత పార్లమెంటు దిగువ సభలో బీజేపీకి చెందిన మొదటి ముస్లిం సభ్యుడు అవుతాడు.

 

No comments:

Post a Comment