16 May 2024

ఢిల్లీలోని జామా మసీదులో ఒక హిందూ సన్యాసి (స్వామి శ్రద్దానంద) ఉపన్యాసం ఇచ్చినప్పుడు When a Hindu Sanyasi(Swami Sraddananda) delivered sermon in Jama Masjid of Delhi

 


1650 లో నిర్మించినప్పటి నుండి జుమా మసీదు ప్రార్ధనలకు మాత్రమే కాకుండా, భారత చరిత్రకు సాక్షిగా ఉంది. 1857 లో బ్రిటీష్ అధికారానికి వ్యతిరేకంగా విముక్తి మరియు తిరుగుబాటుకు ఇది సంకేతంగా ఉంది.1857 తిరుగుబాటులో ఢిల్లీ ముట్టడి సమయంలో తిరుగుబాటు సమావేశాలకు జామా  మసీదు ప్రధాన కేంద్రంగా ఉంది

హిందల్ అహ్మద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అబిప్రాయం ప్రకారం "ఎర్రకోట మరియు జామా మసీదు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో మతం లేదా కులo కు  అతీతంగా  భారతీయ ప్రజానీకపు  రాజకీయ ప్రేరణకు ఎల్లప్పుడూ చిహ్నంగా ఉన్నాయి. వేర్వేరు నేపథ్యాల మరియు సిద్ధాంతాల నుండి వచ్చిన వివిధ రాజకీయ పక్షాల నాయకులు తమ రాజకీయ సందేశాలను అందించడానికి మసీదు యొక్క మింబర్ (పల్పిట్) ను ఉపయోగించారు.

గాంధీ, నెహ్రూ మరియు ఆజాద్ – ఆర్య సమాజం నుండి  స్వామి శ్రద్దనంద మొదలగు నాయకులు ఇక్కడ ప్రసంగాలు చేశారు. కాని గుర్తించుకోవలసిన అంశం ఏమిటంటే "1946 లో ముస్లిం లీగ్ యొక్క ఊరేగింపులో పాల్గొన్నప్పటికీ, జిన్నా జామామసీదు లోపల ప్రసంగాన్ని ఎప్పుడూ చేయలేదు.

శుక్రవారం ప్రార్థనల సమయంలో ఢిల్లీలోని చారిత్రాత్మిక జామా మసీదులో "హిందూ-ముస్లిం కీ జై" (హిందూ మరియు ముస్లింలు  దీర్ఘకాలం జీవించండి) అనే నినాదాల మధ్య కాషాయ వస్త్రాన్ని ధరించిన ఒక హిందూ సన్యాసి నడుచుకుంటూ వస్తున్నారు. జామా మసీదు నిండిపోయింది. ఈ సన్యాసి జామా మస్జిద్ మింబర్ (పల్పిట్) లోంచి ప్రసంగిస్తాడని వేలాది మంది ముస్లింలు ఎదురు చూస్తున్నారు. వందలాది మంది ఇతర హిందువులను కూడా జామా మసీదు లోపలికి అనుమతించారు.

ఇది అవాస్తవం కాదు. ఇది వాస్తవంగా  4 ఏప్రిల్ 1919న జరిగింది. ఆర్యసమాజ్ శుద్ధి మరియు గౌరక్షా ఉద్యమ నాయకుడు సన్యాసి స్వామి శ్రద్ధానంద్,

హిందూ-ముస్లిం ఐక్యత సూత్రం ప్రపంచానికి చాటటానికి , ముస్లింలు   ఢిల్లీలోని జామా మసీద్ నుండి ఆర్య సమాజానికి చెందిన స్వామి శ్రద్దానంద ను ప్రసంగించమని అడిగారు. డాక్టర్ సైఫ్ ద్డిన్ కిచ్చ్లు, కు అమృతసర్ లోని సిక్కు మందిరం అయిన స్వర్ణ దేవాలయానికి చెందిన తాళాలు keys ఇవ్వబడ్డాయి. హిందూ-ముస్లిం కి జై'  నినాదం తో మొత్తం దేశం ప్రతిధ్వనిoచింది.

ఏప్రిల్ 4న శుక్రవారం షహీద్‌ల (అమరవీరుల) కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు. స్వామి శ్రద్దానంద్ మరియు పలువురు హిందువులను ప్రత్యేకంగా జామా మసీదు లోపలికి ఆహ్వానించారు. హిందూ ముస్లిం ఐక్యతపై స్వామి శ్రద్దానంద్ ఉపన్యాసం ఇచ్చారు..

జామ మసీదు నందు  4 ఏప్రిల్ 1919 న స్వామి శ్ర్రద్దానంద్ కుంకుమ వస్త్రాలు ధరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి హిందూ-ముస్లిం ఐక్యత మరియు బ్రిటిష్ పాలన కు వ్యతిరేకంగా ప్రసంగించారు. స్వామి శ్ర్రద్దానంద్ వేద మంత్ర ఉచ్చారణ తో  తన ప్రసంగాన్ని ప్రారంభించారు.దానికి అందరు అమీన్ అని బదులిచ్చారు.  'ఈ జాతీయ ఆలయం' లో మాతృభూమి యొక్క "ప్రేమతో కూడిన నీటితో ‘water of love’" తమ  హృదయాలను శుద్ధి చేయాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు మరియు భారతీయులు అందరు సోదరులు మరియు సోదరీమణులు అని భోదించారు.

సంఘటన-పూర్వ చరిత్ర:

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, బ్రిటీష్ వారు రౌలట్ బిల్లును తీసుకువచ్చారు, ఇది భారతీయుల ప్రసంగం మరియు భావవ్యక్తీకరణ హక్కుపై మరిన్ని ఆంక్షలను ప్రతిపాదించింది. M. K. గాంధీ (మహాత్మా గాంధీ) నేతృత్వంలోని భారత నాయకత్వం ఈ బిల్లును క్రూరమైనదిగా పిలిచింది.

మహాత్మా గాంధీ మరియు ఇతర నాయకులు ఫిబ్రవరి 1919లో అహ్మదాబాద్‌లో బ్రిటీష్ ప్రభుత్వం చట్టంగా చేస్తే రౌలట్ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రతిజ్ఞపై సంతకం చేశారు. ప్రతిజ్ఞపై అబుల్ కలామ్ ఆజాద్, అజ్మల్ ఖాన్, లజపత్ రాయ్, మోతీలాల్ నెహ్రూ, శ్రీమతి సరోజినీ నాయుడు, అబ్బాస్ తయాబ్జీ, ఎన్.సి.కేల్కర్, వి.జె.పటేల్, వల్లభాయ్ పటేల్, ఎం.ఆర్.జయకర్, జవహర్‌లాల్ నెహ్రూ, గంగాధరరావు దేశ్‌పాండే, శ్రీమతి సోబని,  జమునాలాల్ బజాజ్, , M. S. అనీ, డా. అన్సారీ, ఖలీకుజ్జమాన్, అబ్దుల్ బారీ, రాజగోపాలాచారి, జతీంద్ర లాల్ బెనర్జీ, రాజేంద్ర ప్రసాద్, హస్రత్ మోహని, యాకూబ్ హసన్, డాక్టర్. మూంజే మరియు జైరామ్‌దాస్ దౌలత్ రాం మొదలగు నాయకులు సంతకం చేసారు..

దేశంలోని ఇతర ప్రాంతాల్లో, బిల్లు ఆమోదం పొందిన తర్వాత సత్యాగ్రహం కోసం ఎంచుకున్న రోజు ఏప్రిల్ 6, కాని ఢిల్లీలో మార్చి 30న సత్యాగ్రహం జరిగింది. 1919 మార్చి 7న ఢిల్లీలో ఏర్పడిన సత్యాగ్రహ సభలో పద్నాలుగు మంది నాయకులు ఉన్నారు. వీరిలో డాక్టర్ అన్సారీ (అధ్యక్షుడు), స్వామి శ్రద్ధానంద్ అని పిలవబడే మున్షీ రామ్, హస్రత్ మోహని, డాక్టర్ అబ్దుర్ రెహమాన్, శంకర్ లాల్, శివ నారాయణ్ హక్సర్, మిస్ గ్మీనర్ Miss Gmeiner, షుయబ్, ఇంద్ర (స్వామి కుమారుడు) మరియు అతని భార్య మరియు ఇతరులు ఉన్నారు.

స్వామి శ్రద్ధానంద్, మహమూద్ షుయబ్ మరియు అబ్దుర్ రెహమాన్ 30 మార్చి 1919న డిల్లీ సత్యాగ్రహానికి ప్రధాన నిర్వాహకులుగా ఉన్నారు.

సత్యాగ్రహా కార్యాచరణ ప్రణాళిక ఇలా ప్రచారం చేయబడింది:

 ( 1 ) మార్చి 30వ తేదీని సంతాప దినంగా జరుపుకోవాలి.

(2) మార్చి 29 రాత్రి నుండి అందరూ మార్చి 30 రాత్రి వరకు ఉపవాసం ఉండాలి.

(3) ఇతర రోజువారీ విధులన్నీ ముగించుకుని, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, పరమాత్మను మనకు ఓర్పు శక్తిని ప్రసాదించమని, మన సర్కార్‌ను సరైన మార్గంలో నడిపించమని మరియు భారత మాత యొక్క కష్టాలను అంతం చేయమని ప్రార్థించండి,

(4) అన్ని వ్యాపారాలు మరియు దుకాణాలు మూసివేయడం, దేశానికి మంచి జరగాలని కోరుకోవడంలో, మనస్సును సంస్కరించడంలో మరియు దాతృత్వ పనిలో గడపాలి.

(5) ప్రతి స్త్రీ, పురుషుడు మరియు బిడ్డ సాయంత్రం సమావేశానికి 5 గంటలకు హాజరు కావాలి.

 ఆ రోజు (మార్చి 30)1857 తరువాత ఢిల్లీ చరిత్రలో అత్యంత రక్తపాతంగా మారింది మరియు భారతీయులకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఒక హెచ్చరిక అని కూడా నిరూపించబడింది. రెండు వారాల తర్వాత బ్రిటిష్ వారు అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో మారణకాండ నిర్వహించారు.

బ్రిటీష్ పోలీసులు మరియు సైన్యం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో సత్యాగ్రహిలపై కాల్పులు జరిపినారు  మధ్యాహ్నం 2 గంటలకు డజనుకు పైగా సత్యాగ్రహులు మరణించారు. జనం చాందినీ చౌక్‌లోని క్లాక్ టవర్ వైపు వెళ్లడంతో పోలీసులు మళ్లీ బ్రిటీష్ పోలీసులు మరియు సైన్యం పలువురిని హతమార్చారు. ఢిల్లీలో 50 మందికి పైగా శాంతియుత నిరాయుధ సత్యాగ్రహులు బ్రిటిష్ పోలీసులు మరియు సైన్యం చేతిలో హతమయ్యారు.

చాందినీ చౌక్ నుండి క్లాక్ టవర్ వరకు వేలాది మందితో జరిగిన సత్యాగ్రహ యాత్రలో మెషిన్ గన్‌లు ఉపయోగించారని స్వామి శ్రద్ధానంద్ విన్నారు. అటు వెళ్ళిన స్వామి శ్రద్ధానంద్  ను బ్రిటీష్ సైన్యం,   నిలువరించి తుపాకీలను గురిపెట్టినది.   స్వామి విచారణ కమిషన్ ముందు జరిగిన సంఘటనను వివరించారు

.” స్వామి ఇలా వ్రాశాడు, “మేము క్లాక్ టవర్ దగ్గరికి చేరుకున్నప్పుడు, గుర్ఖాలు రోడ్డు మధ్యలో, రెండు వైపులా డబుల్ ఫైల్‌లో ఉన్నారు. మమ్మల్ని చూడగానే వాళ్లు కుడి ఫుట్ బోర్డు దగ్గరకు వెళ్లారు. మేము ముందుకు వెళ్లేందుకు వీలుగా వారు రోడ్డును విడిచిపెట్టారని మేము అనుకున్నాము, కాని మేము వారి దగ్గరికి చేరుకున్నప్పుడు, ఒక రైఫిల్ గుంపుపైకి కాల్చబడింది. జనంలో కలకలం మరియు తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కానీ నేను అందరినీ శాంతి గా ఉండమని అడిగాను మరియు వారు నా మాట పాటించారు. నా సన్యాసి వేషంలో, నేను ఒంటరిగా ఫుట్‌పాత్‌పైకి వెళ్లి, అమాయక శాంతియుత ప్రజలపై ఎందుకు కాల్పులు జరుపుతున్నారని గూర్ఖాలను అడిగాను. వెంటనే రెండు రైఫిళ్లు నా వైపుకు గురిపెట్టబడ్డాయి మరియు వారు చాలా అసభ్యకరమైన స్వరంతో తుమ్ కో ఛేద్ దేంగే (మేము మిమ్మల్ని కాలుస్తాము) అని చెప్పడం ప్రారంభించారు. నేను వారి ముందు నిశ్శబ్దంగా నిలబడి చెప్పాను. "మై ఖాడా హున్, గోలీ మారో (నేను నిలబడి ఉన్నాను, కాల్చండి)). ఒక్కసారిగా మరో ఎనిమిది లేదా పది రైఫిళ్లు నా రొమ్ముపై గురిపెట్టాయి మరియు అవమానకరమైన బెదిరింపులు కొనసాగాయి."

ఏప్రిల్ 17C. A. బారన్, C.I.E. , ఐ.సి.ఎస్. Sir J. H. DuBoulay, K.C.I.E. C.S.I. , I.C.S కి వ్రాసారు. “4వ తేదీన జామా మసీదు ప్రార్థనా సమావేశం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగిసింది, అయితే అనేక మంది హిందువులను మసీదులోకి ఆహ్వానించడం మరియు ఆర్య సమాజిస్ట్ మున్షీ రామ్ (స్వామి శ్రద్ధానంద్) పల్పిట్ నుండి నమాజీలను ఉద్దేశించి  ప్రసంగించడానికి అనుమతించడం విశేషం.."

R. C. జెఫ్రీస్, పోలీసు సూపరింటెండెంట్, C.I.D. "జామా మసీదులోని పల్పిట్ నుండి మాట్లాడటానికి స్వామికి అనుమతి ఉంది మరియు 40 లేదా 50 మందికి బదులుగా ఇక్కడ ఉన్న సగం మందిని కూడా చంపితే భయపడవద్దని ప్రజలను కోరటం జరిగింది" అని నివేదించబడింది.

తరువాతి కొద్ది రోజుల్లో, జలియన్ వాలా బాగ్, అహ్మదాబాద్, లాహోర్ మొదలైన అనేక ప్రదేశాలలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపై కాల్పులు జరిపింది.

 

 

 

 

No comments:

Post a Comment