12 May 2024

ఆన్‌లైన్ ఇస్లామిక్ లెర్నింగ్‌ సుల్తానా -డా. ఆయేషా సుల్తానా Dr. Ayesha Sultana Queen of Online Islamic Learning -

 


డా. ఆయేషా సుల్తానా ఇస్లామిక్ విద్యా రంగంలో తన ఆన్‌లైన్ కార్యక్రమాల ద్వారా, యువత మరియు మహిళలను ఆకట్టు కొంటున్నది.. ఆంగ్లం లో డాక్టరేట్ పొంది , ఇస్లామిక్  అధ్యయనాలు మరియు మనస్తత్వశాస్త్రం లో పోస్ట్-గ్రాడ్యుఎషణ్ పూర్తి చేసిన    డాక్టర్ ఆయేషా సుల్తానా యువత హృదయాలలో నైతిక విలువలు మరియు ఇస్లామిక్ బోధనలను నింపుతున్నారు. అందుబాటులో ఉన్న  చైతన్యవంతమైన కోర్సుల ద్వారా మహిళలకు సాధికారత కల్పించడంపై డాక్టర్ ఆయేషా సుల్తానా ప్రత్యేక దృష్టి సారించారు.

"తాలిముల్ ఇస్లాం సర్టిఫికేట్ కోర్సు," డాక్టర్ ఆయేషా సుల్తానా యొక్క అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. 14 ఏళ్లలోపు పిల్లల కోసం రూపొందించబడిన, "తాలిముల్ ఇస్లాం సర్టిఫికేట్ కోర్సు సమగ్ర 10-వారాల ఆన్‌లైన్ ప్రోగ్రామ్ ప్రాథమిక ఇస్లామిక్ జ్ఞానాన్ని పొందేందుకు ఒక ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. 

జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ మహిళా విభాగం మాజీ సహాయ కార్యదర్శి కూడా అయిన  డాక్టర్ ఆయేషా సుల్తానా మహమ్మారి సమయంలో 1500 మంది మహిళలకు "తాలిముల్ ఇస్లాం సర్టిఫికేట్ కోర్సు ద్వారా ప్రాధమిక  ఇస్లామిక్ జ్ఞానం లో శిక్షణ ఇచ్చారు..

అల్ హుదా బ్యానర్ క్రింద, డాక్టర్ ఆయేషా సుల్తానా అయత్ అల్-ఫరియా ఇస్లామిక్ అకాడమీని స్థాపించి  వందలాది మంది మహిళలు మరియు పిల్లలకు దివ్య ఖురాన్ బోధనలు మరియు వ్యక్తిత్వ వికాస కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు.  పిల్లలు దివ్య ఖురాన్ కంఠస్థం మరియు ఇస్లామిక్ సూత్రాలపై ఇంటరాక్టివ్ సెషన్‌లలో పాల్గొంటారు.

డాక్టర్ ఆయేషా సుల్తానా పిల్లల కోసం సమ్మర్ షార్ట్-టర్మ్ కోర్సులను నిర్వహిస్తుంది. సమ్మర్ షార్ట్-టర్మ్  కోర్సులలో శారీరక కార్యకలాపాలతో బాటు  ఇస్లామిక్ విలువలపై శిక్షణ ఇవ్వబడును.  అంతేకాకుండా, డాక్టర్ ఆయేషా సుల్తానా మహిళల కోసం "ఫామ్ ఇ ఖురాన్" కోర్సు మరియు "తలాష్ ఇ ఖదర్ సిరీస్ వంటి కార్యక్రమాల ద్వారా  వారి రంజాన్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

యువతకు సాధికారత కల్పించడంలో భాగంగా  డాక్టర్ అయేషా సుల్తానా పిల్లల కోసం ఆన్‌లైన్ పోటీలను నిర్వహించడం చేస్తుంది.  ఇందులో పాల్గొనేవారికి వీడియో పోటీలు, ప్రసంగ పోటీలు మరియు మౌఖిక పరీక్షలతో సహా వివిధ విభాగాలలో వారి విజయాలకు గుర్తింపు సర్టిఫికేట్లు మరియు ట్రోఫీలు అందించబడతాయి. 300 మంది పిల్లలు కోర్సులలో చేరారు మరియు 100 మంది సర్టిఫికేట్ పొందారు

2013లోఅల్ హుదా ఇస్లామిక్ స్కూల్ తెలంగాణలోని ఖమ్మంలో డాక్టర్ సుల్తానా మార్గదర్శకత్వంలో ప్రారంభమైంది. మొదట్లో మహిళలకు ఆఫ్‌లైన్ తరగతులను అందిస్తూ, ఉచిత రవాణా సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. 

2018 వరకు అల్ హుదా ఇస్లామిక్ స్కూల్ఇస్లామిక్ స్టడీస్‌లో సర్టిఫికేట్, డిప్లొమా మరియు ఖురాన్, బేసిక్ అరబిక్ గ్రామర్, తఫ్సీర్, సీరా మరియు వ్యక్తిత్వ వికాసం వంటి కోర్సులను అందించింది. వందలాది మంది మహిళలు వీటి ద్వారా ప్రయోజనం పొందారు. కోర్సులు విజయవంతం గా పూర్తిచేసిన వారిలో అధికులు  జమాతే ఇస్లామీ హింద్‌ స్వచ్ఛంద సేవకులు మరియు సభ్యులుగా సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు

డాక్టర్. ఆయేషా సుల్తానాకు విద్య పట్ల ఉన్న అంకితభావం, వైద్య మరియు ఇంజినీరింగ్ సంస్థలతో సహా అనేక కళాశాలల్లో ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఇవ్వడానికిడానికి మరియు పాఠశాల పిల్లలకు నైతిక తరగతులను నిర్వహించేలా చేసింది. 

జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ మహిళా విభాగం సహాయ కార్యదర్శిగా మరియు దావా కార్యదర్శిగా ప్రస్తుతం జాతీయ స్థాయి లో ఔరా/OURA మహిళా మ్యాగజిన్ ఎడిటోరియల్ బోర్డు మెంబెర్ , మర్కజ్ సబ్ఎడిటర్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్  మెంబర్ గా   డాక్టర్. ఆయేషా సుల్తానా వివిధ మహిళా సాధికారత కార్యక్రమాలకు విజయవంతం గా నాయకత్వం వహించారు.

2019 లో కరోనా మహమ్మారి ప్రారంభ కాలం లో డాక్టర్. ఆయేషా సుల్తానా వివిధ రకాల ఆన్‌లైన్ తరగతులు నిర్వహించినది. డాక్టర్. ఆయేషా సుల్తానా అక్సే ఫుర్కాన్, దావా క్లాస్‌లు, కసల్ ఉల్ అంబియా కోర్సు, ఖుర్బ్ ఇ ఇలాహి మరియు అనేక క్విజ్ మరియు ఎగ్జామ్ సిరీస్‌లతో సహా మహిళల కోసం అనేక కోర్సులు మరియు షార్ట్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. 1500 మందికి పైగా మహిళలు వివిధ కోర్సులు, షార్ట్ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటున్నారు.  

2023లో, అల్ హుదా ఇస్లామిక్ స్కూల్ ఆధ్వర్యంలో అయత్ అల్ ఫరియా ఆన్‌లైన్ అకాడమీ స్థాపనతో డాక్టర్ ఆయేషా సుల్తానా తన ఆన్‌లైన్ విద్యా కార్యక్రమాలను విస్తరించింది.

డాక్టర్ ఆయేషా సుల్తానా మహిళల కోసం తఫ్సీర్ మరియు సూరా ముల్క్, సూరా రహ్మాన్ మరియు సూరా యాసీన్ మెమోరైజేషన్ వంటి చిన్న కోర్సులను నిర్వహిస్తూ అయత్ అల్ ఫరియా ఆన్‌లైన్ అకాడమీ ద్వారా వందలాది మంది మహిళలపై సానుకూల ప్రభావాన్ని చూపుతూనే ఉంది. అదనంగా, డాక్టర్ ఆయేషా సుల్తానా ద్వారా షురు రంజాన్ వంటి ప్రీ-రంజాన్ కోర్సులు, అలాగే రంజాన్ సమయంలో ఫామ్ ఇ ఖురాన్ మరియు తలాష్ ఇ ఖదర్ సిరీస్ వంటి కోర్సులు నిర్వహించబడి, అధిక సంఖ్యలో పాల్గొనేవారికి ప్రయోజనం చేకూరింది.

డాక్టర్ అయేషా సుల్తానా విద్యను ఉచితంగా అందించాలనే నిబద్ధత కలిగిన మహిళ. డాక్టర్ అయేషా సుల్తానా వెనియల్ ఫౌండేషన్ నుండి రాష్ట్ర రత్న పురస్కార్ అవార్డు, బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు వర్తీ వెల్ ఫౌండేషన్ నుండి బెస్ట్ ఎడ్యుకేటర్ మరియు అకాడెమీషియన్ అవార్డు తో గుర్తింపు పొందింది, ప్రతిష్టాత్మక బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో డాక్టర్ అయేషా సుల్తానా స్థానం సంపాదించింది.

డాక్టర్ ఆయేషా సుల్తానా నిష్ణాతురాలైన రచయిత్రి. "బియాండ్ రంజాన్" మరియు "ఎంబాడీడ్ విజ్డమ్" వంటి రచనలు చేసింది. రేడియన్స్ న్యూస్ పోర్టల్ అసిస్టెంట్ ఎడిటర్‌గా మరియు జమాతే ఇస్లామీ హింద్ మర్కజ్‌లో అవేర్ ట్రస్ట్ సభ్యురాలిగా, డాక్టర్ అయేషా సుల్తానా విద్య మరియు సమాజ అభివృద్ధిలో తన అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా వ్యక్తులను ప్రేరేపించడం మరియు శక్తివంతం చేయడం కొనసాగిస్తున్నారు.

డా. ఆయేషా సుల్తానా మే 16 నుండి మే 31 వరకు పిల్లల కోసం తాలిముల్ ఇస్లాం లెవల్ 2అనే  అధునాతన కోర్సు ప్రారంభాన్ని ప్రకటించింది. డా. ఆయేషా సుల్తానా మార్గదర్శకత్వంలో 15 రోజుల కార్యక్రమం యువ అభ్యాసకుల విద్యా ప్రయాణాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

డా. ఆయేషా సుల్తానా ఇస్లామిక్ విద్య మరియు సమాజ అభివృద్ధిపై చెరగని ముద్ర వేసింది మరియు లెక్కలేనన్ని మంది వ్యక్తులను జ్ఞానం మరియు సుగుణం పొందేదుకు ప్రేరేపిస్తుంది.

 

మూలం: రేడియన్స్ న్యూస్, మే 11, 202

No comments:

Post a Comment