7 April 2020

మహమూద్ అల్-హసన్ 1851-1920 Mahmud al-Hasan1851-1920




Mahmud al-Hasan | Revolvy

 

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహమూద్ అల్ హసన్ ప్రముఖ ముస్లిం జాతీయ నాయకుడు. 

మహమూద్ హసన్ (1851 - 30 నవంబర్ 1920) గా పిలువబడే మహమూద్ అల్-హసన్ (మాముదుల్-ఆసాన్) భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేసిన డియోబంది సున్నీ హనఫీ  ముస్లిం పండితుడు. అతని ప్రయత్నాలు మరియు పాండిత్య ప్రతిభకు గాను సెంట్రల్ ఖిలాఫత్ కమిటీ అతనికి "షేక్ అల్-హింద్" ("షేక్ ఆఫ్ ఇండియా") అనే బిరుదును ఇచ్చింది.


మహమూద్ అల్-హసన్ 1851 లో ఉత్తర ప్రదేశ్ లోని  బరేలీ పట్టణంలో ఒక పండితుల కుటుంబంలో జన్మించాడు.] అతని తండ్రి, ముహమ్మద్ జుల్ఫికర్ అలీ, అరబిక్ భాష పండితుడు మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన యొక్క విద్యా విభాగంలో పనిచేశారు.

1857 నాటి తిరుగుబాటు సమయంలో మహమూద్ అల్-హసన్ మీరట్‌లో తన తండ్రితో ఉన్నారు.
ఇస్లాం, పెర్షియన్ భాష మరియు ఉర్దూ అధ్యయనానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ మహమూద్ అల్-హసన్ సాంప్రదాయ ఇస్లామిక్ విద్యను పొందారు. అతని ప్రాధమిక విద్య మౌలానా మొంగేరి, మౌలానా అబ్దుల్ లతీఫ్ మరియు తరువాత, అతని మామ మౌలానా మహతాబ్ అలీ వద్ద గడిచినది. మహమూద్ అల్-హసన్ ముక్తసార్ అల్-కుదురి మరియు షార్-ఇ-తహ్దీబ్ పుస్తకాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, దారుల్ ఉలూమ్ డియోబంద్ అని పిలువబడే కళాశాల 1866 లో స్థాపించబడింది.

మహమూద్ అల్-హసన్ తండ్రి అతన్ని కొత్తగా స్థాపించిన దారుల్ ఉలూమ్ డియోబంద్ పాఠశాలకు పంపారు, అక్కడ అతను మొదటి విద్యార్థి. అతను తన ప్రాథమిక పాఠాలను  (1869/1870)  పూర్తి చేశాడు, తరువాత అతను ముహమ్మద్ ఖాసిమ్ నానోట్వి క్రింద హదీసులు అభ్యసించాడు. ఆ తరువాత, అతను తన తండ్రి క్రింద ఉన్నత స్థాయి పుస్తకాలను అభ్యసించాడు. అతను 1873 లో దారుల్ ఉలూమ్ డియోబంద్ నుండి డిగ్రీ పట్టా పొందాడు.

1874 లో, మహమూద్ అల్-హసన్ దారుల్ ఉలూమ్ డియోబంద్‌లో ఉపాధ్యాయుడిగా చేరాడు మరియు తరువాత 1890 లో కళాశాల ప్రిన్సిపాల్ పదవికి పదోన్నతి పొందాడు

దారుల్ ఉలూమ్ డియోబంద్‌లో  ఉపాద్యాయుడుగా పని చేస్తూనే మౌలానా మహమూద్ అల్-హసన్ బ్రిటిష్ భారతదేశం మరియు ప్రపంచంలోని రాజకీయ వాతావరణంపై ఆసక్తిని పెంచుకున్నాడు.

1914 లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒట్టోమన్ సామ్రాజ్యం మొదటి ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇస్లాం యొక్క ఖలీఫ్ మరియు ప్రపంచ ముస్లిం సమాజానికి ఆధ్యాత్మిక నాయకుడైన ఒట్టోమన్ సామ్రాజ్యం సుల్తాన్ యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు దానినే ఖిలాఫత్ ఉద్యమం  అని పిలుస్తారు, దాని నాయకులు మహ్మద్ అలీ జౌహర్ మరియు మౌలానా షౌకత్ అలీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

ముస్లిం విద్యార్థులను ఉద్యమంలో చేరమని ప్రోత్సహించడంలో మహమూద్ అల్ హసన్ చురుకుగా పనిచేశారు. భారతదేశం లోపల మరియు వెలుపల నుండి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవాన్ని ప్రారంభించడానికి హసన్ ప్రయత్నాలు నిర్వహించారు. "యుద్ధం లేకుండా బ్రిటిష్ వారిని భారతదేశం నుండి బహిష్కరించడం సాధ్యం కాదు మరియు దానికి గాను  ఆయుధాలను  సాధించడం అవసరం. భారతీయులకు ఆయుధాలు లేనందున స్వాతంత్ర్య యుద్ధంలో విదేశీ సహాయం అవసరం అని పేర్కొనారు.

ఈ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో చేరిన భారతదేశ మరియు విదేశాలలో ఉన్న తన శిష్యుల నుండి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వారిలో ప్రముఖులు మౌలానా ఉబైదుల్లా సింధి మరియు మౌలానా ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ. ప్రజా మద్దతును సమీకరించడానికి మరియు వాలంటీర్లను నియమించుకోవడానికి సింధీని కాబూల్‌కు మరియు అన్సారీని నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌కు పంపిస్తూ, మహమూద్ అల్-హసన్ 1915 లో టర్కిష్ ఒట్టోమన్ పాలకుల నుండి మద్దతు పొందడానికి హిజాజ్‌(సౌదీ అరేబియా)ను స్వయంగా  సందర్శించారు.

ఒట్టోమన్ సామ్రాజ్యం ఆఫ్ ఆసియా నుండి మద్దతు పొందడం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలనతో పోరాడటానికి ఉద్దేశించిన "సిల్క్ లెటర్ కుట్ర" కు ఆయన ప్రసిద్ది చెందారు.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధ ప్రకటనపై టర్కీ గవర్నర్ గాలిబ్ పాషా సంతకాన్ని పొందిన మహమూద్ అల్ హసన్ తిరుగుబాటును ప్రారంభించడానికి బాగ్దాద్ మరియు బలూచిస్తాన్ మీదుగా భారతదేశానికి తిరిగి రావాలని ప్రణాళిక వేశారు. సిల్క్ లెటర్ కుట్ర అని పిలువబడే ఈ ప్రణాళికను పంజాబ్ సిఐడి లీక్ చేసి పత్రలను స్వాధీనం చేసింది.

బ్రిటిష్ వారు ఇప్పటికే సౌదీ అరేబియా పాలకులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు మరియు 1916 డిసెంబర్ 19 న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కోర్టు మార్షల్ చేసి, తరువాత 15 ఫిబ్రవరి 1917 న మాల్టాకు బహిష్కరించారు. అతను 3 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు జీవితం గడిపాడు విడుదలైన తరువాత 1920 లో భారతదేశానికి చేరుకున్నాడు.

బ్రిటిష్ ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత, మహమూద్ అల్ హసన్ ఖిలాఫత్ ఉద్యమంలో చేరారు. భారతదేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సహకరించవద్దని  ఆయన  500 ఉలామాల  మద్దతుతో ఒక ఫత్వా జారీ చేశాడు. ఇది బ్రిటిష్ వలసరాజ్యాల అధికారులతో అన్ని సహకారాలు హరామ్ అని మరియు మహాత్మా గాంధీ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారమించిన నాన్-కోఅపరేషణ్  ఉద్యమానికి మద్దతు ఇవ్వడం మరియు అందులో పాల్గొనడం భారత ముస్లింలందరి కర్తవ్యం అని పేర్కొంది.

మరణం-ఖ్యాతి Death &Legacy:
1920 నవంబర్ 30 న మహముద్ అల్-హసన్ మరణించారు. అయన సమాధి దారుల్ ఉలూమ్ డియోబంద్ స్మశానవాటిక లో కలదు.

·        అతని ప్రయత్నాలు ముస్లింలనే  కాకుండా అందరు భారతీయుల ప్రశంసలను పొందాయి. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమానికి చిహ్నంగా నిలిచాడు మరియు అతనికి కేంద్ర ఖిలాఫత్ కమిటీ "షేక్ అల్-హింద్" బిరుదు ఇచ్చింది.
·        ఇతను 1920 అక్టోబరులో స్థాపించిన జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులలో ఒకరు. అతను ఖురాన్ యొక్క ప్రసిద్ధ అనువాదం కూడా వ్రాసాడు, దాని వ్యాఖ్యానాన్ని అతని విద్యార్థులలో ఒకరైన షబ్బీర్ అహ్మద్ ఉస్మానీ రాశారు.
·        మహమూద్ అల్-హసన్ ఆధునిక విద్యకు మద్దతు ఇచ్చాడు మరియు 1893 లో లక్నోలో స్థాపించబడిన దారుల్ ఉలూమ్ నద్వాతుల్ ఉలామాకు మద్దతు ఇచ్చాడు
·        సహారన్పూర్ లోని షేక్-ఉల్-హింద్ మౌలానా మహమూద్ హసన్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టారు.
·        మౌలానా నిజాముద్దీన్ ఆసిర్ అడ్రావి అతని  జీవిత చరిత్ర, “షేఖ్ అల్-హింద్ హయత్ ఔర్ కార్నమే” ను రాశారు దీనిని డియోబంద్ లోని షేఖుల్ హింద్ అకాడమీ ప్రచురించింది.
·        దారుల్ ఉలూమ్ డియోబంద్ మహమూద్ అల్ హసన్ పేరు మీద పరిశోధనా సంస్థ షేఖుల్ హింద్ అకాడమీని స్థాపించారు.
·        అతను తఫ్సీర్-ఎ-ఉస్మాని (ఉర్దూ తఫ్సీర్)  గ్రంధం షబ్బీర్ అహ్మద్ ఉస్మానితో కలిసి రాశాడు.
·        అతడు రచించిన ప్రముఖ గ్రంధాలు: తర్జుమా షేక్ అల్-హింద్, ఆదిల్లా-ఎ-కమీలా, ఇడాహుల్ ఆదిల్లా Tarjuma Shaykh al-Hind, Adilla-e-Kamilah, Idaahul Adillah

అతని ప్రముఖ విద్యార్థులలో  కొందరు:
·         అన్వర్ షా కాశ్మీరీ
·         ఉబైదుల్లా సింధి
·         హుస్సేన్ అహ్మద్ మదాని
·         ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ
·         కిఫాయతుల్లా దిహ్లావి
·         షబ్బీర్ అహ్మద్ ఉస్మాని



No comments:

Post a Comment