అది 1931
సంవత్సరం, గాంధీ-ఇర్విన్ ఒప్పందం తర్వాత చాలా
మంది జాతీయవాద నాయకులు జైలు నుండి బయటకు వచ్చారు కానీ నార్త్ వెస్ట్రన్ ఫ్రాంటియర్
ప్రావిన్స్లోని ఖుదాయి ఖిద్మత్గార్స్ Khudai
Khidmatgars
నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇప్పటికీ జైలులో ఉన్నాడు మరియు ఖాన్ అబ్దుల్ గఫర్
ఖాన్ అనుచరులు అన్ని విధాలుగా క్రూరంగా హింసించబడ్డారు.
బ్రిటిష్ జైళ్లలో మగ్గుతున్న జాతీయవాద నాయకులను
విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖుదాయి ఖిద్మత్గార్స్ ఉత్మాన్జాయ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశాన్ని ఆపడానికి బ్రిటిష్ దళాలను పంపారు. సమావేశాన్ని ఆపమని దళాలు ఆదేశించాయి
కానీ ఖుదాయి ఖిద్మత్గార్స్ వినలేదు. బ్రిటిష్
దళాలు నిరాయుధ నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాయి.
పురుషులు పారిపోవడం ప్రారంభించగా, సమావేశానికి హాజరైన ఒక యువ పఠాన్ బాలిక
బ్రిటిష్ దళాల వైపు నడవడం ప్రారంభించింది, వారు
కాల్పులు జరుపుతున్నారు. పురుషులు బాలికను 'మూర్ఖురాలు' అని మరియు ఆత్మహత్యసద్రుస్యంగా ప్రవర్తించినందుకు
బాలిక పై కేకలు వేసారు.. బాలిక ప్రాణాలను కాపాడుకోవడానికి తమతో పారిపోవాలని వారు బాలికను
కోరారు. ఈ సమయంలో బాలిక “దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మీరందరూ
పారిపోతున్నారు కాబట్టి నేను ఆ దారిలోకి వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వండి. ఒక
బుల్లెట్ నాకు తగలనివ్వండి, నేను చనిపోతాను, లేకపోతే పఠాన్లలో ఎవరూ తమ విశ్వాసం
కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా లేరని బ్రిటిష్ వారు చెబుతారు.” అని తిరిగి
అరిచింది;
ఈ మాటలు అక్కడ ఉన్న పఠాన్లలో శౌర్య జ్వాలను
మళ్ళీ రగిలించాయి, వారు వెంటనే ఆగి ఆ బాలిక తో పాటు దళాల
వైపు నడవడం ప్రారంభించారు. సైనికులు తమవైపు
వస్తున్న మోసుకెళ్తున్న దేశభక్తి కల నిరాయుధ ప్రజలను చూసి భయపడి తమ రైఫుళ్ళను
విడిచి పారిపోయారు.
ఈ దేశభక్తిగల అమ్మాయి పేరు మనకు తెలియకపోవడం
సిగ్గుచేటు మరియు మనకు తెలిసినది ఏమిటంటే బాలిక సోదరుడు రబ్నావాజ్ ఖాన్ ఖుదై ఖిద్మత్గార్.
మరొక సందర్భంలో ఒక పఠాన్ వ్యక్తి పోలీసుల
హింసను తట్టుకోలేక అప్రూవర్గా మారాడు. పఠాన్ వ్యక్తి గ్రామంలోని ప్రతి ఇతర
వ్యక్తి జైలులో ఉండగా అతన్ని విడుదల చేశారు. ఇంటికి చేరుకున్న తర్వాత, పఠాన్ వ్యక్తి భార్య గ్రామంలోని మరెవరూ
విడుదల కానప్పుడు నీవు ఎలా తిరిగి వస్తాడని అడిగింది. ఆమె అతని బొటనవేలు
తనిఖీ చేసి, కొన్ని కాగితాలపై పఠాన్ వ్యక్తి బొటనవేలు
ముద్ర వేసినట్లు రుజువు చేసే సిరా జాడలను కనుగొంది. దీనితో ఆ భార్య కోపగించుకుంది, ఆమె ఒక చెక్క కర్రను తీసుకుని తన
భర్తను కొట్టడం ప్రారంభించింది. మరియు ఆ మహిళ అంతటితో ఆగక తాను దేశభక్తి లేని పిరికివాడిని వదిలి ఒంటరిగా
జీవిస్తానని ప్రకటించింది. పఠాన్ వ్యక్తి తన తప్పును గ్రహించి స్వయంగా జైలుకు
తిరిగి వచ్చాడు.
No comments:
Post a Comment