విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక రంగంలో
ఇస్లాం/ముస్లింల యొక్క కృషి మనలో ఎంత మంది కు తెలుసు? క్రీస్తు శకం ఆరు నుంచి పన్నెండు
శతాబ్దం వరకు ఇస్లాం సైన్స్ మరియు టెక్నాలజీ క్షేత్రం లో గణనీయమైన కృషి చేసినదని మనలో కొద్ది మంది
మాత్రమె తెలుసు. మిడిల్ ఈస్ట్,
ఆఫ్రికా మరియు
యూరప్ లోని వివిధ ముస్లిం సామ్రాజ్యాలలో
అనేక మంది శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, వైద్యులు, ఫార్మాలజిస్ట్స్, భూగోళ శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, జంతు శాస్త్రవేత్తలు మరియు అనేకమంది విద్వాంసులు విజ్ఞానం మరియు శాస్త్రాలను అభ్యసిస్తున్న
అనేకమంది పండితులు జన్మించారు. ఈ పండితులు కేవలం ముస్లింలే కాదు, వారు మంచి నైతిక
ప్రవర్తన మరియు శాస్త్రీయ జ్ఞానంతో పాటు మతపరమైన అవగాహన కలిగి ఉన్నారు.
అటువంటి వారిలో
జహిజ్ ఒకడు. జహీజ్ ఒక మదరసా (ఇస్లాం
సెమినరీ) యొక్క పూర్వ విద్యార్ధి. అతను విజ్ఞాన శాస్త్రం మరియు
విజ్ఞానశాస్త్రంలోని ఇతర విభాగాలకు వినూత్న సేవ, సహకారం అందించాడు. అతని శాస్త్రీయ
మరియు విద్యా పరమైన పరిశోధనలు పాశ్చాత్య విద్వాంసుల యొక్క వివిధ అధ్యయనాలలో
ఉపయోగించబడ్డాయి కాని దురదృష్టవశాత్తు అతని ప్రస్థావన నేడు ఎక్కడా కనిపించదు.
దురదృష్టవశాత్తూ, నేడు మదరసాలు తీవ్రవాదానికి ప్రతీకగా భావించబడుతున్నవి, కానీ జంతు శాస్త్రం లో జహీజ్ చేసిన కృషి సంకుచితులైన ఆలోచనాపరులు, పాత్రికేయులు మరియు చరిత్రకారుల అభిప్రాయాలను తొలగిస్తుంది. ఆ రోజులలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మానవ మూలధనం
అభివృద్ధిలో మదరసా కీలక పాత్ర పోషించింది.
ఇస్లాం అనేది ఒక దివ్య విశ్వాసం. ఇది ఉయ్యాల నుండి సమాధి నుండి సమాధి వరకు
మానవుడిని జ్ఞానాన్ని సంపాదించమని ప్రోత్సహిస్తుంది.
ప్రవక్త
ముహమ్మద్ (స) ప్రతి ముస్లిం స్త్రీ మరియు పురుషుడు కి జ్ఞానం సంపాదించడం తప్పనిసరి అని చెప్పారు.
అంతేకాక, దివ్య ఖుర్ఆన్, దైవిక గ్రంథం
మొత్తం మానవాళి మార్గదర్శకత్వం కోసం వెల్లడైంది. జ్ఞానం లేని మానవుడు గుడ్డి
వానితో సమానం అని నొక్కి చెప్పినది.
విజ్ఞానశాస్త్రం
మరియు సాంకేతిక రంగాలలో ముస్లింల యొక్క
గొప్ప కృషి ఇస్లాం యొక్క నిజమైన మరియు
పూర్తి భాగస్వామ్య పరిణామం. కొంతమంది
ముస్లిం శాస్త్రవేత్తల కృషి/రచనల గురించి సత్యాన్ని మరుగున పెట్టడానికి
ప్రయత్నించినప్పటికీ, అది శాస్త్ర పరిశోధన మరియు ఆవిష్కరణలో ఒక
మైలురాయిగా గుర్తించబడింది.
గొప్ప జంతు
శాస్త్ర పండితుడు అల్-జహీజ్ యొక్క కృషి జంతుశాస్త్ర రంగంలో మైలురాయి గా బావించ బడుతుంది. కానీ
ప్రస్తుత ముస్లిం తరానికి అతని గురించి ఎలాంటి ముఖ్యమైన సమాచారాన్నిలేక పోవటం
విచారం గా ఉంది.
అల్-జహీజ్
బస్రాలో 776 C.E. లో (ప్రస్తుతం ఇరాక్ లో ) జన్మించాడు. అతని
పూర్తి పేరు అబూ ఉత్మాన్ అమెన్ బిన్ మహ్బూబ్ అల్-జహిజ్. అతను ఒక పేద కుటుంబం కు చెందినవాడు.
ఆర్థిక ఇబ్బందులు కారణంగా, అతను చేపలు మరియు ఖుబ్జ్ (రొట్టె) అమ్మేవాడు.
అతని రంగు చాలా నల్లదిగా ఉండి ముఖం మరింత
వికారం గా ఉoడేది. కానీ అతని పరిశోధన
అద్భుతమైనది మరియు విద్యావేత్తలు మరియు పరిశోధకులకు కీలకమైనది. అతను 1200 సంవత్సరాల క్రితం మరణించాడు, కాని ఇప్పటికీ అతను పుస్తకాలు, పరిశోధనా
పత్రికలు మరియు ఎన్సైక్లోపెడియాలో జీవించి ఉన్నాడు.
జాహీజ్ ప్రారంభ
జీవితం ఆర్థికంగా పరిపుష్టంగా లేదు; అతను పేదరికం
మరియు ఆకలి తో బాధ పడినాడు. అలాoటి పరిస్థితిలో కూడా ఆయనకు శాస్త్ర జ్ఞానo పట్ల
విపరీతమైన ఆసక్తి ఉంది. జ్ఞానాన్ని సంపాదించడానికి
ఆయన బాగ్దాద్ వెళ్లి ఖలీఫా మమున్ రషీద్ ను
కలుసుకున్నారు. ఖలీఫా మమున్ విద్యావేత్తలు మరియు పరిశోధకులతో చాలా
స్నేహపూర్వక ప్రవర్తనను కలిగి ఉన్నాడు. అతనికి ఇలం Ilm (జ్ఞానం) యొక్క ప్రాముఖ్యతను తెలుసు. జాహీజ్ బాగ్దాద్ తో భావోద్వేగ ప్రేమను
కలిగి అతని మరణం వరకు ఖలీఫా మమున్ రషీద్ తో నివసించాడు. అతను బాగ్దాద్ లో ఎక్కువ కాలం గడిపాడు.
ఖలీఫా మమున్
రషీద్ మరణం తరువాత, 96 సంవత్సరాల వయస్సులో జహిజ్ తన స్థానిక స్థలo బస్రాకు తిరిగి చేరుకున్నాడు. అక్కడ 869 సి.ఇ.లో మరణించినాడు అతను తన మొత్తం
జీవితాన్ని అధ్యయనం మరియు పరిశోధనకు అంకితం చేశారు. ఇది జ్ఞానం మరియు ఇస్లాం యొక్క
మంచి అవగాహన కోసం చేసాడు. అతని మరణం గురించి కొన్ని పుస్తకాలలో చోటుచేసుకున్న ఒక
ప్రసిద్ధ ఉల్లేఖనం ఏమిటంటే, వృద్ధుడు మరియు బలహీనమైన ఒక పండితుడు
కుతుబ్ఖానా (లైబ్రరీ) లో పుస్తకాల భారీ స్టాక్ పడిపోయినప్పుడు మరణించాడు. ఈ ప్రకటన
జహీజ్ మరణించిన నివేదిక యొక్క శీర్షికగా ఉంది..
అతను అరబిక్
సాహిత్యం యొక్క ఒక అద్భుతమైన రచయిత అని భావిస్తారు. అతను అరబిక్ గద్యo లో అనేక పుస్తకాలను వ్రాసాడు అయితే జంతుశాస్త్రం లో అతని సహకారం అనింటికన్నా ఎక్కువ విలువైనది. ఆయన
పుస్తకం కితాబుల్ హేవాన్ (బుక్ ఆఫ్
యానిమల్స్) అతని శకంలో జంతుశాస్త్రo ఒక కంపెండం .
జంతు శాస్త్రం
లో జహీజ్ యొక్క అద్భుతమైన కృషి విద్యా ప్రపంచంలో అత్యంత గౌరవించబడినది. జహీజ్ ఈ
పుస్తకాన్ని ఏడు సంపుటల్లో సంకలనం చేశాడు మరియు ఇది పెద్ద జంతువులు, చేపలు, పక్షులు, సరీసృపాలు మరియు
కీటకాలు వంటి మూడు వందల కంటే ఎక్కువ జంతువులకు సంభందించినది. జంతువుల మొత్తం
అధ్యయనం లో అతను ఆల్మైటీ భగవంతుని మరియు అతని
దివ్య వ్యవస్థ యొక్క ఉనికిని చూపినాడు. జహీజ్
మొత్తం సృష్టిని రెండు విస్తృత విభాగాలలో విభజిoచినాడు: జామిన్ (అకర్బనo inorganic) మరియు నామిన్ (సేంద్రీయ organic). నామిన్ ను తిరిగి హేవాన్ (జంతువు) మరియు నాబాత్ (మొక్కలు ) గా ఉపవిభజన
చేసాడు.
తరువాత అతను హేవాన్ ను వాటి చలన శైలి ప్రకారం నాలుగు రంగాలుగా విభజించాడు. అతను
లక్షణాలు, ప్రవర్తన మరియు జంతువుల వంశవృక్షాన్ని
వివరించాడు. ఆశ్చర్యకరంగా, ఈ పుస్తకం చాలా విచిత్రమైన మరియు విలువైన
సమాచారం అందిస్తుంది. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత మనకు ఆశ్చర్యకరంగా ఉండవచ్చు, ఎందుకంటే ఇది జంతువుల జీవితంపై చాలా అరుదైన మరియు వాస్తవమైన సమాచారాన్ని కలిగి
ఉంటుంది.
జాహీజ్ కేవలం ఒక విజ్ఞాన శాస్త్ర
నిపుణుడు కాదు, రాజకీయ శాస్త్రం, సోషియాలజీ, మానవ శాస్త్రం
మరియు వాస్తవిక శాస్త్రంతో పాటు అరబిక్ సాహిత్యం వంటి సామాజిక శాస్త్రాల గురించి కూడా
అతనికి మంచి అవగాహన ఉంది. విస్తృతమైన
అధ్యయనం మరియు విస్తృత అనుభవం కారణంగా, అతను పలు అంశాలపై అనేక పుస్తకాలు రాశాడు. ఆయన
వివిధ విషయాలపై 200 కన్నా ఎక్కువ
పుస్తకాలు రాశారు. అతని ప్రసిద్ధ పుస్తకాలలో కొన్ని: కితబుల్ హేవాన్, కితబూల్ బేవాన్
వల్ తబ్వీన్ , రిసాలా ఫై నాబిల్
టాబిష్ మరియు కిట్బుల్ బొఖ్లా.
No comments:
Post a Comment